5, మార్చి 2021, శుక్రవారం

ఫ్యాట్టి లివర్ డైట్ ప్లాన్ అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి అవగాహనా కోసం మాత్రమే

సారాంశం

కాలేయంలో ఎక్కువ కొవ్వు (fat) పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధే కాలేయ వాపు (swelling of liver). కాలేయ వాపు (fatty liver) రెండు రకాలు. 1. మద్యపానపు కాలేయ వ్యాధి-ఇది అధిక మద్యపానం వల్ల వస్తుంది. 2. మద్యపానేతర కాలేయ వాపు (NAFLD)- కాలేయంలో క్రొవ్వు నిక్షేపాలు పేరుకునిపోవడం వల్ల ఏర్పడే “నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి (non-alcoholic fatty liver disease-NAFLD).” ఈ రెండో రకం కాలేయ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియవు, అయితే, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు జీవక్రియ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ రెండో రకం కాలేయ వాపు వ్యాధికుండే కాలేయ పరిస్థితులు పాశ్చాత్య దేశాల్లో ఉండే ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేసే సామాన్య (కాలేయ) లక్షణాల్లో ఒకటి. పరిమాణంలో కాలేయం పెరగడమనే ఒక్క లక్షణం తప్పితే ఏ లక్షణాలు లేకుండా “కాలేయ వాపు వ్యాధి” మనిషిలో నిగూఢంగా ఉండవచ్చు. లేదా పూర్తి కాలేయ వైఫల్యాన్ని సూచించే తీవ్రమైన లక్షణాలతో అకస్మాత్తుగా స్పష్టాతి స్పష్టంగా అగుపడనూవచ్చు. దీనికి వెంటనే వైద్య జోక్యం చాలా అవసరం. కాలేయ వ్యాధిని  నిర్ధారణ చేయడం, వెనువెంటనే తగిన వైద్యం చేయడమే ఈ వ్యాధి నివారణకు మరియు వ్యాధి యొక్క పురోగతిని నివారించడానికి లేదా అదుపు చేయడానికి కీలకం. స్థూలకాయం బరువు తగ్గించడం మరియు వ్యాయామాల ద్వారా కాలేయ ఆరోగ్య నిర్వహణ ప్రస్తుతం రూఢీలో ఉన్న చికిత్స లక్ష్యంగా ఉంది. కాలేయవ్యాధిని ఖచ్చితంగా నయం చేయగల మరియు ప్రభుత్వం అనుమతించిన మందులు లేవు కానీ రోగి పరిస్థితిని బాగు చేసేందుకు ఉపకరించే పలు ఆశావహ మందులు రానున్నాయి. మరింత తీవ్రమైన పరిస్థితులకు శస్త్రచికిత్స అవసరం

కాలేయవాపు వ్యాధి నివారణ 

కాలేయ వాపు  వ్యాధికి ఒక నిర్దిష్టమైన వైద్య చికిత్స లేదా శస్త్రచికిత్స అంటూ లేదు. కానీ, ఈ కాలేయ వాపు వ్యాధికి గురైన వ్యక్తి తగిన నివారణా  చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించి కొంత వరకు వాపును బాగు చేసుకోవచ్చు. మద్యపానేతర కాలేయ వ్యాధికి చెందిన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్-NASH (కామెర్లు) తో బాధపడుతున్నవారు ఈ నివారణా చికిత్స తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కాలేయ వాపు వ్యాధిని ఆపడానికి, ఇంకనూ వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించడానికి సహాయపడే చర్యలు కింది విధంగా ఉన్నాయి:

  • బరువు తగ్గడం
    సురక్షితంగా బరువు తగ్గడమనేది కాలేయ వాపు ను  నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది. సురక్షితంగా బరువును కోల్పోవడమంటే ఒక వారంలో అర్ద కిలోగ్రామ్ లేదా ఒక కిలోగ్రాము కంటే ఎక్కువ బరువును కోల్పోకుండా ఉండడం.  
  • మద్యపానానికి దూరంగా ఉండటం
    మద్యం సేవించడం కాలేయానికి హానికరం. మద్యం కాలేయంలో విరిగిపోయినప్పుడు కాలేయానికి హాని కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది. మాద్యపానాన్ని ఆపేయడం మూలంగా కాలేయం తనలో పేరుకుపోయిన శరీరజన్య విషాన్ని తొలగించడానికి మరియు స్వయంగా నయం చేసుకునే అవకాశాన్నీ కాలేయానికి కల్పించినట్లవుతుంది.  
  • మధుమేహం నియంత్రించటం
    మధుమేహం (చక్కెరవ్యాధి) వ్యాధిని సవ్యంగా నిర్వహించుకుంటూ వెళ్తే మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) ని మెరుగ్గా నయం చేసుకోవడానికి సహాయపడుతుంది.
  • ఆహారసేవనం లో మార్పులు
    మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) రోగుల విషయంలో-వారి వ్యాధి చికిత్స మరియు నిర్వహణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వారి ఆహారంలో చేర్చండి మరియు అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం నివారించండి.
  • మీ శారీరక శ్రమపెంచేందుకు వ్యాయామం  
    మద్యపానేతర కాలేయ వ్యాధి రోగులు వారి శారీరక శ్రమ (వ్యాయామాలు మొదలైనవి)ను  కొద్దిపాటిగా పెంచినా అది వారికి చికిత్సాపరమైన మేలును కలుగజేసి ఉపయోగకరమైందిగా కనిపిస్తుంది.
  • మీ వైద్యుడితో నిరంతరంగా పరీక్షలు చేయించుకోవడం
    మీ కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లివర్ స్పెషలిస్ట్ ద్వారా రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడం చాలా ముఖ్యమైంది  

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ 

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణకు ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు లేనందున వైద్యుడు మీ రక్తపరీక్ష పరిశీలనలో ఏదైనా  విలక్షణమైనదాన్ని గమనించినట్లయితే గాని లేక పరిమాణం పెరిగిన కాలేయమును గమనిస్తే గాని ఈ వ్యాధి రోగికున్నట్లు యాదృశ్చికంగానే బయట పడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్ కాలేయ వాపు వ్యాధి యొక్క ఉనికిని పసిగట్టినపుడు కొన్ని రక్త పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఒక CT స్కాన్ లేదా ఒక MRI ను మీ కాలేయ స్థితిని నిర్ధారించడానికి గాను సూచించవచ్చు.

మీకు చేసిన అనేక పరీక్షలు మీకు ఎలాంటి ఇతర కాలేయ వ్యాధులు లేవని సూచిస్తూ ఉండగా మీరు మద్యపానేతర స్టీటోహెపటైటిస్ (NASH) లేక కామెర్లతో బాధపడుతున్నారని మరో పరీక్ష తేల్చవచ్చు. ఒక్క కాలేయ జీవాణుపరీక్ష మాత్రమే వ్యాధిని నిర్ధారించగలదు. కాలేయం జీవాణుపరీక్షలో, కాలేయ కణజాలం యొక్క ఒక చిన్న నమూనా తొలగించబడుతుంది మరియు దాన్ని సూక్ష్మదర్శిని క్రింద వైద్యుడు పరిశీలిస్తాడు. డాక్టర్ కాలేయ వాపు వ్యాధి అని  అనుమానిస్తే, మీనుండి ఒక వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. మరియు మీకు మద్యంపానం అలవాటుంటే దాని గురించి మరియు ఏవైనా మందులసేవనం వల్ల సమస్యను కల్గించి ఉంటె దాన్ని గుర్తించడానికి మీరు తీసుకున్న మందులు గురించి డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.

కాలేయ వాపు వ్యాధి చికిత్స 

రోగికి దాపురించిన కాలేయ వాపు వ్యాధి యొక్క రకాన్ని బట్టి ఆ వ్యాధి నిర్వహణ క్రింది విధంగా ఉంటుంది:

మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (Non-alcoholic Fatty Liver Disease ,NAFLD)

మద్యపానేతర కామెర్ల జబ్బు (NASH)కు గాని లేదా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి గాని  ఎటువంటి స్థిరమైన మందులు లేవు.

  • ఈ కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ చేయబడిన వారికి బరువు తగ్గమని వైద్యులు సిఫారసు చేస్తారు. బరువు తగ్గడం మూలంగా  కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, మంట మరియు కాలేయం పై ఏర్పడిన మచ్చలు ( ఫైబ్రోసిస్) తగ్గుతాయి.
  • శారీరక శ్రమ (వ్యాయామాలతో కూడినది కావచ్చు)ను  పెంచడమనేది మొత్తం శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికే కాక కాలేయంలోని కొవ్వునూ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ కార్యకలాపాలు సిఫార్సు చేసిన స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, కేవలం క్రియాశీలకంగా ఉండటం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి NALFD లో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  
  • వైద్యులు మీరు తీసుకున్న మందులను మూల్యాంకనం చేయవచ్చు మరియు కొన్ని ఔషధాలను మార్చమని లేదా మరి కొన్ని మందుల్ని నిలిపివేయమని మిమ్మల్ని అడగొచ్చు. మీ వైద్యుని ఆమోదం లేకుండా మీరు చికిత్సలో భాగంగా తీసుకుంటున్న మందుల్ని   ఆపకండి , అలా చేస్తే అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది మరియు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా మారే ప్రమాదం ఉందని నిరూపించగలదు.
  • మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) చికిత్సకు ఎటువంటి ఆమోదిత ఔషధాలు లేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మధుమేహం (చక్కెరవ్యాధి) జబ్బు చికిత్సకు వాడే కొన్ని మందులు మరియు విటమిన్లు కాలేయ వాపు వ్యాధి చికిత్సకు కూడా సహాయపడతాయని సూచించిన ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఎటువంటి నిర్ధారణకు రావడానికి ముందుగా పరిశోధన అవసరం.

మద్యపాన కాలేయ వాపు వ్యాధి

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటేమిటంటే వారు మద్యపానాన్ని పూర్తిగా మానెయ్యాలి. మద్యపానాన్ని మానేయడానికి కష్టంగా ఉండేవారికి సహాయకారిగా ఉండే వేరే చికిత్స సిఫారసు చేయబడుతుంది, ఆ చికిత్స ద్వారా మద్యపానాన్ని మానుకోవచ్చు.  
  • మద్యం సేవించడాన్ని మానుకోవడానికి కొన్ని మందులు సహాయం చేస్తాయి. ఎలాగంటే ఈ మందులు తీసుకోవడం ద్వారా మద్యం పుచ్చుకోవాలన్న కోరిక తగ్గిపోతుంది. మద్యం త్రాగితే ఎదో జబ్బుపడినట్లుండే భావనను ఈ మండలి కల్గిస్తాయి.  

జీవనశైలి నిర్వహణ

మీరు కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, మీరు మీ దిననిత్యచర్యల్లో కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పరిస్థితి మెరుగై  మరింత ప్రభావవంతంగా జీవితాన్ని నిర్వహించడానికి వీలుంటుంది. అలాంటి జీవనశైలి మార్పులు కొన్ని ఏవంటే:

  • మీ ఆహారంలో 3-4 భాగాల తాజా పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం మానుకోండి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తృణధాన్యాలను మీ ఆహారంలోకి తీసుకోండి.
  • సంతృప్త కొవ్వులు మరియు క్రొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహార పదార్ధాలను తగ్గించి వాటి స్థానంలో ఆలివ్ ఆయిల్ వంటి ఏక అసంతృప్త కొవ్వులు మరియు బహుళఅసంతృప్త కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోండి, దీనివల్ల కాలేయ వాపు వ్యాధితో సంబంధం ఉన్న గుండె వ్యాధులు తగ్గే  అవకాశాలు ఉన్నాయి.
  • మీ బరువును అదుపులో ఉంచడానికి మరియు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • మీరు విటమిన్లు, లేదా ప్రత్యామ్నాయ మూలికా మందులు వంటివి ఆహార పదార్ధాలుగా తీసుకుంటుం టే, దాని గురించి మీ డాక్టర్తో మాట్లాడటం మరియు అతని/ఆమె సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మూలికా ఔషధాలు మీ కాలేయానికి హానిని కలిగిస్తాయి.
  • కాలేయం దెబ్బతిన్న వ్యక్తులు కొన్ని రకాల అంటువ్యాధులు మరియు “న్యుమోకోకల్” అనే ఒక విధమైన బాక్టీరియా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులు కామెర్ల జబ్బు (హెపటైటిస్ A మరియు B), ఫ్లూ మరియు న్యుమోకోకల్ వ్యాధులకు నిర్దేశింపబడిన టీకామందులు వేసుకోవడం ముఖ్యం. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులకు హెపటైటిస్ లేదా కామెర్ల వ్యాధి  చాలా ప్రమాదకరమైనది కావచ్చు మరియు ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు.

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ

రోగనిరూపణ

ఆరోగ్యకరమైన కాలేయానికి తనకు తానుగా (స్వయంగా) నయం చేసుకోగల గొప్ప సామర్ధ్యం ఉంటుంది, ఒకవేళ గాయపడినట్లయితే తిరిగి కోలుకుంటుంది, మరియు పునరుత్పత్తి కూడా చేసుకోగలదు. కాలేయ వాపు వ్యాధికి సకాలంలో రోగనిర్ధారణ జరిపి వెనువెంటనే చికిత్స చేసినట్లయితే కాలేయానికి అయిన హాని రూపుమాపబడి, రోగం మాయమైపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది అనేకమంది రోగుల విషయంలో నిరూపితమైంది. మనిషిలో కాలేయం దెబ్బ తినిందనడానికి మంట మరియు తంతీకరణం (ఫైబ్రోసిస్) అనేవి తొలి లక్షణాలు. ఈ ప్రారంభ దశలోనే కాలేయ వాపు వ్యాధి రోగ నిర్ధారణ అయినట్లయితే, మీ కాలేయం కొంతకాలంలోనే తనకు తానుగా నయం చేసుకోగలదు. ఇలా మన కాలేయం తనకు తానుగా రోగనయం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార మార్పులను చేసుకోవాల్సి  ఉంటుంది. కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం తక్కువగా ఉన్నట్లైతే తంతీకరణం (Fibrosis) తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాంతక కాలేయ వ్యాధి  (cirrhosis)గా   రూపాంతరం చెందుతుంది. కాలేయ వ్యాధి సిర్రోసిస్ దశలోకొచ్చినపుడు కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం  చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధికి చేపట్టే చికిత్స యొక్క లక్ష్యమంతా కొద్దిగా మిగిలున్న ఈ ఆరోగ్యకరమైన కాలేయకణజాలాన్ని రక్షించి వ్యాధి పురోగతిని నిలిపివేయడం పైన్నే ఉంటుంది.  

ఉపద్రవాలు

కాలేయ వాపు వ్యాధి యొక్క ముగింపు దశ కాలేయ వైఫల్యం (liver failure). కాలేయ వైఫల్యం ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి లేదా సిర్రోసిస్ కారణంగా లేదా పోషకాహారలోపం కారణంగా సంభవిస్తుంది. కాలేయ వైఫల్యం సిర్రోసిస్ వల్ల సంభవించినట్లయితే, కాలేయ వైఫల్యం నెమ్మదిగా ఉంటుందని వైద్యులంటారు. ఈ దశలో కాలేయపు పనితీరు నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి, క్షీణిస్తుంది. పోషకాహార లోపము వలన సంభవించే కాలేయ వైఫల్యం అకస్మాత్తుగా ఉంటుంది, అంటే కేవలం 48 గంల్లోపలే సంభవించవచ్చు. ఇటువంటి దశలో రోగికి కాలేయ మార్పిడి ఒక్కటే చికిత్స.

కాలేయ వాపు వ్యాధి అంటే ఏమిటి 

నేటి రోజుల్లో ఊబకాయం మరియు మధుమేహం అనేవి మనుషుల్లో పెరుగుతున్న కారణంగా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) అనేది సామాన్యమైపోతోంది. ఈ వ్యాధి భారతీయ జనాభాలో 9% నుండి 32% మందిని బాధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులు మరియు చక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులైన జనాభాకు మద్యపానేతర కాలేయ వాపు దాపురిస్తోంది. ఈ వ్యాధి వయసుపైబడ్డ వారిలో సాధారణం. భారతీయ జనాభాపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిందేమంటే, 61.8% మంది మద్యపానేతర కాలేయ వాపుబారిన పడ్డారని, ఈ రోగులందరూ 61 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్నారని.  మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి యొక్క నిర్వహణ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్న ఊబకాయులకైతే బరువు తగ్గించమని, శారీరక వ్యాయామాలను చేపట్టమని మరియు ఆహార మార్పులను అలవర్చుకొమ్మని, ఇంకా పలు జీవనశైలి మార్పులను  వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తారు. ఈ పరిస్థితికి సిఫార్సు చేసిన మందులు ఏవీ లేవు. అంతవరకూ వ్యాయామం జోలికెళ్లని ఈ వ్యాధి రోగులు ఏమాత్రం శారీరక వ్యాయామం చేసినా వారి పరిస్థితిలో ప్రయోజనకరమైన ప్రభావం రావడం కనబడింది. ఇంకా, ఏరోబిక్ వ్యాయామాలు, మరియు వ్యాధినిరోధకతలో శిక్షణ లేక ‘శక్తి శిక్షణ’ కూడా మద్యపానేతర కాలేయ వాపు రోగులకు సహాయకారిగా ఉంటాయి.

కాలేయవాపు వ్యాధి (లేక Fatty Liver Disease) అంటే ఏమిటి?

మానవుడి శరీరంలో కాలేయం అనేది చాలా పెద్ద అంతర్గత అవయవాల్లోఒకటి. కాలేయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, శరీరం నుండి శరీరజన్యవిషాన్ని మరియు ఇతర విషాల్ని తీసివేసి, మన శరీరంలో శక్తిని నిల్వ చేయడానికి మనకు సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు క్రమంగా నిర్మాణమవడమే “కాలేయ వాపుకు దారి తీస్తుంది. మన కాలేయంలో సాధారణంగానే  కొంత కొవ్వు ఉంటుంది అయితే ఇది ఎటువంటి వ్యాధి లక్షణాలను ఉద్భవించనీయదు. అయితే, కాలేయంలో ఉండే కొవ్వుకు తోడు అధికంగా కొవ్వు పేరుకుంటూ పోవడం కాలేయ వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే “కాలేయ వాపు వ్యాధి” గాను, “ఫాటీ లివర్ వ్యాధి” అని పిలువ బడుతుంది.

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రకాలు 

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రెండు ప్రధాన రకాలు:

  • మద్యపానేతర (నాన్ ఆల్కహాలిక్) కాలేయ వ్యాధి (NAFLD)
    మద్యపానేతర కాలేయ వ్యాధి-NAFLD, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల వస్తుంది గాని దీనికీ, మద్యం అధికంగా తీసుకోవడానికి సంబంధం లేని జబ్బు ఇది. మద్యపానేతర కాలేయవ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:

    • సాధారణ కాలేయ వాపు
      ఈ సాధారణ కాలేయ వాపు రకంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ, కాలేయ కణాలకు ఎలాంటి హాని ఉండదు. ఇలా కొవ్వు చేరడం వలన ఎటువంటి వాపు గాని, మంట గాని ఉండదు. ఈ పరిస్థితి సాధారణంగా కాలేయానికి ఎటువంటి హాని కలిగించదు మరియు ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టదు.  

    • నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
      ఈ రకం కాలేయ వాపు స్థితిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇంకా వాపు, కాలేయ కణాలకు నష్టం వాటిల్లుతుంది. వాపు, నొప్పితో కూడిన మంట మరియు కాలేయ కణ నష్టం అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఆ ఇతర ఆరోగ్య సమస్యలేవంటే కాలేయంలో వ్యాప్తి చెందే తంతీకరణం (fibrosis), మచ్చలు, ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis) మరియు కాలేయ క్యాన్సర్ వంటివి. (మరింత సమాచారం: సీస్టిక్ ఫైబ్రోసిస్ చికిత్స)

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధి
    మద్యపాన కాలేయ వాపు వ్యాధి (Alcoholic fatty liver disease) మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. మద్యం కాలేయంలో విచ్ఛిన్నం అవుతుంది మరియు కొన్ని హానికరమైన పదార్థాలను  విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన హానికారక పదార్థాలు కాలేయ కణాలను దెబ్బ తీస్తాయి మరియు వాపును ఎక్కువ చేస్తాయి. ఫలితంగా, శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఒక వ్యక్తి మితానికి మించి మరింత మద్యం సేవించడం కొనసాగినప్పుడు, కాలేయనష్టం పెరుగుతుంది.

కాలేయ వాపు వ్యాధి లక్షణాలు 

కాలేయ వాపు వ్యాధి ఒక నిశ్శబ్ద వ్యాధి మరియు ఏ ముఖ్యమైన లక్షణాలను బయటికి కనిపించనీయదు.  సాధారణ అలసట మరియు పొత్తికడుపు ఎగువ కుడి భాగంలో కొంచెం అసౌకర్యం కలుగజేసే స్థితి ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో ఉండవచ్చు. ఈ వ్యాధి వచ్చిందని గుర్తించేందుకు ఎక్కువమందిలో ఈ వ్యాధి లక్షణాలు గమనించదగ్గవిగా  కానరావు.

అయితే దీన్ని ఎపుడు గుర్తించవచ్చు అంటే వాపుతో కూడిన మంట మరియు కాలేయానికి నష్టం సంభవించినపుడు వాచిన కాలేయం సంకేతాలను చూపుతుంది, అప్పుడు మాత్రమే వ్యాధి పరిస్థితి లక్షణాలతో స్పష్టంగా కనబడుతుంది. అప్పటికే, ఈ లక్షణాలు “సిర్రోసిస్” పరిస్థితికి దారి తీసి ఉంటుంది. సిర్రోసిస్ అంటే కాలేయం యొక్క కణాల క్షీణత ఏర్పడి చెరిపేయలేని మచ్చలతో నష్టం కలగడమే. ఇది కామెర్లను పోలి ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి.   చర్మం మరియు కన్నుల్లోని తెల్ల కనుగుడ్లు వ్యాధి ఉనికిని సూచించే పసుపు రంగులోకి మారవచ్చు. రోగిలో కాలేయం దెబ్బతిన్నదన్న దానికి  మరొక సంకేతం “జలోదరం ” మరియు “ఎడెమా”, అనే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బ తినడంతో పాటు శరీరం యొక్క కణజాలంలో అసాధారణంగా ద్రవాలు చేరడం సంభవించిందన్నమాట.

భౌతిక పరీక్ష సమయంలో మీ డాక్టర్ కాలేయం బిర్ర బిగుసుకుపోయి ఉండడాన్ని గమనించవచ్చు. కాలేయం ఇలా బిర్రబిగుసుకు పోవడమనేది కాలేయం యొక్క “ఫైబ్రోసిస్” స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో కాలేయంపై  మచ్చలు కనబడవచ్చు.
కాలేయం దెబ్బతిన్న వ్యక్తికి కాలేయంలోనే కమిలిన గాయాలు ఎక్కువవడం జరిగి మానసిక గందరగోళాన్ని పెంచవచ్చు.

కాలేయ వాపు వ్యాధికి కారణాలు మరియు ప్రమాద కారకాలు - 

కారణాలు

మితం మించి మద్యపానం చేయడమే “మద్యపాన కాలేయ వాపు వ్యాధి” కి గల ప్రధాన కారణాలలో ఒకటి. మద్యం శరీరంలోనికి ప్రవేశించాక ‘శరీరజన్య విషం’గా మారి కాలేయం వాపుకు, మంటకు కారణమవుతుంది. కాని మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు (Non-alcoholic fatty liver disease-NAFLD)కు  ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కాలేయంలో కొవ్వు కణాలు పోగటానికి ఎన్నో కారణాలు. ఈ కారణాల్లో ఎదో ఒక కారణం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు-NASH దాపురించవచ్చు.

  • ఆహారం 
    అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరడం జరుగుతుంది. కనుక, అనారోగ్య ఆహారం కాలేయ వాపు వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. అధికమైన కేలరీలు గల ఆహారం  తీసుకోవడం మూలంగా కాలేయం కొవ్వు కణాలపై చయాపచయ క్రియను నిర్వహించడంలో విఫలమై కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
  • ముందుగానే ఉన్న వ్యాధులు
    రెండో రకం డయాబెటిస్ (Type 2 diabetes), ఊబకాయం లేదా అధిక బరువు వంటి కొన్ని వ్యాధులు, కాలేయ వాపు పరిస్థితికి ఒక వ్యక్తిని మరింత ప్రభావితం చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయి, కొవ్వు కణాల్లోనే ఒక నిర్దిష్ట రకమైన కొవ్వు కణాలు ఎక్కువవడం కూడా కాలేయ వాపు వ్యాధికి గురి చేస్తాయి.  
  • మందులు
    టామోక్సిఫెన్, అమోడియోరోన్ మరియు మెతోట్రెక్సేట్ వంటి కొన్ని ఔషధాలు ఈ వ్యాధి పరిస్థితికి దారితీసే దుష్ప్రభావాలకు కారణమవుతాయి.
  • ఇన్సులిన్ నిరోధకత
    ఇన్సులిన్ నిరోధకత మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి అనుసంధానం కావచ్చనే  సూచనలు ఉన్నాయి. కాలేయంలో గ్లూకోజ్ను చయాపచయం (metabolise) చేయడంలో అందులోని కణాలు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను తగినంతగా ఉపయోగించుకోలేక పోవడం మూలంగా కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

ప్రమాద కారకాలు

మద్యపానేతర కాలేయ వ్యాధి (NAFLD)కి ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట జాతి నేపథ్యాలతో ఉన్నవారు కాలేయ వాపుకు ఎక్కువగా గురయ్యే పరిస్థితి ఉంది, అంతే గాక ఈ వ్యాధి వారికి మరింత ఎక్కువగా దాపురించే ప్రమాదముంది.  రెండో రకం మధుమేహం (Type 2 diabetes) లేదా ప్రీ-డయాబెటీస్ స్థితి, ఊబకాయం, వయసు మళ్లినవారు, రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ వంటి అధిక స్థాయి కొవ్వు, అధిక రక్తపోటు, కొన్ని క్యాన్సర్ మందులు, హెపటైటిస్-సి వంటి అంటురోగాలు మరియు శరీరజన్య విషపదార్థాలకు గురికావడం వంటి పరిస్థితులు కాలేయవాపు వ్యాధికి దగ్గరయ్యే అవకాశాలను పెంచుతుంది.

ఫ్యాటీ లివర్‌ కొరకు మందులు

Medicine NamePack Size
BiohepBiohep Tablet
NormatoneNormatone Syrup
HysinHysin Syrup
B LivB Liv Tablet
ADEL 79 Ferrodona TonicADEL 79 Ferrodona Tonic
LetarteLetarte Sachet
LoleptLolept Granules

కాలేయము సమస్య కు ఆయుర్వేదం నవీన్ సలహాలు 



              కాలేయాన్ని శుభ్రపరచడానికి --- భ్రుంగరాజ రసాయనం                   1-1-2009.
 
గుంటగలగర  ఆకును  కాటుక ఆకు అని కూడా అంటారు.
 
    పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున (ఆదివారమైతే మరీ మంచిదిమొక్కలను తెచ్చుకోవాలి.
 రోజు మొక్కలలో ఔషధ శక్తి చాలా రెట్లు పెరుగుతుందిగుంటగలగరతెల్లగలిజేరు మొక్కలను తెచ్చి కడిగి వేర్వేరుగా ఎండబెట్టాలివారంపది రోజులు ఎండ బెట్టాలి.
 
గుంటగలగర పొడి                 ------100 gr
తెల్ల గలిజేరు పొడి                 ----- 100 gr
వేయించిన నువ్వుల పొడి      ------ 100 gr
కలకండ పొడి                      ------ 100 gr
 
     మధుమేహ వ్యాధి గ్రస్తులు తాటి బెల్లం వాడవచ్చుఅన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి
గాజు  సీసాలో భద్రపరచుకోవాలి.
         రాత్రి ఆహారానికిఒక గంట ముందు మూడు చిటికెల పొడిని తీసుకోవాలి .తేనెతో కూడా
తీసుకోవచ్చుఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుందిమరియు వెంట్రుకలు శాశ్వతంగా నల్లబడతాయి.

                             కాలేయ సమస్యలకు ఆహార ఔషధం                   

తెల్ల గలిజేరు            --100 gr
నేల ఉసిరి                --100 gr
గుంటగలగర            --100 gr

       అన్నింటిని సమూలముగా తెచ్చి కడగి ఎండబెట్టి విడివిడిగా దంచి పొడి చెయ్యాలికలిపి
సీసాలో భద్ర   పరచుకోవాలి.

 పొడిని భోజనానికి ఒక గంట ముందు పావు టీ స్పూను నుండి అర టీ స్పూనుకు పెంచుతూ ఒక కప్పుమంచి నీళ్ళలో కలిపి సేవించాలిగంట ముందు గంట వెనుక ఏమి తినకూడదు.

ఉదయంసాయంత్రం రెండుపూటలా వాడాలి.

కాలేయ సమస్యలు రాకుండా  పొడిని ఆకుకూరలుపప్పుసామ్బారులలో మూడు చిటికెల పొడిని  వేసుకొని తినాలి.

                             లివర్ లేదా కాలేయ సమస్యల నివారణ             

1. చంద్రభేదన ప్రాణాయామం

2. శీతలి ప్రాణాయామం:-- మోకాళ్ళ మీద కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలి పీల్చి
 నోరు మూసి ముక్కుతో గాలి వదలాలి.

3. మోకాళ్ళ మీద గానిలేదా పద్మాసనం  లో గాని కూర్చొని పై దవడ పళ్ళనుకింది దవడ పళ్ళను కలిపి నొక్కిఆరోగంగా కాలేయం పెదవులను తెరిచి పళ్ళ మధ్యనుండి గాలిని పీల్చి నోరు మూసి ముక్కు నుండి గాలి వదలాలి.

   50 గ్రాముల శనగలను గుగ్గిళ్ళ లాగా ఉడికించి వాటి మీద కొద్దిగా సైంధవ లవణం చల్లాలిమరో 50గ్రాముల శనగలను  కొద్దిగా నెయ్యి వేసి వేయించి సైంధవ లవణం చల్లాలి.

      ఉడికించిన శనగలను ఉదయం పరగడుపున తినాలి. 15 నిమిషాల తరువాత వేయించిన
శనగలను తినాలి

పులుపుఎక్కువ కారంమద్యంసిగరెట్మాంసంచేపలుగుడ్లు వంటివి మానెయ్యాలి.

                                       కాలేయ సమస్యలు --- నివారణ                 

పచ్చి శనగలను నానబెట్టి ఉడికించాలి (గుగ్గిళ్ళు)

శనగ గుగ్గిళ్ళు ----- 50 gr

       శనగలను మెత్తగా ఉడికించి వాటి పై సైంధవ లవణాన్ని చల్లాలివీటిని ఉదయం పరగడుపున తినాలి. విధంగా ఉదయం పరగడుపున రోజుకు 50 గ్రాముల గుగ్గిళ్ళ చొప్పున 15 రోజులు తినాలిఒక గంట వరకుఏమి  తినకూడదు.

      15 రోజుల తరువాత ఇంకొక 50 గ్రాముల శనగలను వేయించుకొని తినాలిఅనగా గుగ్గిళ్ళు మరియు   వేయించిన శనగలను 16  రోజు నుండి 30  రోజు వరకు తినాలి.

 30 రోజులు పూర్తిగా కారాన్ని నిషేధించాలి.

            బహిష్టు సమయంలో వచ్చే కాలేయ సమస్యలు--- నివారణ             

             మురికి రక్తం నిల్వ వుంటే ఆకలి మందగించి కాలేయ సమస్యలు వస్తాయి.

మట్టి పట్టి వెయ్యాలి.

పొట్ట మీద కుడి వైపు ప్రక్కటెముకల కింద పట్టి వేసి గాలి తగలకుండా దుప్పటి కప్పి ఉంచాలి.

1. వెల్లకిలా పడుకొని మోకాలును గడ్డానికి ఆనించాలికాలును చాపాలి మరలా ఆనించాలిరెండవ కాలుతోనుఅలాగే చేయాలి వ్యాయామాన్ని వేగంగా చెయ్యాలి.

2. నిటారుగా నిలబడి చేతులనుముందుకు చాపి కాళ్ళు కదిలించకుండా పక్కలకు తిరగాలి.

3. నిటారుగా నిలబడి చేతులను ముందుకు చాపి వంగిఎడమ చేతితో కుడికాలి బొటన వ్రేలునుకుడిచేతితోఎడమ కాలి బొటన వేలును తాకాలిదీనిని వేగంగాచేయ్యాలి.

జటామాంసి   ---- 50 gr
తుంగ గడ్డలు ---- 50 gr

రెండింటిని విడివిడిగా దంచి వస్త్రగాయం పట్టి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
అర టీ స్పూను పొడిని అర కప్పు నీటిలో కలుపుకొని తాగాలి.
10 నుండి 20 రోజులు వాడితే చాలుదీని వలన కాలేయముపిత్తాశయము శుభ్రపడతాయివంటలలో
నల్లగా మాడిన ప్రతి పదార్ధము కాలేయానికి హాని కలిగిస్తుంది.
తాజాగా వున్న ఆకు కూరలుకాయగూరలు వాడాలి.

                         కాలేయముపై కొవ్వు చేరడం (Fatty Liver)                
ఇది రెండు రకాలు :--

1 Alcoholic Fatty Liver :-- మద్య పానము వలన కాలేయముపై కొవ్వు చేరడం వచ్చే వ్యాధి.
2. Non Alcoholic Fatty Liver :-- శరీరములోని ఇతర భాగాలనుండి కొవ్వు కాలేయానికి చేరడం వలన వచ్చే వ్యాధి

కటుకరోహిణి                    --- 50 gr
శొంటి                             --- 50 gr
పిప్పళ్ళు                        --- 50 gr
మిరియాలు                    --- 50 gr
ఉసిరిక పెచ్చులు             ----50 gr

కాలేయ వ్యాధులకు కటుకరోహిణి దివ్య ఔషధం "   పరిశోధన చేయబడినది.

     అన్నింటిని విడివిడిగా దంచిజల్లించిచూర్ణాలు చేయాలి అన్ని చూర్ణాలు సమానముగా
తీసుకుని   కలిపి నిల్వ చేసుకోవాలి.

    అర టీ స్పూను నుండి ఒక టీ స్పూను వరకు ఉదయంమధ్యాహ్నంసాయంత్రం వేడి నీటితో ఆహారానికి   అరగంట ముందు తీసుకోవాలి.

 ఔషధము వ్యాధిని నియంత్రిస్తుంది( preventive) , నివారిస్తుంది ( curative)

                               కాలేయ సమస్యలు-- నివారణ                    

      కాలేయం మన శరీరంలో  కాలేయము 500 రకాల పనులను నిర్వహిస్తుంది,

జలోదర సమస్యకామెర్లు మొదలైనవి తీవ్రమైతే  చనిపోయే ప్రమాదం వున్నది.  
      ఈ సమస్య దురలవాట్ల వలన వచ్చే అవకాశం ఎక్కువ.

గుంటగలగర    పొడి             --- 100 gr
నేల ఉసిరి        పొడి             --- 100 gr
కటుక రోహిణి    పొడి             --- 100 gr
గలిజేరు వేర్ల    పొడి              --- 100 gr
త్రికటు         చూర్ణం             --- 100 gr
పిప్పళ్ళ       చూర్ణం             --- 100 gr

      అన్ని చూర్ణాలను  కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టాలి.  బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

       పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయంసాయంత్రం తగినంత తేనెతో సేవించాలి.

   మధుమేహం వున్నవాళ్ళు నీటితో చూర్ణాన్ని ముద్దగా  చేసుకుని మింగాలి.

 విధంగా సంవత్సరంలో రెండు నెలలు వాడితే ఎలాంటి కాలేయ సమస్యలు రావు.
 
                          కాలేయం  ఆరోగ్యంగా  ఉండాలంటే                    
 
   దవనాన్ని ఎండబెట్టి దంచి పొడి  చేసి  నిల్వ చేసుకొవాలి.
   ప్రతి రోజు అర టీ స్పూను పొడి ని నీటిలో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా
   వుంటుంది .  

        దవనాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటితో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా వుంటుంది.


                                        కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే               
 
కృష్ణ తులసి ఆకులను గోలీ అంత ముద్ద చేసి తగినంత తేనె కలిపి ప్రతి రోజు తీసుకుంటూ
వుంటే కా

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


2, మార్చి 2021, మంగళవారం

రోజు సరిగా నిద్ర పట్టడంలేడా నిద్ర సమస్యకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా ఈ లింక్స్ లో చూడాలి


నిద్ర పట్టడం లేదు మేలుకో వచ్చుంటే నిద్ర పాటు తలనొప్పి వస్తుంది దీనికి మంచి పరిష్కారం నవీన్ నడిమింటి సలహాలు 

 , Sleep

 


నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము . నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగు తుంది . . . కలతపడ్డ మనసు కుదుట పడుతుంది . చాలినంత నిద్రలేక పోతే అది చాలా రుగ్మతల్కు దారి తీస్తుంది . మనసు మీద ప్రభావము చూపుతుంది . శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి.


ఎన్ని గంటలు నిద్రపోవాలి

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.


  • వయసు ---------రోజుకు కావలసిన సగటు నిద్ర
  • పురిటిబిడ్డ -------సుమారు 18 గంటలు
  • 1–12 నెలలు--------------14–18 గంటలు
  • 1–3 సంవత్సరాలు---------12–15 గంటలు
  • 3–5 సంవత్సరాలు ---------11–13 గంటలు
  • 5–12 సంవత్సరాలు ---------9–11 గంటలు
  • యువకులు -----------------9-10 గంటలు
  • పెద్దవారు --------------------7–8 గంటలు
  • గర్భణీ స్త్రీలు -----------------8 (+) గంటలు

ప్రయోజనం

  • నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
  • నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
  • హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
నిద్రలో దశలు :
రాత్రి నిద్రపోయే సమయాన్ని రెండు రకాలుగా గుర్తిస్తారు. " రెమ్‌ " , "నాన్‌ రెమ్‌"  అని .
రెమ్‌ అంటే " రాపిడ్ ఐ మూవ్ మెంట్ " అనేదానికి సంక్షిప్త నామము . ఇందులో నాలుగు దశలుంటాయి.  
1. తొలి దశ 5 నిముషాలే . ఇది నిద్రలోకి వెళ్ళేదశ . కనురెప్పలు కింద కళ్ళు కదులుతూ ఉంటాయి. ఈ దశలో చిన్న శభ్దానికైనా వెంటనే మెలకువ వస్తుంది .
 
నిద్ర లేమి :
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :
  • దైనందిన జీవితం లో పని వత్తిడి ,
  • మానషిక వత్తిడి ,
  • టీవీ చూడడం ,
  • కంప్యుటర్ పై పనిచేయడం ,
  • కుటుంబ సమస్యలు ,
  • ఆర్ధిక సమస్యలు ,
  • ఆహార నియమాలు ,
  • చెడ్డ అలవాట్లు ,

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :
  • రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
  • రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
  • నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

    • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
    • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

    • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

    • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ట్రీట్మెంట్ :
  • అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .
నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :

నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...


* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

రాత్రిపూట గాఢనిద్ర తగ్గితే--పురుషులకు గుండె జబ్బులే!

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషులు రాత్రివేళ గాఢ నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో మధ్యమధ్యలో నిద్ర లేవడం పురుషుల్లోనే అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్నిసార్లు తమ సొంత గురకవల్లే నిద్ర లేస్తారని చెప్పారు. ఫలితంగా నిరంతరాయ నిద్ర సమయం తగ్గిపోతుందని వివరించారు. అంతరాయాలులేని నిద్ర తక్కువగా ఉండేవారిలో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదిగుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా 65ఏళ్లు పైబడ్డ 784మంది పురుషుల నిద్ర అలవాట్లను పరిశీలించారు. రాత్రిళ్లు చాలా తక్కువగా గాఢనిద్ర పోయేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది.

ఏడు గంటల నిద్ర చాలు : 
ఆరు , ఏడు , ఎనిమిది ... ఎన్ని గంటల నిద్ర అవసరము ? ... అని ప్రశ్నించుకుంటే ఏడు గంటల గాడనిద్ర అని చెప్పుకోవాలి. 7 గంటలకంటే తక్కువ  లేదా ఎక్కువ నిద్ర పోతే గుండే జబ్బులు వచ్చే ఆస్కారము ఎక్కువ అని పరిశోధనలలో గుర్తించారు . ఈ నియమము 20 సంవత్సరాలు దాటినవారికే.

Extra sleep is good,అదనపు నిద్ర మంచిదే!

అతిగా నిద్రపోవటమనేది మంచి అలవాటేమీ కాదు. కానీ తక్కువ సమయం నిద్రపోయేవారు అదనంగా రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోవటం మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చురుకుదనం మాత్రమే కాదు.. నొప్పిని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తగినంత నిద్రపోనివారు మరింత ఎక్కువసేపు నిద్రపోతే నొప్పి తీవ్రత తగ్గటానికి దోహదం చేస్తోందని అమెరికాలోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన థామస్‌ రోథ్‌ పేర్కొంటున్నారు. దీర్ఘకాల వెన్నునొప్పి వంటి అన్నిరకాల నొప్పులపైనా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. ఒకవేళ ఇప్పటికే 8 గంటల సేపు నిద్రపోతుంటే మాత్రం మరింత నిద్ర అవసరం లేదని గుర్తించాలని వివరిస్తున్నారు. ఇంతకీ నొప్పికి, నిద్రలేమికి సంబంధం ఏంటి? ఈ రెండూ శరీరంలో వాపు సంకేతాల స్థాయులను పెంచుతాయని.. అందువల్ల మరింత ఎక్కువ నిద్రపోవటం వాపు తగ్గేందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ------ source : Medicine update (magazine).

  • జ్ఞాపకశక్తికి నిద్రే మందు!
ఎంత చదివినా గుర్తుండటం లేదా? అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను, ఎదురైన సంఘటనలను బలమైన జ్ఞాపకాలుగా పదిల పరచుకోవటానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. గత జ్ఞాపకాలతో కొత్తవాటిని కలపటానికీ, సృజనాత్మక ఆలోచనలు పుట్టుకురావటానికీ దోహదం చేస్తుంది. ఇంతకీ నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని జ్ఞాపకాలు ఎలా స్థిరపడతాయి? నిద్ర సరిగా లేకపోతే నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? వీటిని పసిగట్టేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచటానికి, వృద్ధుల్లో మతిమరుపును తగ్గించటానికి కొత్త పద్ధతులను రూపొందించటంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

మనం నిద్రపోతున్నప్పుడు తేలికైన నిద్ర, గాఢనిద్ర, కంటి కదలికలు వేగంగా ఉండే (రెమ్‌) నిద్ర వంటి దశలుంటాయి. సాధారణంగా రెమ్‌ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలన్నీ క్రమంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి ఏర్పడుతుంటాయి. విషయాలను నేర్చుకోవటంలో రెమ్‌ దశ చాలా కీలకపాత్ర పోసిస్తుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే నేర్చుకునే సామర్థ్యమూ 40% వరకు పడిపోతుంది. కొత్త జ్ఞాపకాలు స్థిరపడేందుకు తోడ్పడే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ఆయా సంఘటనల వారీగా మెదడులో కొత్త జ్ఞాపకాలు పోగుపడుతుంటాయి. వీటిలో చాలావరకు మరచిపోతుంటాం కూడా. జ్ఞాపకాలు తొలిసారి ఏర్పడినప్పుడు అంత బలంగా ఉండవు. చాలా అపక్వంగా, సున్నితంగా ఉంటాయి. కానీ నిద్ర పోయినప్పుడు వాటిని నెమరువేసుకోవటానికి మెదడుకు తగినంత సమయం దొరుకుతుంది. ఏయే సంఘటనలను గుర్తుంచుకోవాలో, వేటిని వదిలించుకోవాలో కూడా నిర్ణయించుకుంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు జ్ఞాపకాలు బలోపేతమవుతాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌ చెబుతున్నారు. పియానోపై మంచి గేయాన్ని వాయించటం వంటి కొన్ని పనులకు సంబంధించిన జ్ఞాపకాలు నిద్రపోతున్నప్పుడు మెరుగుపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. గాఢనిద్ర దశలో జ్ఞాపకాలు మరింత స్థిరంగా కొనసాగుతాయి. రెమ్‌ దశలోనేమో ఈ జ్ఞాపకాల్లో ఒకదాంతో మరోదానికి సంబంధం గల వాటి మధ్య బంధాలు ఏర్పడతాయి. భావోద్వేగ జ్ఞాపకాల విశ్లేషణకూ రెమ్‌ దశ తోడ్పడుతుంది. దీంతో భావోద్వేగాల తీవ్రతా తగ్గుతుంది.

నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ నిద్రా పద్ధతులు కూడా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు 30 ల చివర్లో బలమైన జ్ఞాపకాలకు తోడ్పడే నిద్ర తగ్గిపోవటం మొదలవుతుంది. 18-25 ఏళ్ల వారితో పోలిస్తే 60 ఏళ్లు పైబడినవారిలో గాఢనిద్ర 70% వరకు తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ముందురోజు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇందుకు గాఢ నిద్ర తగ్గిపోవటంతో సంబంధం ఉంటోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ పేర్కొంటున్నారు. అందువల్ల వృద్ధుల్లో గాఢనిద్రను పెంచటానికి తోడ్పడే పద్ధతుల మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంపొందించే చికిత్సలు అంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా పట్టే చికిత్సలు రూపొందిస్తే గణనీయమైన ఫలితాలు కనబడతాయని వాకర్‌ చెబుతున్నారు. యువకులు కూడా ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకున్న తర్వాత రాత్రిపూట నిద్రపోతే మంచి ఫలితాలు ఉంటాయని, ఆయా విషయాలు బాగా గుర్తుండటానికిది తోడ్పడుతుందని స్టిక్‌గోల్డ్‌ సూచిస్తున్నారు.

చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

  • స్త్రీ-పురుషుల నిద్ర వేరువేరుగా ఉంటుందా?
నిద్ర.. స్త్రీ పురుషులకి సమానమేనా? ఇంత వరకూ అలాగే భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు! అయితే నిద్ర పద్ధతీ, మోతాదూ, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులకి వేర్వేరని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాకి చెందిన ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త మోనికా మల్లంపల్లి నేతృత్వంలోని సొసైటీ ఫర్‌ విమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (ఎస్‌డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఈ పరిశోధన నిర్వహించింది. మగవారికంటే మహిళల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉందని ఇందులో తేల్చారు. పురుషుల కంటే స్త్రీలు నిద్రలోకి జారుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోందని కనిపెట్టారు. పగటివేళ మగతగా ఉందనే ఫిర్యాదూ ఎక్కువగా మన నుంచే ఎదురవుతోందట. వీటన్నింటికీ మహిళల్లోని ప్రత్యేక హార్మోన్ల ప్రభావమే కారణమని చెబుతున్నారు. నెలసరికి ముందూ, నెలసరప్పుడూ స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారట. పెళ్లయ్యాక గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలూ, వీటికి తోడు ఇల్లూ, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని పరిశోధన తేల్చింది. పురుషులకు ఇటువంటి సమస్యలు ఎప్పుడో కానీ ఉండవనీ అంటోంది. 'నిద్ర విషయంలో స్త్రీలకు ఇన్ని సమస్యలున్నా, ఇంతవరకూ దానిపై ప్రత్యేకంగా ఆశించినంతగా ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిద్రలేమి పరీక్షలన్నీ కూడా పురుషుల నిద్ర తీరుల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు' అంటున్నారు అధ్యయన

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి
     విశాఖపట్నం
 ఫోన్ -9703706660

1, మార్చి 2021, సోమవారం

దంతాలు నొప్పి నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి

దవడ పంటి నొప్పి అంటే  ఏమిటి?

దవడ మరియు దాని దంతాల చుట్టూ ఉండే నొప్పి దవడ పంటి నొప్పిని సూచిస్తుంది. ఇది సాధారణంగా దంత క్షయం వలన సంభవిస్తుంది. దవడ పళ్ళు (మొలార్ పళ్ళు) నోటి వెనుక భాగంలో ఉంటాయి. నాలుగు మోలార్ (దవడ) పళ్ళు, ఉంటాయి రెండు పై దవడలో మరియు రెండు కింద దవడలో ఉంటాయి. కొందరు వ్యక్తులలో తక్కువ మోలార్ (దవడ) పళ్ళు/దంతాలు ఉంటాయి లేదా అసలు ఉండవు. కొందరు వ్యక్తులలో, మోలార్ పళ్ళు ఒక కోణంలో అభివృద్ధి చెందుతాయి, అవి చుట్టుపక్కల ఉన్న పళ్ళను/దంతాలను లేదా పంటి చిగురును పక్కకు తోసేస్తాయి. ఈ ప్రక్రియ చాలా బాధాకరముగా ఉంటుంది, మరియు ఆ పంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కష్టం అవుతుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పితో ముడి పడి ఉన్న ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • మోలార్/దవడ పంటి దగ్గర ఉండే దవడ భాగం బిరుసుగా మారిపోవడం లేదా నొప్పిగా ఉండడం
  • మింగడంలో కష్టం, పళ్ళు తోమడం మరియు నోరు తెరవడంలో కష్టం
  • దంత క్షయం
  • పళ్ళ మీద పళ్ళు ఏర్పడడం
  • చిగుళ్లలో చీము ఏర్పడడం
  • మోలార్ పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ల యొక్క ఇన్ఫెక్షన్ లేదా వాపు
  • చెడు శ్వాస
  • అశాంతి
  • జ్ఞాన దంతాలు మరియు వాటి పక్కన ఉండే దంతాల మధ్య ఆహారం మరియు బాక్టీరియా చేరడం
  • లింఫ్ నోడ్లలో (శోషరస కణుపులలో) వాపు
  • పళ్ళు తప్పు కోణంలో పెరగడం వలన నాలుక, చెంప, నోటిలో పైన లేదా కింద నొప్పి లేదా చికాకు
  • చిగుళ్ల వ్యాధి
  • జ్వరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పి యొక్క ప్రధాన కారణాలు:

  • డెంటల్ పల్ప్ (dental pulp, పంటి లోపలి పొర) లో వాపు
  • పంటి కురుపులు (పంటి మధ్యభాగంలో బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్టేడ్ పదార్దాల యొక్క చేరిక)
  • చిగుళ్ళ పరిమాణం తగ్గిపోవడం ఇది మోలార్/దవడ పళ్ళ మూలలను సున్నితముగా చేస్తుంది
  • పరిశుభ్రత లేకపోవడం
  • చీము ఏర్పడటం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దంతవైద్యులు పంటి చెక్-అప్/తనిఖీ ద్వారా దవడ దంతంలో నొప్పిని నిర్ధారింస్తారు మరియు నిర్వహించడం మరియు ఎక్స్- రే ఆధారంగా ఏ మోలార్ పంటి వలన నొప్పి సంభవిస్తుందో గుర్తిస్తారు.

దవడ పంటి నొప్పికి ఈ కింది పద్ధతుల ద్వారా చికిత్స జరుగుతుంది:

  • ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారుణులు (పెయిన్ కిల్లర్స్)
  • యాంటిబయోటిక్స్
  • ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాలను శుభ్రపరచడం
  • పన్ను తీవ్రంగా పాడయినట్లైతే పన్ను పీకివేయడం
  • వెచ్చని ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం
  • రూట్ కెనాల్ (Root canal)
దవడ పంటి నొప్పి కొరకు మందులు
Medicine NamePack Size
Oxalgin DPOxalgin DP Tablet
Diclogesic RrDiclogesic RR Injection
DivonDivon Gel
VoveranVoveran 50 GE Tablet
EnzoflamEnzoflam SV Tablet
DolserDolser Tablet MR
Renac SpRenac Sp Tablet
Dicser PlusDicser Plus Tablet
D P ZoxD P Zox Tablet
Unofen KUnofen K 50 Tablet
పంటి నొప్పి  నివారణకు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు అవగాహనా కోసం మాత్రమే 

నేటి సమాజంలో మనం తినే చిరుతిళ్లకు పండ్లు పాడై పోవడమో లేక పండ్లకు సంబంధించిన వ్యాధులు రావడమో సర్వ సాధారణంగా మారింది. నూటిలో తొంబై శాతం మంది పంటి నొప్పి తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తీపి పదార్థాలు తినడం సరిగా బ్రష్ చేసుకోక పోవడం వంటివి. పంటి నొప్పిని తట్టుకోలేక ఏమి తినలేక తీవ్ర యిబ్బందులు ఎదురౌతూ ఓర్చుకోలేనంత బాధలు పడుతున్న పరిస్థితి. మనం తినే తీపి పదార్థములు పిండి పదార్థాలతో పంటిపై గారలు ఏర్పడతాయి. వాటిలో సూక్ష్మ జీవులు చేరతాయి. వీటి వలన ఏనుగు దంతము వలె గట్టిదైన పంటి పైనున్న ఎనామిల్ పాడవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం పిప్పళ్ల వంటివి ఏర్పడి ఏమి తినకుండా నొప్పి కలగడం జరుగుతుంది. అంతేకాక పంటి నరాలకు దంతమూలాలకు చేరి పళ్లను పాడుచేస్తాయి.

మరి ఈ పంటి నొప్పి వెంటనే తగ్గడానికి తీసుకోవల్సివ జాగ్రత్తలు, చిట్కాలు ఏంటో చూద్దాం.

 వెల్లుల్లి, లవంగం ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే కొద్ది సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ వలన ఎప్పటి నుండో ఉన్న నొప్పి కూడా తగ్గి పోతుంది.

పంటి నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఒక నాలుగు, ఐదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది. యిది మంచి చిట్కా.

  కాగితపు టవల్ పైన విక్స్ లేదా అమృతాంజన్ ను రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంతంలో చర్మం పై కాసేపు ఉంచినట్లైతే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

  దంత శుద్దికి, పంటి నొప్పికి గోధుమ గడ్డి రసం ను ఉపయోగిస్తారు. యిది చక్కని ఆయుర్వేదంలా పనిచేసి దంత క్షయాన్ని నొప్పిని నివారిస్తుంది.
 
 పంటి నొప్పి ఉన్న దంత భాగంలో ఐస్ క్యూబ్ పెడితే నొప్పి తగ్గిపోతుంది.
 
 చిగుళ్ల వాపు మరియు నొప్పి తగ్గుటకు మిరియాల పొడిని దంత మంజన్ లా వాడి పళ్లపై రుద్దితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
 
 చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. యిది చాలా మంచి అలవాటు అంటున్నారు వైద్యులు. ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే పంటి నొప్పి తగ్గిపోతుంది. నమలడం యిబ్బంది అనుకుంటే అప్పుడే కోసిన ఉల్లిముక్కని నొప్పి దగ్గర పెడితే నొప్పి మాయం అవుతుంది
 
 ఇక పొద్దున రాత్రిపూట క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పంటి సమస్యలతో బాధ పడేవారు రెండు పూటలా బ్రష్ చేయాలి.

  ఈ చిన్న చిట్కాలను పాటించి పంటి నొప్పిని తగ్గించుకోండి. ఏదైనా తిన్నపుడు నోటిని పరిశుభ్రం చేసుకోవాలి .

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

 విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.