7, అక్టోబర్ 2020, బుధవారం

చెవిలో నొప్పి ఇన్ఫెక్షన్ కు నివారణకు నవీన్ నడిమింటి సలహాలు ఈ లింక్స్ లో చూడాలి




చెవి వ్యాధి అంటే ఏమిటి?

చెవి వ్యాధి అంటే చెవిలో నొప్పి మరియు అసౌకర్యం  నుండి పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోవడం వరకూ ఎలాంటి చెవివ్యాధి లక్షణాలున్నా దాన్ని  చెవివ్యాధిగా చెప్పవచ్చు. మన చెవులు మూడు భాగాలను కలిగి ఉంటాయి. అవి బాహ్య చెవి, మధ్య చెవి మరియు అంతర్గత  చెవి. ఈ చెవి భాగాల ప్రధాన విధులు వినడం మరియు శరీరం యొక్క సంతులనాన్ని నిర్వహించడం. సాధారణంగా మనం ఎదుర్కొనే చెవి వ్యాధులు ఏవంటే చెవి వాపు లేదా మంట (otitis), చెవిలో హోరు లేక రింగింగ్ శబ్దం (tinnitus), చెవి మూసుకుపోవడం లేక చెవిలో మైనం, గులిమి లేక గుబిలి పేరుకుపోవడం, మెనియర్స్ వ్యాధి ( vertigo and tinnitus), చెవి యొక్క బూజు వ్యాధి లేక ఫంగల్ ఇన్ఫెక్షన్ (otomycosis), గాలి పీడనంలో కలిగే మార్పు వల్ల చెవికి గాయం (barotrauma), వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కంఠపు నరము యొక్క వాపు (vestibular neuritis), వృద్ధాప్యం వల్ల వినికిడి శక్తి నష్టం (presbycusis) మరియు చెవిలో అసాధారణమైన పెరుగుదల (cholesteatoma).

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెవి వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు వ్యాధి లక్షణాల అధ్యయనాన్ని బట్టి మరియు చెవిలో వ్యాధి సోకిన భాగాన్ని బట్టి  మారుతుంటాయి. ప్రధాన సాధారణ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ చెవి వ్యాధులకు ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • బాక్టీరియల్ , ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు.
  • గాలి మరియు నీటి ఒత్తిడివల్ల ఆకస్మిక మార్పులు కారణంగా చెవికి గాయం కావడం.
  • లోపలి చెవిలో కాల్షియం స్ఫటికాల యొక్క కదలికల కారణంగా సంతులన నష్టం.
  • వినికిడిశక్తి నష్టం:పెద్ద ధ్వనులకు చెవులు నిరంతరంగా బహిర్గతమవడం, వయస్సు లేదా కొన్ని క్యాన్సర్ వృద్ధి కారణంగా కర్ణభేరి (లేదా చెవిగూబ) బలహీనపడటంవల్ల  వినికిడి శక్తి నష్టం.
  • కొన్ని మందులు చెవులలో హోరుమనే (ringing) శబ్దాన్ని కలిగిస్తాయి.

చెవి వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

చాలా చెవి వ్యాధుల సంకేతాలు మరియు లక్షణాలు సాధారణంగానే ఉంటాయి మరియు చెవి వ్యాధికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ పొందడానికి, ENT (చెవి, ముక్కు మరియు గొంతు) నిపుణుడ్ని సంప్రదించి సలహా తీసుకోవాలి. ఇందుకు క్రింది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు:

  • నుమాటిక్ ఓటోస్కోప్ ఉపయోగించి చెవి పరీక్ష.
  • చెవి ఉత్సర్గ పరీక్ష (చెవి నుండి కారే చీమును పరీక్షించడం).
  • ఎకౌస్టిక్ రిఫ్లెక్టోమెట్రీ - కొన్ని శబ్ద పౌనఃపున్యాలను (sound frequencies)  ఉపయోగించి మధ్య చెవి నుండి కారే చీము లేదా ఇతర ద్రవాన్ని గుర్తించడం.
  • టింపనోమెట్రీ - వివిధ గాలి పీడనాలను ఉపయోగించి మధ్య చెవి మరియు కర్ణభేరి యొక్క పరిస్థితిని అంచనా వేయడం.
  • ట్యూనింగ్ ఫోర్క్ పరీక్ష.
  • ఆడియోమెట్రిక్ పరీక్ష .- ఈ పరీక్ష వినికిడి సామర్థ్యంను అంచనా వేయడానికి చేస్తారు.
  • టిష్యూ బయాప్సీ

చెవి వ్యాధి యొక్క సరైన మరియు సమయానుసార రోగనిర్ధారణ చేసుకున్న పిమ్మట మీ ENT స్పెషలిస్ట్ మీ కోసం ఒక చికిత్స నియమాన్ని ఏర్పాటు చేస్తారు. చికిత్స సాధారణ మందుల నుండి కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స వరకు కూడా ఉంటుంది. కింద పేర్కొన్న  సాధారణ చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

  • చెవిలో పేరుకున్న గులిమి (గుబిలి) లేదా మైనం (Earwax) తొలగింపు
    చూషణ (suction) ఉపయోగించి చెవిలో అడ్డుగా ఉండేదాన్ని తొలగించడం.
  • మందులు
    సంక్రమణ వ్యాధిని మాన్పడానికి యాంటీ బాక్టీరియల్ చెవి చుక్కల మందు లేదా కడుపులోకి మింగించే (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్స్ మందులు. చెవి  నొప్పిని నియంత్రించడానికి నొప్పి నివారణా మందులు (అనాల్జెసిక్స్). వికారం మరియు వాంతులను నిర్వహించడం కోసం యాంటీ-ఎమిటిక్స్ మందులు.
  • వినికిడికి ఉపకరణాలు
    వినికిడి శక్తి నష్టాన్ని నిర్వహించడానికి వినికిడిశక్తిలో సహాయం చేసే హియరింగ్ ఎయిడ్ల ఉపయోగం.
  • శాస్త్ర చికిత్స (సర్జరీ)
    శస్త్రచికిత్స సాయంతో క్యాన్సర్ పెరుగుదలను తొలగించడం.
  • కోక్లీయర్ ఇంప్లాంట్తీ
    వ్రమైన వినికిడిశక్తి నష్టం చికిత్స కోసం కోక్లీయర్ ఇంప్లాంట్ ను ఉపయోగించడం.
  • వ్యాయామాలు
    తల తిప్పుడు (vertigo or dizziness) సమస్యకు (repositioning) పునఃసృష్టి వ్యాయామాలు.
    వాతావరణాది ఒత్తిడి వలన ఏర్పడిన చేవిగాయం లేదా పుండు (బారోట్రూమా) నుండి ఉపశమనం కోసం నమిలే జిగురుబంకల్ని (chewing gums) నమలడం లేదా ఆవలించడం వంటి సాధారణ పద్ధతులను అవలంభించడం.

స్నానం లేదా ఈత (swimming) తర్వాత చెవిని ఎండబెట్టడం వంటి కొన్ని సాధారణ నివారణ చర్యలు చెవి ఇన్ఫెక్షన్లు మరియు చెవిలో నొప్పి వంటి సమస్యల నుండి కాపాడుతుంది. చెవులు హోరెత్తించే బిగ్గరగ శబ్దాల్ని వినకపోవడం లేదా రక్షిత ప్లగ్లను (protective plugs) చెవికి పెట్టుకోవడంవల్ల వినికిడి నష్టం నుండి మిమ్మల్ని రక్షించగలదు. చెవికి సంబంధించిన ఎలాంటి సమస్య లేదా రుగ్మత మీకు ఎదురైనా దయచేసి  గృహసంబంధమైన పరిష్కారాలను ప్రయత్నించకుండా, మీ వైద్యుడిని సంప్రదించి సంబంధిత రుగ్మతలకు సలహాలను చికిత్సను పొందండ

చెవి వ్యాధి కొరకు అలౌపతి మందులు

Medicine NamePack Size
Blumox CaBlumox CA 1.2 Gm Injection
BactoclavBactoclav 1000/200 Injection
Mega CVMega CV 1.2gm Injection
Erox CvErox CV 625 Tablet
MoxclavMOXCLAV 91.4MG DROPS 10ML
NovamoxNovamox 125 Rediuse Oral Suspension
Moxikind CVMoxikind CV 375 Tablet
PulmoxylPulmoxyl 250 Capsule
ClavamClavam 1000 Tablet
AdventAdvent 1.2 gm Injection
AugmentinAugmentin 1000 DUO Tablet
ClampClamp 625 Tablet
MoxMox 250 Mg Capsule
Zemox ClZemox CL Injection
P Mox KidP Mox Kid Tablet
AceclaveAceclave 250 Mg/125 Mg Tablet
Amox ClAmox CL Syrup
ZoclavZoclav Tablet
PolymoxPolymox Capsule
AcmoxAcmox 125 Dry Syrup
StaphymoxStaphymox Tablet
Acmox DSAcmox DS 250 Tablet
AmoxyclavAmoxyclav 375 Tablet
Zoxil CvZoxil CV 1000/200 Injection 

చెవిసమస్యలు - నివారణ చర్యలు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు  


                               చెవి సమస్యలు నివా రణ చర్యలు                                                    

మారేడు పండు గుజ్జు పొడి           ------100gr
ఆవు మూత్రం                           ----- అర లీటరు
మేకపాలు                                ----- పావు లీటరు
నువ్వుల నూనె                        ----- పావు లీటరు

 ఒక పాత్రలో ఆవు మూత్రాన్ని పోసిస్టవ్ మీద పెట్టాలి . అది మరుగుతుండగా మారేడు పండు గుజ్జు పొడిని  వెయ్యాలి .పావు లీటరు మిగిలేవరకు సన్న మంట మీద కాచాలి . దించి వేరే పాత్రలోకి వడ కట్టుకోవాలి .దీనిలో నువ్వుల నూనెమేకపాలు పోసి బాగా కలియబెట్టి సన్న మంట మీద మరిగించాలి .చివరికి నూనె మాత్రమే మిగలాలి .దీనిని వడకట్టి సీసాలో భద్ర పరచుకోవాలి

జాగ్రత్తలు:- నూనె చెవిలో వేసేటప్పుడుగోరు వెచ్చగా వెయ్యాలి .తైలం చెవిలోకి వెళ్ళేటట్లు చెవిని సున్నితం గా కదిలించాలి .రెండు చూపుడు వెళ్ళాను రెండు చెవులలో పెట్టుకొని బుగ్గలను గాలితో పూరించి వదలాలి  విధంగా 30,40 సార్లు చెయ్యాలి

                          చెవి చు క్కల మందు - ఆత్రేయ తైలం                         

వామ్ము                         --------10gr
మంచి పసుపు                  -------10gr.
ముల్లంగి దుంపల రసం       -------75gr
నువ్వుల నూనె                 ------250gr

     నువ్వుల నూనెలో పై పదార్ధాలను కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మిగిలే వరకు కాచాలి .వడకట్టి సీసాలో .ఉదయంసాయంత్రం నూనెను కొంచం గోరు వెచ్చగా చెవిలో వెయ్యాలి దీని వలన చెవిలో చీమునొప్పి తగ్గుతాయి .

చెవి నొప్పికి ఆవిరి పట్టడం :-- రెండు గ్లాసుల నీటిలో రెండుగుప్పేళ్ళ వేపాకురెండు స్పూన్ల పసుపు వేసి మరిగించాలి .  ఆవిరిని చెవికి పట్టాలి .తరువాత చెవిని దూది తో శుభ్రంగా తుడవాలి

            చెవుడు తగ్గడానికి లక్ష్మి మాత్రలు                             

           100 gr వేప గింజల పప్పును ఎండబెట్టాలి . నిదానంగా ,మాడిపోకుండా వేయించాలి . తగినన్ననీళ్ళు పోసి మేత్హగా నూరాలి .ముద్దగా అయిన తరువాత శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో బాగా ఆర బెట్టాలి తడి పూర్త్జ్హిగా ఆరిపోయి రాయి లాగా గట్టి పడాలి బూజు పడితే వాడకూడదు
ప్రతి రోజు ఉదయంసాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున మంచి నీటితో వేసుకోవాలి దీర్ఘకాలంగా ఉన్నవాళ్ళు 100 రోజులు వాడాలి

              దీనితో అమీబియాసిస్ కూడా నివారింప బడుతుంది.

        చెవిలో చీము కారడం --నివారణ --వాల్మీకి కర్ణ తైలం            

 సమస్య వున్న వాళ్ళు కఫ సంబంధమైన పదార్ధాలు వాడకూడదు.

నువ్వుల నూనె                ---- 250 gr
ముల్లంగి దుంపల రసం       ---- 75 gr
వాము                             ---- 10 gr
దంచిన పసుపు పొడి           ---- 10 gr

  అన్నింటిని నూనెలో వేసి బాగా కలియ బెట్టి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలినీరు ఆవిరై నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.పొంగు తగ్గే వరకు కలియ బెడుతూ వుండాలిజాగ్రత్తగా వడ కట్టాలి.గాలికి ఆరబెట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగించే విధానం:-- ఒక స్పూను లో రెండుమూడు చుక్కల నూనె తీసుకొని వేడి చేసి
చెవిలో వేసుకోవాలి

   రెండు గుప్పెళ్ళు వేపాకు నలగ గొట్టిరెండు స్పూన్ల పసుపురెండు గ్లాసుల నీళ్ళు పోసి వేడి చేసి
  ఆవిరిని చెవి దగ్గర పెట్టి చెవిలోపలికి వెళ్ళేటట్లు చెయ్యాలి ఆవిరిని ముక్కుతో పీల్చాలి.
  ఆవిరిలో గుడ్డను ముంచి చెవి చుట్టూ కాపడం పెట్టాలిపుల్లకు దూది చుట్టి  నీటిలో ముంచి చెవిని శుభ్రం చెయ్యవచ్చు.

            చెవితమ్మెలు పెరగడానికి                                          

శతావరి వేర్లు                     ------30gr
అశ్వగంధ దుంపలు            ------30gr
ఆముదపు గింజల పప్పు        ----30gr
పాలు                                -----90gr
నువ్వుల నూనె                     ----90gr

      ఒక గిన్నెలో పాలునువ్వుల నూనె పోసి బాగా కలియ బెట్టాలి . దానిలో మిగిలిన పదార్ధాలను
కచ్చ పచ్చగా దంచి వెయ్యాలి . పాలు ఇగిరి పోయి ,పదార్ధాలు మాడకుండా ,పొంగు అణిగిపోయిన తరువాత వడ పోసుకోవాలి .సీసాలో నిల్వ చేసుకోవాలి .

   ప్రతి రోజు 5,6 చుక్కలు నూనె చేతిలో వేసుకొని  దానితో చెవి తమ్మేను సాగదీయాలి దీనివలన
చెవి తమ్మెలు సాగుతాయి

                    చెవిపోటు నివారణకు నవనాధ సిద్ధ తైలం .                       

నలగగొట్టిన వాము                        ------50 gr
సన్నగా తరిగిన వెల్లుల్లి పాయల ముక్కలు  ---50 gr
కల్లుప్పు                                        ------25 gr
నువ్వులనూనె                                ------250 gr                                                                                                                                                         

    స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి వేడెక్కిన తరువాత పై పదార్ధాలను వెయ్యాలి . చిన్న మంట
మీద పదార్ధాలు మాదే వరకు కాచి వదపోసుకోవాలి .చల్లారిన తరువాత గాజు సీసాలో భద్ర పరచుకోవాలి .

      చెవి ఎండి పోయినపుడు , కఫం చేరినపుడు  సమస్య వస్తుంది అప్పుడు నూనెను కొంచెం
వేడి చేసి  4,5 చుక్కలు చెవిలో వెయ్యాలి

వ్యాయామం:-- రెండు చూపుడు వేళ్ళురెండు చెవుల్లో పెట్టుకొని బుగ్గలను పూరించి వదలాలిఉంగరపు వేలునుచిటికేనవేలును రెండు చేతులతో నొక్కాలి .


              చెవుడు సమస్య  నివారణ                       

సన్న రాష్ట్రము
తిప్పతీగ
ఆముదం చెట్టు వేళ్ళు
దేవదారు చెక్క 
సొంఠి

     అన్నింటిని సమాన భాగాలు తీసుకోవాలి విడివిడిగా ఎండబెట్టి ,దంచిజల్లించి ,కలిపి సీసాలో
 భద్ర పరచుకోవాలి .

వయసునుబట్టి చిటికెడు పొడి నుండి 1/2t.s వరకు వాడుకోవాలి పొడిని తేనెతో నాకించాలి

         గ్రహణశక్తి లోపించి,రక్తప్రసరణ లోపించి చెవులు మూసుకు పోయిన వారికి చికిత్స

ఆవుమూత్రం ----- 1 గ్లాసు

         ఆవు మూత్రాన్ని 7 సార్లు వడపోసి 1/8 ( అర పావు ) గ్లాసు వచ్చే వరకు మరిగించాలి .
గోరు వెచ్చగా 5,6 చుక్కలు   చెవిలో వేస్తూవుంటే మూసుకుపోయిన చెవులు తెరుచుకుంటాయి

ముల్లంగి దుంపలు దంచి రసం తీసి ,అదే మోతాదులో నువ్వుల నూనె గానిఆవాల నూనేగాని పోసినూనె మిగిలే వరకు కాచాలి  నూనెను చెవుల్లో వేసుకోవాలి

   వావిలాకు(నిర్గుండిరసం ,నువ్వుల నూనె సమాన భాగాలుగా పోసి నూనె మిగిలేవరకు కాచి
వడ పోసుకొని భద్ర పరచుకోవాలి దీనివలన మంచి ఫలితం ఉంటుంది .( నిర్గుండి తైలం )


         చెవి సమస్యలు --- నివారణ                

1. 15 రోజులకొకసారి నువ్వుల నూనె గాని , ఆముదం గాని గోరు వెచ్చగా చెవుల్లోవేసుకోవాలి .

వేసిన వెంటనే చల్లబడుతుంది . అర గంట తరువాత స్నానం తల స్నానం చెయ్యాలి .

2. లేత వేపాకులు  ------ 10
              తేనె       ------- 5 gr

 రెండింటిని మెత్తగా నలగగొట్టి గుడ్డలో పిండితే వచ్చే రసం చెవిలో వేసుకుంటే చెవిలో చీము కారడం

తగ్గుతుంది

3. గుంటగలగరాకు రసం చెవిలో వేస్తే 2,3 రోజులలో తగ్గుతుంది

4. బంతి ఆకు రసం చెవిలో చీము నివారణకు ప్రశస్తమైనది

5. సబ్జా ఆకుల రసం కూడా వెయ్యవచ్చు .

           చెవిపోటు నివారణకు కర్ణ తైలం                     

వెల్లుల్లి                           ---- నాలుగైదు పాయలు
వాము                            ---- ఒక టీ స్పూను
ఉప్పు లేక సైంధవ లవణం     ---పావు టీ స్పూను
నువ్వుల నూనె                  ---50 gr

     అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి వెల్లుల్లి నల్లగా మాడేంత వరకు కాచి వదపోసుకోవాలి.చల్లార్చి సీసాలోనిల్వ చేసుకోవాలి.

3,4 చుక్కల నూనె వేడి చేసి చెవిలో వేస్తే చెవిపోటు చాలా త్వరగా తగ్గుతుంది.

       చెవిపోటు, చెవిలో శబ్దాలు -- నివారణకు నిర్గుండి ( వావిలి ) తైలం          

వావిలాకు రసం -------1 గ్లాసు
నువ్వులనూనె  -------1 గ్లాసు

         రెండింటిని ఒక పాత్రలో పోసి నూనె మాత్రమే మిగిలేటట్లుకాచి వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .

ప్రతిరోజు ఉదయంసాయంత్రం చెవిలో 5 చుక్కల చొప్పున వేసుకుంటే చెవిపోటుచెవిలో శబ్దాలు
నివారింపబదతాయి  .

       నువ్వుల నూనెలో వెల్లుల్లి ముక్కలను వేసి వేడిచేసివెల్లుల్లి తీసివేసి నూనెను గోరువెచ్చగా
చెవిలో  వేస్తే చెవిపోటుచెవిలో శబ్దాలు నివారింప బడతాయి

               చెవి నొప్పి నివారణ                                 

  3, 4 వెల్లుల్లి పాయలను కొంచం నువ్వుల నూనెలో వేసి వేడి చేసి నూనె గోరు వెచ్చగా ఉన్నపుడే
చెవిలో వెయ్యాలిదీని వలన చెవి నొప్పి నివారింప బడుతుంది.


                                 చిన్నపిల్లలలో చెవి సమస్యలు                      

       చిన్నపిల్లలలో చీము కారడానికి కారణం జలుబు చేయడం,జలుబుకు సరైన treatment తీసుకోకపోవడంవలన  ustasian tube ( యూస్టేషియన్ ట్యూబ్)   లో infection చేరుతుంది

.తీవ్రమైన చెవిపోటు,జ్వరముఏమి తినాలని అనిపించకపోవడం
వంటి లక్షణాలు ఉంటాయి  చీము కర్ణభేరికి రంధ్రం చేసుకొని బయటకు వస్తుంది

సముద్ర ఫీనము యొక్కచూర్ణాన్ని నేరుగా చెవిలో వేసి దూది పెట్టి ,ఒక రోజంతా ఉంచాలి .మరుసటి రోజు దూది పుల్ల ను వేడి నీటిలో గాని ,నిర్గుండి తైలం లో గాని ముంచి తుడవాలి  విధంగా కొద్దిరోజులు చేస్తే పూర్తిగా నివారింప బడుతుంది .

సముద్ర ఫీనచూర్ణము :-- cattle fish యొక్క skeleton ను సముద్ర ఫీనము అంటారు .సంద్రపు ఒడ్డున 5,6 అంగుళాల పొడవుతో వుండే తెల్లని పదార్ధం ..అంతే గాని సముద్రపు నురుగు కాదు

                  జలుబు చేసి చెవి మూసుకుపోవడం వలన నొప్పి వస్తే            

వాము ----అర టీ స్పూను
పాలు ---- అర కప్పు

 రెండింటిని బాగా మరిగించి , వడపోసి రెండు చెవుల్లో రెండు చుక్కలు గోరువెచ్చగా వెయ్యాలి .
 ఎంతో ఉపశమనం ఉంటుంది .

                      చెవిపోటు --- నివారణ                                      

          జలుబు చేసినపుడు చెవిపోటు రావడానికి అవకాశం ఉన్నది .చెవిలో infection చేరి మైనం తయారవుతుంది ఇది దవడ కదలిక వలన బయటకు వస్తుంది , కొంత మందిలో రాదు
చెవిలో నొప్పి , చీము కారడంచెవి చుట్టూ నొప్పి మొదలగు లక్షణాలు ఉంటాయి .


(A) వేడిచేసిన అల్లం రసాన్ని గోరువెచ్చగా రోజుకు 2,3 సార్లు ,drops గా వేస్తుంటే తగ్గిపోతుంది .

వెల్లుల్లి రసం ---
మునగాకు రసం --
ముల్లంగి రసం ---

         అన్ని కలిపి గాని ,లేక ఒక్కొక్కటి గాని రసాన్ని వేడి చేసి 2,3 చుక్కలు వెయ్యాలి

శారిబాదివటి మాత్రలు  + రా 1+1 వేడినీటితో వేసుకుంటే చెవిలో బరువుగా అనిపించడం ,

నొప్పి ,చెవుడు నివారింపబడతాయి .

(B) నిమ్మరసం లో ఒకే ఒక్క ఉప్పుకల్లు కరిగించి వేడిచేసి చెవిలో వెయ్యాలి .

(C) కలబంద గుజ్జు రసాన్ని వేడి చేసి నాలుగు చుక్కలు చెవిలో వేస్తే వెంటనే చెవి పోటు తగ్గిపోతుంది .

(D) మునగపట్ట దంచిన రసం వేడిచేసి చెవిలో వేస్తే చెవిపోటు నివారింపబడుతుంది .

(E) మునగబంక కరిగించి 23 చుక్కలు చెవిలో వేస్తే చీము కారడం తగ్గిపోతుంది

(F) ఆవనూనెను పరోక్షంగా వేడిచేసి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది .

              చెవుల్లో పురుగులు దూరితే                       

       గదిలో దీపాలను ఆర్పి టేబుల్ పైన తల వాల్చి పడుకోమని చెప్పాలి చెవికి ఎదురుగా టార్చ్ లైటును  ఫోకస్ చెయ్యాలి    పురుగు కాంతికి ఆకర్షింపబడి బయటకు వస్తుంది

  ఒకవేళ పురుగు రాకపోతే బుల్బు సిరంజితో గానికొబ్బరినూనె డబ్బాతో గాని , షాంపూ డబ్బాతో గాని గోరువెచ్చని నీటిని చెవిలోకి పిచికజారి చెయ్యాలి .తరువాత చెవిలో తేమ లేకుండా బాగా శుభ్రంగా తుడవాలి .

                వినికిడి శక్తి పెరగడానికి               

నిర్గుంది లేక వావిలాకు తైలం ప్రతి రోజు 2 చుక్కలు వేసుకుంటూ ఉంటె క్రమేపి వినికిడిశక్తి పెరుగుతుంది .

              చెవిలో మైనం పెరుకుపోతే                 

        రోజుకు రెండుసార్లు గ్లిజరిన్ గాని బేబీఆయిల్ గాని నాలుగు చుక్కలు వెయ్యాలి. వాష్ బేసిన్
దగ్గర నిలబడి చెవిని సాగదీసి రెండవ చేతితో బుల్బ్ సిరంజి తో గోరువెచ్చని నీటిని చెవిలోకి పిచికారి చెయ్యాలి .  తరువాత వంచెయ్యాలి . విధంగా 2,3 సార్లు చేస్తే మైనం అంతా వచేస్తుంది చెవిని బాగా తుడిచి ఆపిల్ వెనిగర్ ను చెవిలో రెండు చుక్కలు వేస్తే మామూలు స్థితికి వస్తుంది .


               చెవినొప్పి -- నివారణ                         

    బాగా చల్లదనం కలిగిన పదార్ధాలు , బాగా వేడిగా ఉన్న పదార్ధాల వలన ,చెవిలో పొక్కుల వలన
చెవిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది .

1. నీరుల్లి పాయల రసాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేసుకోవాలి.

2. వెల్లుల్లి గర్భాలు -------- 5
                  వాము ------- 5 gr
                   ఉప్పు -------1 gr
    నువ్వుల నూనె --------50 gr

వామును రెండు చేతుల మధ్య నలపాలి . అన్నింటిని నూనెలో వేసి ,కాచి , వడకట్టాలి .సీసాలో

భద్ర పరచుకోవాలి . నొప్పి ఉన్నపుడు 2 చుక్కలు వేసుకోవాలి .

3. ఇంగువ         -----3 gr
      శొంట         -----3 gr
ధనియాలు      ------3 gr
ఆవనూనె       ------50 ml

      అన్ని కలిపి కాచి చల్లార్చి , వడకట్టినిల్వ చేసుకోవాలి .దీనిని నొప్పి ఉన్నప్పుడు వాడుకోవాలి .

(G) నెయ్యి       -----30gr
పచ్చకర్పూరం   -----30gr

  రెండు కలిపి కరిగించి సీసాలో నిల్వ చేసుకోవాలి .చెవిలో నొప్పి వున్నపుడు రెండు చుక్కలు వెయ్యాలి .     దీని వలన నొప్పితగ్గుతుంది .సురక్షితమైనది .

   చెవిలో చీము కారడం ---కర్ణ స్రావ హర తైలం                   

            చెవికి దెబ్బ తగలడం , ఇతర పదార్ధాలు చేరడంచేవిలోపల గాయం కావడం  ఇన్ఫెక్షన్  చేరడం,చెవిలో tumers ఏర్పడడం వంటి కారణాల వలన చెవిలో చీము చేరుతుంది .

 పసుపుపొడి                  ------1 gr
 పటికపొడి                  ------20 gr
 కుంకుడు నీళ్ళు           -----90 ml
 వేపనూనె                    -----10 ml

         ఒక చిన్న గిన్నెలో పసుపుపొడి,పటికపొడి వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

                      కుంకుళ్ళపొడిని నీటిలో వేసి కాచి వడ పోయ్యాలి .దీనికి వేపనూనెను కలిపి చెవిని శుభ్రపరచుకోవాలి .

         ఈ మిశ్రమాన్ని బుల్బు సిరంజి లోకి తీసుకొని చెవిలోకి పిచికారి చెయ్యాలి . తరువాత drier
( డ్రయ్యర్ )తో చెవిని ఆరబెట్టాలి .తరువాత చెవిలో పొడిని వేసుకోవాలి .దీనితో చెవిలో చీము కారడం తగ్గుతుంది .

చెవికితలకు దెబ్బతగిలితే అశ్రద్ధ చెయ్యకూడదు .

చెవిలోకి నీళ్ళు పోతే పక్కకు వంచేయ్యాలి .

    చెవిలో మైనాన్ని తొలగించడం --కర్ణబిందు తైలం               

కుంకుళ్ళు ------- 10 gr (గుజ్జు లేక పొడి )
గ్లిసరిన్      -------తగినంత

      స్టవ్ మీద పాత్రను పెట్టి దానిలో ఒక కప్పు నీళ్ళు పోసి ,కుంకుడు పొడి వేసి పాకప్పుకువచ్చే
విధంగా మరిగించాలి .చల్లారనిచ్చి వడపోయాలి

స్పూన్ల కషాయానికి 2 స్పూన్లగ్లిజరిన్ కలిపి బాగా కలియబెట్టాలి .దీనిని చుక్కల మందు సీసాలో పోసుకోవాలి .
మైనం తయారైన చెవిలో కొన్ని చుక్కల మందును వేసి కొంత సేపు వుంచి దూది పెట్టాలి . విధంగా  రోజుకు రెండు సార్లు చొప్పున 4,5 రోజులు చెయ్యాలి .దీంతో మైనం కరుగుతుంది `

           రబ్బరు బుల్బు సిరంజి తో నీటిని చెవిలోకి పిచికారి చెయ్యాలితలను పక్కకు వంచితే
నీళ్ళుమైనం రెండు బయటకు వస్తాయిదూది పుల్లతో చెవిని తుడవాలి.


             చెవిలో చీము కారడం ---నివారణ                            

       పటికనుపొంగించి  పొడిని చెవిలో వేయడం వలన చీము గట్టి పడిబయటకు వస్తుంది.

శారిబాది గుడం

(శారిబాది ) సుగంధపాల వేర్ల చూర్ణం          ------100 gr
కరక్కాయల చూర్ణం                                   -----25 gr
పల్లేరు కాయలపొడి                                     ----25 gr
పసుపుపొడి                                               ----25 gr
తులసి ఆకుల పొడి                                   -----25 gr
(గుడంపాతబెల్లం                                  -----100 gr

                 అన్ని చూర్ణాలను కలిపి కల్వం లో వేసి బెల్లం కలిపి నూరాలి
ప్రతిరోజు మూడు పూటలా 3 వేళ్ళతో వచ్చినంత వాడితే చెవిలో చీము కారడం తగ్గుతుంది.

                                     
                                            జలుబు వలన చెవి పోటు-- నివారణ                     

వాము              ---అర టీ స్పూను
పాలు             ---- అర కప్పు

           వామును పాలల్లో వేసి మరిగించి వదపోయాలిరెండు చెవుల్లో రెండేసి చుక్కల పాలను గోరువెచ్చగా వేయాలి.చల్లగా వేస్తే కళ్ళు తిరుగుతాయి

                                           

    ఉల్లి రసాన్ని వేడి చేసి గోరువెచ్చగా రెండు చుక్కలు చెవిలో వేస్తే నొప్పి నివారింప బడుతుంది.

                         

         ఆవ నూనెలో కొద్దిగా ఇంగువ ముక్కకొద్దిగా వెల్లుల్లి ముక్క వేసి వేడి చేసి రెండు చుక్కలు
చెవిలో వేస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది.

      చెవిలో మైనం  పెరుకుపోతే -- పరిష్కారం                          
బేబీ ఆయిల్ ( లేదా ) గ్లిజరిన్
 డ్రాపర్
బల్బ్ సిరంజి
వేడి నీళ్ళు
ఆపిల్ వెనిగర్

    రోజుకు రెండు సార్లు చెవిలో రెండేసి చుక్కలు ఆయిల్ వేయాలితరువాత వాష్ బేసిన్
దగ్గర నిలబడి చెవిని పైకి లాగి రెండవ చేతితో గోరువెచ్చని నీటితో నింపిన బల్బ్ సిరంజి  ద్వారా నీటిని చెవిలోకి పిచికారి చేయాలితరువాత వంపెయ్యాలి విధంగా రెండు మూడు సార్లు చేస్తే మైనం  అంతా బయటకు వచ్చేస్తుంది.

    తరువాత చెవిని బాగా తుడిచి ఆపిల్ వెనిగర్ ను చెవిలో వేస్తే చెవి మామూలు స్థితికి వస్తుంది.


    చెవిలో మైనాన్ని తొలగించడానికి  కర్ణ బిందు తైలం                         

            కుంకుళ్ళ  గుజ్జు లేక పొడి     --- 10 gr
                            గ్లిజరీన్                ---

          గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి  కుంకుళ్ళ పొడి వేసి మరిగించి పావు కప్పు కు రానివ్వాలి.
 స్టవ్ ఆపి చల్లార్చి వడ పోయాలి.

          రెండు స్పూన్ల కషాయానికి రెండు స్పూన్ల గ్లిజరీన్ కలిపి బాగా కలియ బెట్టి సీసాలో పోసుకోవాలి.

          దీనిని చుక్కల మందు సీసాలో పోసి ఏ చెవిలో మైనం తయారవుతుంది ఆ చెవిలో కొన్ని
 చుక్కల మందు  వేసి  కొద్ది సేపు వుంచి దూది పెట్టాలి. ఈ విధంగా రోజుకు రెండు సార్లు చేయాలి.
 దీనితో మైనం కరుగుతుంది.

         రబ్బరు బల్బు సిరంజి తో  గోరువెచ్చని  నీటిని పీల్చి చెవిలోకి పిచికారి చేయాలి. తలను
 పక్కకు వంచితే మైనం,  నీళ్ళు రెండు బయటకు వస్తాయి.   తరువాత దూది పుల్లతో తడిని
 తుడవాలి.

                  వినికిడి శక్తికి శ్రవణ ఘ్రుతం                                           

       ఆవు నెయ్యి                          ----100 gr
       సన్నగా తరిగిన   వెల్లుల్లి గర్భాలు      ---- 3 , 4

               నేతిలో వెల్లుల్లి ముక్కలను వేసి  అవి ఎర్రగా అయ్యే వరకు కాచాలి . చల్లారిన తరువాత వడపోసి
సీసాలో పోసి భద్రపరచుకోవాలి .

        ఉదయం ,  సాయంత్రం  ఆహారానికి ముందు రెండు చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి .
        దీనితో చెవిలో నోరు ,  నొప్పి నివారింపబడతాయి .

     చెవిలో చీము కారడం  -- కర్ణ స్రావ హర తైలం                 

కారణాలు  :-- చెవికి దెబ్బ తగలడం , ఇతర పదార్ధాలు చేరడం , చేవిలోపల గాయం కావడం , ఇన్ఫెక్షన్ చేరడం
చెవిలో ట్యూమర్స్  ఏర్పడడం  మొదలైనవి .

పసుపు పొడి             ----  1 gr
పటిక   పొడి              --- 20 gr
కుంకుడు నీళ్ళు         --- 90 ml ( పొడిని మరిగించి వడకట్టిన నీళ్ళు )
వేప నూనె                 --- 10 ml

      ఒక చిన్న గిన్నెలో పసుపు పొడిని , పటిక పొడిని వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .
      కొద్దిగా  కుంకుళ్ళ పొడిని నీళ్ళలో వేసి కాచి వదకట్టుకోవాలి . ఆ నీటిలో వేప నూనెను కలపాలి . ఈ రెండింటి 
యొక్క మిశ్రమం తో చెవిని శుభ్రం చెసుకొవాలి.  బుల్బు సిరంజ్ లోకి కుంకుడు రసాన్ని తీసుకొని చెవిలోకి పిచికారి చేయాలి .
తరువాత ద్రయ్యర్ తో చెవిని ఆరబెట్టాలి . తరువాత చెవిలో పొడిని వెయాలి.
   దీనివలన చెవిలో చీము కారడం తగ్గుతుంది .
   చెవికి , తలకు దెబ్బ తగిలితే అశ్రద్ధ చేయకూడదు , చెవిలోకి నీళ్ళు చేరితే పక్కకు వంచేయ్యాలి .

                చెవిపోటు  --- నివారణ                              

తుమ్మ పూలు                 ---- 50 gr
ఆవనూనె                        ---- 50 gr

   ఆవనూనె ను స్టవ్ మీద పెట్టి కాగేటపుడు  పూలను వేయాలి .  పూలు నల్లగా మాదే వరకు కాచాలి .దించి వడ పోసుకోవాలి
3 , 4 చుక్కలను గోరువెచ్చగా చెవిలో వేసుకుంటే  చెవిపోటు సమస్యలు నివారింపబడతాయి . వినికిడి శక్తి పెరుగుతుంది .
    దీనితోపాటు ఆకాశ ముద్ర వేయాలి

         చెవిలో చీము కారడం  --- నివారణకు  కర్ణ ఘ్రుతము        

కానుగ గింజలు               ---- 20 gr
     నెయ్యి                     ---- 40 gr     

       ఒక గిన్నె లో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి దానిలో కానుగ గింజలను వేసి మరిగించాలి . రంగు మారిన తరువాత
దించి వడ పోయాలి . చల్లార్చి నిల్వ చేసుకోవాలి .

      చెవిలో వేసుకొనే ముందు ఈ తైలాన్ని వేడి చేసి గోరువెచ్చగా వేసుకోవాలి .
      ఆకాశ ముద్ర వేయాలి .
      రెండు చెవులలో రెండు వేళ్ళ ను దూర్చి బుగ్గలను పూరిస్తూ వదులుతూ వుండాలి .

               చెవిలో హోరు  --- నివారణ                                  

కారణాలు :---- సాధారణంగా వర్టిగో వలన ఏర్పడుతుంది  ( Inbalance of Medulla), ఒత్తిడి , వంశపారంపర్యం , శారీరక
బలహీనత  మొదలైనవి .

1. చనుబాలను  లేదా ఆపు పాలను గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ వుద్గంగా  10, 15 రోజులు చేస్తే  తగ్గిపోతుంది .

2. ఆవు నేతిని పరోక్షంగా వేడి చేసి గోరువెచ్చగా చెవిలో వేసుకోవాలి . ఈ విధంగా 40 రోజులు చేసీ ఫలితం ఉంటుంది .

సూచనలు :--- మంచి పోషకాహారం తీసుకోవాలి . విశ్రాంతి అవసరం . కుంగుబాటు లేకుండ చూచుకోవాలి 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

సయాటికా సమస్య కు నవీన్ నడిమింటి సలహాలు ఈ లింక్స్ లో చూడాలి


                శరీరంలో తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాల గాయం కారణంగా ఒక బాధాకరమైన పరిస్థితిని  సూచిస్తుంది. నడుము క్రింద భాగంలో ఒక కాలిలో తిమ్మిరితో సహా నొప్పి గల లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా రెండు రకాలు - న్యూరోజెనిక్ మరియు రిఫర్డ్. లక్షణాలు అకస్మాత్తుగా వ్యక్తమవుతాయి మరియు చాలా అసౌకర్యకరమైనవిగా ఉంటాయి. తుంటి నొప్పికి దారి తీసే అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సందర్భాలలో, తుంటి నొప్పి అనేది వెనుకవైపు గాయం లేదా దీర్ఘకాలిక స్తబ్దతను కలిగి ఉంటుంది. ఇతర కారణాలలో సరికాని శరీర భంగిమ, ఊబకాయం, నాడీ సంబంధిత రుగ్మతలు, స్పాండిలైటిస్, స్లిప్డ్ డిస్క్, మరియు కండరాల నొప్పులు. శస్త్రచికిత్స దాని యంతటగా 4-6 వారాలలోనే నయమవుతుంది కానీ లక్షణాలు కొనసాగితే వైద్యపరమైన జోక్యం అవసరమవుతుంది. నొప్పి-ఉపశమన మందులు, ఫిజియోథెరపీ, రుద్దడం మరియు తీవ్రమైన సందర్భాల్లో - శస్త్ర చికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు. అనేక జీవనశైలి మార్పులను చేర్చడం ద్వారా తుంటి రోగ లక్షణాలు  ప్రభావవంతంగా నిర్వహించబడతాయి. అయితే, లక్షణాల పునఃస్థితి ఉంటే వైద్య సలహాను కోరుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, శస్త్రచికిత్స వల్ల నొప్పి మరియు శాశ్వతoగా నరాలు పాడవుట వంటి సమస్యలు సంభవిస్తాయి

సయాటికా యొక్క లక్షణాలు 

తుంటి నొప్పి యొక్క సాధారణంగా నివేదించబడిన లక్షణాలు:

వెంటనే వైద్య దృష్టికి తీసుకురావలసిన కొన్ని లక్షణాలు ఉండవచ్చు. వీటితొ పాటు:

  • కాళ్ళు లో సుదీర్ఘమైన తిమ్మిరి.
  • పిత్తాశయము మరియు ప్రేగుల నియంత్రణను కోల్పోవడం. (ఇంకా చదవండి - మూత్రం ఆపుకొనలేకపోవడానికి చికిత్స)
  • కాలిలో బలహీనత.
  • కదిలించడానికి చేయు ప్రయత్నింలో కలిగే నొప్పి.

తుంటి నరాల వాపు లక్షణాలు ఎక్కువగా వెన్నెముక, కాలు, మరియు పాదాలతో సహా శరీరం దిగువ భాగంలో కలుగుతుంది, ఇది  కొన్ని నిమిషాలలో ఆగిపోతుంది, ఇది ఒక జలదరింపు లేదా మంట కలిసి పరిమిత పనితీరు మరియు తీవ్రమైన నొప్పి కలిగి ఉంటుంది.

అయితే, తుంటి నరాల వాపు శస్త్ర చికిత్సా లక్షణాలు శాక్రోలియాక్ జాయింట్ పనిచేయకపోవడం వంటి పరిస్థితిని పోలి ఉంటాయి. గర్భం వంటి పరిస్థితులలో దిగువ వెన్ను నొప్పి కలుగవచ్చు. అందువల్ల, ఇటువంటి లక్షణాలను ఉన్నప్పుడు, ఇతర పరిస్థితుల తీవ్రత లేకుడా చేయుటకు సరైన రోగనిర్ధారణను రూపొందించడానికి క్షుణ్ణమైన క్లినికల్ నిర్థారణకు ఇది కీలకమైనది.

సయాటికా యొక్క చికిత్స - Treatment of Sciatica in Telugu

తుంటి నరం వాపు అనేది 4-5 వారాల వరకూ నయం కాకుంటే, వైద్య జోక్యం అవసరమవుతుంది. ఈ క్రింది చికిత్స పద్ధతులు ఉన్నాయి:

  • నొప్పి నివారణ మందులు
    నొప్పిని తగ్గించడానికి సహాయపడే నొప్పి నివారణ మందులు ఇతర రకాల చికిత్సలతో కలిపి సూచించబడతాయి. ఈ మందులు నరం నయం అయ్యేవరకూ తాత్కాలిక నొప్పికి ఉపశమనం అందించబడుతుంది.
  • ఎపిడ్యూరల్ ఇంజెక్షన్లు
    ఈ మందులు నొప్పి ఉపశమనం కోసం నేరుగా వెన్నెముకలోకి ఇంజెక్ట్ చేయబడతాయి.
  • ఫిజియోథెరపీ
    తుంటి నరం వాపు సంబంధం నొప్పి యొక్క లక్షణాలను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్రమంగా వైద్యంలో సహాయపడుతుంది మరియు వ్యాయామం మరియు మర్దన టెక్నిక్లను కలిగి ఉంటుంది. ఇది శస్త్రచికిత్సలో మొదటి వారంలోనే ఫిజియోథెరపీ సంప్రదింపులను పొందాలని సూచించబడింది. ఇది నొప్పిని సులభతరం చేయడంలో కూడా ప్రభావవంతంగా లక్షణాలను నిర్వహించడం ద్వారా సహాయపడుతుంది.
  • సర్జరీ
    అంచనా వేసినట్లు నొప్పి తగ్గకపోతే మరియు ముఖ్యoగా అసౌకర్యం కలిగితే, ఒక శస్త్రచికిత్స సూచించవచ్చు. తుంటి నరం వాపును డికంప్రెషన్ శస్త్రచికిత్స ద్వారా ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఈ శస్త్రచికిత్స యొక్క రికవరీ సమయం సాధారణంగా ఆరు వారాలు. అన్ని శస్త్రచికిత్సా విధానాలు విఫలమైనప్పుడు, నొప్పిని చాలా ప్రభావవంతంగా నిర్వహించడంలో శస్త్రచికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది. స్లిప్డ్ డిస్క్ వల్ల సంభవించిన తుంటి నరాల వాపును పార్శియల్ డిసెక్టమీ అని అంటారు.

జీవనశైలి నిర్వహణ

వైద్య నివేదికల ప్రకారం, తుంటి నరం నొప్పి అనగా తొడ వెనుక భాగపు నరాల నొప్పి నొప్పి నిర్వహించడం అంత కష్టమైనది కాదు మరియు చాలా సార్లు అది దానితో సంబంధం కలిగి ఉంటుంది, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. నొప్పి తగ్గించగల అనేక మార్గాలు ఉన్నాయి. వీటితొ పాటు:

  • సాధ్యమైనంతవరకు తేలికపాటి వ్యాయామం మరియు సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనాలి.
  • నొప్పిని తగ్గించడంలో సహాయపడటానికి చురుకైన నడక కోసం మరియు వెనుకవైపు సాగటం చేయాలి.
  • నడుము దిగువ ప్రాంతంలో కండరాలు విశ్రాంతి కోసం హీటింగ్ ప్యాడ్స్ ఉపయోగించండి. హీటింగ్ ప్యాడ్స్ తక్షణమే లభిస్తాయి మరియు కదలిక చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక హీటింగ్ ప్యాడ్­ని ఒక రోజులో అనేక సార్లు ఉపయోగించవచ్చు.
  • హీటింగ్ ప్యాడ్ ఉపయోగించిన తర్వాత నొప్పి ఉపశమనం మందులను వాడాలి. ఈ లేపనాలు కూడా కండరాలు విశ్రాంతి మరియు వాపుని తగ్గించవచ్చు. హీటింగ్ ప్యాడ్ నుండి వేడిని గ్రహించి, క్రీమ్ వేగంగా కరిగి, పీల్చబడేలా చేస్తుంది.
  • మీరు మీ కాలిలో తిమ్మిరి అనుభూతి కలిగి ఉంటే, తిమ్మిరి వదిలించుకోవటం నేలపై నెమ్మదిగా పాదాన్ని ఆనించి నొక్కాలి. మీ పాదాన్ని రొటేట్ చేయాలి. తిమ్మిరి వదిలిపోయినపుడు మీరు ఒక జలదరింపు అనుభూతిని అనుభవిస్తారు. మీ కాలిని నెమ్మదిగా కదిలిస్తూ ఉండండి కాని వేగవంతమైన కదలిక గట్టిగా మారడానికి కారణం కావచ్చు, ఆకస్మికమైన కదలికలు చేయవద్దు.
  • నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందడానికి మీరు అప్పుడప్పుడు నొప్పి నివారణలను తీసుకోవచ్చు. అయితే, ఇతర ఔషధాలను కూడా మీరు తీసుకొంటున్నప్పుడు ప్రత్యేకంగా డాక్టర్ను సంప్రదించాలి.
  • శరీరంలో మంట తీవ్రతరం చేయగలిగే ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు చక్కెర వంటకాలను తినడం మానుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు వంటి యాంటీ-ఇన్­ఫ్లమ్మేటరీ ఆహారాలు తీసుకోవడం ఉత్తమo. ఇంట్లో తయారు చేసే అల్లం గ్రీన్ టీ వాపు తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.
  • హీటింగ్ ప్యాడ్స్ వలన మీకు అసౌకర్యంగా ఉంటే, వెచ్చని నీటితో స్నానo చేయడం మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
  • ఒక దిట్టమైన పరుపుపై నిద్ర పోవచ్చు కానీ అది చాలా దృడమైనది కానిదిగా నిర్ధారించుకోవాలి. అదేసమయంలో, మంచం మీద నిద్ర పోకూడదు, ఇది మృదువుగా లేకుంటే మీ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఈ క్రింది విధంగా చేయకూడదని సలహా ఇవ్వడమైనది:

  • మీరు తిమ్మిర్ అనుభవిస్తున్న భాగాల్లో కోల్డ్ కంప్రెస్ ఉపయోగించుట
  • సుదీర్ఘకాలం కూర్చుని ఉండడం లేదా పడుకోవడం.
  • అధిక స్ట్రెస్ కండరాల నొప్పికి దారితీస్తుంది.
  • పారాసెటమాల్ మాత్రలు తీసుకోవాలి, అయితే ఇవి వెన్ను నొప్పికి సహాయపడవు.

సయాటికా కొరకు అలౌపతి మందులు 

Medicine NamePack Size
Oxalgin DPOxalgin DP Tablet
Diclogesic RrDiclogesic RR Injection
DivonDivon Gel
VoveranVoveran 50 GE Tablet
EnzoflamEnzoflam SV Tablet
DolserDolser Tablet MR
Renac SpRenac Sp Tablet
Dicser PlusDicser Plus Tablet
D P ZoxD P Zox Tablet
Unofen KUnofen K 50 Tablet
ExflamExflam Gel
Rid SRid S 50 Mg/10 Mg Capsule
Diclonova PDiclonova P Tablet
Dil Se PlusDil SE Plus Tablet
Dynaford MrDynaford MR Tablet
ValfenValfen 100 Mg Injection
FeganFegan Eye Drop
RolosolRolosol 50 Mg/10 Mg Tablet
DiclopalDiclopal Tablet
DipseeDipsee Gel
FlexicamFlexicam Tablet
VivianVivian Roll ON Gel
I GesicI Gesic Eye Drop
Rolosol ERolosol E 50 Mg/10 Mg Capsule

కాలు నొప్పి:ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

నరాల సమస్యలు

 

శరీరంలో ఇతర భాగాల మాదిరిగా కాలిలో నొప్పికూడా ఒక నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రావచ్చు. లేదా ఇతర భాగాల నుంచి జనించి కాలిలో ప్రస్ఫుటమవ్వచ్చు. నొప్పి ఎక్కడ నుంచి మొదలవుతుందనేది స్పష్టంగా చెప్పలేనప్పుడు లేదా స్పష్టమైన గాయంగాని, దేబ్బగాని లేనప్పుడు లక్షణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే కారణాలు భోదపడతాయి. కాలు నొప్పికి స్పష్టమైన కారణమంటూ తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స తీసుకోడానికి వీలవుతుంది.

1. కండరాల నొప్పి (మజిల్ క్రాంప్స్):

కాలి కండరాల్లో హఠాత్తుగా నొప్పి మొదలైనప్పుడు దానిని, 'మజిల్ క్రాంప్స్' అంటారు. ఆయుర్వేద పరిభాషలో ఈ నొప్పికి 'పిండకోద్వేష్టనం' అని పేరు. సాధారణంగా ఈ తరహా నొప్పి కాలి పిక్కల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల కనిజాలు, లవణాలు - ముఖ్యంగా కాల్షియం, పొటాషియం వంటివి తగ్గినప్పుడు క్రాంప్స్ ఏర్పడతాయి. ఈ కారణం చేతనే చాలామందికి ఆల్కహాల్ తీసుకున్న తరువాతగాని, విరేచనాలు అయిన తరువాత గాని కాళ్ల పిక్కల్లో నొప్పులు వస్తుంటాయి. అలాగే అలవాటు లేకుండా శారీరక శ్రమ చేసిన తరువాత గాని, ఎక్కువదూరాలు నడిచిన తరువాత గాని చాలా మందికి కాళ్ల నొప్పులు వస్తాయి, శారీరక శ్రమ చేసేటప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునే సమయంలో నొప్పులు వస్తాయి కాబట్టి వీటిని రెస్ట్ పెయిన్స్ అంటారు. దీనికి పరిష్కారంగా, నొప్పి వచ్చినప్పుడు కాలి వేళ్ళను పైవైపుకు వంచి, పిక్కలపైన మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అలవాటు లేని వ్యాయామాలను, శారీరక శ్రమలనూ చేయకూడదు. సరైన వార్మప్ లేకుండా వ్యాయామాలను మొదలెట్టకూడదు, కాఫీ, టీలను తగ్గించాలి. క్యాల్షియంనూ (పాల పదార్థాలు, పాలకూర, టమాట, గుడ్డు మొదలైనవి), పొటాషియంను (అరటి, కమలా, టమాటా తదితరలు) ఎక్కువగా తీసుకోవాలి.

ఔషధాలు: సింహ నాదగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, మహాయోగరాజు గుగ్గులు.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం.

2. తుంటి నొప్పి / గృద్రసీవాతం (సయాటికా):

సయాటికా నరం అనేది వెన్ను చివరి భాగం నుంచి బయలు దేరి పిరుదులు, తొడ పక్క భాగం, పిక్కలు మొదలైన ప్రదేశాల నుంచి ప్రయాణిస్తూ అరికాలు వరకూ వ్యాపిస్తుంది. సయాటిక్ నరం వాపునకు గురైనప్పుడు, ఇది ప్రయానించినంత మేరా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి సాధరణంగా వెన్నెముకలోని డిస్కులు స్లిప్ అయినప్పుడు వస్తుంది. దగ్గినప్పుడు వెన్నులో నొప్పిరావటం, నడిచినప్పుడు నొప్పిరావటం, కాలులో సూదులతో గుచ్చినట్లు చిమచిమలాడటం, కండరాలు క్షీణించుకుపోవడం, పట్టుకోల్పోవడం వంటివి జరుగుతుంటే సమస్య తీవ్రంగా ఉన్నట్లు అర్థం. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి, స్నేహకర్మ, స్వేదకర్మ, వస్తి కర్మ అనే ఆయుర్వేద చికిత్సా పద్దతులతో నొప్పిని సమూలంగా తగ్గించవచ్చు. స్నేహకర్మలో ఔషధతైలాలను పైపూతగా ప్రయోగించడంతోపాటు, కడుపులోనికి తీసుకునే విధంగా ఉపయోగించడం జరుగుతుంది. తైలాలతో శరీరం మార్దవంగా తయారైన తరువాత స్వదకర్మతో నరం చుట్టూ పక్కల కండరాల్లోని జడత్వాన్ని తగ్గించాల్సి ఉంటుంది. చివరగా చేసే వస్తికర్మ వల్ల నడుము ప్రాంతంలో ఏర్పడిన వాతావరోధం తొలగిపోయి నొప్పికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

గృహచికిత్సలు: 1. శొంఠి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి. 2. వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి. 3. పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాదిక్వాథం, సమీరాపన్నగ రసం, యోగరాజగుగ్గులు, వాతవిధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాతగజాంకుశరసం.

3. మోకాళ్ళు అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్):

వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన 'సంధివాతం' గా అర్థం చేసుకోవాలి.

సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను వాడాటం, వృత్తిరీత్యా చేయాల్సిన పనుల్లో మార్పులూ చేర్పులను చేసుకోవడంతో ఈ సమస్యను తేలికగా అదుపులో పెట్టుకోవచ్చు.

4. సిరలు ఉబ్బటం (వేరికోస్ వీన్స్):

కాళ్లలో సిరలు నల్లగా, నీలం రంగులో మెలికలు తిరిగి ఉబ్బెత్తుగా కనిపిస్తుంటే, వాటిని 'వేరికోస్ వీన్స్' అంటారు. వీటి వల్ల కాలులో నొప్పి, అసౌకర్యాలు కలుగుతాయి. సిరల గోడలు సంకోచించగలిగే శక్తిని కోల్పోయినప్పుడు రక్తం స్థానికంగా సంచితమై, చుట్టుపక్కల నిర్మాణాలపైన ఒత్తిడిని కలిగించి నొప్పికి కారణమవుతుంది. పాదాలకు ప్రసారిణి తైలం అనే ఔషధ నూనెను రాసుకోవటం, ఎలాస్టిక్ సాక్స్ లను ధరించడం, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్య సలహాను అనుసరించి చేయడం ద్వారా ఈ స్థితిని చక్కదిద్దుకోవచ్చు.

ఔషధాలు: వృద్ధివాదివటి, అభయారిష్టం, అర్శకుఠార రసం, అర్శోఘ్నవటి, బోలపల్పటి, గుడూచిసత్వం, కుటజావలేహ్యం, లవణభాస్కర చూర్ణం, మహావాత విధ్వంసినీ రసం, పీయూషవల్లీరసం, ప్రాణదాగుటిక, సప్తవింశతిగుగ్గులు, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం.

బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం

5. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం (త్రాంబోసిస్):

ధూమపానంచేసే వారిలోను, సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళల్లోనూ, వ్యాయామరహిత జీవితం గడిపే వారిలోను సిరల్లో రక్తం గడ్డ కట్టి స్థానికంగా నొప్పికి, వాపునకూ కారణమవుతుంది. ఆయుర్వేదంలో ఈ స్థితిని 'ఖవైగుణ్యం' అంటారు. 'ఖ' అంటే స్రోతస్సులనీ లేదా మార్గాలనీ అర్థం.

రక్తం గడ్డకట్టడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో 'త్రాంబోసిస్' అంటారు. చర్మానికి దగ్గరగా ఉండే సిరలలో రక్తం గడ్డకట్టినప్పటికి పెద్దగా ప్రమాదం ఉండదుకాని, శరీరాంతర్గతంగా ఉండే సిరలలో కనుక రక్తం గడ్డ కడితే, గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన నిర్మాణాలలోకి రక్తపు గడ్డలు ప్రవేశించి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా మహిళల్లోనూ, వేరికోస్ వీన్స్ తో బాధపడేవారిలోనూ, శస్త్రచికిత్స అనంతరం కోలుకునే దశలో వున్న వారిలోనూ జరిగే అవకాశం ఉంది కాలిలో ఎరుపుదనం, తీవ్రమైన నొప్పి, వాపు మొదలైనవి కనిపిస్తున్నప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యసలహా తీసుకోవటం అవసరం. ఇవన్నీ సాధారణంగా డివిడి (డిప్ వీన్ త్రాంబోసిస్)లో కనిపిస్తాయి.

సూచనలు: ఈ వ్యాధిలో జలౌకావచరణం (జలగలతో రక్త మోక్షణం చేయడం)తో పాటు సమీరపన్నగ రస, లశునక్షీరపాకం వంటి శక్తివంతమైన మందులు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

6. రక్తనాళాలు బిరుసెక్కి సాగే గుణాన్ని కోల్పోవడం (ఎథిరోస్క్లీరోసిస్):

రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉన్న వారిలోను, సిగరెట్లు ఎక్కువగా తాగేవారిలోను ధమనుల లోపలి గోడలు పూడుకుపోయి కాలుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా కణజాలాలకు ప్రాణవాయువు సరైన మోతాదులో అందక నొప్పి బయల్దేరుతుంది. ఇలా ఎక్కువగా కాళ్లలో జరుగుతుంటుంది. ఈ స్థితిలో ఒకవేళశక్తికి మించి శ్రమ చేసినా, వ్యాయామం చేసినా, ఆక్సిజన్ అవసరాలు మరింతగా పెరిగి, డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడంతో, తీవ్రమైన నొప్పి అనిపిస్తుంది. కాలువలలో రక్తనాళాలు (ధమనులు) పూడుకు పోయినప్పుడు చర్మంపై మార్పులు సంభవించడం, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పాలిపోయి కనిపించడం, చర్మాన్ని తాకితే స్పర్శకు చల్లగా తగలడం, పాదాల వేళ్ల సందుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

గృహచికిత్సలు: 1. వెల్లుల్లిపాయలు (ఇది గ్రాములు) తీసుకొని పైపొర తోఅలగించి లోపలి గర్భాలను మజ్జిగలో (కప్పు) ఆరుగంటల పాటు నానేయాలి. తరువాత కడిగి పాలలో (గ్లాసు) వేసి పావుగ్లాసు పాలు మాత్ర మిగిలేంతవరకు మరిగించాలి. దీనిని వదపోసుకుని అవసరమైతే కొద్దిగా పంచదార కలుపుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగాలి. 2. కరివేపాకును ఎండబెట్టి పొడిచేసి అన్నంలోగాని, మజ్జిగలోగాని పూటకు చెంచాడు చొప్పున ప్రతిరోజూ రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: లశునాదివటి, నవకగుగ్గులు, పునర్నవాదిగుగ్గులు, మేదోహరవిడంగాది లోహం.

7. పౌష్టికాహారలోపం (మాల్ న్యూట్రిషన్):

సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని వారిలో, బీ-కాంప్లెక్స్ లోపం ఏర్పడి కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, సూదులతో గుచ్చినట్లు నొప్పులూ అనిపించే అవకాశం ఉంది. ఆకు కూరల్లోను, తవుడులోనూ బీ- కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలి.

8. నరాల సమస్యలు:

ఆల్కహాల్ తీసుకునే వారిలోను, మధుమేహం నియంత్రణలో లేని వారిలోనూ కాళ్ల లోపలుండే నరాలకు రక్తసరఫరా తగ్గి వాటిలోని న్యూరాన్ కణజాలాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరిగితే సూదులతో గుచ్చినట్లు నొప్పి మొదలై క్రమంగా పాదాలు మొద్దుబారటం, కండరాలు శక్తిని కోల్పోవడాలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా, మద్యపానాన్ని వదిలేయటం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం మానేయటం, పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే కారణాన్ని అనుసరించి చికిత్స తీసుకోవాలి.

ఔషధాలు: క్షీరబలాతైలం (101 ఆవర్తాలు), మహావాత విధ్వంసినీ రసం, లశునక్షీరపాకం, వాతగజంకుశరసం, స్వర్ణసమీరపన్నగ రసం, వసంత కుసుమాకర ర

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాల

6, అక్టోబర్ 2020, మంగళవారం

పొట్ట లోని కొవ్వు కరగాలి తీసుకోవాలిసుని జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి

క్రొవ్వు కరగడానికి తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు 

      అతిగా వున్న కొవ్వు నివారణకు                            
 
    శరీరంలో కొవ్వు అతిగా పేరుకున్న వాళ్ళు నెలకొక సారి విరేచానానికి మందు వేసుకోవాలి.పగటిపూట నిద్రించ రాదు.రాత్రి పూట 4,5 గంటలు మాత్రమే నిద్ర పోవాలి.
 
        కొర్రల గంజి మంచిది, యవలు మంచి ధాన్యము. బియ్యము, గోధుమలు వాడకూడదు. పాల ఉత్పత్తులు ,చెరకు ఉత్పత్తులు తినరాదు.
 
                విరేచానానికి మందు
 
                   అల్లం రసం     ------ 2  టీ స్పూన్లు
                            తేనె      ------ 2  టీ స్పూన్లు
                   వంటాముదం  -----  4  టీ స్పూన్లు
 
         అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి దించి గోరువెచ్చగ వేకువ జామున తాగాలి. ఆ రోజంతా చారన్నం తినాలి.

           శరీర భాగాలలో కొవ్వు కరిగించడానికి                             
.
   వెల్లకిలా పడుకొని నిదానంగా కుడి కాలును పైకి లేపాలి.అదే విధంగా రెండవ వైపు కూడా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి .   మరల  రెండు కాళ్ళను ఒకే సారి పైకేత్తాలి, నెమ్మదిగా దించాలి.ఈ వ్యాయామాన్ని రెండు, మూడు సార్లతో ప్రారంభించి హెచ్చించాలి.
 
     ఈ విధంగా చెయ్యడం వలన నడుము నొప్పి  తగ్గుతుంది, పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది.
ఉదయం, సాయంత్రం ఖాళి కడుపుతో మాత్రమే చెయ్యాలి.
 
ఆహార నియమాలు:-
 
     అతి చల్లని పదార్ధాలు.నిల్వ ఉంచిన పదార్ధాలు,వేపుడు కూరలు, ఉడికి వుడకని పదార్ధాలు తినకూడదు.
 
జెర్సీ ఆవుల, గేదెల పాలలో కొవ్వు ఎక్కువగా వుంటుంది. కాబట్టి అవి వాడకూడదు,  మాంసాహారం జీర్ణం కావడానికి 48 నుండి 72 గంటలు పడుతుంది
 
    ఉదయం టిఫిను మానేసి ఉదయపు భోజనం 6 గంటల లోపు, రెండవ భోజనం 8 గంటల లోపు భోంచేయ్యాలిసాయంత్రం పండ్ల రసాలు తీసుకోవచ్చు.
 
ఉదయపు భోజనం :- 
 
        పాత గోధుమలు గాని, పాత రాగులు గాని, పాత బియ్యం గాని ఒక గ్లాసు తీసుకోవాలి.దానికి 14 గ్లాసుల నీటిని కలిపి మెత్తగా జావ లాగా ఉడికించాలి.దానికి చిటికెడు జిలకర, చిటికెడు ధనియాల పొడి,చిటికెడు వాము,చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూను సన్నగా తురిమిన అల్లం ముక్కలు,కారెట్ ,బీట్రూట్, ఇతర కూరగాయల ముక్కలు అందులో  వేసి కిచిడి లాగా చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి తినాలి. సైంధవ లవణం కలపాలి.
 
      దీని వలన ఒక్క గ్రాము కూడా అదనంగా కొవ్వు పెరగదు, పైగా కొవ్వు కరుగుతుంది.

         శరీరంలో కొవ్వు కరిగించడానికి.                                 
  ప్రాణాయామం ద్వారా :--  సుఖాసనంలో కూర్చొని బాగా దీర్ఘంగా గాలిని పీల్చి నెమ్మదిగావదలాలి.ఈ విధంగా చేసేటపుడు పొట్ట బాగా లోపలి పోవాలి.
 
1. ఒక కప్పు మెంతి ఆకుల రసం లో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.ఈ విధంగా ఉదయం, సాయంత్రం   రెండు పూటలా చెయ్యాలి.లేదా కనీసం రోజుకొకసారైనా చెయ్యాలి.
 
2. మామిడి, సపోటా, అరటి కొవ్వును పెంచుతాయి.
    బొప్పాయి కొవ్వును కరిగించడంలో ప్రధానమైనది.  
    ఉదయం   --పచ్చి ఆకుల రసం
    సాయంత్రం  --పండ్ల రసం
 
    దీనితోబాటు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.దీని వలన నీరసం రాదు.తేనె, నీరు చాలా బలాన్నిస్తుంది.
 
             కొవ్వును కరిగించడానికి తైలం                            
 
     100 గ్రాముల ఆవాల నూనెను స్టవ్ ,\మీద పెట్టి వేడి చేసి దించి దానిలో 20 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల ముద్ద కర్పూరం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది అద్భుతంగా కొవ్వును కరిగిస్తుంది.
 
    స్నానానికి గంట ముందు కొంత తైలం తీసుకొని కొవ్వు వున్న భాగంలో మర్దన చెయ్యాలి. ఒక అర గంట సేపు గాని, గంట సేపు గాని మర్దన చెయ్యాలి. దీనితో శరీరం మీద వున్న మచ్చలు కూడా నివారింప బడతాయి.అద్భుతమైన అందం, నిగారింపు వస్తాయి.
 
             శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన వచ్చే దుర్గంధాన్ని నివారించడం      

                నల్ల తుమ్మ ఆకులను రుబ్బిన పేస్ట్
               కరక పెచ్చులను రుబ్బిన పేస్ట్

     నల్ల తుమ్మ ఆకుల పేస్ట్ ను ముందు ఒళ్లంతా పట్టించాలి. తరువాత కరక్కాయ పేస్ట్ రుద్దాలి. దీని వలన శరీర దుర్గంధము నివారింప బడుతుంది.  కొవ్వు కర్గుతుంది.

                  అధిక క్రొవ్వును తగ్గించడం.                                            

                    ఉల్లి గడ్డల రసం          ----- పావు కిలో
                    ఆవాల నూనె             ----- పావు కిలో

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత బట్టలో పోసి వడకట్టాలి.

     శరీరంలో ఎక్కడ చెడు వాయువు, కొవ్వు చేరి ఉంటాయో అక్కడ ఈ తైలం తో బాగా మర్దన చెయ్యాలి.

                        Cellulite  --- చర్మం కింద కొవ్వు చేరడం -- నివారణ                    
 
      ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా వుంటుంది.
      వయసు మీద పడినట్లుండడం, చర్మం కమలా పండు లాగా మందంగా తయారవడం జరుగుతుంది.
 
     పిరుదులలో, ముంజేతుల పై భాగంలో, పొట్ట మీద ఎక్కువగా పేరుకుంటుంది.
 
     ఈ సమస్య స్థూల కాయం , హార్మోన్ల లో తేడా, అతినీల లోహిత కిరణాల ప్రభావం మొదలైన కారణాల వలన వస్తుంది.
 
 చర్మం లో బిగువు తగ్గి వేలాడుతున్నట్లు ఉండడం వీడియొ గేమ్స్ ఆడేటపుడు ప్రాణ వాయువు తగ్గడం ధూమ పానం , కెఫీన్ ఎక్కువగా వాడడం వలన శరీరంలోఆక్సిజెన్ తగ్గడం వంటివి జరుగుతాయి.
 వయ్యారి భామ  లేదా కాంగ్రెస్ గడ్డి ప్రభావానికి గురి అయినపుడు గర్భధారణకు, పాల ఉత్పత్తికి సమస్య 
ఏర్పడుతుంది.
 
     వయసు మీరడం కూడా ఒక ప్రధాన కారణం
 
     ఉదయం 11  గంటల నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. కావున ఆ సమయం లో జాగ్రత్తలు పాటించాలి.
 
పాటించ వలసిన నియమాలు:---    క్రమంగా బరువు తగ్గాలి. రోజుకు ఆరు నుండి పది లీటర్ల నీటిని తాగాలి.
 
క్రొవ్వు పదార్ధాలు, నిల్వపదార్ధాలు, కాఫీ, టీలు, ఉప్పు తగ్గించి వాడుకోవాలి. వ్యాయామం చెయ్యాలి.
 
     ఆరోగ్యదారి ( రేల పండు ) యొక్క గుజ్జుతో మర్దన చెయ్యాలి. తైల మర్దన తప్పని సరి.
 

     నూనె, నెయ్యి ఎక్కువగా వాడినపుడు దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం  వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాని  నూనె, నెయ్యి తగినంత వాడుకోవాలి. పూర్తిగా వాడడం మానేస్తే శరీరం ఎండి పోయినట్లు అవుతుంది., ఆహారం జీర్ణం కాదు.

దోరగా వేయించిన వాయు విడంగాలు
    "            "         శొంటి
                        ఉసిరిక పొడి

    అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణాలు  చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు పూటలా అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు బార్లీ జావాలో కలుపుకొని తాగాలి లేక తేనెతోకలుపుకొని తాగాలి. దీని వలన మూత్రము ఎక్కువగా వస్తున్నా భయపడవలసిన పని లేదు.

                  కొవ్వు కరగడానికి
తిప్ప తీగ పొడి
తుంగ గడ్డల పొడి

    రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి జల్లించి కలిపి భద్ర పరచుకోవాలి.

    అర టీ స్పూను పొడిని  ఒక టీ స్పూను తేనెతో ప్రతి రోజు తీసుకుంటే కొవ్వు అద్భుతంగా కరుగుతుంది.
                                  
1. త్రిఫలాలు
    త్రికటుకాలు
    సైంధవ లవణం

           అన్ని చూర్ణాలను కలిపి ముద్దగా చేసుకోవాలి. ప్రతి రోజు కుంకుడు కాయంత ముద్దను తినాలి. లేదా ఉదయం బార్లీ నీళ్ళలో కలుపుకొని తాగ వచ్చు.

2. మధ్యాహ్న భోజనానికి రొట్టె
     బార్లీ పిండి       --- 125 gr
     గోధుమ పిండి ---- పావు కిలో
     మిరియాల పొడి --చిటికెడు
     శొంటి పొడి         --      "
     పిప్పళ్ళ  పొడి      ---     '
     సైంధవ లవణం --- తగినంత

            అన్నింటిని నీటితో కలిపి రొట్టె చేసుకుని తినాలి. దీనిలోకి పొన్నగంటి కూర  గాని, మెంతి కూర గాని కలుపుకొని తినాలి.

3.  సాయంత్రం ఉలవకట్టులో సైంధవ లవణం కలుపుకొని తాగాలి.
4.   రాత్రి పుల్లటి పండ్లను తినాలి.
త్రిఫలాలు
తుంగ గడ్డలు
మాని పసుపు

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని కలిపి అర గ్లాసు కషాయం రానిచ్చి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.

      దీని వలన శరీరంలో అధికంగా వున్నకొవ్వు తగ్గుతుంది. రక్త నాళాలలో పెరిగిన కొవ్వు కూడా తొలగించబడుతుంది.

                           అధికంగా వున్న కొవ్వును, ఆకలిని తగ్గించడానికి  సంజీవనీ రసాయనం

ఉత్తరేణి గింజల పొడి                 ----  అర టీ స్పూను

       ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి ఉడికించాలి. దానిలో పాలు, చక్కర కలుపుకోవాలి. దీనిని తాగితే 2  3 రోజులు ఆకలి కాదు. తరువాత ఆకలైతేనే తినాలి.

       దీనిని విపరీతమైన లావు శరీరం వున్నవాళ్ళు, విపరీతమైన ఆకలి వున్నవాళ్ళు మాత్రమే వాడాలి. దీనితో విపరీతమైన ఆకలి తగ్గుతుంది,  శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

                కొలెస్ట్రాల్  సమస్య --నివారణ                                       

        రెండు వెల్లుల్లి పాయలను సన్నని ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేట్లు కాచాలి.  చల్లారిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని నిద్రించే ముందు తాగాలి. 40 రోజులు వాడాలి. దీని వలన కొలెస్ట్రాల్ అనబడే చెడు క్రొవ్వు నివారింప బడుతుంది.

         కఫ శరీరము కలిగి లావుగా వున్నవాళ్ళు  రెండు పాయలను, పైత్య (వేడి ) శరీరము కలిగిన వాళ్ళు ఒక వెల్లుల్లి పాయను వాడాలి.

              కొలెస్ట్రాల్  కరగడానికి చిట్కా                                                

తులసి గింజలు
జాజికాయ

      రెండింటి  చూర్ణాలను   సమాన భాగాలుగా తీసుకుని  కలిపి నిల్వ చేసుకోవాలి.  ప్రతి రోజు ఒక టీ స్పూనుపొడిని  నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ నివారింప బడుతుంది.

     శరీర భాగాలలోని కొవ్వును కరిగించడానికి లేపనం                

        తొడలలో కొవ్వు ఎక్కువైతే రాసుకుంటాయి. చర్మం లో కొవ్వు పెరుకున్నపుడు కమలాపండు
 తొక్క మీద లాగా గుంటలు ఏర్పడతాయి.

       ఈస్ట్రోజన్,  హార్మోన్లు,  ఒత్తిడి మొదలైన కారణాల వలన కొవ్వు ఏర్పడుతుంది.

       కళ్ళ కింద వలయాలు,  గడ్డం కింద కొవ్వు ( Double Chin),  స్థూలకాయం మొదలైన
 కారణాల వలన శరీర భాగాలలో కొవ్వు పేరుకుంటుంది.
    
   

                        కాఫీ పొడి పేస్ట్                       ---ఒక కప్పు
                        కలకండ పొడి                        ---అర కప్పు
                        సముద్రపు ఉప్పు పొడి           ---అర కప్పు
                        ప్రొద్దుతిరుగుడు గింజల నూనె --- అర కప్పు

         కాఫీ పొడి లో వేడి నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనికి కలకండ, ఉప్పు,
 నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.

         కొవ్వు అధికంగా పెరుకున్న  ( సెల్యులైట్ ) భాగాల మీద దీనిని రుద్దాలి .

         కొవ్వు సహజంగా తొడల లో, మెడ మీద, గడ్డం కింద, పొట్ట మీద, ఎక్కువ ఏర్పడుతుంది.

         మొదట ఆ భాగాలను వేడి నీటితో శుభ్రపరచాలి. ఈ లేపనాన్ని పూసి అదుముతూ పైకి
( గుండె వైపుకు ) రుద్దాలి.

ఉపయోగాలు :--  ఇది చర్మం కింద కొవ్వు ఏర్పడకుండా కాపాడుతుంది.

సూచనలు :--   గర్భధారణ సమయంలో, బహిష్టు కు ముందు రోజులలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

       తీపి పదార్ధాలను, నూనె పదార్ధాలను తగ్గించాలి. నడవాలి. ఉలవ కషాయం తాగాలి. నాలుగైదు మిరియాలను తమలపాకులలో పెట్టుకొని నమిలి తిని నీళ్ళు తాగాలి.  భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగాలి.   
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660