5, జనవరి 2020, ఆదివారం

మగవాళ్ళు అంగం పై కణుతు నివారణ కు


పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ,Testicular Tumours



పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య - వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్‌ కానివి కావచ్చు.లేదా కేన్సర్‌ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ కాని కంతులే ఉంటాయి.

ఇవి ఒకచోటినుంచి మరొక చోటకు వ్యాప్తి చెందవు. అయినప్పటికీ, వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. కేన్సర్‌కు చెందిన కంతులు వృషణాలపై ఏర్పడితే అవి అక్కడినుంచి మరొక చోటికి వ్యాప్తి చెందవచ్చు.సాధారణంగా ఊపిరితిత్తులు, కాలేయం, లింఫ్‌ నోడ్స్‌, కేంద్ర నాడీ మండల వ్యవస్థలకు ఈ కేన్సర్‌ కంతులు వ్యాప్తి చెందుతాయి.

కారణాలు
మగపిల్లల్లో వృషణాలపై కంతులు ఎందుకు ఏర్పడతాయనే విషయమై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం ఏదీలేదు. అయినా, ఇవి జెర్మ్‌ సెల్స్‌నుంచి ఏర్పడుతాయని భావిస్తున్నారు. గర్భస్థ పిండంలో ఎదిగే కణాలు ఈ జెర్మ్‌ సెల్స్‌. ఇవి పిండంతోపాటు అభివృద్ధి చెందుతూ పురుష, స్త్రీ జననావయవ వ్యవస్థగా రూపు దిద్దుకుంటాయి. జెర్మ్‌ సెల్స్‌ పిండంలో ఒక మధ్యస్థ రేఖన నుసరించి పెరుగుతూ, గర్భస్థ పిండం శిశువు స్త్రీ అయితే కటి వలయంలో అండాశయ కణాలుగానూ, శిశువు పురుషుడైతే, వృషణ కణాలుగానూ మారుతాయి.కేంద్ర నాడీ మండల వ్యవస్థ, మూత్ర, జన నావయవ వ్యవస్థల పనితీరు సక్రమంగా లేకపోవడం వంటి అనేక అంశాలు జెర్మ్‌ సెల్స్‌ కంతులుగా మారడానికి దోహదం చేస్తాయి.

లక్షణాలు
వృషణాల్లో వాపు, గట్టి దనం, వృషణాల రూపం, పరిమాణం మొదలైన వాటిలో అసాధారణతలు, వృష ణాల్లో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి. అయితే ఈ రకమైన లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపించే అవకాశాలు న్నందున తప్పనిసరిగా వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.

-నిర్దారణ
సాధారణంగా వృషణాలపై ఏర్పడే కంతులను మొట్ట మొదటగా గుర్తించేది తల్లిదండ్రులే. తమ బిడ్డకు వృషణాలపై వాపు కనిపించగానే వారు వైద్యసహాయం పొందాలి. హెర్నియా, ఎపిడిడిమస్‌కు సోకే ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలు కూడా ఈ లక్షణాలను ప్రతిబింబించే అవకాశాలున్నందున తమ బిడ్డను శిశు వైద్య నిపుణులకు చూపించి, తగిన సహాయం పొందాలి. రోగి ఆరోగ్య, అనారోగ్య అంశాలు, భౌతిక పరీక్ష మొదలైన వాటితో వైద్యులు ఈ సమస్యను అనుమానించి, నిర్ధారణ నిమిత్తం కొన్ని పరీక్షలు చేయిస్తారు.

అల్ట్రాసౌండ్‌ : అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయడం ద్వారా వృషణాల్లో ఉన్న కంతి ఏ రకమైనదనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అవసరమైతే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అత్యధిక తరచుదనం కలిగిన ధ్వని తరంగాలను వృషణాల్లోకి ప్రసరింపజేసి, కంప్యూటర్‌ మానిటర్‌పై వృషణాల్లోని రక్తనాళాలు, కణ జాలాలు మొదలైన వాటిని క్షణ్ణంగా పరీక్షిం చడానికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఉపకరిస్తుంది.

సి.టి.స్కాన్‌ : ఎక్స్‌రేలు, కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానాలను మేళవించి చేసే పరీక్ష ఇది. దీనిలో వృషణాలను మరింత క్షుణ్ణంగా పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. భూసమాంతరంగానూ, నిలువుగానూ వృషణాల్లో కొద్ది కొద్ది భాగాలను ముక్కలుగా (స్లయిస్‌) పరీక్షిస్తారు. దీని ద్వారా ఎముకలు, కండరాలు, కొవ్వు తదితర భాగాలను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది.

ఎం.ఆర్‌.ఐ. : దీనిలో పెద్ద పెద్ద అయస్కాం తాలను, రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తూ పరీక్షిస్తారు.
బయాప్సి : కంతినుంచి చిన్న ముక్కను సేకరించి మైక్రోస్కోప్‌ కింద పరీక్షిస్తారు. దీని ద్వారా ఆ కంతి కేన్సర్‌కు చెందినదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవచ్చు.

సి.బి.సి. : ఈ పరీక్షను కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌ అంటారు. దీనిలో రక్త కణాల పరిమాణం, సంఖ్య, అవి పరిణతి చెందినవా? కాదా? అనే అంశాలను పరిశీలిస్తారు.

ఇతర పరీక్షలు : అవసరానుగుణంగా బ్లడ్‌ కెమిస్ట్రీ, కాలేయ, మూత్రపిండాల పని తీరు పరీక్షలు, జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.

చికిత్స
చికిత్స సమస్య తీవ్రతనుబట్టి, బాధితుడి వయస్సు, ఇతర అనారోగ్య సమస్యలు మొదలైన అంశాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే, రోగి ఏ రకమైన మందులను తీసుకోగలుగుతాడు, ఎలాంటి ప్రక్రియలు ఉపయోగిస్తే రోగికి ఇతరత్రా బాధలు ఉండవనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది.వృషణాలపై ఏర్పడిన కంతులు కేన్సర్‌కు చెందినవైనా, కేన్సర్‌ కాని కంతులైనా వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. దీనిలో కంతిని, దానితోపాటు ఆ కంతి సోకినవైపు ఉండే వృషణాన్ని తొలగిస్తారు. ఈ చికిత్సను ఆర్కియెక్టమీ అంటారు.

ఒకవేళ వృషణంపై ఏర్పడిన కంతి కేన్సర్‌ రకమైనదైతే, దానిని తొలగించిన తరువాత కీమోథెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కీమోథెరపీలో కేన్సర్‌ కణజాలం పెరగకుండా చేసే మందులను ఇస్తారు. కంతులు కుంచించుకుపోయేలా చేసేవి, కేన్సర్‌ కణాలు నశింపజేయడానికి ఉపకరించేవి అయిన అనేక రకాల ఔషధాలు కీమోథెరపీలో ఉపయోగిస్తారు.

కీమోథెరపీ విధానం
ఈ ప్రక్రియలో ఔషధాన్ని మాత్రలుగా నోటి ద్వారా తీసుకోవడానికి ఇస్తారు. లేదా ఇంజక్షన్‌ రూపంలో కండరాల్లోనుంచి కాని, నేరుగా రక్తనాళంలోకి (సిరల్లోకి - ఇంట్రావీనస్‌ లేదా ఐవి) కాని ఇస్తారు. ఔషధాన్ని నేరుగా వెన్నుపాము ద్వారా ఇవ్వడాన్ని ఇంట్రాథెకల్లీ అంటారు.ఇవేకాకుండా, కేన్సర్‌ కణాలను నాశనం చేయడానికి అత్యధిక శక్తి కలిగిన ఎక్స్‌రేలను (రేడియేషన్‌)ను ఇస్తారు. ఈ ప్రక్రియను రేడియేషన్‌ థెరపీ అంటారు. చికిత్స తరువాత కూడా రోగిని కొంతకాలంపాటు వైద్యుల పర్యవేక్షణ ఉంచాలి 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

POST A COMMENT

అమ్మాయి నెలసరి సమస్య (అధిక రుతుస్రావం )


Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    నెలసరి దగ్గరపడుతోందంటే కొందరు మహిళల్లో కంగారు. ఆ సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడమే ఆ భయానికి కారణం. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్యలేదు. తరచూ బాధ పడుతోంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతోందా లేదా అన్నది తెలుసుకునే ముందు అసలు ఆ సమయంలో సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వాలనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే తక్కువగా అలాగని మరీ ఎక్కువగా రక్తస్రావం కాకుండా ఉండటమే. సగటున అయితే ఐదు రోజులకు మించి నెలసరి ఉండకూడదు. ఆ సమయంలో ఇరవై నుంచి అరవై ఎంఎల్‌ దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్‌ అనొచ్చు.. దాన్ని తెలుసుకోవడం కష్టం అయినా, కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ న్యాప్‌కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి రెండు న్యాప్‌కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడటం.. లాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి.

ఇవీ కారణాలు...
అప్పుడే రుతుక్రమం మొదలైన వారి నుంచి మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న ఎవరైనా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ప్రతి పదిమందిలో దాదాపు ఆరుగురిలో ఈ సమస్య ఉన్నా, చాలాసార్లు అసలైన కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొస్టాగ్లాండిన్‌ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టీ ఈ సమస్య ఎదురవుతుంది. ఈ రసాయనం గర్భాశయ పొరపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్నిసార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడూ ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు ఈ కింది కారణాలూ ఉండే అవకాశం ఉంది.

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

*పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ)తో బాధపడే కొందరిలో ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. అలాంటప్పుడూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్‌తో బాధపడుతోన్నా అధికరక్తస్రావం కావచ్చు.

*ఇతర సమస్యలకూ, కీమోథెరపీలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల మందుల వల్లా కొన్నిసార్లు సమస్య తలెత్తుతుంది.

గుర్తించేందుకు పరీక్షలుంటాయి..
సమస్య కనిపించినప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధరించుకునేందుకు డాక్టర్‌ని సంప్రదించాలి. అలాంటప్పుడు గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతినెలా ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి, ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్‌ మాత్రల్ని తీసుకోని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టే ఆ పరీక్ష చేయించుకోమంటారు. వాస్తవానికి అధిక రక్తస్రావంతో బాధపడే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రక్తహీనత ఉంటుంది.

ఒకవేళ గర్భాశయం, గర్భాశయ ముఖద్వారంలో ఎలాంటి సమస్యలూ లేకపోతే, వయసు నలభై లోపు ఉంటే అదనంగా ఎలాంటి పరీక్షలూ సూచించరు. సమస్య తీవ్రతను బట్టి మాత్రల్ని ఇస్తారు.
అలా కాకుండా వయసు నలభై అయిదేళ్లు దాటి, నెలసరి, నెలసరికీ మధ్యలో రక్తస్రావం అవుతోన్నా, కలయిక తరవాత రక్తం కనిపించడంతోపాటూ నొప్పిలాంటి లక్షణాలు కూడా ఉంటే డాక్టర్లు గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు.. ఫైబ్రాయిడ్లు, పాలిప్స్‌ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్‌ శాంపిల్‌ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టీ హిస్టెరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.

మాత్రలే మొదటి చికిత్సగా..
ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

*గర్భం రాకుండా వాడే మాత్రల్లో కంబైన్డ్‌ ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ కూడా రక్తస్రావంతోపాటూ నెలసరి నొప్పినీ కొంతవరకూ తగ్గిస్తాయి.

*కొన్నిసార్లు మిరేనా గా చెప్పుకొనే లెవనార్జెట్రెల్‌ ఇంట్రా యూటరైన్‌ సిస్టమ్‌ కూడా ఈ సమస్యను చాలామటుకు తగ్గిస్తుంది. దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. అది ప్రతిరోజూ కొద్దికొద్దిగా లెవనార్జెట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. దాంతో నెలసరి చాలా తక్కువ కావచ్చు. లేదా కొంతకాలం ఆగిపోవచ్చు. ఆ సమయంలో వచ్చే నొప్పీ తగ్గుతుంది. ఇది ఎండోమెట్రియల్‌ పొరను పలుచన చేస్తుంది. ఈ మిరేనాని కనీసం ఐదేళ్లవరకూ అమర్చుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు వెంటనే తొలగించుకోవచ్చు. రక్తస్రావం సమస్య తగ్గడంతోపాటూ ఎక్కువకాలం గర్భం రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి మంచి పరిష్కారం.

*ఇవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా డాక్టర్లు శస్త్రచికిత్సను చేయించుకోమంటారు. గర్భాశయాన్ని తీసేయడం లేదా అక్కడ ఉండే ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం ఈ శస్త్రచికిత్సలో భాగం. అదే ఎండోమెట్రియల్‌ ఎబ్లేషన్‌. ఇందులో ఎండోమెట్రియల్‌ పొరను సాధ్యమైనంతవరకూ తగ్గిస్తారు. ఈ శస్త్రచికిత్సను హీట్‌, మైక్రోవేవ్‌, క్రయోథెరపీ లాంటి ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. ఆ తరవాత సమస్య దాదాపుగా తగ్గినా భవిష్యత్తులో గర్భం వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

*పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు..గర్భాశయాన్ని పూర్తిగా తీసేసే హిస్టెరెక్టమీ డాక్టర్లు సూచిస్తారు.

అదనంగా జాగ్రత్తలు..
అధికబరువున్న వాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తహీనత సమస్య ఉందని రక్తపరీక్షలో తేలితే ఐరన్‌ మాత్రల్ని తీసుకోవడంతో పాటూ ఇనుము అందించే పదార్థాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తోటకూర, గుడ్లు, ఎండుద్రాక్ష, సోయా లాంటివి రోజూ ఆహారంగా తీసుకోవాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 

POST A COMMENT



కేన్సర్ కు గ్యాస్ట్రిక్ ఆల్కర్ నొప్పి కు ఎలా గమనాన్నిచాలి


Ulcer and Cancer difference,అల్సర్ కి క్యాన్సర్ కి తేడా ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJD9SpTD01NH7RBNKSxY-bvl69i7RThiPy7PmCO9jmaKKoYORuacTVe93ckA3QkAay4miho8L3jdbTVurFL1ahhz7Xr8qQvsClY4G9hHd_8reEqnU5d9ux1TihnTe1dxbP-FYGQ__JJ3k/s1600/peptic+ulcer.jpg
అల్సర్ కి క్యాన్సర్ కి తేడా - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

నీరు తక్కువ తాగడము వల్లనో , లేక పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతి   ఒక్కరు జీవిత కాలములో ఏదో ఒక దశలో అల్సర్ కు గురి అవడము జరుగుతుంది . అందుకనే విద్యార్ధులలో పరీక్షల సమయములో ఎక్కువగా నోటిపూత గమనిస్తూ ఉంటాము . సాదారనము గా మూడు , నాలుగు రోజులలో తగ్గిపోయే అల్సర్లు అంతకంటే ఎక్కువకాలము ఉండి తరుచుగా భాధిస్తూ ఉంటే ఎవ్వరికైనా అనేక అనారోగ్య అనుమానాలు వేధిస్తు ఉంటాయి. అల్సర్ లకు సంబంధించి నోటి పూతతో పాటు , పెప్టిక్ అల్సర్ , గ్యాస్ట్రిక్ అల్సర్ , ఈసోపేగల్ అల్సర్ , కదలలేని పరిస్థితి లో మంచానికి పరిమితమైనపుడు ఏర్పడే పుండ్లు , సిఫిలిస్ , హెర్పిస్ వలన జెనిటల్ మర్మావయవాలలో అల్సర్లు , డయాబెటిక్ న్యూరోపతిక్ తో కాళ్ళలోవచ్చే అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్ ను పెప్టిక్ అల్సర్ అంటాము . జీర్ణకోశము , చిన్నప్రేగులలొ ఇవి పుడతాయి. జీర్ణ కోశములో ఉంటే ;;; గ్యాస్ట్రిక్ అల్సర్ గాను , చిన్నప్రేగులో ఉంటే డియోడినల్ అల్సర్ గానూ పిలుస్తారు . జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత 1% వరకు క్యాన్సర్ గా మారే ప్రమాధము ఉంది . గ్యాస్ట్రిక్ అల్సర్ ఎక్కువగా క్యాన్సర్ గా మారే ప్రమాదము ఉంది  .

1980 వరకు అల్సర్ కు , పూతకు మసాలా ఆహారము , కారము , ఒత్తిడి , ఆల్కహాల్ తాగడము , పొగాకు సంబంధిత మత్తుపదార్ధాలు నమలడము , తిన్డము అనుకునేవారు . దాదాపు వంద సంవత్సరాలు అల్సర్ కు కారణము అవే అనుకొని వీలైనంత వరకు వాటికి దూరం గా ఉండమని సలహాలు ఇచ్చేవారు వైద్యులు . 1982 లో " టారీమార్షల్ మరియు రాబిన్‌ వారెన్‌ " అనే ఇద్దరు డాక్టర్లు  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పూత , అల్సర్ లకు కారణము " హెలికోబాక్టర్ పైలోరి (Helicobactar pylori) ... హెచ్.పైలోరి .. అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు . దీనికి వారికి నోబెల్ బహుమతి వచ్చింది .  మన జనాభాలో 90% మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బాక్టీరియాకు గురి అవుతారు .ఇవి డియోడినం లో నిరరంతరము ఉండి  జీవిస్తూ ఉంటాయి.  ఒత్తిడి , ఎసిడిటి , స్మోకింగ్ , ఆల్కహాల్ తాగడము వంటి కారణాలవల్లనో  లేక శరీర తత్వమువల్లనో జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిని ఈ బాక్టీరియా వలన అల్సర్ ఏర్పడడము జరుగుతుంది .

వ్యాధి లక్షణాలు

జీర్ణాశయం అల్సర్‌ : బాగామంటతో కూడిన నొప్పి. అన్నం తింటూనే ఎక్కువై, 3,4 గంటల తర్వాత తగ్గుతుంది. అన్నం సహించకపోవడం. ఆకలి మందగించడం. వాంతుల వడం. బరువు తగ్గడం. వాంతి అయితే నొప్పి తగ్గడం. ఇవి దీని సాధారణ లక్షణాలు. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగితే, కాఫీ, డికాక్షన్‌ లాగ వాంతులవడం, మనిషి నీరసిం చిపోవడం జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

డ్యుయోడినల్‌ అల్సర్‌ : కడుపు పైభాగంలో మంటతో కూడిన నొప్పి. ఖాళీ కడుపు వున్నప్పుడు నొప్పి అధికమవుతుంది. అన్నం తిన్న రెండు, మూడు గంటలు దాటిన తర్వాత, అర్థరాత్రి, తెల్లవారు జామున అధికనొప్పి రావడం. అప్పుడేమైన తిని నీళ్లు తాగితే తగ్గుతుంది. ఇవి ముఖ్య లక్షణాలు. దీని లోపల, పుండు నుండి రక్తస్రావం జరిగితే వాంతితో పాటు, తారులాగా నల్లగా విరేచనమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితి.

విపరీతలక్షణాలు : అల్సర్‌ నుండి రక్తస్రావం అవుతుంది. గ్యాస్ట్రిక్‌ అవుట్‌లెట్‌ అవరోధం. పుండు వున్న చోట రంధ్రం పడడం. పైలోరిక్‌ స్టినోసిస్‌ ఏర్పడడం. పుండు క్యాన్సర్‌గా మారటం.

వ్యాధి / బాదలను ప్రేరేపితము చేసే కారకాలు :


*వంశపారంపర్యంలో ఒక రకమైన జన్యువుల వల్ల.

*పొగతాగే వారిలో అవకాశం అధికం.

*గాస్ట్రినోమ అనే క్లోమగ్రంథిలో పెరిగే గడ్డ వల్ల.

*కొంతమందిలో గ్యాస్ట్రోజెజునాష్టమి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఏర్పడొచ్చు.

*ఎక్కువ ఆందోళన చెందేవారిలో.

*మద్యం అపరిమితంగా సేవించేవారిలో.

*ఎక్కువ కారం, పులుపు, మసాల దినుసులు వాడే వారిలో.

*జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్‌ తయారవటం వల్ల.

*'హెచ్‌.పైలోరి' అనే సూక్ష్మజీవుల కడుపు లో చేరడము వలన .

వొళ్లు నొప్పులు తగ్గించే (పెయిన్‌కిల్లర్స్‌) కొన్ని మందుల వల్ల.ఈ పెప్టిక్‌ అల్సర్‌ ఏర్పడుతాయి.

ఎలా మొదలవుతుంది ?

*జీర్ణాశయంలో ఎక్కువ జీర్ణరసం ఉత్పత్తి.

*జీర్ణాశయం లోపలి వుండే పల్చటి పొర (గ్యాస్ట్రిక్‌ మ్యూకోజ) దెబ్బతిన్నప్పుడు (మద్యం అతిగా సేవించే వారిలో ఆస్పిరిన్‌ మొదలైన మందులు *వాడేవారిలో ఆ పొర దెబ్బ తింటుంది.)

*పెస్సిన్‌ ఆమ్లం ఎక్కువ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్‌ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు.

*చర్మం కాలినప్పుడు, కొన్ని రక్త ప్రసరణ రోగాలు వచ్చినప్పుడు.

వ్యాధి నిర్ధారణ

జిఐ ఎండోస్కోపి, బేరియం ఎక్సరే, రాపిడ్‌ బయాప్సి‌ (హెచ్‌.పైలోరి కనుక్కోవడానికి)

దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్ లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. చాలా కాలము గా వస్తూ , పోతూ ఉండే అల్సర్లే ... కాన్సర్ గా మారిపొతాయి. అల్సర్ చుట్టూ దలసరిగా కణితి లా తయావుతుంది . .ట్రీట్మెంట్ కూడా కణితి వచ్చిన ప్రదేశము , స్టేజ్ , వయస్సు , ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటుంది . లింఫ్ నోడ్స్ క్యాసర్ కు గురి అయితే చికిత్స కష్టమవుతుంది . జీర్ణ కోశాన్ని కొంతబాగము , చిన్నపేగులలో కొంతభాగాన్ని లింఫ్ నోడ ను వీలైనంతవరకు తీసివేయడము , . .చేస్తారు . కీమోథెరఫీ కూడా అవసరము ఉంటుంది . ఈ సర్జరీ తర్వాత సప్లిమెంటరీ ట్రీట్మెంట్ ... విటమిన్‌ - డి  , కాల్సియం , ఐరన్‌ , విటమిన్‌ బి.కాంప్లెక్ష్ అవసరము ఉంటుంది.

మంచి గ్యాస్ట్రోఎంటిరాలగిస్ట్ / గాస్ట్రిక్ సర్జన్‌ ని సంప్రదించాలి.

స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి  దశలో అంత ప్రస్పుటంగా ఉండవు . అనుమానించేంత  స్థాయిలో లక్షణాలు బయటపడ్డాయంటే అప్పటికే క్యాన్సర్ స్టేజీ ఎక్కువగా ఉంటుంది . ప్రతిసంవత్సరము ప్రపంచవ్యాప్తం గా సుమారు 8,00,000 మంది ఈ క్యాన్సర్ వ్యాది కి బలైపోతున్నారు .  హెలికోబాక్టర్ పైలోరి  ఈ క్యాంసర్ కు దాదాపు 70% - 80% వరకు కారణము . వీటికి చెడు అలవాట్లు ... మద్యము , పొగ , మసాలా పదార్ధాలు దోహదపడతాయి. హెలికోబాక్టర్ పైలోరి మనము తీసుకునే నీటిలోనే ఉంటుంది. అందుకే పరిశుభ్రమైన నీటిని , ఆహారాన్ని తీసుకోవాలి. పాస్ట్ ఫుడ్స్ తినరాదు . తిన్నవారందరికీ ఈ వ్యాధి వస్తుందనుకోవడమూ పొరపాటే . అనేకానేక కారణాలు , కారకాలు సమ్మిలిత ఫిలితంగా ఈ అల్సర్ / క్యాన్సర్ వస్తుంది . ప్రజలలో అవగాహన కోసమే 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 


దగ్గు నప్పుడు మూత్రం రావడానికి కారణం నివారణ


దగ్గినప్పుడు మూత్రం పడుట కారణం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  , Urine dribiling during cough


దగ్గినప్పుడు మూత్రం పడుట -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఏదో ఒక సందర్బంలో దగ్గని వారు ఎవరూ ఉండరు. మన దైనందిన జీవితంలో వంటగదిలో పోపు వేస్తున్నప్పుడు వచ్చే వాసన పీల్చినప్పుడు కాని, ఇల్లూ, వాకిలి తుడుస్తున్నప్పుడు కాని, మరుగుదొడ్లు శుభ్రపరుస్తు న్నప్పుడు కాని, చలిగాలిలో బైటికి వెళ్లినప్పుడు కాని, కాలుష్యానికి గురైనప్పుడు కాని, మస్కిటో కాయిల్స్‌ వెలిగించినప్పుడు కాని, చివరకు పర్‌ఫ్యూమ్స్‌ వాడినప్పుడు కాని మనకు తెలియకుండానే దగ్గి ఉంటాము. మనం మన శరీరాన్ని రక్షించుకునే ప్రక్రియలో భాగంగా దగ్గు ఒక ప్రతిస్పందనగా పని చేస్తుంది. శ్వాసనాళాల్లో ఉండే కాఫ్‌ రిసెప్టార్స్‌ ఇలాంటి వాసనలకు గురైనప్పుడు అవి ప్రేరితమై మెదడుకు సంకేతాలు పంపుతాయి. అక్కడినుంచి ఛాతీ కండరాలకు సంకేతాలు అందుతాయి. ఈ సమయంలో ఊపిరి బాగా పీల్చడం, స్వరపేటిక మూసుకోవడం, కండరాలు బిగుతుగా మారడం, ఒక్కసారిగా ఊపిరితిత్తుల నుంచి గాలి వేగంగా బైటకు రావడం జరుగుతుంది. ఈ వేగానికి శ్వాసనాళాల్లో చేరిన మలినాలు, బాక్టీరియా, వైరస్‌ వంటివి బైటికి వెళ్లిపోతాయి. సాధారణంగా జరిగే ప్రక్రియను మనం గుర్తించలేకపోవచ్చు. గుర్తించినా, అవి మనకు గుర్తు ఉండకపోవచ్చు.

ఏళ్ల తరబడి ధూమపానం చేసేవారు తమకు తెలియకుండానే తీవ్రంగా దగ్గుతుంటారు. మీరు దగ్గుతున్నారని ఎదుటివారు చెప్పినా వారు నమ్మరు. దీనిని స్మోకర్స్‌ కాఫ్‌ అంటారు. సాధారణంగా కనిపించే శ్వాసకోశ వ్యాధులు - జలుబు, ఫారింజైటిస్‌, ట్రేకియాటిస్‌, బ్రాంకైటిస్‌, అలర్జీ, ఆస్తమా మొదలైన వాటితోపాటు - దీర్ఘకా లిక వ్యాధుల్లో కూడా దగ్గు ఒక లక్షణంగా కనిపి స్తుంది. క్షయ, న్యుమోనియా, ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌, గుండె వైఫల్యం చెందడం, ఇసినోఫిలియా వంటి వ్యాధుల్లో కూడా దగ్గు ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. బీటాబ్లాకర్స్‌, ఎసిఇ ఇన్హిబిటర్ల వంటి బిపి మందులు, నాన్‌ స్టీరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఎఐడి) వంటి నొప్పులకు వాడే మందుల వల్ల కూడా కొంతమందిలో దగ్గు వస్తుంది.

వివిధ రకాల వ్యాధుల్లో దగ్గుతోపాటు ఆయా వ్యాధులకు సంబంధించిన ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. జ్వరం, ఛాతీ నొప్పి, ఆయాసం, పిల్లికూ తలు, దగ్గులో రక్తం పడటం, గొంతు బొంగురుపోవడం వంటివి కనిపిస్తాయి. వీటినిబట్టి కొన్ని అవసరమైన రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే, సి.టి. స్కాన్‌ మొదలైన పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. చాలామందిలో దగ్గు తేలికగా ఉండటం, కొన్ని సందర్బా ల్లో దగ్గిన్పుడు ఛాతీలో మంట రావడం, దగ్గు వల్ల నిద్ర పట్టకపోవడం వంటివి కూడా జరుగవచ్చు. మరికొందరిలో దగ్గుతున్నప్పుడు మూత్రం పడుతుంది. బట్టలు తడిసిపోవడం, వాసన రావడం వంటి వాటితో కొందరు బైటకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. వీరిలో మూత్రాశయ సమస్య ఏమీ ఉండకపోవచ్చు.

దగ్గినప్పుడు ఛాతీలో కలిగే ఒత్తిడి, కడుపులోని ఒత్తిడి మూత్రాశయంపై పడటం వల్ల దగ్గిన ప్రతిసారీ మూత్రం పడుతుంటుంది. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వారు దగ్గు రావడానికి కారణమైన వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి చికిత్స తీసుకుంటే, ఈ సమస్యను అధిగమించవచ్చు. కొంతమంది ఈ విషయం అర్థం కాక, మూత్రపిండాలు దెబ్బ తిన్నాయే మోననే భయంతో స్పెషలిస్టుల దగ్గరకు వెళ్లి రకరకాల పరీక్షలు చేయించు కుంటూ ఉంటారు. దగ్గినప్పుడు మూత్రం పడటమనే సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యతో కుంగిపోతారు. గర్బాశయాన్ని తొలగించడం (హిస్టరెక్టమీ), లేదా జీర్ణాశయ వ్యాధులకు అవసరమయ్యే శస్త్ర చికిత్సలకు ముందు కూడా దగ్గు లేకుండా జాగ్రత్త పడాలి. ఆపరేషన్‌ తరువాత ఒక్కొక్కసారి కుట్లు ఊడిపోయి హెార్నియా వచ్చే ప్రమాదం ఉంటుంది. దగ్గు, దానితోపాటు మూత్రం వస్తున్నప్పుడు ముందుగా ఫిజిషియన్‌ను లేదా పల్మొనాలజిస్ట్‌ను సంప్రదించి దగ్గుకు తగిన కారణమేమిటో నిర్ధారణ చేసుకుని తదనుగుణంగా చికిత్స తీసుకుంటే దగ్గినప్పుడు మూత్రం పడే సమస్యనుం నివారణ అవుతాది 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

చిన్న పిల్లలు కు టీకా ఎప్పుడు వేసుకోవాలి


వ్యాధి నిరోధక టీకాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  , Vaccination Schedule

* శిశువుకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు జూన్, జనవరి నెలలలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి - విటమిన్ ఏ చుక్కలు ఇవ్వాలి.
* గర్భవతులు - ప్రారంభ దశలో - టీటి లేదా బూస్టర్ ఇన్జెక్షన్/ సూది ; 4 వారాల తరువాత టీ.టి 2

టీకాల ద్వారా నిరోధించగల అంటు వ్యాధులు

1. డిఫ్తీరియా : ఇంటిలో పిల్లలకి గొంతులో అంగుటమీద తెల్లటి పొర ఏర్పడి తీవ్ర జ్వరం, దుష్పలితాలు ఏర్పడతాయి. చాలా ప్రాణాపాయం.
2. పర్ ట్యూసిస్ : కోరింత దగ్గు ఇందులో పిల్లలు జ్వరం, విపరీతంగా తెరలు తెరలుగా దగ్గుతూ నీరసించి పోతారు. ప్రాణాపాయం ఎక్కువ.
3. టెటనసం – ధనుర్వాతం : దీని వలన జ్వరం, ఫిట్స్, విల్లులుగా వెనక్కి విరచుకుపోతారు. ప్రాణం పోవచ్చు.
4. పోలియో – పక్షవాతం : దీనిలో జ్వరంతో మొదలయి కొద్దిపాటి విరోచనాల తరువాత కాళ్ళు చేతులు పక్షవాతంకి గురి అవుతాయి.
5. బిసిజి : ఈ టీకావలన క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.
6. పొంగు : మీజిల్స్ టీకావలన పిల్లలకి ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చును.
7. హెపటైటిసం బి : కాలేయమునకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించవచ్చును.

ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి?

వయస్సు ----------- మందు పేరు ---- 

పుట్టిన వెంటనే -------- బి.సి.జి. మరియు ఓరల్ పోలియో,
6 వారాలకు--------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో,
10 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
14 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
9 మాసాలకు-------------- మీజిల్స్,
16 – 24 నెలలు----------- డి.పి.టి., పోలియో, బూస్టర్ డోసుల

ప్రతి 5 సంవత్సరాలకు బూస్టర్ డోసు ఇవ్వాలి -- మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించంది .


నిరోధక టీకాల కార్యక్రమం గత చరిత్ర :
ప్రధాన లక్ష్యాలు

*మూడు ప్రధాన లక్ష్యాలతో మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

1. 1990 నాటికి దేశంలోని ఏడాదిలోపు పిల్లల్లో 85 శాతం మందికి ఒక మోతాదు బిసిజి టీకా, మూడు మోతాదుల ఓరల్‌ పోలియో, మూడు మోతాదులు డిపిటి, ఒక మోతాదు తట్టు సూది అందించడం. 100 శాతం గర్భవతులు టెటనస్‌ టాక్సాయిడ్‌తో రక్షించడం.

2. 1990 నాటికి టీకాల గురించి 'డిమాండ్‌' కలిగించడం. అంటే ప్రజలలో టీకాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి, వారు ఆరోగ్య కార్యకర్తలను టీకాలు ఇవ్వమని అడిగే స్థితికి ఎదగడం. ' ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం' అనే గొప్ప ఆదర్శానికి ఈ లక్ష్యం ఆయువు పట్టు.

3. టీకాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి కావడం.

ఇరవై ఐదేళ్ల కిందట అంటే నవంబరు 19,1985 న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా నాటి ప్రభుత్వం మన పిల్లల రక్షణకు ఒక మహోజ్వల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే 'సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం'. ఈ నెల 19కి కార్యక్రమం రజతోత్సవం జరుపుకున్నాం.

చిన్న పిల్లల రక్షణలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఒక మైలురాయి. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎన్నో విన్నూత్నమైన అంశాలు ఇందులో ప్రవేశపెట్టారు. వ్యాక్సినులు పాడుగాకుండా రక్షించే శీతలీకరణ పద్ధతి, పరిశుభ్రమైన సూదుల వాడకం, వీటిని రక్షించడంలో అనేక కొత్త మెలకువలు, వ్యాక్సీనులతో నిరోధించే వ్యాధులపై నిఘా, విజయవంతంగా టీకాలు వేసేందుకు ప్రజల భాగస్వామ్యం...ఇలా ఎన్నో అంశాలు.

ఈ అంశాల గురించి కార్యక్రమం మొదలు పెట్టేముందు డాక్టర్లకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందినప్పుడు అందరికీ 'ఇంతవరకు మనం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం శాస్త్రీయంగా, పటిష్టంగా నిర్వహించలేదు' అనే భావన కలిగింది. దేశంలో అప్పటికే ప్రైవేటు వైద్యవ్యవస్థ బలంగా ఉంది. ప్రైవేటు వైద్యులు కూడా పిల్లలకు టీకాలు వేస్తారు. మాకు శిక్షణలో చెప్పిన చాలా అంశాలు ప్రైవేటు వైద్యులు పాటించరు. వ్యాక్సీను సీసా తెరిచిన తర్వాత వెంటనే టీకా మందును దగ్గర్లోని మెడికల్‌ షాపు వాళ్ల ఫ్రీజర్‌లో పెట్టేవాళ్లు. చాలా మంది మెడికల్‌ షాపు యజమానులు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను తృప్తిపరిచేందుకు రిఫ్రిజిరేటర్‌ పెట్టేవాళ్లు. రాత్రిపూట రిఫ్రిజరేటర్‌ ఆపు చేసేవారు. 'ప్రైవేటు డాక్టర్లకు కూడా ఈ కార్యక్రమం గురించి శిక్షణ' ఇస్తే బాగుంటుందని మాకందరికీ అనిపించింది. మా శిక్షకులకు ఈ అభిప్రాయాన్ని తెలిపాం. ప్రైవేటు డాక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ సంతృప్తికరంగా నిర్వహించలేదు.

తొలి రోజుల్లో...

అప్పటికే నాలాగా ఆలోచించే వారందరూ 'ప్రాథమిక ఆరోగ్య రక్షణపై ఆల్మా-ఆటా ప్రకటన' నిషాలో ఉన్నాం. '2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం' - అదోక గొప్ప ఊహ. కార్యక్రమం గురించి అప్పటి ప్రభుత్వ దార్శనికత నన్నెంతో ఉత్తేజితున్ని చేసింది. 'నాదేశంలో పిల్లలందరికీ క్షయ, పోలియో, గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వ్యాధుల నుండి త్వరలో విముక్తి'. నాలో ఉత్సాహం కట్టలు తెంపుకొంది. కలల్లో కూడా ఇవే ఆలోచనలు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా, దశల వారీగా జిల్లాలను ఎంపిక చేసి అమలు చేసారు .

కార్యక్రమం మొదలు పెట్టేముందు వైద్యాధికారులందరికీ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు వైద్యకళాశాల ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ, ఆ మాడ్యుల్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్‌ స్లైడ్స్‌ ద్వారా ఎన్నో విషయాలు బోధించారు. వ్యాధి నిరోధక టీకాల గురించి లోతుగా అధ్యయనం చేయాలని ఆరోగ్య కేంద్రంలో పారామెడికల్‌ సిబ్బందికి కూడా తెలుగు మాడ్యుల్‌ సహాయంతో శిక్షణ ఇచ్చారు . నవంబర్‌ 19, 1985న ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. నిజంగా అది మా అందరికీ పండుగ. 1989 వరకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రద్ధతో అన్ని గ్రామాలు తిగిరి పిల్లలకు టీకాలు వేశారు. . 1987 ప్రపంచ ఆరోగ్య సంస్థ- ప్రపంచ ఆరోగ్య దినం నినాదం 'ఇమ్యునైజేషన్‌ ఎ అచివ్‌ ఫర్‌ ఎవిరి చైల్డ్‌' - వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బిడ్డకు ఒక అవకాశం. ఈ నినాదం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రపంచ ఆరోగ్య దినం 1988 నినాదం 'ఆరోగ్యం అందరికీ- అందరూ ఆరోగ్య కోసం'. 1989 నినాదం ' మనం ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకుందాం ' లాంటి అంశాలు మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సమసమాజం, ఆరోగ్యం సామాజికీకరణ చేయడం, ఆరోగ్యంలో సమానత్వం లాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఈ ఆలోచనల ప్రభావం సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలులో ఉండేది. దేశంలో జరుగుతున్న ' బిడ్డ నుండి బిడ్డకు', 'లిటిల్‌ డాక్టర్స్‌' కార్యక్రమాలు, మన రాష్ట్రంలో అమలువుతున్న 'తెలుగు బాలల సుఖీభవ పథకం', ప్రపంచ బాలల నిధి ప్రచురించిన 'ఫ్యాక్ట్స్‌ ఫర్‌ లైఫ్‌ - ప్రాణ రణక్ష సూత్రాలు', హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ ప్రచురించిన 'వేర్‌ దేర్‌ ఇజ్‌ నో డాక్టర్‌- వైద్యుడి లేని చోటు' లాంటి ఎన్నో అంశాలు ప్రజారోగ్యం పట్ల మాకు స్ఫూర్తినిచ్చాయి. పరోక్షంగా సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి దోహదపడ్డాయి.

వైద్యకళాశాలల పాత్ర

ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు వైద్య కళాశాలల పాత్ర ప్రముఖంగా ఉండేది. అక్కడ పనిచేసే సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఎస్‌పిఎం) ప్రొఫెసర్లు వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఉండేది. వైద్యకళాశాల ఉండే పట్టణానికి కార్యక్రమం అమలు బాధ్యత వైద్యకళాశాలలదే. ఇందులోని ఎస్‌పిఎం ప్రొఫెసరు ఈ కార్యక్రమానికి ఆ పట్టణానికి నోడల్‌ ఆఫీసరు. దీని అమలులో వైద్య విద్యార్థులు ప్రొఫెసర్‌ నాయకత్వంలో పాల్గొనేవారు. ఒక ప్రజారోగ్య కార్యక్రమానికి వైద్య విద్యార్థి దశలోనే పాల్గొనే ఒక గొప్ప ఆదర్శానికి నాంది పలికారు. వైద్య విద్యార్థులను సమాజం పట్ల వారి బాధ్యతలను పెంచే ఒక గొప్ప ప్రక్రియ ఇది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పూర్తిగా గండికొట్టారు. ఇటీవల వచ్చే చాలా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం లేదు. అందువల్లే వైద్యకళాశాలల నుండి వచ్చిన కొత్త డాక్టర్లకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్య ప్రాధాన్యాల గురించి ఎలాంటి అవగాహన లేదు. వీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ కార్యక్రమాల అమలులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

నేషనల్‌ టెక్నాలజీ మిషన్‌

మన దేశంలో ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలైన మంచినీరు, నూనె గింజలు, పాల ఉత్పత్తి, అక్షరాసత్య, టెలికమ్యూనికేషన్స్‌, వ్యాధినిరోధక టీకాలపై 1986లో ఆరు నేషనల్‌ టెక్నాలజీ మిషన్స్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్‌ టెక్నాలజీ మిషన్స్‌లో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఒక భాగం కావడం వల్ల సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి మరింత ఊపునిచ్చింది.

పట్టణ సమస్యలు

మన దేశంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగా ఇంటి దగ్గరే ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థీకృత ఆరోగ్య వ్యవస్థ పట్టణాలలో లేదు. కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి పట్టణాలలో అందరికీ టీకాలు అందించడం చాలా కష్టతరమైన సమస్యగా తయారైంది.1985 నుంచి 89 జిల్లా యాంత్రాంగానికి పట్టణాలలో టీకాల సమస్య అధిగమించడానికి ఒక ఆలోచన వచ్చింది. నెలకు 3 రోజులు పట్టణానికి చుట్టూ ఉండే గ్రామీణ ప్రాంత ఆరోగ్య కార్యకర్తల సహకారం తీసుకుని అమలు చేసే పద్ధతి. ఆ కార్యక్రమం కింద 24 బాలవాడీలు ఉండేది. పట్టణంలోని మౌలిక సేవల్లో పనిచేసే సిబ్బంది, పట్టణంలోని ఆసుపత్రి, ఆరోగ్య సిబ్బంది, చుట్టూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తల సహకారంతో 8 టీములు తయారు చేశారు . నెలలో 3 రోజులు, రోజూ 8 చోట్లా - బాలవాడీ కేంద్రాలలో టీకాల కార్యక్రమం నిర్వహించేవారు . ఆ నాటి జిల్లా కలెక్టర్‌కు ఈ బాలవాడి కేంద్రాలలో పిల్లలకు వైద్య పరీక్షలు చేయలనేది ఒక కోర్కె. ఇలా టీకాల కార్యక్రమం నిర్వహిస్తూనే, బాలవాడీలలో పిల్లకు వైద్య పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చేవారు . ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌ గారి ప్రసంశలు జీవితంలో మరచిపోలేనివి. టీకాల కార్యక్రమం అమలు చేయడంలో పట్టణాలు ఎదుర్కొంటున్న
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

మెడ నొప్పి నివారణ


మెడనొప్పి నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు అవగహన కోసం ,Neck Pain in Human


ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం జీవనశైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నమయవుతుంది.
మెడ నుంచి భుజానికో, చేతుల చివర్లకో నొప్పి పాకు తూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మెడ నొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

మనం నిలబడే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్ళే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్తప్రసారంలో తేడా వచ్చి మెదడుకు రక్త ప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతు లు అవడం జరుగుతుంది.

మెడ దగ్గర ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ అని, రెండవ దానిని ఆక్సిస్‌ అని అంటారు. ఆ తర్వాత పూ సలను వరుసగా సర్వెకల్‌ 3,4,5,6,7 అంటారు. ఇవ న్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. ఈ సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ పారామినా నుండి ఒకకొక్క నరం బయటకు వస్తుం ది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది.

కారణాలు :
ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడడం వల్ల వస్తుంది.
స్పాంజి లేదా దూది ఎక్కువ ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం.
కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం.
నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

పరీక్షలు :
ఎక్స్‌రే -స్కానింగ్‌: మెడనొప్పి వచ్చేవారికి ఎక్స్‌రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దీనిని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దానిని బట్టి పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైనా వచ్చి చేరాయా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత వత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల వచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ. పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంతమేరకు ఆ సమస్య ఉందో గమనించి దానికి చికిత్స చేస్తారు.

పర్సనల్‌ కేర్‌: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.

బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...

తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువ్ఞను మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.

కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి. టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు ...................... వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.
చింతాకుల ముద్ద మెడచుట్టూ నాలుగు నుండి ఐదురోజులు పట్టిస్తూ ఉంటే మెడనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది చిట్కా మాత్రమే. కొన్నిసార్లు మెడ దగ్గర చాలా ఎక్కువగా ఉండే లింఫ్‌గ్లాండ్స్‌ వాస్తే కూడా మెడనొప్పి వస్తుంది. మెడనరాలపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు నొప్పి చేతులు, భుజాలలోకి వ్యాపించడం జివ్ఞ్వమని లాగడం ఉంటుంది. ఛాతీలో ముందు వెనుకలకు కూడా వ్యాపించ వచ్చు.
కంటిదోషాల వల్ల కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిన వైద్యం చేయిస్తే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండ, వేడి, చలి వీటికి మెడ ఎక్స్‌పోజ్‌ చేయకూడదు. అలాచేస్తే మెడ కమిలి పోతుంది. నల్లబడుతుంది. మరీ ఎక్కువ ఆభర ణాలతో మెడను ఇబ్బంది పెడితే చర్మం ఒరుసుకు పోతుంది. బిరుసుగా అవ్ఞతుంది. ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్‌గా ఉండే నగలు ధరించడం మంచిది. ముఖంతో పాటు మెడను కూడా సబ్బుతో శుభ్రపరుస్తుండాలి.
గిల్ట్‌ నగలు ధరించినప్పుడు ఆయా నగల తయా రీలో ఉపయోగించిన మెటల్స్‌ పడక కొందరికి ఎలర్జీ వస్తుంది. మెడనల్లగా మారడానికి స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కూడా కొంత వరకు కారణం.
మెడకు కూడా వ్యాయామం అవ సరం. అన్ని వైపులకు మెడను తిప్పాలి. అందువల్ల మెడకు సరిగా రక్తప్రసరణ జరుగుతుంది. అంతేగాక మెడ కొవ్ఞ్వ కరిగి చర్మం పలచబడుతుంది. నాజూకుగా ఉంటుంది. ఎక్కువ బరువ్ఞలు మోయడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, నిలబడడం మానాలి.
నిద్రపోయే సమయంలో చాలామంది తలగడపై తల మాత్రమే ఉంచుతారు. తలతో పాటు మెడ కూడా ఉంచాలి. 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి