14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

 బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు.  ఏమి తింటే పాలు వృద్ధి అవుతాయి పరిష్కారం మార్గం


*తల్లి పాలను పెంచు కోవడం ఎలా ?* 
           *మాతృ దేవోభవ* 
        మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం . మాతృమూర్తిగా మారాకే స్త్రీ పరిపూర్ణతను సంతరించు కుంటుంది . అమ్మ పాలు అమృతం . బిడ్డ పుట్టిన తర్వాత కనీసం ఆరు మాసాలైన తల్లి పాపాయికి పాలివ్వాలి . 
# మారిన వాతావరణ పరిస్దుతుల మూలంగా , ఇంగ్లీషు మందులు వాడటం వలన , రసాయన ఆహార పదార్దాల వలన తల్లి పాలు 50 % తగ్గి పోయినాయి . 
*తల్లి పాపాయికి పాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు* : --- 
      తల్లి పాలు ప్రకృతి ప్రసాదం . దివ్య ఔషధం . పాపాయికి పాలు ఇస్తే తల్లి ప్రసవానంతర తర్వాత వచ్చిన బరువు తగ్గటకు దోహద పడుతుంది . గర్భాశయం యధా స్ధానంలో వస్తుంది . రక్త స్రవాం తగ్గుతుంది .  రొమ్ము క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు రావు . తల్లి పాపాయికి పాలు ఎంత కాలము ఇస్తే ఇద్దరికి అంత మంచిది . పాపాయికి సమత్యుల ఆహారం లభిస్తుంది . 

*పాపాయికి కలిగే ప్రయోజనాలు* : --- 
       తల్లి పాలు త్రాగే పిల్లలకు శ్వాస కోశ వ్యాధులు , జీర్ణ కోశవ్యాధులు , చర్మ వ్యాధులు , చెవి సమస్యలు మొదలగునవి రావు . పెద్ద వయసులో అధిక రక్తపోటు , మధు మేహ వ్యాధులను రాకుండా కాపాడుతుంది .

*తల్లి పాలు పెరగాలంటే* : ---
           తల్లి పౌష్టిక ఆహారం తీసుకొనవలెను . ఎల్లప్పుడు ఉల్లాసంగా , ఉత్సాహంగా  వుండి పాపాయిని గురించి ఆలోచించాలి . బాగ ఎక్కువగా నిద్రపౌవాలి . పాపాయికి పాలు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఉత్పత్తి జరుగుతుంది . 

*ఆహార నియమాలు* : --- 
        ముడి బియ్యంని వాడండి . చక్కగా ఉడికిన అన్నం , తేలిగ్గా జీర్ణమయ్యే ఆకు కూరలు , పళ్ళ రసాలను తీసుకోవాలి . ఆయా ఋతువులలో వచ్చే పండ్లను తీసుకోవాలి . 
# ఎక్కువ కారం , పులుపు పదార్ధాలు , చల్లగా ఉండే పానీయాలు వంటివి తీసుకోకూడదు .
# సులువుగా జీర్ణం కాని పదార్ధాలను తీసుకోకూడదు .
# బాలింతలకు మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది మరియు మెంతులతో చేసిన పదార్ధాలను తినిపించ వలెను . 
# వెల్లుల్లి ( Garlic ) ని పచ్చిగ తినడం కంటే , పొడులలో చేర్చి ఇవ్వడం మంచిది . 
# కాకర కాయను ప్రసవం తర్వాత తీసుకోవడం వలన పాలు బాగా పడుతాయి . 
*బొప్పాయి* :--- బొప్పాయి కల్ప తరువు . దోరగా ఉన్న బొప్పాయిని కోరులా చేసి కూర వండుకొని తిన్నట్లయితే స్తన్య వృద్ధి జరుగుతుంది . 
*గమనిక* : -- తల్లి పాలు దోషయుక్తంగా ఉండి , బిడ్డకు వికారం , విరేచనాలు కల్గిస్తున్నపుడు , బొప్పాయి పండుని తీసుకోవడం మంచిది . 
*తులసి* ఆకులతో తేనె కలిపి తినడం వలన కూడా తల్లి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి . 
*గ్రీన్ వెజిటబుల్స్ మరియు రెడ్ విజిటేబుల్స్ లలో ఎక్కువ ఫైబర్ వుంటాయి . ఇవి తల్లి పాలను పెంచడంలో సహకరిస్తాయి*
    *ఆకు కూరలు , బీన్స్ , స్వీట్ పొటాట మరియు దుంపలు పాలను పెంచడంలో చాలా ఉపయోగ పడతాయి . నల్ల ద్రాక్ష , కర్బూజ పండ్లు కూడ మంచివి* 
*# పాలకూర , జీలకర్ర , బార్లీ జావ , బొబ్బర్లు , ములగాకు ( మునగాకు) మొదలగు నవి చాలా మేలు చేస్తాయి* . 

*ఈ క్రింది పద్ధతుల ద్వారా తల్లి పాలు పెరుగుతాయి లింక్స్ లో చుడండి* : ----
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

1. *మెంతులు* : ---
          రాత్రి 1 Tea Spoon  మెంతులను 1  గ్లాసు నీళ్ళలో నానబెట్టండి . 
ఉదయం మెంతులన ఆ నీళ్ళలోనే మరిగించండి . మెంతులను వడబోసి ఆ నీళ్ళను మాత్రమే త్రాగండి . *ప్రతి రోజు ఉదయం త్రాగండి . త్వరలో ఫలితం లభిస్తుంది* . 
2 . *సోపు ( సోంపు ) గింజలు*
       ( Fennel Seeds ) .
     1 Tea Spoon సోపు గింజలు +  1 గ్లాసు వేడి నీళ్ళలో వేసి , 1/2  గంట వరకు వుంచ వలెను . సోపు గింజలను వడబోసి త్రాగవలెను . ఆ విధంగా ఉదయం , రాత్రి త్రాగవలెను . 1 నెల రోజులు త్రాగ వలెను . 
3 . *శతావరి. ( పిల్ల పెసర గడ్డలు )* :--- 
   2 లేక 3 Tea Spoon ల శతావరి పోడి + 1 గ్లాసు వేడి ఆవు పాలు + చిటికెడు పిపిళ్ళ చూర్ణం ని కలిపి త్రాగండి . 
4 . *జీలకర్ర* : ----  
           2 గ్రాముల జీలకర్ర పొడి + 1 table spoon  దేశీయ ఆవు నెయ్యిలో కలిపి తీసుకొండి . 
5. *శొంఠి + బెల్లం* :---- 
     2 గ్రాముల సొంఠి పొడి + 4 గ్రాముల బెల్లంను కలిపి రెండు భాగాలుగా చేసుకొని , ఉదయం , రాత్రి తీసుకొనండి . 
6. *దాల్చిన చెక్క పొడి* : ---
    *రాత్రి భోజనము తర్వాత* 
   1 Tea Spoon దాల్చిన చెక్క పొడి +  తేన ను కలిపి తినండి . 
తర్వాత వేడి పాలు త్రాగండి . 
7 . *Beet root + Carrot juice* :---- 
  బీట్ రూట్ + క్యారట్ జ్యూసులను సమ పాళ్ళలో కలపండి . కొద్దిగా తేన కలిపి త్రాగండి . 
8. పాలు పడని బాలింతలు *రాగి*  జావ త్రాగితే క్రమంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది . 
*పై 8 పద్దతులలో ఏదో ఒక పద్దతిని ఆచరించండి*  
# బాలింతరాలు స్వచ్చమైన ఆవు పాలు , ఆవు నెయ్యిని ఎంత ఎక్కవగా వాడితే అంత ఆరోగ్యం . 
*గమనిక* : ----
   పండ్ల రసాలను ఉదయం బ్రేక్ ఫాస్ట తర్వాత త్రాగవలెను . మధ్యాహ్న  భోజనానికి 40  నిమిషాల ముందు తాజ పండ్లను తినవలెను .  
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి

కామెంట్‌లు లేవు: