15, జూన్ 2020, సోమవారం

పొడి దగ్గు సమస్య పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి


పొడి దగ్గు అంటే ఏమిటి?

విసుగు, చికాకు కలిగించే  మరియు ఎటువంటి కఫం (phlegm) లేదా శ్లేష్మం (mucus) ఉత్పత్తి అవ్వని రకమైన దగ్గును పొడి దగ్గుగా పిలుస్తారు. ఇది సాధారణంగా గొంతులో ఒక గిలిగింత సంచలనాన్ని/అనుభూతిని కలిగించే విధంగా ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పొడి దగ్గుకు ముడిపడి ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు:

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

పొడి దగ్గు ప్రధానంగా ఈ క్రింది కారణాల వలన కలుగుతుంది:

  • వైరల్ అనారోగ్యం (జలుబుఫ్లూ [ఇన్ఫ్లుఎంజా] లేదా వైరల్ సంక్రమణ తరువాత వచ్చే దగ్గు [వైరల్ అనారోగ్యం తరువాత కొన్ని వారాల పాటు  దగ్గుఉంటుంది ])
  • ఆస్తమా
  • కోోరింత దగ్గు
  • స్వరపేటిక యొక్క వాపు (స్వరపేటిక వాపు ) లేదా కొన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధులు (మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి,interstitial lung disease)
  • ధూమపానం
  • అలెర్జీ రినైటిస్ (పెంపుడు జంతువుల చర్మం, పుప్పొడి లేదా దుమ్ము వంటి అలెర్జీ కారకాలను పీల్చడం వలన వచ్చే గవత జ్వరం) లేదా ఏదైనా బయటి పదర్థం పీల్చడం, ఇది చిన్న పిల్లలు మరియు శిశువులలో చాలా సాధారణం
  • ఔషధ దుష్ప్రభావాలు (అధిక రక్తపోటుకు ఉపయోగించే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్-ఎంజైమ్ [angiotensin-converting-enzyme,ACE] నిరోధకాలు)
  • గ్యాస్ట్రో-ఎసిసోఫేగల్ రెఫ్లాక్స్ (Gastro-oesophageal reflux) లేదా పోస్ట్-నాసల్ డ్రిప్ (post-nasal drip, ముక్కు నుండి గొంతులోకి శ్లేష్మ స్రావాలు వెనుకకు వెళ్లడం)
  • గురక మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస అందకపోవడం)

పొడి దగ్గు కొన్ని అసాధారణ కారణాలు:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటీ?

ముందుగా, వైద్యులు దగ్గు మరియు ఏవైనా ఇతర లక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను గురించి తెలుసుకుంటారు, దాని తరువాత శారీరక పరీక్ష నిర్వహించబడుతుంది. వ్యక్తి  యొక్క ఆరోగ్య చరిత్ర, వయస్సు మరియు శారీరక పరీక్షలో కనుగొన్న విషయాల పై ఆధారపడి, వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచిస్తారు:

  • అలెర్జీ పరీక్షలు
  • ఛాతీ ఎక్స్-రే
  • గొంతు స్విబ్ ( గొంతు లోపలి నుండి ఒక నమూనాను సేకరించి, మరియు ఆ నమూనాను ఇన్ఫెక్షన్ల కోసం పరీక్షిస్తారు)
  • పల్మనరీ ఫంక్షన్ పరీక్షలు (Pulmonary function tests)

పొడి దగ్గు చికిత్స దాని కారణం మీద ఆధారపడి ఉంటుంది (ఉదా., వైరల్ సంక్రమణ వలన దగ్గు సంభవిస్తే అది ఒక వారం లేదా రెండు వారాలలోపు దానికదే తగ్గిపోతుంది). పొడి దగ్గు ఉపశమనానికి వివిధ నివారణ చర్యలు ఉన్నాయి:

స్వీయ రక్షణ

  • తేనె గొంతులో ఒక మృదువైన పూతలా (పొర) ఏర్పడి, పొడి దగ్గును ప్రేరేపించే, చికాకు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది
  • పుష్కలంగా ద్రవాలను సేవించాలి (వెచ్చని నీళ్లు, టీ, మొదలైనవి)
  • ఉప్పు నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి మరియు పొడి దగ్గును తగ్గించడంలో అది సహాయపడుతుంది
  • పొడి దగ్గును ప్రేరేపించే కొన్ని మందుల వాడకాన్ని (ఏసిఇ నిరోధకాలు [ACE inhibitors], బీటా బ్లాకర్లు) ఆపివేయాలి. వైద్యున్ని సంప్రదించి వాటికి ప్రత్యామ్నాయ మందులను తీసుకోవాలి.
  • నీటిని కొంచెం కొంచెముగా తాగడం అనేది దగ్గు కోరికను తగ్గిస్తుంది
  • యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన మాత్రలు లేదా టానిక్లు లేదా లేహ్యల రూపంలో దగ్గుకు అణిచివేతలు [Cough suppressants] అందుబాటులో ఉన్నాయి, అవి వీటిని కలిగి ఉంటాయి:
    • ఫోల్కొడైన్ (Pholcodine)
    • డెక్స్ట్రోమిథోర్ఫాన్ (Dextromethorphan)
    • కొడైన్ (Codeine)
    • డైహైడ్రోకొడైన్ (Dihydrocodeine)
    • పెంటాక్సీవిరైన్ (Pentoxyverine)
  • జలుబు మరియు ఫ్లూ యొక్క కలయిక మందులు సాధారణంగా క్రింది వాటిని కలిగి ఉంటాయి:
    • యాంటిహిస్టామైన్ (antihistamine)
    • ఒక డికాంగిస్టెంట్ (decongestant, అడ్డంకులు ఉన్న లేదా ముకుసుపోయిన ముక్కు నుంచి ఉపశమనం పొందడం కోసం)
    • పారాసెటమాల్ (Paracetamol)
  • అలెర్జీ రినైటిస్ లేదా పోస్ట్ నాసల్ డ్రిప్ వలన సంభవించిన పొడి దగ్గుకు నాసల్ స్ప్రేలు మరియు ఇన్హేలర్లు ఉన్నాయి, అవి:
    • సెలైన్ లేదా కార్టికోస్టెరాయిడ్ నాసల్ స్ప్రే
    • కోర్టికోస్టెరాయిడ్ ఇన్హేలర్ ( నోటి ద్వారా ఔషధం పీల్చబడుతుంది)
  • గ్యాస్ట్రో-ఓసోఫ్యాగల్  రిఫ్లక్స్ (gastro-oesophageal reflux) వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇచ్చే రిఫ్లక్స్ చికిత్స, వీటిని కలిగి ఉంటుంది:
    • ఆమ్ల స్రావాన్ని నిరోధించే మందులతో చికిత్స (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వంటివి)
    • నిద్రపోయే ముందు తినకపోవడం మరియు పడుకున్నప్పుడు తలను పైకి పెట్టడం వంటి స్వీయ-సంరక్షణ చర్యలు పా

పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు నివారణకు ఆయుర్వేదం నవీన్ సలహాలు :

1. జలుబుతో కూడిన దగ్గు:

మనం మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు లాలాజలం అత్యంత సూక్ష్మమైన బిందువుల రూపంలో బైటకు వెలువడుతుంది. ఒకవేళ మనకు జలుబు చేసినట్లయితే దానికి కారణమైన వైరస్ లు ఈ సూక్ష్మ బిందువుల ద్వారా ఎదుటి వారి శ్వాస కోసం లోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మజీవులు, వాటి తాలూకు విష పదార్థాలు శ్వాస మార్గంలోని శ్లేష్మపు పొరలపై పెరుకున్నప్పుడు, వాటిని వదలించుకునే ప్రయత్నంలో దగ్గుం తుమ్ములు వస్తాయి.

జలుబు చేసిన వారు ముక్కుకు, నోటికి రుమాలనో, చేతినో అడ్డం పెట్టుకోకుండా తుమ్మినా, లేదా దగ్గినా వైరస్ లు సునాయాసంగా ఇతరుల శరీరంలోనికి చేరుకుంటాయి. వైరస్ లు మనిషి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు, వాటికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ప్రతిరక్షక కణాలు తయారవుతాయన్న సంగతి తెలిసిందే, కాకపొతే ఈ కణాలు తయారయ్యే కాల వ్యవధి వ్యాధినుండి వ్యాధికి మారుతుంటుంది. జలుబు విషయమే తీసుకుంటే ప్రతి రక్షక కణాలు తయారుకావడానికి కనీసం వారం రోజులు పడుతుంది; జలుబుకు చికిత్స చేస్తే వారం రోజులలో తగ్గుతుందనీ, చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుందనే జన వాక్యం ఇందుకే పుట్టి ఉండొచ్చు.

జలుబుతో మొదలైన దగ్గు, జలుబుతో పాటే తగ్గుముఖం పడుతుంది. అలా తగ్గకుండా చాలా రోజుల పాటు కొనసాగుతున్నప్పుడు, శ్లేష్మం పసుపు ఆకుపచ్చల మిశ్రమ వర్ణంలో కనిపిస్తున్నప్పుడు వ్యాధి ప్రథమావస్థను దాటి ద్వితీయాంకంలోకి ప్రవేశించినట్లుగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మందులు వాడటం తప్పనిసరి. దగ్గుకు అతి సాధారణ కారణం జలుబు అనుకున్నాం కదా. దగ్గు వల్ల పెద్ద ప్రమాదమేదీ జరుగదుగాని ఇబ్బందిగా, నలతగా అనిపిస్తుంటుంది. ఇది పూర్తిగా పని మానేసి విశ్రాంతి తీసుకోవలసినంత పెద్ద వ్యాధి కాదు. అలగాని దీనితో పనిచేయాలన్నా చిరాకుగానే ఉంటుంది.

గృహచికిత్సలు: 1. పొడి దగ్గులో గొంతును మార్దవం చేయడానికి పాలు నెయ్యిల మిశ్రమం బాగా పనిచేస్తుంది. 2. ఒకవేళ దగ్గుకు కారణం కఫమైతే, యష్టిమధుకం (అతిమధురం) వేరును డికాక్షన్ కాచి, తేనెతో, లేదా పంచదారతో కలిపి తీసుకుంటే కఫం తెగి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. 3. మిరియాల చూర్ణాన్ని (చిటికెడు) నెయ్యి, చక్కెర, తేనెలతో కలిపి తీసుకోవాలి. 4. దగ్గు నుండి సత్వరమే ఉపశమనం పొందడానికి మిరియాలు, ఖర్జూరం, వాయువిడంగాలు, పిప్పళ్లను అన్నిటిని సమభాగాలు కలిపి పేస్టులాగా తయారుచేసి అరచెంచాడు చొప్పున చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి.

ఔషధాలు: తాళీసాది చూర్ణం, ప్రవాళ భస్మం, అభ్రక భస్మం, శృంగి భస్మం, మహాలక్ష్మి విలాస రసం, స్వర్ణమాలినీ వసంత రసం, ప్రవాళ పంచామృతం, వాసరిష్టం, వాసా కంటకార్యవలేహ్యం, అగస్త్య హరీతకీ రసాయనం, చ్యవనప్రాశ లేహ్యం, లవంగాది వటి, ఏలాది వటి.

2. శ్వాసనాళ సంబంధ రుగ్మత (బ్రాంకైటిస్):

ఊపిరితిత్తులలోని శ్వాసనాళాల ఉపశాఖలు, వాటి శ్లేష్మపు పొరలూ వ్యాధిగ్రస్తమైనప్పుడు ఆ స్థితిని 'బ్రాంకైటిస్' అంటారు. ఇది దీర్ఘవ్యాధిగా పరిణమించినప్పుడు దగ్గు శ్లేష్మానుబంధంగా వస్తుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ధూమపానం చేసే వారిలో బ్రాంకైటిస్ లక్షణాలేక్కువగా కనిపిస్తాయి. దగ్గు వస్తునప్పటికి లెక్కచేయకుండా అదేపనిగా ధూమపానంధూమపానం చేసేటట్టయితే పరిస్థితి విషమిస్తుంది. శ్వాస వేగం పెరగడం, గాలి పీలుస్తున్నప్పుడు పిల్లి కూతలు ధ్వనించడం, శారీరక శ్రమను తట్టుకోకపోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా శరీరానికి సరిపడ్ద ప్రాణవాయువు అందకపోవడం వలన ముక్కు, పెదవులు, చేతులు నీలంగా మారుతాయి, ఇదే చాలా ప్రమాదకరమైన స్థితి కనుక వైద్య సహాయం తీసుకోవాలి.

ఔషధాలు: అగస్త్య రసాయనం, భారంగి గుడం, చ్యవన ప్రాశ లేహ్యం, దశమూలారిష్టం, ద్రాక్షాది చూర్ణం, ఏలాది చూర్ణం, కర్పూరాది చూర్ణం, కూష్మాండ లేహ్యం, లోకనాథ రసం, తాళీసాది చూర్ణం, విదార్యాది ఘృతం, వాసా కంటకారిలేహ్యం.

3. న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు:

ముక్కునుండి, గొంతునుండి వ్యాధి కారకాంశాలు శ్వాసనాళికలోకి ప్రవేశించి శ్లేష్మపు పొరలను వాపునకు గురిచేసినప్పుడు దగ్గుతోపాటు ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. మన శరరంలో ఊపిరితిత్తులు ఒక పొర మధ్య పదిలంగా ఉంటాయి. ఏదైనా కారణం చేత ఈ పొర వ్యాధిగ్రస్తమైతే (బ్రాంకోన్యుమోనియా) ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో వ్యాకోచించలేవు. ఇలాంటి సందర్భాలలో కూడా దగ్గుతోపాటు ఛాతిలో నొప్పి వస్తుంది.

ఔషధాలు: దశమూల కటుత్రయాది క్వాథ చూర్ణం, కస్తూరి మాత్రలు, కాలకూట రసం, మహాజ్వరాంకుశ రసం, నవగ్రహి సింధూరం, నారాయణ జ్వరాంకుశ రసం, ప్రతాప లంకేశ్వర రసం, సన్నిపాత భైరవ రసం (మహా, లఘు), స్వచ్చందభైరవ రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తి రసం.

4. క్షయ వ్యాధి (ట్యుబర్క్యులోసిస్):

దగ్గుతో పాటు బరువు కోల్పోవడం, రక్తహీనత, రాత్రిపూట చమట ఎక్కువగా పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అన్ని కారణాల కంటే ముందు క్షయవ్యాధిని (ట్యుబర్క్యులోసిస్) గురించి ఆలోచించాలి. ఇది ట్యూబర్కిల్ బ్యాసిలై లేదా మైకోబ్యాక్తీరియం ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవుల వలన వచ్చే సాంక్రమిక వ్యాధి, ఊపిరితిత్తులు ఇన్ ఫ్లేమ్ అవ్వడం, త్యూబర్కిల్ అనే బొడిపెల మాదిరి నిర్మాణాలు ఏర్పడటం, కణజాలలు కుళ్ళిపోయి వెన్నవంటి పదార్ధం తయారవడం, చీము గడ్డలు ఏర్పడటం, ఊపిరితిత్తులలోని గాయాలు మానేటప్పుడు సహజ కణజాలంతో కాకుండా నార వంటి పీచు పదార్థంతో పూరించబడటం వీటన్నిటి ఫలితంగా ఊపిరితిత్తుల కదలిక పరిమితమవుతుంది. ఈ లక్షణాలన్నీటి ద్వారానూ, ఇతర పరీక్షల ద్వారానూ క్షయ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. పెన్నేరు, పిప్పళ్ళు సమతూకంగా తీసుకొని, పొడిచేసి అరచెంచాడు మోతాదుగా పంచదార, తేనె, నెయ్యిలు కలిపి రోజు రెండుపూటలా తీసుకోవాలి. 2. పిప్పళ్ళు, ఎండుద్రాక్ష, పంచదారలను సమభాగాలు కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకోవాలి. 3. లాక్షా చూర్ణాన్ని (రెండు చెంచాలు), బూడిదగుమ్మడికాయ రసంలో ముద్దుగా నూరి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 4. అడ్డసారం ఆకులను దంచి రసం తీసి పూటకు పావు చెంచాడు మొతాడుగా రెండుపూటలా తగినంత తేనె చేర్చి తీసుకోవాలి. 5. రావి చెట్టు బెరడు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, మండూరం వీటిని సమతూకంలో తీసుకొని తగినంత బెల్లం చేర్చి ముద్దగా నూరి రేగు గింజంత మాత్రలు చేసి అనుదినము వాడాలి.

ఔషధాలు: అమృతప్రాశ ఘృతం, అశ్వగంధాది లేహ్యం, చ్యవనప్రాశలేహ్యం, ద్రాక్షాది రసాయనం, ద్రాక్షారిష్టం, కూష్మాండ లేహ్యం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, మహాలక్ష్మీ విలాస రసం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణమాలిని వసంత రసం, విదార్యాది ఘృతం, వసంత కుసుమాకర రసం.

5. ఉరః క్షతం (బ్రాంకియక్టాసిస్):

క్షయం, బ్రాంకైటిస్, కోరింత దగ్గు, న్యుమోనియా మొదలయిన దీర్ఘకాల వ్యాధుల వలన ఊపిరితిత్తులలోని 'గాలినాళాలు' సాగగలిగే గుణాన్ని కోల్పోయి గట్టి పడతాయి. ఫలితంగా శ్లేష్మం తనంతట తాను బైటకి రాలేదు. ఈ స్థితిని వైద్యపరిభాషలో 'బ్రాంకియోక్టాసిస్' అంటారు. తీవ్రమైన దగ్గు, ఒక్కొక్కసారి రక్తం పడటం, అసాధారణ మోతాదులో శ్లేష్మం తయారవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

ఔషధాలు: అగస్త్య రసాయనం, చ్యవన ప్రాశ లేహ్యం, దశమూలకత్రయాది క్వాథ చూర్ణం, కనకాసవం, మకరధ్వజ సింధూరం, ప్రవాళ భస్మం, ప్రవాళ పంచామృతం, రస మాణిక్యం, శుభ్ర వటి, శృంగారాభ్ర రసం, వాతాఘ్ని కుమార రసం, వాసా కంటకారి లేహ్యం.

6. ఎంఫిసీమా

కాలుష్యం వలన 'ఎంఫిసీమా' అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఆరోగ్యవంతుల ఊపిరితిత్తుల్లో శాఖోపశాఖలుగా విస్తరించిన శ్వాస నాళాలు చివరాఖరుగా చిన్న చిన్న గాలి అరల్లోకి తెరచుకుంటాయి. ధూమపానం, కాలుష్యం, విషవాయువులు తదితరాల వల్ల ఈ అరల గోడలు శిథిలమై సాగగలిగే గుణాన్ని శాశ్వతంగా కోల్పోతాయి. ఫలితంగా ఈ అరల ద్వారా ప్రాణ వాయువు మారకం పరిపూర్ణంగా జరగదు. దీని పర్యవసానంగా ప్రాణవాయువు లోటుగా భర్తీ చేయడానికి శ్వాస వేగం పెరుగుతుంది. అయినప్పటికీ, శరీరావసరాలకు సరిపడా ఆక్సిజన్ అందక శరీరమంతా కొద్దిపాటి శ్రమకే నీలంగా మారుతుంది.

సూచనలు: ఈ వ్యాధిలో ప్రాణాయామం చేస్తే అంచి ఫలితం కనిపిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధుల్లో పేర్కొన్న అన్ని ఔషధాలు దీనిలో పనిచేస్తాయి.

7. ఉబ్బసం (ఆస్తమా):

చాలామంది అస్తమాను పిల్లికూతల ఆధారంగా మాత్రమే గుర్తించవచ్చునని అనుకుంటారు. అయితే ఆస్తమా ఒకోసారి, పొడి దగ్గు రూపంలో కూడా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా, రాత్రివేళల్లో పొడి దగ్గు మాత్రమే ఉంటే అస్తమాను అనుమానించాలి. ఇది చిన్న పిల్లలకు మరీ వర్తిస్తుంది. ఉబ్బసం వ్యాధిలో శ్వాస నాళాల గోడలలోని కండరాలు కుంచించుకుపోయి, గాలి ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. కొన్ని సందర్భాలలో శ్లేష్మం ఎక్కువగా తయారవడం, గాలి నాళాలు వాయడం వంటి వాటి వల్ల గాలి మార్గాలు మరింత మూసుకుపోయి ఒక రకమైన కూత కూడా ధ్వనిస్తుంది.

గృహచికిత్సలు: 1. శ్వాసనాళాలు కుంచించుకుపోవడం వలన వచ్చే ఆయాసం, దగ్గులలో అడ్డరసం (సంస్కృతంలో వాసా) అద్భుతమైన ఔషధం. యోగ రత్నాకరుడనే ఆయుర్వేదాచార్యుడు తన యోగరత్నాకరంలో 'వాసా దొరుకుతున్నప్పుడు జీవించాలనే కోరిక బలీయంగా ఉన్న క్షయ వ్యాధిగ్రస్తులుగాని, రక్తస్రావంతో బాధపడే రక్త పిత్తవ్యాధిగ్రస్తులుగాని, దగ్గుతో పీడించబడే వ్యక్తులుగాని దుఖించాల్సిన అవసరం ఏముంది?” అని అభాయస్తమిస్తాడు. అల్లోపతి వైద్యవిధానంలోకూడా ఈ మొక్కనుంచి తీసిన వాససిన్ అనే ఆల్కలాయిడ్ ని 'బ్రోమోహెక్సిన్'గా తయారుచేసి బ్రాంకోడైలేటర్ గా, శ్వాస నాళాలను వ్యాకోచపరిచే నిమిత్తం వాడుతున్నారు. 2. శొంఠి పొడిని చెంచాడు వంతున రోజు 3 పూటలా నీళ్లతో/తేనెతో తీసుకోవాలి. 3. ఆవనూనె (రెండు చెంచాలు), బెల్లం (పెద్ద ఉసిరికాయంత) కలిపి, ముద్దచేసి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 4. మేకమేయనిఆకు గుప్పెడు తెచ్చి ముద్దచేసి ఉదయం ఖాళీ కడుపునాతీసుకోవాలి. (దీనితో వాంతి జరిగి కఫం తెగి సాంత్వన లభిస్తుంది). 5. గుంటభారంగి (అరచెంచాడు, శొంఠిపొడి (అరచెంచాడు) గ్రహించి తగినంత తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 6. పిప్పళ్ళ చోర్ణం (పావు చెంచాడు). బెల్లం లేదా తేనెతో కలిపి తీసుకోవాలి. 7. ఉమ్మెత్త ఆకులను ఎండపెట్టి, నిప్పుల మీద వేసి దూపాన్ని పీల్చాలి.

ఔషధాలు: శ్వాస కుఠార రసం, సితోపలాది చూర్ణం, కర్పురాది చూర్ణం, తాళీసాది చూర్ణం, కనకాసవం, శ్వాసానంద గుళిక. అగస్త్య హరీతకీ రసాయనం.

8. ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు:

ధూమపానం చేసే వారిలోనూ, గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ (ఒకవేళ స్త్రీలైతే) వారో శరీరంలోని రక్తానికి "అంటుకుపోయే" గుణము, గడ్డకట్టే నైజము పెరిగిపోయి రక్తం గడ్డలుగా తయారవుతుంది. ఈ రక్తపు గడ్డలు రక్త ప్రవాహం ద్వారా ఊపిరి తిత్తులలోకి ప్రవేశించి, ఏదైనా ఒక రక్త నాళంలో తట్టుకుని, ఆ భాగానికి రక్త సరఫరాను నిలిపివేస్తాయి. దీని వలన ఆ ప్రాంతంలోని కణజాలాలు నిర్జీవమైపోతాయి. ఇటువంటి సందర్భాలలో తీవ్రమైన జ్వరం, ఛాతిలో పొడుస్తున్నట్లు బాధ ఉంటాయి. అంతే కాకుండా దగ్గు వస్తుంది. ఇది కఫం, రక్తాలతో కూడిగాని, లేకుండాగాని కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆయా కారణాలను కనిపెట్టి వైద్యసలహాలతో వాటికి తగిన చికిత్సలు తీసుకోవాలి.

9. ఊపిరితిత్తుల క్యాన్సర్:

50 సంవత్సరాలు దాటినా వ్యక్తుల్లో - ముఖ్యంగా ధూమపానం చేసే అలవాటున్న వారిలో చాలా కాలంగా దగ్గు వస్తూ, కఫం రక్తంతో కలిసికాని, లేకుండా కాని పడుతున్నట్లయితే ఆ వ్యక్తికీ అత్యవసరంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించి అన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మూడు వారాల నుంచి దగ్గు ఉండటం, సాధారణ మందులకు దగ్గు లొంగకపోవడం, బరువు తగ్గటం, శ్వాస వేగం పెరగడం ఈ లక్షణాల ఆధారంగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ ను అనుమానించాలి.

10. శ్వాసకోశ సంబంధ ఎలర్జీలు (ఈసినోఫిలియా):

వాతావరణంలోని పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి మొదలగునవి చాలా మందిలో దగ్గును, తుమ్ములను కలిగిస్తాయి. ఒక్కో వ్యక్తికీ ఒక్కో పదార్ధం ఎలర్జీని కలిగిస్న్తుంది. ఫలానా వస్తువుల వల్ల మాత్రమే ఎలర్జీ వస్తుందని తేల్చి చెప్పలేము, ఎలర్జీ వలన దగ్గు వస్తుందనుకుంటే దానికి కారణాన్ని కనిపెట్టి దూరంగా వుంచడం / వుండటం ఉత్తమమైన పధ్ధతి.

ఔషధాలు: దశమూల కుటుత్రయాది క్వాథ చూర్ణం, కామదుఘారసం, మంజిష్టాది క్వాథ చూర్ణం, మౌక్తీక భస్మం, ప్రవాళ భస్మం, ప్రవాళ పంచామృతం, రసమాణిక్యం, శ్వాసకుఠారం, శ్వాసానంద గుటిక, తాళీసాదిచూర్ణం, తాళక భస్మం, వాతగ్ని కుమార రసం, హరిద్రాఖండ యోగం (బృహత్)

11. ఊపిరితిత్తుల వాపు (పల్మనరీ ఎడిమా):

గుండె కండరాలు సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, సిరలలో రక్తం నిలిచిపోయి రక్త భారానికి కారణమవుతుంది. పర్యవసానంగా ఊపిరితిత్తులు కూడా నిండిపోతాయి. అటువంటి స్థితిలో ఊపిరితిత్తులలోని గాలి, గుండె గదులలోకి లీక్ అవడం వలన ప్రాణవాయువు శరీరంలోని ప్రవేశించడం కష్టమవుతుంది. దీని ఫలితంగా శ్వాసవేగం పెరగడం, వెల్లకిలా పడుకున్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించి లేచి కూర్చోవాలనిపించడం జరగవచ్చు, వైద్య పరిభాషలో ఇలాంటి స్థితిని 'పల్మనరీ ఎడిమా' అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో ఊపిరితిత్తుల పనితీరు సరిగా ఉండనందున శరీరంలో వాపు జనిస్తుంది.

సూచనలు: దీనికి దగ్గు మందులతో పాటు మూత్రాన్ని జారీ చేసే మందులను గోక్షురాది గుగ్గులు, చంద్రప్రభావటి, దుగ్ధవటి, గుడపిప్పలి, పునర్నవాసవం) కూడా వాడాల్సి ఉంటుంది.

పొడి దగ్గు కొరకు మందులు

Medicine NamePack Size
AlexAlex Cough Lozenges Lemon Ginger
Tusq DXTusQ DX Liquid
GrilinctusGrilinctus Paediatric Syrup
Ascoril DAscoril D 12 Oral Suspension Orange
Tixy SoftTixy Soft 10 Mg/100 Mg Capsule
Dr. Reckeweg Justicia Ad DilutionDr. Reckeweg Justicia Ad Dilution 1000 CH
Bjain Arsenicum Sulphuratum Flavum DilutionBjain Arsenicum Sulphuratum Flavum Dilution 1000 CH
Xl 90Xl 90 10 Mg/100 Mg Syrup
ADEL 29 Akutur DropADEL 29 Akutur Drop
Schwabe Mentha piperita MTSchwabe Mentha piperita MT
SBL Rumex acetosa Mother Tincture QSBL Rumex acetosa Mother Tincture Q
Alcof DALCOF D SYRUP 100ML
Dextopen SyrupDextopen Syrup
Schwabe Laurocerasus CHSchwabe Laurocerasus 1000 CH
Bjain Pulsatilla LMBjain Pulsatilla 0/1 LM
Dr. Reckeweg Justicea Adh QDr. Reckeweg Justicea Adh Q
Mama Natura NisikindSchwabe Nisikind Globules
ADEL Justicia Adh DilutionADEL Justicia Adh Dilution 200 CH
ADEL 33 Apo-Oedem DropADEL 33 Apo-Oedem Drop
Dr. Reckeweg Stannum Metallicum DilutionDr. Reckeweg Stannum Metallicum Dilution 1000 CH
DrilergDRILERG SYRUP 100ML
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
SBL Asclepias tuberosa DilutionSBL Asclepias tuberosa Dilution 1000 CH
Niltuss DCNiltuss DC Cough Syru

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

      అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


14, జూన్ 2020, ఆదివారం

సెర్వికల్ నొప్పి (మెడ నొప్పి )నివారణకు పరిష్కారం మార్గం



సెర్వికల్ నొప్పి (cervical (neck) pain) అంటే ఏమిటి?

మెడ నొప్పి పురుషులు మరియు మహిళలు అనుభవించే ఒక సాధారణ బాధాకరపరిస్థితి.  సాధారణంగా మధ్య వయస్కుల్లో వస్తుంటుందిది. ఈ నొప్పి ‘సెర్వికల్ వెర్టెబ్రయీ’ అనే మెడ భాగంలో పుడుతుంది, కాబట్టి దీన్ని ‘సెర్వికల్ నొప్పి’ అని కూడా పిలుస్తారు. మెడ నొప్పి సాధారణంగా కండర-కంకాళాల రుగ్మత వలన వస్తుంది. మెడ చుట్టూ ఉన్న కండరాలలో ఓ తేలికపాటి నొప్పి ఉంటుంది మరియు దీనివల్ల మెడ యొక్క సాధారణ కదలికలు కష్టమవుతాయి. మెడనొప్పివల్ల, మెడ యొక్క ఎగువ అవయవాలలో స్పర్శ జ్ఞానం కూడా కోల్పోవడం జరుగుతుంది. .

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెడ నొప్పి తీవ్రమైన లేదా దీర్ఘకాలిక బాధాకర పరిస్థితి కావచ్చు. మెడ నొప్పికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు:

  • మెడ కండరాలలో పెడసరం లేక బిర్రబిగుసుకుపోవడం
  • మెడ కదలికల్లో పరిమితి
  • మెడ పైభాగం అవయవాలలో జలదరింపు లేదా తిమ్మిరి
  • మెడ ప్రాంతంలో నొప్పి
  • భుజాలు నొప్పి మరియు ఎగువ అవయవాలలో నొప్పి

మీరు అనుభవించే అరుదైన లక్షణం పార్శ్వపు తల నొప్పి. దీర్ఘకాల నొప్పి విషయంలో, కొన్ని నరాల సమస్యలు తలెత్తవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మెడ నొప్పి వివిధ కారణాల వలన రావచ్చు. సాధారణ కారణాలు:

అరుదుగా, మెడ ప్రాంతంలో పెరుగుతున్న కణితి మెడ నొప్పికి కారణం అవుతుంది..

దీన్నిఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

క్షుణ్ణమైన వైద్య చరిత్ర పరిశీలన మరియు భౌతిక పరీక్ష ఆధారంగా మెడ నొప్పి కారణాన్ని నిర్ధారణ చేస్తారు. రోగ నిర్ధారణ చేయడానికి క్రింది విశ్లేషణ సాధనాలు ఉపయోగించబడతాయి:

మెడ నొప్పికి చికిత్స ఇలా ఉంటుంది:

  • ఫిజియోథెరపీ - స్వల్పకాలికంగా కీలును కదల్చకుండా పెట్టి ఉంచడం.  
  • మెడ వ్యాయామాలు
  • పల్సెడ్ విద్యుదయస్కాంత క్షేత్ర చికిత్స
  • నొప్పి నుండి ఉపశమనం పొందటానికి స్టెరాయిడ్ కాని శోథ నిరోధక మందులు మరియు కండరాల సడలింపులతో చికిత్స
  • వేడి కాపాడాలు (హాట్ కంప్రెసెస్)

దీర్ఘకాలిక నొప్పిని కిందివాటి ద్వారా చికిత్స చేయవచ్చు:

  • కండరాలను బలపరిచే మరియు ఓర్పు వ్యాయామాలు
  • ఫిజియోథెరపీ మరియు డైయాథర్మీ
  • నొప్పినివారిణులు (అనాల్జెసిక్స్), మంట, నొప్పిని ఉపశమింపజేసే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మందులు మరియు కండరాల సడలింపు
  • కౌన్సెలింగ్
  • ఆక్యుపంక్చర్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు
  • నరాల సమస్య ఉంటే శస్త్రచికిత్స,

మొత్తానికి, మెడ నొప్పి మెడ భాగం (cervical area) నుండే  ఉద్భవిస్తుంది. ఈ మెడ నొప్పి కండరాల నొప్పి నుండి నాడీ సంబంధిత సమస్యలు వరకు ఉంటుంది. మెడనొప్పికి  ఫిజియోథెరపీ, వ్యాయామం మరియు మందులతో చికిత్స చేయవచ్చు.బాధాకరమైన ఈ మెడనొప్పి పరిస్థితిని నిరోధించడానికి పనిచేసే చోట సరైన భంగిమలో (కూర్చోవడమో లేక నిల్చోవడమూ) పని చేయడం మరియు సరైన వ్యాయామం సహాయపడు

సెర్వికల్ నొప్పి కొరకు మందులు


Medicine NamePack Size
BrufenBrufen Active Ointment
CombiflamCOMBIFLAM PAED SUSPENSION
Ibugesic PlusIbugesic Plus Oral Suspension
TizapamTizapam 400 Mg/2 Mg Tablet
Espra XNEspra XN 500 Tablet
LumbrilLumbril Tablet
TizafenTizafen Capsule
EndacheEndache Gel
FenlongFenlong 400 Mg Capsule
Ibuf PIbuf P Tablet
IbugesicIbugesic 200 Tablet
IbuvonIbuvon Suspension
Ibuvon (Wockhardt)Ibuvon Syrup
IcparilIcparil 400 Tablet
MaxofenMaxofen Tablet
TricoffTricoff Syrup
AcefenAcefen 100 Mg/125 Mg Tablet
Adol TabletAdol 200 Mg Tablet
Dr. Reckeweg Gossypium Herb. QDr. Reckeweg Gossypium Herb. Q
BruriffBruriff Tablet
EmflamEmflam 400 Injection
Fenlong (Skn)Fenlong 200 Mg Tablet
FlamarFlamar 3D Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

      అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


మొలలు నొప్పి నివారణకు ఆయుర్వేదం పరిష్కారం మార్గం


మొలలు (Piles) నివారణకు ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 

                మొలలు (Piles)
               మలబద్ధకం వలన వస్తుంది.
 
1. ఆసనం వద్ద కొంతమందికి ఎండుమొలలు వస్తాయి.
2. కొంతమందికి రక్తం స్రవించే మొలలు వస్తాయి. 

       ఈ వ్యాధిగ్రస్తులు కూర్చోలేరు, కొంత మందికి   ఈ      మొలలు బయటకు ఉంటాయి,          కొంతమందికి లోపలి వుంటాయి.రెండవ రకం లోపల వుంటాయి. ఇవి చాలా ప్రమాదకరం/
 
    పెద్ద కుంకుడు కాయల పై బెరడు        100 gr 
 
          కుంకుడు పెచ్చులను కల్వంలో వేసి కొద్దిగా నీళ్ళు కలుపుతూ మెత్తగా గుజ్జుగా నూరాలి.తీసి పళ్ళెంలో పెట్టుకొని శనగ గింజలంత మాత్రలు కట్టి, బాగా విస్తారంగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి.నాలుగైదు రోజులలో 
గట్టిగా రాళ్ళ లాగా అవుతాయి.
 
           ఎండు మొలలతో బాధ పడేవాళ్ళు మాత్రలను మజ్జిగతో వాడాలి.. రక్త మొలల వాళ్ళు మంచి నీటితో 
వాడాలి.
 
         ఎక్కువ సేపు ప్రయాణించే వాళ్లకు,మాంసం , మసాలాలు ఎక్కువగా వాడే వాళ్లకు,రాత్రి ఆలస్యంగా 
భోంచేసే వాళ్లకు,ఎప్పుడు -ఎక్కువ సేపు కుర్చీలలో కూర్చునే వాళ్లకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం వున్నది.
 
          పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా ఆహారానికి అరగంట ముందు వేసుకోవాలి.
 
         మూత్రాన్ని ఎడమ చేతిలో పోసుకొని ఆ మూత్రంతోనే మొలలను కడుగుతూ వుంటే 40 రోజులలో తగ్గి పోతాయి.
 
    అర్శమొల్ల నివారణకు భరద్వాజ లేహ్యము                                   
 
    కరక్కాయ పై బెరడు పొడి        ------ 30 gr
    తాని కాయల పై బెరడు పొడి    ------ 30 gr
    ఉసిరి కాయల పై బెరడు పొడి  ------- 30 gr
   నువ్వుల నూనె          ------- 30 gr
   తేనె                         ------- 180 gr 
 
          అన్నింటిని  ఒక్కొక్కటిగా కల్వంలో వేసి మెత్తగా నూరాలి.తడి తగలని సీసాలో భద్ర పరచాలి.
 
                        పెద్దలకు         --------- 10 gr 
                        పిల్లలకు         ---------  5 gr
 
         ఉదయం, రాత్రి ఆహారానికి గంట ముందు నోట్లో వేసుకొని చప్పరించాలి.
 
ఉపయోగాలు:--  ఉదరంలో పేరుకుపోయిన మలినాలు బహిష్కరింప బడతాయి.ఆకలిని కలుగ జేస్తుంది.వాత ,పిత్త , కఫ సమస్యలు నివారించ బడతాయి.అన్ని సమతౌల్యము చేయ బడతాయి. అర్శ మొలలు తొలగించ బడతాయి.అత్యుష్ణము,అతి చల్లదనము తొలగింప బడతాయి.
 
                               పెరిగిన, గుచ్చుకుంటున్న మొలలు --నివారణ                        
 
            లేపనము (Ointment)
 
                     ఆముదము          ------- 100 gr    (ఆముదము = ఆసాంతము ముదమును కలిగించునది)
                     తేనె మైనము        -------   50 gr
                     ముద్ద కర్పూరము  ------    10 gr 
 
       ఒక చిన్న పాత్రలో ఆముదాన్ని పోసి  దానిలో తేనెమైనాన్ని వేసి స్టవ్ మీద పెట్టి మైనం కరిగే వరకు చిన్న మంట మీద వేడి చేసి వడపోయ్యాలి దీనిలో మెత్తగా నూరిన కర్పూరం పొడిని కలపాలి. ఫ్యాను కింద పెడితే కొంత సేపటికి చల్లారి గడ్డ కడుతుంది .Ointment  తయారవుతుంది సీసాలో భద్ర పరచాలి. ఇది ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
      మొలలు బయటకు వచ్చి వుంటే వాటికి నేరుగా పూయవచ్చు లేదా దూదికి పూసి అంటించవచ్చు.
లోపలి మొలలైతే వేలితో మందును ఆసనం లోపల పూయాలి.

                   మొలలు --నివారణ                                                            

                  సుగంధ పాల వేర్లు ---- 50 gr 
                  నీళ్ళు                  ---- పావు లీటరు 

    సుగంధ పాల వేర్లను కడిగి చితగ్గొట్టి నీళ్ళలోవేసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం స్టవ్ మీద పెట్టి 50 గ్రాముల కషాయం మిగిలేవరకు కాచాలి. 

      సుగంధ పాల వేర్ల రసం            ---- 50 gr 
     ఉల్లిపాయల రసం                   ---- 30 gr 
       కొబ్బరి నూనె                        ---- 20 gr 

     ఈ మూడింటిని ఒక గ్లాసులో పోసి అన్ని కలిసేట్లు బాగా కలపాలి. దీనిని పెద్దలు రెండు, మూడు భాగాలుగా చేసి రోజుకు రెండు మూడు సార్లుగా తాగాలి. పిల్లలు వయసునుబట్టి రెండు స్పూన్లు లేక మూడు టీ స్పూన్ల మందును వాడాలి. 

     ఇది రక్తం కారే మొలలను నివారిస్తుంది.  ఈ వ్యాదివలన శరీరంలో ఏ భాగము నుండి రక్తం కారుతున్నా దీనిని వాడవచ్చు. 
                                                        

     గుదస్నానం:-- గుడ్డను చల్లటి నీటిలో తడిపి వెయ్యాలి. మట్టి పట్టి గోచీ లాగా పెట్టుకోవాలి. 
     ఉదరంలో అగ్ని మాంద్యం, అజీర్ణం మొదలైన వాటి వలన వస్తుంది. దీని వలన రక్తము, మాంసము, కొవ్వు పాడవుతాయి. దీని వలన గుదమునకు రెండు వైపులా అధిక మాంస భాగాలు (అర్శ మొలలు) ఏర్పడతాయి.

     గుప్పెడు శుభ్రం చేసిన నువ్వులను ఉదయాన్నే బాగా నమిలి తిని ఒక గ్లాసు చల్లటి నీళ్ళు తాగాలి.దీనివలన క్రమేపి తగ్గి పోతాయి. 

    కరక్కాయ పెచ్చులను కొద్దిగా నెయ్యి వేసి వేయించి దంచి పొడి చేసి పెట్టుకొని దానిలో బెల్లం వేసి దంచి నిల్వ చేసుకోవాలి.  ఆహారానికి ముందు పది గ్రాముల ముద్దను నమిలి మింగాలి. 

ఉత్తరేణి ఆకుల పొడి                 ---- 50 gr 
ఉత్తరేణి గింజల పొడి                 ---- 50 gr 
             కలకండ                    ---- 50 gr 

      అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. 
      అర టీ స్పూను పొడిని మజ్జిగలో కలుపుకొని తాగుతూ వుంటే మొలల ద్వారా కారే రక్తం ఆగి పోతుంది. 

పసుపు 
దోరగా వేయించిన వాము పొడి 

      రెండింటిని సమానంగా కలిపి తగినంత నీళ్ళు కలిపి నూరి దానిని మొలలపై అంటించి గోచి పెట్టుకోవాలి. 
పైవిధంగా ఒక రోజు, మట్టి పట్టి ఒక రోజు వేసుకుంటే మొలలు తగ్గి పోతాయి. 
   రక్త  మొలల నివారణకు అతిబల యోగం 

      అతిబల ఆకు (తుత్తిరి బెండ ఆకు) ఇగుళ్ళు తెచ్చి సన్నగా తరిగి ఒక కల్లు ఉప్పు వేసి నీళ్ళు చల్లి ఉడకబెట్టాలి. బాణలిలో ఒక స్పూను ఆముదం వేసి ఉడికిన ఆకును దానిలో వేసి చిటికెడు మిరప్పొడి చల్లాలి. ఇది కొంచం వగరుగా వుంటుంది. దీనిని రెండు పూటలా పరగడుపున తినాలి. ఇది తిని నీళ్ళు తాగి ఒక అరటి పండు తినాలి. ఈ విధంగా మూడు రోజులు చేయాలి

పత్త్యం:-- మందు తిన్న మూడు రోజులు, ఇంకొక మూడు రోజులు (పై పద్యం )వుండాలి  మాసాహారం తినకూడదు. 

కారం, పులుపు తగ్గించి తినాలి. చలువ చేసే పదార్ధాలను ఎక్కువగా వాడుకోవాలి. 

    ఇది రక్తం, చీము పడే వాళ్లకు మాత్రమే  

     ఆముదపు చెట్టు యొక్క లేత చిగుళ్ళు తాజాగా తెచ్చి ఒక కర్పూరం బిళ్ళ వేసి నూరి ముద్దను బిళ్ళగా చేసి మొలల మీద అంటించాలి. ఊడిపోకుండా గోచి పెట్టుకోవాలి.  20 రోజులు వాడితే క్రమేపి తగ్గుతుంది. 
     కాని అన్నింటికన్నా ముఖ్యంగా మలబద్ధకం నివారించబడాలి.
 
        ఈ వ్యాధి మాంసాహారం ఎక్కువగా తినే వాళ్లకు,పీచు పదార్ధాలు తక్కువగా తినే వాళ్లకు
వస్తుంది.  దీనిని.అర్శస్సు  అంటారు.
లక్షణాలు;-- మలద్వారం వద్ద మంటగా వుండడం, మలవిసర్జన సమయంలో నొప్పి, రక్తం పడడం జరుగుతుంది.
ఆహారం:--
     పుల్ల కందను చింత పండు పులుసులో నానబెట్టి రెండవ రోజు తినాలి. దీని వలన రక్తం స్రవించడం తగ్గుతుంది
 
రాత్రి పూట రెండు స్పూన్ల త్రిఫల చూర్ణం నీటిలో కలుపుకొని తాగుతూ వుటే మా,అం మెత్త బడుతుంది. 
 
    ముద్దబంతి పూలను   నూరి రసం తీసి రాత్రి పూట పెరుగులో కలుపుకొని తాగాలి. 
 
   పీచు పదార్ధాలు ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను ఎక్కువగా తినాలి, మొలకెత్తిన గింజలను తినాలి.
   మాంసాహారాన్ని దాదాపుగా తగ్గించాలి. నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి. 

            రక్త మొలలు --- నివారణ                                          
 
సుగంధ పాల వేర్ల కషాయం               --- 50 gr
                    కొబ్బరి నూనె            --- 30 gr
                    పెద్ద ఉల్లి గడ్డ            ---  1
                          చక్కెర               --- 1, 2 స్పూన్లు
                            నీళ్ళు              --- ఒక గ్లాసు 
 
    ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి  వాటిలో సుగంధపాల వేళ్ళను వేసి పావు  భాగానికి వచ్చేంతవరకు మరిగించాలి. వడకట్టాలి. ఎర్రని కషాయం వస్తుంది. దీనిని తప్పక చల్లార్చాలి. వేడిగా తాగకూడదు. దానిని ఒక గ్లాసులో పోసుకోవాలి. దానిలో కొబ్బెరనూనే, ఉల్లిగడ్డ రసం, చక్కెర కలపాలి. దీనిని ఆహారానికి గంటముందు ఉదయం, సాయంత్రం సేవించాలి. 
 
    ఇది అతి వేడిని, పైత్యాన్ని తగ్గిస్తుంది. 
 
     మధుమేహం వున్నవాళ్ళు చక్కెర లేకుండా తాగవచ్చు. 
 
ఒకటి, రెండు రోజులలో రక్త మొలల సమస్య తగ్గిపోతుంది.
     కారం, పులుపు, అరగని పదార్ధాలు, ఊరగాయలు తినకూడదు. సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను తినాలి.

బంతి ఆకులు                            ----- 20 gr
వేప ఆకులు                              ----- 50 gr
నల్ల ఉప్పు పొడి                         ----- 30 gr
చిన్న కరక్కాయల పొడి              ----- 50 gr 
 
        అన్నింటిని కల్వంలో వేసి మెత్తగా నూరి రేగు పందంతా గోలీలు చేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. 
 
        ప్రతి రోజు ఒక గోలి చొప్పున వాడాలి. 
 

           దానిమ్మ చెట్టు బెరడు తెచ్చి కడిగిఒక కప్పు  నీళ్ళలో వేసి కషాయం కాచి వడకట్టి  దానిలో అర టీ స్పూను           
శొంటి పొడిని కలిపి తాగాలి. .
                                              

  Anus  వద్ద ఒత్తిడి పెరగడం వలన ఇవి బయటకు వస్తాయి. 
కారణాలు ;--  మలబద్దకము ముఖ్య  కారణం.  తరచుగా విరేచనాలు కావడం వలన,  గర్భిణి స్త్రీలలో సరైన పద్ధతిలో డెలివరి  కాక పోవడం వలన కూడా ఏర్పడతాయి. 

      " మజ్జిగ  100 రోగాలను తగ్గిస్తుంది",    మొలల వ్యాధిలో మజ్జిగ దివ్యమైన ఔషధం 

        కరక్కాయ పెచ్చులను నేతిలో వేయించి దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి.  ఈ పొడిని మజ్జిగలో గానిగోరువెచ్చని నీటిలో గాని  కలిపి తీసుకుంటూ వుంటే తగ్గుతుంది. 

       కంద గడ్డ చాలా మంచిది. దీనిని కూరగా గాని,  లేహ్యం లాగా గాని వాడుకోవచ్చు. 

      ఫైల్స్  వున్న  ప్రాంతంలో కొబ్బరి నూనె గాని, ఆముడంగాని పూస్తూ వుండాలి. 

     మలబద్ధకం వలన ఎక్కువగా ముక్కడం, రోజులో ఎక్కువసేపు కూర్చోవడం  వంటి కారణాల వలన వస్తుంది.  
ఇది అంటువ్యాధి కాదు. వచ్చిన తరువాత పోవడం  చాలా కష్టం. ఆహారపు జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు మందులు పని చేస్తాయి. 
 
      ఎకువగా ప్రయాణం చేయడం, కర్మాగారాల్లో పని చేయడం, వేడి చేసే వస్తువులు తిడం వలన వలన అసలు తగ్గవు

1. కరక్కాయ పెచ్చులు 
    బెల్లం 

    శుద్ధి చేసిన గోమూత్రం లేదా గోఅర్కములో కరక్కాయ పెచ్చులను ఒక రోజంతా నానబెట్టాలి.  తీసి ఆ పెచ్చులకు సమానంగా బెల్లాన్ని కలిపి కల్వంలో వేసి నూరి బటాణి గింజలంత మాత్రలు కట్టాలి. 

    పూటకు ఒక్క మాత్ర చొప్పున  మూడు పూటలా ఆహారానికి  గంట ముందు తీసుకోవాలి. 

2. వాము పొడి                   ---- ఒక టీ స్పూను
    మజ్జిగ                         ---- ఒక గ్లాసు  ( పెరుగుతో  వాడితే సమస్య పెరుగుతుంది ).
    సైంధవ లవణం              ---- రెండు చిటికెలు

          అన్నింటిని కలుపుకుని ఆహారానికి తరువాత తీసుకోవాలి.

సూచన :--  రెండు పద్ధతులను పాటించాలి.

               రక్త మొలలు --నివారణ                                                               అసలు కారణం మలబద్ధకం. ఎక్కువగా ముక్కడం వలన దాని తాలుకు ఒత్తిడి వలన మొలలు ఏర్పడతాయిఅవి చిట్లినపుడు రక్తస్రావం జరుగుతుంది.  విరేచనం తరువాత కూడా రక్త స్రావం జరుగుతుంది. నీరసంగా వుండి చర్మం ఎండిపోయి, పొడిబారినట్లుగా వుంటుంది. కీళ్లలో నొప్పులు వుంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా వున్నాయి. 

      పిత్తప్రకోపము, రక్తప్రకోపము కలిగించే ఆహారాన్ని సేవించరాదు. ఉదాహరణకు  కారం, క్షార పదార్ధాలుమసాలా పదార్ధాలు, మద్యపానం, ఎండలో ఎక్కువగా తిరగడం, వేడి ఎక్కువగా వున్నచోట వుండడం మొదలినవిముఖ్య కారణాలు. 

     కమ్మ గగ్గెర లేదా రుద్రజడ లేదా సబ్జా  ( అసిమం బాసిలికం )

     ఒక గుప్పెడు సబ్జా ఆకులను మెత్తగా, ముద్దగా నూరాలి. దానిలో పావు భాగం పసుపు కలిపి మరలా నూరాలి. ఈ ముద్దను మొలలపై కడితే నాలుగైదు రోజులలో రక్త స్రావం ఆగిపోతుంది. 

     కొడిశపాల బెరడు లేదా విత్తనాలను ముద్దగా నూరి రెండు స్పూన్ల వెన్న కలిపి మూడు పూటలా నాలుగైదురోజులు కడుపులోకి వాడితే తీవ్ర సమస్య కూడా నివారింప బడుతుంది. .
                
        మొలల ద్వారా రక్తం,  చీము  పోతుంటే 
      
       తిత్తిరి బెండ ( అతిబల ) చిగుళ్ళను  తెచ్చి సన్నగా తరిగి  రెండు ఉప్పు రాళ్ళను వేసి  కొద్దిగా నీళ్ళు కలిపి ఉడికించాలి.    బాణలిలో  ఒక స్పూను ఆముదం వేసి   కాగానిచ్చి దానిలో ఉడికించిన ఆకును వేయాలి. చిటికెడు మిరప్పొడి చల్లాలి    

       ఇది కొంచం వగరుగా వుంటుంది. దీనిని తిని నీళ్ళు తాగి ఒక అరటి పండు తినాలి.  ఈ విధంగా ఉదయం, సాయంత్రం  పరగడుపున  తీసుకోవాలి.  ఈ విధంగా మూడు రోజులు రెండు పూటలా వాడాలి.   
       మందు వాడిన మూడు రోజులు, మరొక మూడు రోజులు  అనగా ఆరు రోజులు పత్యం  వుండాలి. 
        ఆరు రోజులు ఎలాంటి మాంసాహారం తినకూడదు.  కారం,  పులుపు తగ్గించి వాడాలి.  చలువ చేసే పదార్ధాలను ఎక్కువగా వాడుకోవాలి.
        మొలల ద్వారా రక్తం  చీము  పడే వాళ్ళు మాత్రమే దీనిని వాడాలి. 

             అర్శ మొలలు -- నివారణ                                          

          మల  ద్వారము లోని  రక్త నాళాలు ఉబ్బి  రక్తపు గడ్డలు అడ్డుగా ఏర్పడతాయి.  దీనినే మొలలు అంటారు.
 
లక్షణాలు :-- మొలలు లోపలి వైపు వున్నపుడు  పైన దురద,  మల ద్వారం వద్ద వాపు,  కొంచం ద్రవం వచ్చినట్లువుండడం వంటి లక్షణాలు వుంటాయి.  

కారణాలు :--ముఖ్యంగా  మలవిసర్జన  సమయం లో బలవంతంగా ముక్కడం వలన  మొలలు వస్తాయి. 
  
  కొంత మంది ఏదో లోపల మిగిలి ఉన్నట్లుగా భావించి  ఎక్కువసేపు కూర్చోవడంజరుగుతుంది.       
కొంతమందికి గర్బ్భ ధారణ  సమయంలో  మొలలు ఏర్పడి అలాగే  వుంది పోతాయి.  అనైతిక పద్ధతుల ద్వారా శృంగారం జరపడం మొదలైన కారణాల వలన మొలలు ఏర్పడతాయి. 

1.   5 గ్రాముల నువ్వులను ముద్దగా నూరి మొలల  మీద ప్రయోగించాలి.  ఇది వాపును,  నొప్పిని తగ్గిస్తుంది.

2.   నువ్వులు             --- అర టీ స్పూను
      వెన్న                   --- తగినంత 
 
            రెండింటిని కలిపి నూరి కడుపులోకి  తీసుకోవాలి. తప్పక నివారింప బడతాయి.

3.   మారేడు  పండు గుజ్జు                --- 5 gr
       పంచదార                              ---10 gr
       మిరియాల గింజలు                ---  3
       యాలకుల పొడి                     ---  3 gr 
 
             అన్నింటిని దంచి మజ్జిగలో కలిపి ప్రతి రోజు  తీసుకుంటే  40 రోజులలో తగ్గిపోతుంది.  

     మొలల నుండి  రక్తస్రావం -- నివారణ                               
             ఉత్తరేణి గింజల పొడి     ---అర టీ స్పూను
                         మజ్జిగ          --- ఒక గ్లాసు
                        కలకండ         --- ఒక టీ స్పూను

             అన్నింటిని కలిపి తాగితే  వారం రోజుల్లో మొలలనుండి స్రవించే రక్తం ఆగిపోతుంది. 

             ఆముదపు  ఆకు        --- ఒకటి
             కర్పూరం బిళ్ళలు      --- రెండు

              రెండింటిని కలిపి నూరి ఆసనం మొలల మీద పెట్టి గోచి పెట్టుకుంటే ఎండి రాలిపోతాయి. 

       ఆసనం  పుండ్లు --నివారణకు శక్తి భస్మం                    
   
                    కొబ్బరి పీచు     --- ను చిన్న ముక్కలుగా కత్తిరించి స్టవ్ మీద పెట్టి కాల్చి బూడిద
    చెయ్యాలి. తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. 

                    పూటకు  పావు టీ స్పూను పొడిని అర గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగాలి.
    ఈ విధంగా  రోజుకు  రెండు సార్లు చేయాలి. 

                    దీని వలన ఆసనం వద్ద వచ్చే పుండ్లు,  గడ్డలు నివారించబడతాయి. 

                    శరీరంలో ఎంత వేడి వున్నా తగ్గి పోతుంది

   వేసవిలో వచ్చే మొలలు-- నివారణ                           

   1. సుగంధపాల వేర్ల పొడి          --- 50 gr 
                   వట్టి వేర్ల పొడి         --- 50 gr 

      రెండింటిని కలిపి సీసాలో భద్రపరచాలి. 

      ఒక టీ స్పూను పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానిచ్చి కలకండ కలుపుకొని తాగాలి. 

    2. కరక్కాయ పొడి
             బెల్లం

    రెండింటిని కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసుకోవాలి.  ఉదయం + మధ్యాహ్నం +రాత్రి
నీటితో సేవించాలి.   ( 2 + 2 + 2) 

    3. మారేడు పండు గుజ్జు చూర్ణం     --- 100 gr 
       యాలకుల గింజల చూర్ణం         ---   10 gr 

    రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. 

    పావు టీ స్పూను పొడిని నీటిలో కలిపి తాగాలి. 

              PILES                                                  

నల్లేరు ముక్కలు              --- పది  ( గుజ్జు ) 
మిరియాలు                     --- పది 

     రెండింటిని కలిపి నూరి మూడు మాత్రలు తయారు చేసుకోవాలి .  ఉదయం, సాయంత్రం ,
మరుసటి రోజు ఉదయం వేసుకోవాలి.  మరుసటి రోజు  మళ్ళీ చేసుకోవాలి. 
     
     నల్లేరు పచ్చడి తింటే కూడా తగ్గుతుంది. 

     నల్లేరును సజ్జ రొట్టేలో కలిపి తింటే ఊపిరితిత్తుల లోని గడ్డ
ల రూపంలోని కఫం కరిగి పడిపోతుంది 

నాగకేసరాల పొడి 
పటికబెల్లం 

      రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని  కలిపి నిల్వ చేసుకోవాలి. 

      పూటకు అర టీ స్పూను చొప్పున రోజుకు రెండు పూటలా వాడాలి. ఈ చూర్ణాన్ని తియ్యటి 
పెరుగులో కలిపి ఆహారానికి ముందు తింటే అన్ని రకాల ( బాహ్య, అంతర) మొలలు నివారింప 
బడతాయి.   ఈ విధంగా  40 రోజులు వాడాలి. 

సూచనలు :-- ద్రాక్ష రసం, దా పొడి నిమ్మ రసం, బార్లీ, ఎక్కువగా వాడుకోవాలి. 

                        

ఆవునెయ్యి                         --- 20 gr 
మెత్తటి  రసాంజనం  పొడి        --- 10 gr 

    ఈ మోతాదు ప్రకారం కలిపి నిల్వ చేసుకోవచ్చు .
    రాత్రి పూట మొల్ల మీద పోసి గోచి పెట్టుకొని పడుకోవాలి . దీంతో ఎంత పొడవుగా వున్న మరియు ఎంత
సమస్యగా వున్న మొలలైనా రాలిపోతాయి .

               రక్త మొలలు  --- నివారణ                                 

 ఎర్రని దానిమ్మ ఇగుళ్ళు           --- 5 gr 
పటికబెల్లం                              -- 5 gr 
కరక్కాయ పొడి                       -- 5 gr 
వెన్న                                     --- 5 gr 

         అన్నింటిని కలిపి ముద్దగా చేయాలి . ఉదయం , సాయంత్రం ఉసిరికాయ అంత ముద్దను తింటూ వుంటే 
మొలల ద్వారా పడే రక్తం పడడం ఆగిపోతుంది .

సూచన :---  ఆహారం లో  కారం , ఉప్పు , పులుపు తగ్గించాలి . మాంసాహారం తినకూడదు . అన్నం లో ఎక్కువగా పాలు
లేదా పల్చని మజ్జిగ  పెసరపప్పు  వాడుకోవాలి .  ద్రాక్ష రసం , తీపి దానిమ్మ రసం తాగుతూ వుండాలి .

పల్చని గుడ్డను తడిపి , పిండి గోచీ పెట్టుకోవాలి . దాని పై మందమైన పొడి గుడ్డను కప్పాలి . ఈ  విధంగా రోజుకు రెండు ,
మూడు సార్లు చేయాలి

2  . ఉత్తరేణి రసం లో చక్కర కలుపుకొని తాగితే కూడా తగ్గుతుంది .

3 . ధనియాల కషాయాన్ని మూడు పూటలా    పూటకు  ఒక కప్పు చొప్పున  తాగుతూ వుండాలి .

           తాటి చెట్టు మీద పాకుతున్న లేదా మొలిచిన నల్లేరు విషం తో సమానం కావున దానిని సేకరించ రాదు .

నల్లేరు గుజ్జు                --- 50 gr
మిరియాల పొడి           --- 25 gr

        రెండింటిని  కల్వంలో వేసి మెత్తగా నూరి శనగ గింజలంత  మాత్రలు చేసుకోవాలి .

        పూటకు ఒక మాత్ర చొప్పున  రోజుకు రెండు మాత్రలు వాడాలి
ధన్యవాదములు 
నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.

12, జూన్ 2020, శుక్రవారం

జలుబు మరియు కఫం తో కూడిన ముక్కు దిబడ్డ


ముక్కు దిబ్బడ అంటే ఏమిటి?

ముక్కు దిబ్బడ లేదా నేసల్ కాంజెషన్ అనేది ముక్కు యొక్క అంతర్గత లైనింగ్లో (పూతలో) వాపు మూలంగా ముక్కు మూసుకుపోవడం/నిరోధించబడం. ఇది సాధారణంగా జలుబు వలన కనిపించే లక్షణాలలో ఒకటి. ఈ పరిస్థితి సాధారణంగా ఒక చిన్నపాటిది/తేలికపాటిది మరియు మందుల అవసరం లేకుండా కూడా కొద్ది కాలంలోనే నయమవుతుంది/తగ్గిపోతుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది మరియు ముఖ్యంగా పిల్లల్లో గమనించవచ్చు. ముక్కు దిబ్బడ అనేది తరచుగా అలెర్జీలు లేదా ఒక జలుబు వంటి ఇతర వ్యాధులతో ముడిపడి ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యక్తి ముక్కు దిబ్బడతో పాటు క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

అరుదుగా, ఈ క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

ఇవి సైనసైటిస్ మరియు ఉబ్బసం వంటి ఇతర కారణాలతో ముడిపడి ఉండే అరుదైన లక్షణాలు .

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ముక్కు లోపలి రక్తనాళాల వాపు, కణజాలపు వాపు మరియు ముక్కు రంధ్రలలో శ్లేష్మం అధికంగా స్రవించడం వల్ల  ముక్కు దిబ్బడను అనుభవించవచ్చు. ముక్కు అంతర్గత లైనింగ్ను చికాకు కలిగించే మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితులు:

  • అలెర్జిక్ రినిటిస్
  • సైనసైటిస్
  • జలుబు
  • నేసల్ పాలిప్స్ (Nasal polyps)
  • బయటి పదార్థం ముక్కులోకి ప్రవేశించడం
  • ఓటైటిస్ మీడియా (చెవి సంక్రమణం)
  • ఆస్తమా

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు ఇటీవలి శ్వాసకోశ అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీల వంటి వ్యాధుల యొక్క చరిత్ర గురించి కొన్ని ప్రశ్నలను అడుగుతారు. వైద్యులు పాలిప్స్ లాంటి అడ్డంకులకు కారణాలుగా ముక్కు నిరోధించబడినదా తెలుసుకోవడానికి ముక్కుని కూడా పరిశీలిస్తారు.

చికిత్సలో డికాంగిస్టెంట్స్ (decongestants) ఉంటాయి, వీటిని ఓరల్ (నోటి ద్వారా) తీసుకోవచ్చు లేదా స్ప్రేలు లేదా నేసల్ డ్రాప్స్ గా ఉపయోగించవచ్చు. వాటితో పాటు, ముక్కు దిబ్బడ యొక్క కారణం బట్టి ఇతర మందులను వైద్యులు సూచిస్తారు.

నేసల్ పాలిప్స్ విషయంలో, సాధారణంగా వాటి పరిమాణాన్ని తగ్గించడానికి మందులు ఇవ్వబడతాయి. చికిత్స ప్రభావవంతంగా లేకపోతే, శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది

ముక్కు దిబ్బడ ఆయుర్వేదం లో 

    ఫ్లూ జ్వరం వలన వచ్చే  ముక్కు దిబ్బడ --నివారణ                              

 1.            నీలగిరి తైలం తో గాని , జీవన ధార తైలం తో గాని Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది. 

  2.     పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 

3.దాల్చిన చెక్క పొడి          --- 5 gr 
మిరియాల పొడి                --- 5 gr 
యాలకుల గింజల పొడి     --- 5 gr 
జీలకర్ర  పొడి                   ---  5 gr 

       అన్ని పొడులను కలపాలి. దీనిని  మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే  తగ్గుతుంది.

4.     జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా  చేసి పాలలో కలుపుకొని తాగాలి. 

5. పసుపు పొడి        --- అర టీ స్పూను 
వెల్లుల్లి ముద్ద           ----పావు టీ స్పూను 

   రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి నివారించ బడుతుంది. 

6. శొంటి
    పిప్పళ్ళు
    మిరియాలు 

 మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి. తరువాత కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. 

     పావు టీ స్పూను పొడి నుండి అర టీ స్పూను పొడి వరకు తీసుకుంటే ఫ్లూ వలన వచ్చే జలుబు నివారించ  బడుతుంది. 
                                     
దాల్చిన చెక్క పొడి
మిరియాల పొడి
యాలకుల పొడి
నల్ల జిలకర పొడి 

      అన్ని  పొడులను వస్త్ర ఘాళితం చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. 

      దీనిని ముక్కు పొడి లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి.

               జలుబు                               
కొబ్బరి నూనె           ---- ఒక టీ స్పూను
కర్పూరం                 ---- ఒక బిళ్ళ

        కొబ్బరి నూనెను వేడి  చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద   చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి  బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన  జలుబు అప్పటికప్పుడు  తగ్గుతుంది .
మీద , 


ముక్కు దిబ్బడ కొరకు మందులు


Medicine NamePack Size
KolqKolq Capsule
WikorylWikoryl 60 Syrup
AlexAlex Cough Lozenges Lemon Ginger
Solvin ColdSolvin Cold AF Oral Drops
Tusq DXTusQ DX Liquid
Febrex PlusFebrex Plus AF Oral Drops
Ascoril DAscoril D 12 Oral Suspension Orange
Orinase AOrinase A 0.10% W/V Nasal Drops
Sinarest LevoSinarest Levo Tablet
SBL Camphora LMSBL Camphora 0/1 LM
Coscopin BRCoscopin BR Expectorant
OtrinozOTRINOZ ADULT 0.1% NASAL DROPS 10 ML
Alcof DALCOF D SYRUP 100ML
Schwabe Corallium rubrum CHSchwabe Corallium rubrum 1000 CH
Bjain Camphora DilutionBjain Camphora Dilution 1000 CH
Bjain Aurum Metallicum DilutionBjain Aurum Metallicum Dilution 1000 CH
Otrivin Nasal SprayOTRIVIN O 0.05% NASAL SPRAY 10ML
SBL Camphora Mother Tincture QSBL Camphora Mother Tincture Q
CosomeCOSOME COUGH SYRUP
RecofastRECOFAST DROP 15ML
RhinosetRhinoset 0.1% W/V Nasal Drops
ADEL 33 Apo-Oedem DropADEL 33 Apo-Oedem Drop
DrilergDRILERG SYRUP 100ML
Rhinoset PRhinoset P 0.05% W/V Nasal Drops

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


11, జూన్ 2020, గురువారం

ధనుర్వాతం పెటావలేంట్ టీకాలు వేయిద్దాం - ప్రాణాంతకమైన ఐదు వ్యాధుల నుండి మన పిల్లలను రక్షించుకుందాం నవీన్ నడిమింటి సలహాలు



టెటనస్ అంటే ఏమిటి?

టెటనస్ లేదా ధనుర్వాతం (lockjaw) అనేది నాడీవ్యవస్థ సంబంధించిన ఒక పరిస్థితి. ఇది కొత్తగా తగిలిన గాయానికి లేదా బహిరంగ/తెరిచివున్న  పుండుకి క్లోస్ట్రిడియం టెటాని (Clostridium tetani) అని పిలవబడే బాక్టీరియా సోకినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్ గా అభివృద్ధి చెందే ఒక సమస్య.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

టెటనస్ యొక్క ప్రధాన సంకేతం దవడ కండరాలు బిగుతుగా లేదా ధృడంగా మారడం, అందుకే దీనికి లాక్ జా (lockjaw) అనే పేరు వచ్చింది. ప్రభావిత గాయం మరియు కండరాల చుట్టూ నొప్పిని కూడా గమనించవచ్చు. టెటనస్ యొక్క ఇతర ప్రధాన లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్లోస్ట్రిడియం టెటని బాక్టీరియా విషాన్ని (టాక్సిన్లను) విడుదల చేయడం వల్ల టెటనస్ సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు సుదీర్ఘకాలం పాటు హోస్ట్ యొక్క శరీరం వెలుపల కూడా దాని మనుగడ సాగించగలదు. ఇవి మట్టి లేదా జంతువుల యొక్క ఎరువుల (manure) లో నివసిస్తాయి. ఈ బ్యాక్టీరియా మానవ శరీరరంలోకి ఏదైనా తెగిన గాయం లేదా పుండు ద్వారా ప్రవేశిస్తుంది మరియు చాలా వేగవంతంగా సాధారణంగా, 3 నుంచి 21 రోజులలోనే వృద్ధి చెందుతుంది. ఇవి నరాలను ప్రభావితం చేసే ఒక రకమైన టాక్సిన్ ను విడుదల చేస్తాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వ్యక్తిలో  పైన పేర్కొన్న లక్షణాల వంటి లక్షణాలను అభివృద్ధి చెందితే లేదా కొత్తగా (ఇటీవలి) తెగిన గాయం లేదా కాలిన గాయాల తర్వాత ఆకస్మికంగా కండరాల నొప్పి సంభవించినట్లయితే, వైద్యులు దానిని టెటానస్ గా పరిగణించవచ్చు. వైద్యులు రోగి టెటానస్ టీకాని వేయించుకున్నాడో లేదో అడుగుతారు లేదా బూస్టర్ షాట్ (booster shot) తీసుకునే సమయం దాటిపోయిందా అనే విషయాన్నీ గురించి తెలుసుకుంటారు. టోటనస్ నిర్ధారణను ధృవీకరించగల ఖచ్చితమైన పరీక్షలు అందుబాటులో లేనందున, చికిత్స లక్షణాలు మరియు వ్యక్తి యొక్క రోగనిరోధకత చరిత్రపై ఆధారపడి ఉంటుంది.

ఒక సంక్రమణ/ఇన్ఫెక్షన్ యొక్క అభివృద్ధిని నివారించడానికి గాయానికి తగినంత సంరక్షణ చెయ్యడం మరియు టెటనస్ టీకాను పొందడం వంటి నివారణ చర్యలు పాటించాలి. టెటనస్ అనేది తక్షణ మరియు అత్యవసర వైద్య చికిత్స అవసరమయ్యే ఒక అత్యవసర వైద్య పరిస్థితి (medical emergency). ఒక వ్యక్తికి ఈ బాక్టీరియా  సోకినట్లయితే, టెటానస్ ఇమ్మ్యునోగ్లోబులిన్ (బ్యాక్టీరియాను చంపే యాంటీబాడీలు),పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ మరియు కండరాల సడలింపు మందుల (muscle relaxants) ద్వారా చికిత్స చెయ్యడం జరుగుతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, వ్యక్తి శ్వాస అందించడం కోసం వెంటిలేటర్ సహాయం కూడా అవసరమవుతుంది

ధనుర్వాతము అనే జబ్బు శరీరానికి గాయం తగిలినప్పుడు ఆ గాయం ద్వారా ఇన్ పెక్షన్ అయినప్పుడు వస్తుంది. క్లాస్ట్రిడియా టెటని అనే క్రిములు గాయం ద్వారా శరీరంలో ప్రవేశించి - ధనుర్వాతం వ్యాధిని కలిగిస్తాయి.

లక్షణాలు:

ధనుర్వాతం ప్రధానంగా కేంద్రనాడీ మండల వ్యవస్ధ      (మెదడు,వెన్నెముక )పై ప్రభావము చూపుతుంది.

ధనుర్వాతం మొదటి లక్షణము,దవడ కండరాలు బిగుసుకుపోయి నోరు  తెరవలేకపోవడం

ఈ లక్షణం చిన్న పిల్లలలో అయితే తల్లిపాలు      త్రాగలేరు

ఏ కారణం లేకుండా ఎవరైన నోరు తెరవలేక      పోయినట్లు అయితే వేంటనే డాక్టరు వద్దకు తీసుకువెళ్ళాలి

స్వల్పంగా జ్వరం రావడం

గుండె స్పందన వేగంగా వుండడం

పొత్తికడుపు వీపు ఇతర కండరాలు కూడ      బిగుసుకు పోవచ్చు

నివారణ:

ధనుర్వాతం రాకుండా నివారించడానికి      సంవత్సరము లోపు పిల్లల్లో 1 నెల వయస్సు నుండి మూడు మోతాదులు      వ్యాధి నిరోధక టీకా ఇవ్వాలి.

అనగా డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతము      ఈ మూడు వ్యాధులకు నివారణ లా పని చేస్తుంది.

గాయం తగిలిన వెంటనే ప్రాధమిక చికిత్స చేసి      ధనుర్వాతం టీకా డాక్టరు సలహా మేరకు వేయించాలి.

గాయం తగిలినా తగలకపోయినా ప్రతి 5 సంవత్సరాలకు యుక్త వయస్సు అమ్మాయిలు      డాక్టరు సలహా ప్రకారము టి.టి సూది వేయించుకోవడం మంచిది.

టెటనస్ కొరకు మందులు

Medicine NamePack Size
Combe Five PFSCombefive Injection
Pentavac PFSPENTAVAC PFS INJECTION
Sii Td VacSii Td Vac 5 Lf/5 Lf Injection
HexaximHexaxim Vaccine
SII Q VacSII Q-VAC Vaccine
Quadrovax SDQUADROVAX SD/PFS LIQUID
Pentavac SDPENTAVAC SD VACCINE 0.5ML
Dual AntigenDual Antigen Vaccine
Triple AntigenTRIPLE ANTIGEN INJECTION 1ML
BettBett 5 ML Vaccine
HiberixHiberix Injection
Tetanus Toxoid VaccineTetanus 1.5 Lf Vaccine
TripvacTripvac Vaccine
PentaximPentaxim Vaccine
SycodepSycodep 25 Mg/2 Mg Tablet
Emetil PlusEmetil Plus 100 Mg/2 Mg Tablet
PlacidoxPlacidox 10 Mg Tablet
ToframineToframine 25 Mg/2 Mg Tablet
Promexy HfPromexy Hf 50 Mg/2 Mg Tablet
Easy Five TtEasy Five Tt 7.5 Lf/20 Lf Injection
ValiumValium 10 Tablet
TrikodepTrikodep 2.5 Mg/25 Mg Tablet
Prozine PlusProzine Plus 100 Mg/2 Mg Tablet
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.