14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయితే ఏమి జరుగుతుంది


ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?అవగాహనా కోసం సలహాలు 

నవీన్ నడిమింటి తో ఇంటర్వ్యూ

 ప్రశ్న : ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం సాధ్యమేనా?
జవాబు : నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధి పరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయం సాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో ఏ పనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తి చేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే. ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవి మనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా. అయితే, ఈ ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్‌గా మారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగా ఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి. ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడి ఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.


ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తులలో శారీరక లక్షణాలు ఎలా ఉంటాయి?
జవాబు :  ముఖ్యంగా ఊపిరి వేగంగా తీసుకోవడం, ఒక క్రమపద్ధతిలో శ్వాస తీసుకోలేక అసహనంగా కనిపించడం, దవడ కండరాలు బిగుసుకు పోవడం, మెడ కండరాలు బిగుసుకోవడం, మైగ్రేన్‌, టెన్షన్‌కు తరచుగా లోను కావడం, తల దిమ్ముగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కడుపులో గందరగోళ పరిస్థితులు ఏర్పడడం, కండరాలు బిగుసుకుపోవడం, జీర్ణశక్తి మందగించడం, కనుపాపలు పెద్దవి కావడం, పళ్లు బిగపట్టడం ఇలాంటి లక్షణాలను శారీరకంగా గుర్తుపట్టవచ్చు.   

ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తిలో మానసికంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి?
జవాబు : ఎక్కువకాలం స్ట్రెస్‌కు లోనయ్యే వ్యక్తుల్లో ముఖ్యంగా ఏకాగ్రతా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఏ పనిపట్లా శ్రద్ధ పెట్టలేరు. నిశితంగా పరిశీలించే శక్తి, సావధానంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. విశ్లేషణా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా తమలోని మానసిక శక్తిని తక్కువగా వినియోగించుకునే స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యక్తి యొక్క ప్రతిస్పందన వేగం అనూహ్యంగా పతనమవుతుంది. ఒక సమస్య పరిష్కరించుకునే సందర్భంలో తగిన ప్రతిస్పందన పొందడం తక్కువ స్థాయిలో జరుగుతుంది. తద్వారా మానసిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, తమకు తామే సమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వస్తారు. తరచుగా తప్పులు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విమర్శనాశక్తి లోపించడం, ఆలోచనల్లో గందరగోళం ఏర్పడడం, వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోవడం, తరచుగా కోపగించుకోవడం జరుగుతుంది. మానసికంగా అలిసిపోవడం, ఇతరులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, తరచుగా ఇతరులను నిందించడం, ఒక్కోసారి తనను తాను నిందించుకోవడం, మానసికంగా స్థిరంగా లేకపోవడం, సమయపాలన లోపించడం లాంటి లక్షణాలను గమనించవచ్చు.

ప్రశ్న : ఉద్వేగానికి సంబంధించిన మార్పులు ఎలా ఉంటాయి?
జవాబు : స్ట్రెస్‌కు లోనైనప్పుడు మానసికంగా, శారీరకంగా తన భద్రతను కాపాడుకునే సందర్భంలో శరీరంలోని కండరాలు బిగుసుకుపోతాయి. బాగా టెన్షన్‌ ఫీల్‌ అవుతారు. సహజంగా భయాందోళనలు తగ్గిపోగానే శరీరం మామూలుగా రిలాక్స్‌ అయిపోతుంది. కానీ దీర్ఘకాలం స్ట్రెస్‌కు గురవుతూ ఉంటే రిలాక్స్‌ అయ్యే సామర్ధ్యం తగ్గిపోతుంది. ఉద్వేగపరంగా అదుపు తప్పి కోపం, ద్వేషం లాంటి సమస్యలు ఏర్పడతాయి. తమకు ఏర్పడే పరిస్థితులను ప్రభావితం చేయగలగడం, వివిధ సందర్భాల్లో వాటిని నియంత్రించే సామర్ధ్యం తగ్గిపోతుంది. తరచుగా యాంగ్జైటీకి, భయాందోళనలకు లోనవుతుంటారు. అభద్రతా భావన, నిస్సహాయత, చనిపోతానేమోననే భయం, చికాకు, కోపం, డిప్రెషన్‌ లక్షణాలు గమనించవచ్చు.

ప్రశ్న : వ్యక్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తాయి?
జవాబు : స్ట్రెస్‌ క్రానిక్‌గా మారడం వల్ల ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు తడబాటు నత్తి అధికమవుతుంది. ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్లడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోవడం, స్మోకింగ్‌, డ్రగ్స్‌, ఆల్కహాల్‌కు అలవాటు పడడం, నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడడం, తీవ్రమైన సంఘర్షణను అనుభవించి ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది. కొంతమంది మేనరిజమ్స్‌లో విపరీతంగా ఏర్పడుతుంది.

ప్రశ్న : బాల్యంపై ఒత్తిడి చూపే ప్రభావం ఏమిటి?
జవాబు : తల్లిదండ్రులలో ఉండే ఉద్వేగాలు, కోపతాపాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, సరిగా పట్టించుకోకపోవడం, తద్వారా పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి విపరీత పరిణామాల వల్ల డిప్రెషన్‌కు కూడా లోనవుతారు. అలాగే బీదరికం, అధిక జనాభా వల్ల కూడా పిల్లల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సాధారణంగా బాలికల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పరీక్షల సమయంలో, స్కూలు మారినప్పుడు, ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు పిల్లలు అధికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అది వారి భవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న : పెద్దల్లో ఒత్తిడి ప్రభావం గురించి చెప్పండి.
జవాబు : భార్య భర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, ఒకరినుంచి ఒకరు దూరమై పోవడం, ఒకరు చనిపోవడం, దీర్ఘకాలిక అస్వస్థతకు లోనుకావడం, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల పెంపకంలో వచ్చే సమస్యలు వీరిలో ఎక్కువగా స్ట్రెస్‌కు సంబంధించిన సమస్యల్లో ముఖ్యంగా ఆందోళన, గుండెజబ్బులు, మైగ్రేన్‌, తలనొప్పులు, గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్స్‌, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు అధికంగా ఉంటాయి.

ప్రశ్న: పనిచేసే ప్రదేశాలలో ఒత్తిడి ఎలా ఉంటుంది?
జవాబు : పనిచేసే ప్రదేశాలలో వ్యవస్థలోని లోపాల వల్ల వ్యక్తి కార్యనిర్వహణా సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడంలో ఒత్తిడి అధికమవుతూ ఉంటుంది. అలాగెే పనిచేసేచోట తగిన సిబ్బంది లేకపోవడం, క్రింది ఉద్యోగులు చేయాల్సిన పనులు కూడా మనమీదే పడడం లేదా పై అధికారులు చేయాల్సిన నిర్ణయాలు మనమీద పడ్డప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సిబ్బంది సహకారం లేకపోవడం, ఓవర్‌టైమ్‌లు ఎక్కువగా చేయడం, నిద్ర, విశ్రాంతి సరిగా లేకపోవడం.
హోదా, జీతం, ప్రమోషన్లు కూడా మనసుపై ఒత్తిడికి కారణమవుతూ ఉంటాయి. వ్యక్తిగత సామర్ధ్యం ఎంతగా ఉన్నప్పటికీ, తగిన హోదాను కల్పించకపోవడం, సీనియారిటీ ఉన్నా అవకాశం కల్పించకపోవడం, రివార్డులు, అవార్డులు కల్పించకపోవడం కొంతమంది ఉద్యోగస్తులలో అభద్రతా భావం ఉంటుంది. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని భయంతో ఉంటారు. అలాగే పనిలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఒత్తిడిని కలగచేస్తాయి. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థల్లో కీలకమైన పాత్రలు నిర్వహించలేకపోతున్నామనే మనోవ్యధకు తరచూ లోనవుతూ ఉంటారు. సంస్థ చెందిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఉద్యోగస్తులు, అధికారులు తమ పదవులు నిర్వ హించడం స్ట్రెస్‌తో కూడుకున్నదే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పూర్తి అధికార హోదాలు లేకపోతే విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, తగిన నాయకత్వం లేకపోయినా, తగిన శిక్షణ లేకపోయినా సహోద్యోగులతో ఘర్షణ ఉన్నా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.

ప్రశ్న : మానసిక ఒత్తిడి క్రానిక్‌గా మారడం వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి?
జవాబు : ఒత్తిడికి సంబంధించిన జబ్బులను గురించి చెప్పుకోవాలంటే... కడుపులో మంట ఎక్కువకావడం, అల్సర్లు, ఇరిటబుల్‌ బవుల్‌ సిండ్రోమ్‌ వంటివి కలుగుతాయి. ఒక్కోసారి ఆకలి వెయ్యదు. మ్యారలాజికల్‌ డిస్టర్బెన్స్‌, ఆందోళన, కంగారు, భయం, చెమటలు పట్టడం, నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, గుండెజబ్బులు, ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కొన్ని రకాలైన చర్మవ్యాధులు రావడానికి కూడా ఒత్తిడి కారణమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ కావడం వల్ల తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. బరువు తగ్గడం, బరువు పెరగడం, తిండి అలవాట్లు మారతాయి. ఎక్కువగా ఒత్తిడికి లోనైతే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఎక్కువ అవుతాయి. డయాబెటిక్స్‌లో సుగర్‌ శాతం ఎక్కువ అవుతుంది. ఇలా అనేక రకాల రుగ్మతలు మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఏర్పడుతుంటాయి.

ప్రశ్న : సెక్స్‌పై ఒత్తిడి ప్రభావం ఎలాంటిది?
జవాబు : మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది. భారభర్తల సుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడా శృంగార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యతపై కూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రశ్న : మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభవాన్ని గురించి వివరంగా చెప్పండి.
జవాబు : ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణ గృహిణి కంటే ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకి ఉద్యోగానికి వెళ్లాలి. దారిలో ట్రాఫిక్‌ జామ్‌, ఈవ్‌ టీజింగ్‌.... పనిచేసే చోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలో మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకం గురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.

ప్రశ్న : జ్ఞాపకశక్తిపై ఒత్తిడి ప్రభావం ఎంత?
జవాబు : జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అధ్యయనం... అన్నింటిమీదా ఒత్తిడి ప్రభావం చాలాఎక్కువగానే ఉంటుంది. చేసే పనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత లోపం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌, వర్కింగ్‌ మెమరీ.... ఇలా అన్నింటిలోనూ స్థాయి తగ్గిపోతూ ఉండడం గమనించవచ్చు. ఒత్తిడి వల్ల విద్యార్ధులు పరీక్షల్లో రాణించలేరు.

ప్రశ్న : గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు : గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదని మన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశం ఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగా తరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనా పుట్టబోయే బిడ్డ బ్రెయిన్‌ ఎదుగుదలపై కూడా ప్రభవాన్ని చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రశ్న : అందరూ స్ట్రెస్‌కు లోనవుతారా?
జవాబు : తప్పకుండా. ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి స్రెస్‌కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారి మానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్‌సెట్‌ అయిపోతూ ఉంటారు. స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపై ఫ్రీడ్‌మెన్‌, రోస్‌మెన్‌ అనే ఇద్దరు అమెరికన్‌ కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. వీరు వ్యక్తులను టైప్-ఎ, టైప్‌-బిలుగా వర్గీకరించారు. టైప్‌`ఎ పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులు నెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపం ఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తి‌ళ్లతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్‌ - బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగా ఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగా కారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో గుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.

ప్రశ్న : మానసిక ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలి... రిలాక్సేషన్‌ పద్ధతులు ఏమిటి?
జవాబు : స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోవడానికి పళ్లు, పచ్చికూరగాయలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. బాగా వ్యాయామం చేయాలి. యాక్టివ్‌ లైఫ్‌ స్టైల్‌ అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే అలవాటు మార్చుకోవాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నవారిపై స్ట్రెస్‌ ఎక్కువ ప్రభావం చూపించదు. అయితే అతి వ్యాయామం పనికిరాదు. ఉదయం, సాయంత్రం నడక చాలా మంచి రిలాక్సేషన్‌ ఇస్తుంది. జిమ్‌కు వెళ్లడం, స్విమ్మింగ్‌ చేయడం కూడా మంచి రిలాక్సేషన్‌ ఇస్తుంది. యోగా, మెడిటేషన్‌ ప్రాక్టీస్‌ చేయడం కూడా మంచిదే. ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌, సెల్ఫ్‌ హిప్నాసిస్‌, జాకబేసన్‌ రిలాక్సేషన్‌, ఆటోజెనిక్స్‌ ద్వారా మంచి రిలాక్సేషన్‌ పొందవచ్చు.
అలాగే టైమ్‌ మేనేజ్‌మెంట్‌, స్కిల్స్‌ ట్రయినింగ్‌, ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ప్లానింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, నెగెటివ్‌ ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేయడం ద్వారా ప్రశాంత జీవనాన్ని అలవాటు చేసుకోవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకున్న హాబీలను అభివృద్ధి చేసుకోవడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడపడం, పిల్లలతో సరదాగా గడపడం, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెయింటింగ్‌, కుట్లు, అల్లికలు, ప్రకృతి ఆరాధన ఇలంటివి అన్నీ రిలాక్స్‌ అయ్యేందుకు దోహద పడతాయి.
మంచి గృహవాతావరణం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, హ్యూమన్‌ రిలేషన్స్‌ను పెంపొందించుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి విశ్రాంతి, ఆనందం కలుగుతాయి.
ఇంకా తీవ్రంగా ఉండే సమస్యలకు సైకాలజిస్ట్‌ ద్వారా కౌన్సిలింగ్‌ తీసుకోవడం, సైకియాట్రిస్ట్‌ ద్వారా మందులు వాడడం వల్ల స్ట్రెస్‌కి సంబంధించిన సమస్యలను అధిగమించి రిలాక్స్‌ అవ్వచూ 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

 బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు.  ఏమి తింటే పాలు వృద్ధి అవుతాయి పరిష్కారం మార్గం


*తల్లి పాలను పెంచు కోవడం ఎలా ?* 
           *మాతృ దేవోభవ* 
        మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం . మాతృమూర్తిగా మారాకే స్త్రీ పరిపూర్ణతను సంతరించు కుంటుంది . అమ్మ పాలు అమృతం . బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి పాపాయికి పాలివ్వాలి . 
# మారిన వాతావరణ పరిస్దుతుల మూలంగా , ఇంగ్లీషు మందులు వాడటం వలన , రసాయన ఆహార పదార్దాల వలన తల్లి పాలు 50 % తగ్గి పోయినాయి . 
*తల్లి పాపాయికి పాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు* : --- 
      తల్లి పాలు ప్రకృతి ప్రసాదం . దివ్య ఔషధం . పాపాయికి పాలు ఇస్తే తల్లి ప్రసవానంతర తర్వాత వచ్చిన బరువు తగ్గటకు దోహద పడుతుంది . గర్భాశయం యధా స్ధానంలో వస్తుంది . రక్త స్రవాం తగ్గుతుంది .  రొమ్ము క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు రావు . తల్లి పాపాయికి పాలు ఎంత కాలము ఇస్తే ఇద్దరికి అంత మంచిది . పాపాయికి సమత్యుల ఆహారం లభిస్తుంది . 

*పాపాయికి కలిగే ప్రయోజనాలు* : --- 
       తల్లి పాలు త్రాగే పిల్లలకు శ్వాస కోశ వ్యాధులు , జీర్ణ కోశవ్యాధులు , చర్మ వ్యాధులు , చెవి సమస్యలు మొదలగునవి రావు . పెద్ద వయసులో అధిక రక్తపోటు , మధు మేహ వ్యాధులను రాకుండా కాపాడుతుంది .

*తల్లి పాలు పెరగాలంటే* : ---
           తల్లి పౌష్టిక ఆహారం తీసుకొనవలెను . ఎల్లప్పుడు ఉల్లాసంగా , ఉత్సాహంగా  వుండి పాపాయిని గురించి ఆలోచించాలి . బాగ ఎక్కువగా నిద్రపౌవాలి . పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది . 

*ఆహార నియమాలు* : --- 
        ముడి బియ్యంని వాడండి . చక్కగా ఉడికిన అన్నం , తేలిగ్గా జీర్ణమయ్యే ఆకు కూరలు , పళ్ళ రసాలను తీసుకోవాలి . ఆయా ఋతువులలో వచ్చే పండ్లను తీసుకోవాలి . 
# ఎక్కువ కారం , పులుపు పదార్ధాలు , చల్లగా ఉండే పానీయాలు వంటివి తీసుకోకూడదు .
# సులువుగా జీర్ణం కాని పదార్ధాలను తీసుకోకూడదు .
# బాలింతలకు మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది మరియు మెంతులతో చేసిన పదార్ధాలను తినిపించ వలెను . 
# వెల్లుల్లి ( Garlic ) ని పచ్చిగ తినడం కంటే , పొడులలో చేర్చి ఇవ్వడం మంచిది . 
# కాకర కాయను ప్రసవం తర్వాత తీసుకోవడం వలన పాలు బాగా పడుతాయి . 
*బొప్పాయి* :--- బొప్పాయి కల్ప తరువు . దోరగా ఉన్న బొప్పాయిని కోరులా చేసి కూర వండుకొని తిన్నట్లయితే స్తన్య వృద్ధి జరుగుతుంది . 
*గమనిక* : -- తల్లి పాలు దోషయుక్తంగా ఉండి , బిడ్డకు వికారం , విరేచనాలు కల్గిస్తున్నపుడు , బొప్పాయి పండుని తీసుకోవడం మంచిది . 
*తులసి* ఆకులతో తేనె కలిపి తినడం వలన కూడా తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి . 
*గ్రీన్ వెజిటబుల్స్ మరియు రెడ్ విజిటేబుల్స్ లలో ఎక్కువ ఫైబర్ వుంటాయి . ఇవి తల్లి పాలను పెంచడంలో సహకరిస్తాయి*
    *ఆకు కూరలు , బీన్స్ , స్వీట్ పొటాట మరియు దుంపలు పాలను పెంచడంలో చాలా ఉపయోగ పడతాయి . నల్ల ద్రాక్ష , కర్బూజ పండ్లు కూడ మంచివి* 
*# పాలకూర , జీలకర్ర , బార్లీ జావ , బొబ్బర్లు , ములగాకు ( మునగాకు) మొదలగు నవి చాలా మేలు చేస్తాయి* . 

*ఈ క్రింది పద్ధతుల ద్వారా తల్లి పాలు పెరుగుతాయి లింక్స్ లో చుడండి* : ----
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

1. *మెంతులు* : ---
          రాత్రి 1 Tea Spoon  మెంతులను 1  గ్లాసు నీళ్ళలో నానబెట్టండి . 
ఉదయం మెంతులన ఆ నీళ్ళలోనే మరిగించండి . మెంతులను వడబోసి ఆ నీళ్ళను మాత్రమే త్రాగండి . *ప్రతి రోజు ఉదయం త్రాగండి . త్వరలో ఫలితం లభిస్తుంది* . 
2 . *సోపు ( సోంపు ) గింజలు*
       ( Fennel Seeds ) .
     1 Tea Spoon సోపు గింజలు +  1 గ్లాసు వేడి నీళ్ళలో వేసి , 1/2  గంట వరకు వుంచ వలెను . సోపు గింజలను వడబోసి త్రాగవలెను . ఆ విధంగా ఉదయం , రాత్రి త్రాగవలెను . 1 నెల రోజులు త్రాగ వలెను . 
3 . *శతావరి. ( పిల్ల పెసర గడ్డలు )* :--- 
   2 లేక 3 Tea Spoon ల శతావరి పోడి + 1 గ్లాసు వేడి ఆవు పాలు + చిటికెడు పిపిళ్ళ చూర్ణం ని కలిపి త్రాగండి . 
4 . *జీలకర్ర* : ----  
           2 గ్రాముల జీలకర్ర పొడి + 1 table spoon  దేశీయ ఆవు నెయ్యిలో కలిపి తీసుకొండి . 
5. *శొంఠి + బెల్లం* :---- 
     2 గ్రాముల సొంఠి పొడి + 4 గ్రాముల బెల్లంను కలిపి రెండు భాగాలుగా చేసుకొని , ఉదయం , రాత్రి తీసుకొనండి . 
6. *దాల్చిన చెక్క పొడి* : ---
    *రాత్రి భోజనము తర్వాత* 
   1 Tea Spoon దాల్చిన చెక్క పొడి +  తేన ను కలిపి తినండి . 
తర్వాత వేడి పాలు త్రాగండి . 
7 . *Beet root + Carrot juice* :---- 
  బీట్ రూట్ + క్యారట్ జ్యూసులను సమ పాళ్ళలో కలపండి . కొద్దిగా తేన కలిపి త్రాగండి . 
8. పాలు పడని బాలింతలు *రాగి*  జావ త్రాగితే క్రమంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది . 
*పై 8 పద్దతులలో ఏదో ఒక పద్దతిని ఆచరించండి*  
# బాలింతరాలు స్వచ్చమైన ఆవు పాలు , ఆవు నెయ్యిని ఎంత ఎక్కవగా వాడితే అంత ఆరోగ్యం . 
*గమనిక* : ----
   పండ్ల రసాలను ఉదయం బ్రేక్ ఫాస్ట తర్వాత త్రాగవలెను . మధ్యాహ్న  భోజనానికి 40  నిమిషాల ముందు తాజ పండ్లను తినవలెను .  
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి

13, ఫిబ్రవరి 2020, గురువారం

నులిపురుగు నివారణ పరిష్కారం మార్గం

మీ పిల్లలు బరువు పెరగకుండ మరియు కడుపు  నొప్పి వంటి సమస్య కు అవగాహనా కోసం  పరిశుభ్రతతోనే నులిపురుగుల సమస్యకు చెక్

        పిల్లల్లో ఎదుగుదల లోపాలకు నులి పురుగుల సమస్య ఒక ముఖ్య కారణం. పెద్దలు సైతం ఈ సమస్యకు మినహాయింపు కాదు. కలుషిత ఆహారం, చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఉడకని మాంసం తినటమే ఈ సమస్యకు ప్రధానకారణాలు. కడుపులోని పేగులను ఆవాసంగా చేసుకొనే ఈ నులిపురుగులు ఆహారం ద్వారా అందే పోషకాలను అందిపుచ్చుకొని క్రమంగా వృద్ధి చెందుతాయి. సమయం గడిచే కొద్దీ ఇవి మరింత బలబడతాయి. అయితే వాటి ఉనికిని చాటే ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు గనుక ఈ సమస్యను త్వరగా గుర్తించటం కష్టం. ఈ సమస్య బాధితుల్లో పోషకాల లోపం తలెత్తి నానాటికీ క్షీణిస్తూ పోతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా వుండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు
కడుపులో నులిపురులు ఉన్నప్పుడు జననాంగాల దగ్గర దురద పెట్టటం, రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరకడం, ఎంత తిన్నా బరువు పెరగకపోవడం, నానాటికీ బరువు తగ్గటం , తరచూ కనిపించే కడుపు నొప్పి, తిన్నది పూర్తిగా జీర్ణం కాకపోవడం, మానసిక, శారీరక అస్థిరత, మలవిస్జరనలో తెల్లని, సన్నని చిన్న పురుగులు పడటం, మలబద్ధకం, వికారం, వాంతులు, కడుపులో గ్యాస్ పేరుకున్నట్లు అనిపించడం ,కలత నిద్ర, రక్తహీనత, చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లటం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కనిపిస్తాయి.
నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు 

పూర్తిగా ఉడికిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మాంసం విషయంలో ఈ జాగ్రత్త పాటించాలి.

శుద్ధిచేసిన నీటినే తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆరుబయట మల మూత్ర విసర్జన చేయరాదు.

ఇంట్లోకి పురుగులు,ఈగలు, ఇతర కీటకాలు రాకుండా జాగ్రత్త పడాలి.

కాలకృత్యాలు తీర్చుకున్న ప్రతిసారి, ఆహారం తీసుకునేముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి.

చేతి గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లు బాగా పెరగకముందే కత్తిరించుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ కొరక్కూడదు.

పిల్లలు నోటిలో చేతులు పెట్టుకోవడం, మట్టిలో ఆడుకోవటం వంటివి చేయకుండా చూడాలి.

రోడ్డు వెంబడి చిరుతిండ్లు వద్దేవద్దు.
ఇంక వివరాలు కు లింక్స్ లో చుడండి 
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

చికిత్స ..
పిల్లల్లో ఏలికపాములు, నులిపురుగులు, కొంకిపురుగులు అనే 3 రకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. వీటి నిర్మూలనకు ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలి. 1-2 ఏళ్ళ వయసున్న పిల్లలకు 200ఎంజీ మాత్రను, మిగతావారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. భోజనం తర్వాత వేసుకోవచ్చు. కడుపులో పురుగులు ఉంటే మాత్రలు వాడిన 2 రోజులకు మలం ద్వారా బయట పడిపోతాయి. ధీర్ఘకాలిక రోగాల బాధితులు, ఇతర రోగాలకు మందులు వాడేవారు ఈ మాత్రలు వాడకూడదు. కడుపులో నులిపురుగులు ఉంటే.. ఈ మాత్రలు వేసుకొన్నతర్వాత వికారం, వాంతులు, కొద్దిగా జ్వరం వచ్చే అవకాశముంది. దాని వల్ల భయపడాల్సిన అవసరం లేదు

 *చిన్న పిల్లల కడుపులో దాదాపు 85 శాతం పురుగులు ఉంటాయట*. 

ఈ పురుగులనే నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు అని అంటారు. ఇవి చిన్న పిల్లల కడుపులో ఉండటం వలన బరువు తగ్గిపోయి అనారోగ్యానికి గురవుతారు. అసలు ఈ పురుగులు రావడానికి కారణాలేంటి? వీటి నుండి ఎలా బయటపడాలో వివరంగా తెలుసుకోండి.

పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి కారణాలు

చిన్న పిల్లల కడుపులోకి పురుగులు చేరడానికి ప్రధాన కారణం నీరు మరియు ఆహారమే. కలుషితమైన నీరు తీసుకోవడం వలన, సరిగ్గా ఉడకని ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఆరు బయటే మల విసర్జన, కాళ్ళు, చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవడం, పిల్లలందరూ ఒకే చోట ఉండటం వలన ఒకరి నుండి మరికొకరి బాక్టీరియా సులువుగా వ్యాపించడం జరుగుతుంది.ఇంక సమస్య ఉంటే నవీన్ గారిని కొనుకొని మందులు వాడాలి 

పిల్లల కడుపులో పురుగులు - లక్షణాలు

కడుపు నొప్పి, తలనొప్పి. మలద్వారం చుట్టూ దురద మంట ఉండటం, వాంతులు, రాత్రి పూత సరైన నిద్ర కలగకపోవడం, చర్మంపై దద్దుర్లు, ఆకలి ఉన్నా తినలేకపోవడం, రోజురోజుకీ బక్కచిక్కి పోవడం, రక్తహీనత, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, రాత్రి నిద్రలో పళ్ళు కొరకడం, ముఖం పాలిపోవడం, మలం తర్వాత చిన్న చిన్న పురుగులు పడటం జరుగుతుంటుంది.

కడుపులో పురుగులు తగ్గడానికి ఏం చేయాలి?
వెల్లుల్లి రసం - వెల్లుల్లి మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. అందుకని ప్రతి రోజూ చిన్న గ్లాస్ చొప్పున ముడి వెల్లుల్లి రసంలో కాస్త నీరు కలిపి ఇవ్వడం వలన ఈ ఎలాంటి పురుగులైనా సరే నశిస్తాయి.

మరిగించిన నీరు - పిల్లలకు ఎప్పుడూ నీరు ఇచ్చినా సరే మరిగించిన తర్వాత చల్లార్చి ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే బాక్టీరియా వారి శరీరంలోకి ప్రవేశించదు.

లవంగాల నీరు - రెండు లవంగాలు ఒక గ్లాస్ నీటిలో వేసి, ఆ నీటిని తాగించినా మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి జ్యూస్ - ఇది మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ లో ఒక స్పూన్ తేనే కలిపి ఇవ్వడం వలన పురుగులు అనేవి వారి కడుపు నుండి దూరమవుతాయి.

పాలు - పసుపు - ప్రతి రోజూ రెండు పూటలా ఒక గ్లాస్ పాలు ఇవ్వడం అందులో ఒక స్పూన్ పసుపు కలిపి పాలు తాగించడం వలన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారవుతారు.

చేతులు, మలద్వారం - మలద్వారం తర్వాత శుభ్రంగా కడగడం, చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, పండ్లు ఇచ్చేటప్పుడు శుభ్రంగా కడిగి ఇవ్వడం చేయాలి.

పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా లేకపోతే ఏ తల్లితండ్రులు సంతోషంగా ఉండలేరు కాబట్టి ప్రతి తల్లితండ్రులకు తెలిసేలా SHARE చేయండి.
ధన్యవాదములు 🙏 
మి నవీన్ నడిమింటి 
ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే

.ఆయుర్వేదం లో బరువు తగ్గాలి అంటే సలహాలు



ఆయుర్వేదం.. మీ బరువునీ సులభంగా తగ్గించేస్తుంది అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ..(Ayurveda For Weight Loss 

ఆయుర్వేదం (Ayurveda).. మన శరీరంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా సహజసిద్ధమైన చిట్కాలతో, సహజ ఉత్పత్తుల వైద్యంతో తగ్గించే మంత్రం ఇది. కేవలం ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మాత్రమే కాదు.. ఆయుర్వేదం ద్వారా మరెన్నో ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అందులో ముఖ్యమైనది బరువు తగ్గడం (Weight loss)..

అవును. బరువు తగ్గడానికి క్రాష్ డైట్లు, కష్టతరమైన వ్యాయామాలు.. ఇలా ఎన్నెన్ని పాటించినా ఫలితం లేనివారికి కూడా ఆయుర్వేదం సులువుగా ఆ సమస్యను తీరుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడంతో పాటు జీవన శైలిలోనూ మార్పులు - చేర్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బరువు చాలా వేగంగా తగ్గుతుంది. ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గించుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

ఈ కథనంలోని ముఖ్యాంశాలు

దోషాలను బట్టి ఆహార నియమాలు
బరువు తగ్గడానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు
బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన పదార్థాలు
తరచూ వచ్చే సందేహాలకు సమాధానాలు

ఏయే దోషాల వారు ఏ ఆహారం తీసుకోవాలంటే..

ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గించుకోవడం సులభమే. కానీ దానికి తగిన ఆహార నియమాలు పాటించడం కూడా ఎంతో అవసరం. ఈ నియమాలు సైతం అందరికీ ఒకేలా ఉండవు. మన శరీరంలోని దోషాల ఆధారంగానే ఆహారమూ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ దోషం ఉన్నవారు ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలంటే..

వాత దోషం : వాత దోషం ఉన్నవారు చలిని తట్టుకోలేరు. చంచలస్వభావులు. ఆత్మీయత, అనురాగం వీరికి తెలియవు. వెంట్రుకలు కొబ్బరిపీచులా ఉంటాయి. ఈ దోషం ఉన్నవారు క్వినోవా, బియ్యంతో వండిన పదార్థాలు, ఉడికించిన కూరగాయలు, ఎర్ర పప్పు, బీఫ్, గుడ్లు, చేపలు, మిరియాల పొడి, కొత్తిమీర, పల్లీలు, అవిసె గింజలు, నువ్వుల నూనె, నెయ్యి వంటివి తీసుకోవచ్చు. యాపిల్స్, చెర్రీల వంటివి ఉడికించి మాత్రమే తినాలి. డ్రైఫ్రూట్స్, యాపిల్, పుచ్చకాయ, పచ్చివి లేదా ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయలు, బంగాళాదుంపలు, బార్లీ, శెనగలు, పెరుగు, మొక్కజొన్న, మటన్, చికెన్, చాక్లెట్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

పిత్త దోషం : ఈ దోషం ఉన్నవారికి దాహం, ఆకలి ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. కళ్లు ఎర్రగా ఉంటాయి. తరచూ నోటిపూత వస్తుంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువ. గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా ఎక్కువే. ఈ దోషం ఉన్నవారు డ్రైఫ్రూట్స్, పుచ్చకాయ, కాలీఫ్లవర్, బ్రొకొలీ, పాస్తా, ఉలవలు, వెన్న, చికెన్, గుడ్లు, బాదం పప్పు, కొబ్బరి వంటివి తీసుకోవచ్చు. వీరు కారం, చేపలు, పులిసిన బ్రెడ్, అవకాడో, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు, పాలకూర, సోయా సాస్, బీఫ్, చాక్లెట్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

కఫ దోషం : కఫ దోషం ఉన్నవారు సౌమ్యులు.. వీరిని అంచనా వేయడం కష్టం. వీరికి ఆకలి మామూలుగా ఉంటుంది. కానీ నిగ్రహం ఉంటుంది కాబట్టి ఉపవాసాలు చేయగలరు. బుద్ధిమంతులు, నిజాయతీపరులు. కష్టాలను ఓర్చుకునే శక్తి కలిగి ఉంటారు. ఈ దోషం ఉన్నవారు యాపిల్స్, క్యారట్లు, బీన్స్, మజ్జిగ, చీజ్, రొయ్యలు, చికెన్ వంటివి తినాలి. దబ్బ పండ్లు, మేడి పండ్లు, కీరదోస, ఓట్స్, గోధుమలు, టోఫూ, చేపలు, కెచప్, చాక్లెట్.. వంటివి తినకూడదు.

బరువు తగ్గడానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు

బరువు తగ్గడానికి ఆయుర్వేద ఉత్పత్తులు ఉపయోగించడం ఎంత అవసరమో.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. బరువు తగ్గేందుకు ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి జీవనశైలిని పాటించాలంటే..

మూడుసార్లు భోజనం చేయండి..

ఆయుర్వేదం ప్రకారం భోజనం అనేది కేవలం మన శరీరానికి శక్తిని అందించేందుకు మాత్రమే.. కాబట్టి మన శరీరానికి అప్పుడప్పుడు మాత్రమే దాన్ని అందించాలి. ముందు అందించిన ఇంధనం అరగకముందే మళ్లీ తినడం వల్ల మన శరీరం దాన్ని కరిగించడం మానేస్తుంది. అందుకే తక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ని ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో చేయండి.

తర్వాత లంచ్ పదకొండు నుంచి రెండు గంటల లోపు తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన పదార్థాలన్నీ తీసుకోవచ్చు. రాత్రి భోజనం ఈ రెండింటి కంటే తక్కువగా ఉండాలి. సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిది లోపు డిన్నర్ చేసేయడం మంచిది. ఈ సమయంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో భోజనం చేయడం మంచిది.

సహజమైనవే తినండి.

మనకు అవసరమైనవన్నింటినీ ప్రక్రుతి ఎప్పటినుంచో అందిస్తోంది.. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. సీజన్ ప్రకారం లభ్యమయ్యే పండ్లు ఇతరత్రావన్నీ మన బరువును కూడా కంట్రోల్లో ఉంచుతాయి. బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు.. వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి.

సూర్యుడితో పాటే నిద్ర, మెలకువ

సూర్య రశ్మి మన శరీరంలో జీవ గడియారాన్ని సమన్వయం చేస్తుంది. దీని ప్రకారం పాటిస్తే హార్మోన్ల స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. మన పూర్వీకులు సూర్యాస్తమయం తర్వాత పెద్దగా పనిచేసేవారు కాదు. పగలంతా ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్లు సూర్యాస్తమయం అయిన తర్వాత మంట చుట్టూ కూర్చొని మాట్లాడుకునేవాళ్లు. భోజనం చేసి అందరితో మాట్లాడి పడుకునేవారు.

ఇప్పుడు స్క్రీన్స్ ఎక్కువగా చూడడం వల్ల మన మెదడు రాత్రుళ్లు కూడా మెలకువగా ఉండేలా చేస్తూ మన జీవ గడియారాన్ని పాడుచేస్తున్నాయి. అందుకే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు ఫోన్, లాప్ టాప్, టీవీ చూడడం మానేయాలి. పది గంటలకు ముందే నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల మరుసటి రోజు కోసం శరీరం సిద్ధమవుతుంది. మంచి నిద్ర ఉంటే శరీరంలో ఒత్తిడి పెంచి బరువు పెంచే కార్టిసాల్ హార్మోన్ కూడా తక్కువగా విడుదలవుతుంది.

వారానికోసారి ఉపవాసం చేయండి.

బరువు అదుపులో ఉంచుకోవడం కోసం వారానికోసారైనా మన జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతిని అందించాలి. దీని కోసం వారానికోసారి వీలైతే రోజు మొత్తం నీళ్లు, మజ్జిగ వంటివి తప్ప ఏమీ తీసుకోకుండా లంఖణం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ఒక్క పూట భోజనం మానేసి మిగిలిన రెండు పూటలు తేలిగ్గా అరిగే పండ్లలాంటివి తీసుకొని ఉపవాసం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి బరువు తగ్గే వీలుంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగండి

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట నిండుగా ఉండి బరువు తగ్గే వీలుంటుంది. కానీ దీన్ని ఆహారంతో పాటు లేదా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్లు డైల్యూట్ అవుతాయి. ఇది జీర్ణ ప్రక్రియ మరింత నెమ్మదిగా  అయ్యేలా చేసి, మనల్ని లావుగా మారుస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అది టాక్సిన్లుగా మారుతుంది. అలా అరగకపోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత వంటి సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా రోజంతా కాస్త వేడి నీళ్లు తాగడం వల్ల శరీరం డీటాక్సిఫై అవుతుంది.

ఆరు రుచులు అవసరమే..

ఆయుర్వేదంలో ఆరు రుచులు ఎంతో ముఖ్యమైనవి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం ఇవన్నీ మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ప్రక్రుతి లో భాగమైన ఈ ఆరు రుచులు మన శరీరం సరైన రీతిలో ఉండేందుకు తోడ్పడతాయి. తీపి, పులుపు, ఉప్పు మన శరీర నిర్మాణంలో భాగమైతే.. కారం, వగరు, చేదు రుచులు కొవ్వును కరిగించే గుణాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి ఎక్కువగా తీపి, పులుపు, ఉప్పు వంటివి తోడ్పడతాయి. అయితే మిగిలిన ఆహార పదార్థాలతో దాన్ని బ్యాలన్స్ చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండొచ్చు.

సీజనల్ పండ్లు కూరగాయలు తీసుకోండి.

వేసవిలో చల్లచల్లగా ఉంచేందుకు ప్రక్రుతి మనకు పుచ్చ, తర్బూజా, మామిడి, ముంజలు.. వంటివి అందించడంతో పాటు కూరగాయలను కూడా అందిస్తూ శరీరం చల్లగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఇక చలికాలంలో దుంపలు, నట్స్, ఇతర పండ్లు, మాంసాహారం వంటివన్నీ మనల్ని వేడి నుంచి కాపాడతాయి. చలికాలంలో మనం తీసుకున్న ఎసిడిక్ డైట్ నుంచి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి వసంత కాలంలో బెర్రీలను మనకు అందిస్తుంది. ఇలా ప్రతి సీజన్ లోనూ ఆయా సీజన్ కి సంబంధించిన, ఆయా సమయాల్లో అవసరమైన పోషకాలను ప్రక్రుతి మనకు అందిస్తుంది.

భోజనం తర్వాత నడవండి..

ఆయుర్వేదం కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్త వహించదు. భోజనం తర్వాత కనీసం వంద నుంచి రెండు వందల అడుగులు వేయాలని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ప్రతి భోజనం తర్వాత ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం పది నుంచి ఇరవై నిమిషాల పాటు నడవడం వల్ల ఆహారం త్వరగా అరిగే వీలుంటుంది. వీలుంటే పడుకునేటప్పుడు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

భోజనం తర్వాత నడుస్తున్నాం కదా అని వ్యాయామాన్ని తక్కువ చేయకూడదు. రోజూ ఉదయం కనీసం 30 నుంచి 60 నిమిషాలు యోగా, నడక, పరుగు, సైక్లింగ్, జాగింగ్, బరువులు ఎత్తడం వంటివి చేయడంతో పాటు ఐదు నుంచి పది నిమషాల పాటు తప్పనిసరిగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం చాలా సులభం.

బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన పదార్థాలు

బరువు తగ్గడం కోసం ఆయుర్వేదం కొన్ని నియమాలను చెప్పింది. అయితే ఆ నియమాలను రోజూ పాటించడంతో పాటు మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడే కొన్ని పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల కొవ్వు వేగంగా కరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆహార పదార్థాలు వ్యాయామం లేదా డైట్ కి ప్రత్యామ్నాయం మాత్రం కాదు. వీటిని తీసుకుంటూ ా ఆరోగ్యకరమైన డైట్ పాటించడం, రోజూ వ్యాయామం లాంటి పైన చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటించడం వల్ల మాత్రమే బరువు తగ్గే వీలుంటుంది. వీటిని రోజూ కనీసం 45 రోజుల నుంచి రెండు మూడు నెలల వరకూ తీసుకొని చూడండి. మార్పు తప్పక కనిపిస్తుంది. 

మెంతులు

మెంతులు ప్రతి వంటింట్లోనూ ఉండే మందు. బరువు తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కొవ్వును బాగా తగ్గిస్తుంది. దీని కోసం స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వేసి రుబ్బి మరిన్ని నీళ్లు కలిపి ఉదయాన్నే పరిగడుపున తీసుకోవచ్చు. దీంతో పాటు వేయించిన మెంతులను సలాడ్స్ తో పాటు తీసుకోవచ్చు.


మిరియాల పొడి

కారం బరువు తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. అయితే మిరపకాయల కారం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. మిరియాల కారం వల్ల ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. అందుకే రోజూ చిటికెడు మిరియాల పొడి, నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మన శరీర జీవక్రియల వేగాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగించేందుకు కూడా ఇది చాలా మంచి మందు. ఇందులోని సిన్నమాల్డిహైడ్ విసరల్ ఫ్యాట్ టిష్యూని తగ్గిస్తుంది. అంటే పొట్ట దగ్గరున్న కొవ్వును పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. కప్పు వేడినీటిలో స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి టీ పెట్టుకొని ఉదయాన్నే తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజీ

బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఆయుర్వేద పదార్థాల్లో క్యాబేజీ కూడా ముఖ్యమైనది. శరీరంలో కొవ్వు కరిగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సాయంత్రం తీసుకునే అనారోగ్యకరమైన స్నాక్స్ బదులు క్యాబేజీ సలాడ్ ని తీసుకోవడం మంచిది. దీన్ని ఉడికించి తీసుకోవడం కంటే పచ్చిది తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది. రోజూ క్యాబేజీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

అల్లం

అల్లం బరువు తగ్గించేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాదు.. సైనస్, ఫ్యాటీ లివర్, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని పేస్ట్ చేసుకొని అందులో నిమ్మరసం పిండి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి సగం అయ్యేవరకూ మరిగించాలి. ఇప్పుడు ఈ రెండు గ్లాసుల నీటిని రోజు మొత్తంలో మూడుసార్లుగా తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితాలుంటాయి.

ఉలవలు

రోజూ ఉడికించిన ఉలవలను తినడం వల్ల కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. ఈ ప్రక్రియను కనీసం 45 రోజులు పాటించి చూడడం వల్ల ఫలితాన్ని సులువుగా గుర్తించే వీలుంటుంది. ఇది ఆయుర్వేదంలోనే ఉత్తమమైన పద్ధతి. దీని కోసం మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. రాత్రి కప్పు ఉలవలను తీసుకొని వాటిని నానబెట్టి ఉదయాన్నే వాటిని ఉడికించి తీసుకోవాలి. కావాలంటే వాటిలో ఉప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు వేసుకోవచ్చు. ఆపై ఓ గ్లాసు మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.


కలబందతో డ్రింక్

కలబంద కూడా బరువు తగ్గేందుకు ఎంతో తోడ్పడుతుంది. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల కలబంద రసం, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు కరక్కాయ పొడి, తిప్పతీగ పొడి చిటికెడు వేసి కలిపి అందులో గ్లాసు వేడినీటిని కలిపి ఆ డ్రింక్‌ని రోజూ తాగాలి. కావాలంటే టీస్పూన్ తేనె వేసుకోవచ్చు. దీన్ని ఉదయాన్నే పరిగడుపున తాగి మరో గంట పాటు ఏమీ తినకుండా తాగకుండా ఉండాలి. దీన్ని అనుకున్న బరువుకి చేరుకునే వరకూ రోజూ తాగడం మంచిది.

గుగ్గుల్

గుగ్గుల్ గా పిలిచే ఈ పదార్థం చాలా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గుగ్గుల్ స్టెరాన్ అనే కెమికల్ బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంతేకాదు.. ఇది కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది. గుగ్గుల్ టీ ఇందుకు చాలా తోడ్పడుతుంది. ఇందుకు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో గుగ్గుల్ మిశ్రమం (ఆయుర్వేద మందుల దుకాణాల్లో లభిస్తుంది) వేసి కాసేపు మరిగించి ఆ నీటిని తాగాలి.

త్రిఫల

త్రిఫల చూర్ణం ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే చూర్ణం. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను ఎండబెట్టి పొడిచేసి వాటిని సమానపాళ్లలో కలిపిన చూర్ణం ఇది. ఇది మన శరీరాన్ని డీటాక్సిఫై చేసేందుకు బాగా తోడ్పడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గే వీలుంటుంది. ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వల్ల పోషకాలు అందడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. దీని కోసం రోజూ ఒక గ్లాస్ వేడినీటిలో టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా కనీసం రెండు నుంచి మూడు నెలలు పాటించాలి.

పునర్ణవ

పునర్ణవ బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని డైయూరిటిక్ గుణాలు కిడ్నీ, యూరినరీ సమస్యలను తగ్గించేందుకు తోడ్పడతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ బయటకు పోకుండా కేవలం టాక్సిన్లు మాత్రమే బయటకు వెళ్లిపోతాయి. కాళ్లు వాపు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు ఇది బరువు కూడా తగ్గిస్తుంది. దీని కోసం ఉదయాన్నే పునర్ణవ చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది.

వీటితో పాటు నిమ్మరసం, వెల్లుల్లి, లవంగాలు, కలోంజీ, వాము, కరివేపాకు, విజయ్సార్.. వంటివి కూడా ఉపయోగించడం వల్ల బరువు వేగంగా తగ్గే వీలుంటుంది.

తరచూ ఎదురయ్యే సందేహాలకు సమాధానాలివే..

1. ఆయుర్వేదిక్ మసాజ్ బరువు తగ్గడంలో తోడ్పడుతుందా?

ఆయుర్వేదిక్ మసాజ్ లేదా అభ్యంగం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అందులో ఒకటి మన శరీరంలోని విషపదార్థాలను తొలగించి శరీర బరువు తగ్గించడం. మసాజ్ మంచి ఫ్యాట్ బర్నర్ గా పనిచేయడంతో పాటు మన శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి పద్ధతి. కేవలం ఇదొక్కటే కాదు.. నరాలకు స్వాంతన కలిగించి మంచి నిద్రను అందించడం, చర్మాన్ని మ్రుదువుగా మార్చి ముడతలను తగ్గించడం, రక్త ప్రసరణ శరీర సక్రమంగా జరిగేలా చేయడం ద్వారా అవయవాల ఆరోగ్యాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలు కూడా దీని వల్ల అందుతాయి.

2. ఆయుర్వేదం ద్వారా బరువు వేగంగా తగ్గే వీలుంటుందా?

సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఆయుర్వేదం మనకు అందిస్తుంది. అయితే ఆయుర్వేద పద్ధతుల్లో వేగంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. జీవన శైలిలో మార్పులతో మన శరీరంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి ఆయుర్వేదం ద్వారా కాస్త నెమ్మదిగా అయినా బరువు తగ్గడం మంచిది. దీని ద్వారా నెలకు రెండు నుంచి ఐదు కేజీల వరకూ బరువు తగ్గే వీలుంటుంది.

3. ఆయుర్వేదిక్ డీటాక్స్ డైట్ అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?

ఆయుర్వేద డీటాక్స్ డైట్ అంటే మన శరీరానికి హాని కలిగించే పదార్థాల నుంచి కొంతకాలం దూరమై శరీరాన్ని సరైన దిశగా తీసుకెళ్లడం అన్నమాట. సాధారణంగా 45 రోజులు ఉండే ఈ డీటాక్స్ డైట్ కి ముందు పదిహేను రోజుల ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో రాత్రి లేదా ఉదయం మిగిలినవి, ప్రాసెస్ చేసినవి, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటివన్నీ మానేయాలి. ఆర్గానిక్ ఆహారం మాత్రమే తీసుకోవాలి. అందులోనూ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

కెమికల్స్, పురుగు మందులు, క్రుత్రిమ ఎరువులు వేసి పండించినవి తినకూడదు. డైరీ ఉత్పత్తుల్లో ఛీజ్, పెరుగు వంటివి, డీప్ ఫ్రై చేసినవి, పచ్చి ఆహారపదార్థాలు, స్వీట్స్ , ఇంకా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారపదార్థాలన్నింటికీ దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, అల్లం, పసుపు, ధనియాలు, సోంపు, మెంతులు వంటివి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గి జీర్ణ క్రియ వేగం పెరిగి బరువు త్వరగా తగ్గే వీలుంటుంది.

4. ఆయుర్వేద మందులు మార్కెట్లో చాలా లభిస్తున్నాయి. వీటిని బరువు తగ్గడానికి ఉపయోగించవచ్చా?

ఆయుర్వేద మందులు మార్కెట్లో చాలా లభ్యమవుతున్నాయి. కానీ వాటిని సంబంధిత ఆయుర్వేద వైద్యుడు సూచిస్తేనే వేసుకోవడం మంచిది. ఆయుర్వేదంలో అందరికీ ఒకే రకమైన మందు ఉండదు. శరీరతత్వాన్ని బట్టి మందులు పనిచేస్తాయి కాబట్టి వైద్యుల సలహా తీసుకొని వాడడం మంచిది. అది కూడా బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారే ఉపయోగించాలి. అంతకంటే తక్కువ బరువున్నవారు ఇంట్లో తయారుచేసుకోగలిగే పదార్థాలతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


 ఇవి కూడా చదవండి.



గాయం దెబ్బలు తగిలిన అప్పుడు పరిష్కారం మార్గం

*గాయం దెబ్బలు  తగిలిన అప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం*
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

 క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం. రకాలు : 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు ,

మానసిక గాయాలు :

మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానును. మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము వరకు మాయదు. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియభాషణము చేతకనివారు మౌనము వహించుట ముఖ్యము.

శారీరక గాయము :

శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో , వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.

గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .


చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, పౌడర్‌ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.

శారీరక గాయాలు రకాలు :


* బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
* గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
* బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
* బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్స లో చూడండి.

చికిత్స :

కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స

తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు.

* కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి.
* ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి.
* నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి.
ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి., మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.


తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమ చికిత్స


* తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి.
* గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి.
* పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు.
* గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి.
* ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది.
* గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి.
* వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి.

నొప్పినివారణ మందులు : అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4-5 రోజులు.

యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు .

పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి .
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి