5, ఏప్రిల్ 2020, ఆదివారం
పెద్ద వాళ్ళు లో మలబద్దకం సమస్య పరిష్కారం మార్గం
4, ఏప్రిల్ 2020, శనివారం
అమ్మాయి బరువు పెరగడం కారణం PCOD సమస్య పై అవగాహనా

ఎంత ప్రయత్నించినా బరువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావచ్చు జాగ్రత్త..! అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు (PCOS In Telugu)
పీసీఓఎస్ (PCOS) పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. మన దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది నేటితరం అమ్మాయిలు, మహిళల్లో వస్తున్న సమస్య.. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతౌల్యత (Harmonal imbalance). మహిళల శరీరాల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈ రెండిటి విడుదల సమతుల్యంగా ఉంటే మన ఆరోగ్యం బాగున్నట్లే..
అదే ఈ రెండింట్లో ఒకటి ఎక్కువగా విడుదలై.. మరొకటి తక్కువగా విడుదలైతే హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడి పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారిలో అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి అండాల విడుదలను అడ్డుకుంటాయి. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్య ఎదురయ్యాక వీలైనంత తొందరగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/pcos_main1.jpg)
పీసీఓఎస్ అంటే ఏంటి? (What Is PCOS In Telugu)
పీసీఓఎస్ అనేది పిల్లలు పుట్టే వయసులో ఉన్న ఆడవారిలో ఎదురయ్యే సమస్య. మన దేశంలో ఈ సమస్యకి గురైన వారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నారంటేనే ఈ సమస్య తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ ఐదు హార్మన్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఐదు హార్మోన్లు సరైన స్థాయిలో విడుదలైతేనే సరైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటిలోని అసమతౌల్యత వల్ల మన అండాశయాల్లో సమస్య ఏర్పడుతుంది.
అండాశయాల్లో అండాలు విడుదలయ్యే ఫాలికల్స్ చుట్టూ నీటి బుడగలు ఏర్పడడం వల్ల అండాలు విడుదల కావు. దీంతో సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటు హార్మోన్లలో సమతుల్యత లేకపోవడం వల్ల బరువు పెరిగిపోవడం, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
పీసీఓఎస్కి కారణాలేంటి? (Causes Of PCOS)
పీసీఓఎస్ ఫలానా కారణంతోనే వస్తుందన్న రూలేమీ లేదు. కానీ కొన్ని కారణాలు మాత్రం ఈ సమస్య ఎదురయ్యేలా చేస్తాయి.. అవేంటంటే..
అండాశయాలు విడుదల చేసే ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
ఇన్సులిన్ ఎక్కువగా విడుదల కావడం - మన రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్. మన శరీర కణాలు ఇన్సులిన్కి రెసిస్టెంట్గా మారి రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి.
దీన్ని తట్టుకోవడానికి శరీరం ఇన్సులిన్ మోతాదును పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి మరింత పెరుగుతుంది. ఇన్సులిన్ మోతాదు ఎక్కువవడం వల్ల సాధారణంగా చాలా తక్కువగా విడుదలయ్యే ఆండ్రోజన్లు స్త్రీలలో ఎక్కువగా ఉత్పత్తవుతాయి. జన్యుపరంగా - మీ కుటుంబంలో పీసీఓఎస్ లేదా డయాబెటిస్ ఉన్నవారు ఉంటే మీకూ పీసీఓఎస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/pcos5.jpg)
పీసీఓఎస్ లక్షణాలేంటి? (Symptoms Of PCOS)
సాధారణంగా పీసీఓఎస్ లక్షణాలు మొదటిసారి రుతుక్రమం ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ వరకూ ఎప్పుడైనా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ కనిపించకపోయినా.. కొంతమందిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. అవేంటంటే..
- బరువు పెరగడం, తగ్గేందుకు చాలా సమయం పట్టడం
- మొటిమలు ఎక్కువగా రావడం
- హిర్సుటిజం ( శరీరం, ముఖంపై ఎక్కువగా జుట్టు రావడం)
- రుతుక్రమం క్రమం తప్పడం
- జుట్టు రాలిపోవడం
- పులిపిర్లు రావడం
- పాలీసిస్టిక్ ఓవరీస్ (అండాశయాల్లో నీటి బుడగలు)
- ఎక్కువగా అలసిపోవడం
- మూడ్స్వింగ్స్
పీసీఓఎస్ వల్ల సమస్యలున్నాయా? (Other Problems Which Occur Because Of PCOS)
పీసీఓఎస్ సమస్య ఉందని తెలియగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే దీని వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటంటే..
- రక్తస్రావం చాలా ఎక్కువగా లేదా తక్కువగా అవ్వడం
- డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు
- ఎండోమెట్రియల్ క్యాన్సర్
- డయాబెటిస్, రక్తపోటు
- ఇన్ఫర్టిలిటీ
- మెటబాలిక్ సిండ్రోమ్
- నిద్రలేమి
- గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/wtlos2.jpg)
పీసీఓఎస్ని ఎలా గుర్తించాలి? (How To Diagnose PCOS)
పీసీఓఎస్ సమస్య లక్షణాలు కనిపించగానే దాన్ని గుర్తించడం కోసం పరీక్షలు చేయించుకోవడం మంచిది. అందుకే కారణం లేకుండా బరువు పెరుగుతున్నా.. రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నా.. హిర్సుటిజం, యాక్నే వంటి సమస్యలు ఎదురవుతున్నా పీసీఓఎస్ ఉందేమోనని అనుమానించి పెల్విక్ స్కాన్ చేయించుకోవాలి. దీనివల్ల అండాశయాలు, ఇతర ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు.
పీసీఓఎస్కి చికిత్స ఎలా? (Treatment)
పీసీఓఎస్ అనేది క్రానిక్ సమస్య. అంటే సమస్య వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు చాలా సమయం పడుతుంది. అయితే ఈలోపు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మంచి జీవనశైలి, చక్కటి మందుల సాయంతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ సమస్యకు ఉన్న ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే..
కాంబినేషన్ థెరపీ (Combination Therapy)
గర్భం రాకుండా చేసే బర్త్ కంట్రోల్ పిల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ సమాన స్థాయుల్లో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ స్థాయులు అదుపులో ఉండడంతో పాటు.. యాండ్రోజెన్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీనివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటు ఎక్కువ రక్తస్రావం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. రోజూ పిల్స్ తీసుకోవడం కష్టం అనుకుంటే స్కిన్ ప్యాచ్ లేదా వజైనల్ రింగ్ కూడా ఉపయోగించవచ్చు.
ప్రొజెస్టిన్ థెరపీ (Progestin Therapy)
ప్రొజెస్టిన్ హార్మోన్ మాత్రలను నెలలో పద్నాలుగు రోజులు తీసుకోవాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే మీ శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా మారే వీలుంటుంది. అయితే ఇది మన శరీరంలో యాండ్రోజన్ల స్థాయిని తగ్గించదు. అంతేకాదు.. ఇది గర్భం రావడాన్ని కూడా అడ్డుకోదు. అందుకే గర్భం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది చక్కటి ఎంపిక.
పీసీఓఎస్ సమస్య తగ్గుముఖం పట్టాలంటే.. చికిత్సతో పాటు లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి. ఈ తరహా మార్పుల వల్లే ఎక్కువ కాలం పాటు మందులపై ఆధారపడకుండా పీసీఓఎస్ సమస్యను తగ్గించుకునే వీలుంటుంది.
పీసీఓఎస్ని తగ్గించేందుకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం? (Changes In Lifestyle To Reduce PCOS)
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/pcos8.jpg)
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోండి.. (Increase Intake Of Protein)
పీసీఓఎస్ సమస్యకు కారణమైన యాండ్రోజెన్ హార్మోన్ రక్తంలో చక్కెరలు ఎక్కువయ్యేలా చేస్తుంది. పైగా ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది కూడా. అందుకే ఈ సమస్యతో బాధపడుతుంటే.. వీలైనంత మేరకు కార్బొహైడ్రేట్లను తగ్గించి ప్రొటీన్లు, ఫ్యాట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది వీలుపడకపోతే కనీసం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లను సమాన మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే కార్బొహైడ్రేట్లలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన శరీరంలోకి విడుదలయ్యే చక్కెరలను నెమ్మదించేలా చేస్తాయి. దీనివల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది.
గ్లైసిమిక్ ఇండెక్స్ గమనించండి. (Consider The Glycemic Index)
గ్లైసిమిక్ ఇండెక్స్.. ఒక పదార్థం మన రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచే స్థాయిని ఆధారంగా చేసుకొని.. వివిధ ఆహారపదార్థాలను కొలిచే ఇండెక్స్ ఇది. పీసీఓఎస్ ఉన్నవారికి ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటివారు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/pcos7.jpg)
యాక్టివ్గా ఉండండి. (Be Active)
పీసీఓఎస్ని దూరం చేసుకోవడానికి ఆహారంతో పాటు ప్రధానంగా యాక్టివ్ జీవనశైలిని కొనసాగించడం ఎంతో అవసరం. దీనికోసం కనీసం వారానికి ఐదు రోజులు వ్యాయామం చేయడంతో పాటు రోజూ కనీసం పదివేల అడుగుల టార్గెట్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లో పనులు కూడా చేయడం అలవాటు చేసుకోవడంతో పాటు రోజూ కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
అంతేకాదు.. ఇలాంటివారికి పొట్ట, తొడలు వంటి భాగాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి ఈ భాగాలకు ఎక్కువ వ్యాయామం అందించాలి. కార్డియో కోసం ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూనే కొవ్వు శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
దీనికోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుండాలి. అయితే వ్యాయామం చేయడం అవసరమే కానీ దీన్ని మరీ ఎక్కువగా కూడా చేయకూడదు. ఇలా వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల అడ్రినల్ గ్రంథులు ప్రేరేపితమైన అడ్రినలిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీ సమస్యను మరింత పెంచుతాయి. అందుకే వ్యాయామం కూడా మితంగా చేయాల్సి ఉంటుంది.
కాఫీ మానేయండి. (Avoid Coffee)
కొంతమంది పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో భాగంగా.. కాఫీ పీసీఓఎస్ సమస్యను పెంచుతుందని గుర్తించారట. అందుకే పీసీఓఎస్ సమస్య తగ్గాలంటే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని వారి సలహా. మరీ తాగకుండా ఉండలేకపోతే రోజంతా కలిపి ఒక కప్పు తీసుకోవడం మంచిది. కాఫీ తీసుకోవడం వల్ల మన శరీరంలో సహజంగా విడుదలయ్యే ఈస్ట్రోజన్ ఉత్పత్తి పెరిగి.. హార్మోన్ల అసమతౌల్యత సమస్య ఏర్పడుతుంది. అందుకే కాఫీని వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.
ఏయే ఆహార పదార్థాలు తీసుకోకూడదు? (Food Items That Should Not Be Taken)
పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మరికొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీసీఓఎస్ సమస్య తొందరగా తగ్గే వీలుంటుంది. మరి, ఏయే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ పీసీఓఎస్ సమస్య తగ్గుముఖం పడుతుందంటే..
/https://s3.amazonaws.com/popxo_rails/app_photos/images/2669/original/pcod3.jpg)
తీసుకోవాల్సిన పదార్థాలు.. (Food Items That Should Be Taken)
- ప్రాసెస్ చేయని ఆహార పదార్థాలు
- పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
- సాల్మన్, ట్యూనా, సార్డైన్లాంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు
- పాలకూర, కేల్ లాంటి ఆకుకూరలు
- ముదురు ఎరుపు, నలుపు రంగులో ఉండే పండ్లు (ఉదా - ద్రాక్ష, బ్లాక్బెర్రీ, చెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు)
- బ్రొకోలీ, కాలీఫ్లవర్
- బీన్స్, పప్పుధాన్యాలు
- ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నూనెలు ఉదా - కొబ్బరి నూనె, ఆలివ్ నూనె
- కొబ్బరి, అవకాడో లాంటి పండ్లు
- పైన్ నట్స్, బాదం, పిస్తా, వాల్నట్స్..
- డార్క్ చాక్లెట్ (తక్కువ మోతాదులో)
- పసుపు, దాల్చిన చెక్క పొడి వంటి మసాలాలు
వంటి పదార్థాలన్నీ రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
తీసుకోకూడని పదార్థాలు (Ingredients That Should Not Be Taken)
- వైట్ బ్రెడ్
- మైదాతో చేసిన పదార్థాలు
- ఫ్రై చేసిన పదార్థాలు
- ఫాస్ట్ ఫుడ్
- సోడాలు, కోలాలు, ఇతర ఎనర్జీ డ్రింకులు
- ప్రాసెస్ చేసిన మాంసం
- రెడ్మీట్, పంది మాంసం
ఇంటిచికిత్స కూడా పనిచేస్తుంది.. (Food To Treat PCOS Problem)
పీసీఓఎస్ని తగ్గించేందుకు కేవలం మందులు, జీవనశైలిలో మార్పు మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. ఈ తరహా ఆహార పదార్థాలను ఇంటి చికిత్సగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పీసీఓఎస్ ముప్పు తగ్గుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో మీకు తెలుసా?
1. యాపిల్ సైడర్ వెనిగర్తో.. (Apple Cider Vinegar)
రోజూ కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ని తీసుకోవడం వల్ల బరువు మాత్రమే కాదు.. పీసీఓఎస్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ. ప్రతీ రోజూ గ్లాసు వేడి నీళ్లలో రెండు టీస్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొన్నాళ్లు ఈ మిశ్రమాన్ని ఉదయం మాత్రమే తీసుకున్నా.. తర్వాత రోజుకి రెండు, మూడు సార్లు తీసుకోవడం మంచిది.
2. కొబ్బరి నూనెతో.. (Coconut Oil)
కొబ్బరి నూనెను రోజూ తీసుకున్నా.. అందులోని గుణాలు మన ఆరోగ్యం బాగుపడేలా.. హార్మోన్ల స్థాయి సమతుల్యమయ్యేలా చేస్తుంది. పీసీఓఎస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజుకో టేబుల్ స్పూన్ వర్జిన్ కొకోనట్ ఆయిల్ని తీసుకొని దాన్ని ఆహారంలో భాగంగా శరీరానికి అందేలా చేయాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. అందుకే రోజూ స్మూతీల్లో, ఇతర వంటకాల్లో కలిపి దీన్ని తీసుకోవడం మంచిది.
3. గ్రీన్ టీ (Green Tea)
గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. గ్రీన్ టీ పీసీఓఎస్ సమస్యను తగ్గించేందుకు సహజమైన పదార్థంగా ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ టీని రోజూ నాలుగైదు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
4. కలబంద రసం (Aloe Vera Juice)
కలబంద రసం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో లభించే కలబంద రసం తాగడం లేదా మీరే స్వయంగా కలబంద ఆకులను శుభ్రం చేసి.. తెల్లని గుజ్జులాంటి పదార్థాన్ని తీసి జ్యూస్ చేసుకొని తాగడం చేయాలి. ఇలా రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండాశయాల పనితీరు మెరుగుపడుతుంది.
5. తాటిబెల్లం (Thati Bellam)
రక్తంలోని చక్కెర స్థాయులను మెయిన్టెయిన్ చేయడానికి సాధారణ చక్కెర, బెల్లాల కంటే తాటిబెల్లం చక్కటి ఎంపిక. ఇది గ్లైసిమిక్ లెవల్లో ఉంటుంది కాబట్టి.. ఒకేసారిగా గ్లూకోజ్ విడుదల చేయకుండానే శరీరానికి శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇందులోని క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి.. దీన్ని రోజువారీ డైట్లో భాగం చేసుకోవచ్చు.
6. తేనె, దాల్చిన చెక్క (Honey And Cinnamon)
తేనెలో ఎన్నో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలుంటాయి. ఇక దాల్చిన చెక్క బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని.. టేబుల్ స్పూన్ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
7. లికోరైస్ రూట్ (Licorice Root)
ఈ తరహా మొక్క వేర్లలో హార్మోన్లను కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయుల్లో మార్పు వచ్చి అవి సమతుల్యంగా మారతాయి. దీనివల్ల పీసీఓఎస్ సమస్య కూడా తగ్గుతుంది. దీనికోసం ఈ వేరు పొడిని అర టీస్పూన్ తీసుకొని.. అందులో నీళ్లు కలిపి టీలా చేసుకొని కనీసం రోజుకోసారి తీసుకోవాల్సి ఉంటుంది.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
3, ఏప్రిల్ 2020, శుక్రవారం
వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది అంతే జాగ్రత్తలు
2, ఏప్రిల్ 2020, గురువారం
కంటి పై ఛెగ్గ గడ్డ కు పరిష్కారం మార్గం
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -(Stye) , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
Sty(stye) : కనురెప్పలోపలగాని, బైటగాని లేచిన కంటి కురుపు, సెగ గడ్డ. వీటిలాగనే ఉండే ' కెలేజియాన్(chalazion)' మయిబోబియాన్ గ్రంధులనుండి పుడతాయి . కనురెప్ప లోపలికి point అయి ఉంటాయి..లైపోగ్రాన్యులోమా సిస్టు లని అంటారు . నొప్పిలేని నాడ్యూల్స్ గా ఉండి నయమవడానికి చాలా రోజులు పడుటుంది , ఇవి సాధారణముగా కంటి పై రెప్పలో ఎక్కువగా పుడతాయి . స్టై(stye) కనురెప్ప అంచున పుడతాయి.
కనురెప్పల మీద కొందరికి కంటికురుపులు వచ్చి మహా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం (sebaceous glands of Zeis)మూతపడటం వల్లగానీ జరుగుతుంది. దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది . ఇటువంటి కురుపులు ఒకరినుండి మరొకరికి అంతువ్యాధి లా సోకే ప్రమాదం ఉంది . కంటికురుపులు వచ్చిన పిల్లలకు వాడిన సబ్బు, టవల్ ఇతర పిల్లలకు వాడకూడదు .
లక్షణాలు :
కనురెప్ప పై అంచున చివరన ఉండే సెబా సియస్ గ్రంథి ఇన్ఫెక్షన్కు గురికావటం వల్ల కురుపులాగా ఏర్పడి, కంటికి ఎంతో బాధను కలిగిస్తుంది.
ఇందువల్ల కంటిభాగము ఎఱ్ఱ గా మారిపోతుంది.
కనురెప్పపై వాపు ఏర్ప డుతుంది.
వాపుతో కూడిన ఈ చిన్నని పుండు కనురప్ప అంచున ఏర్పడడం వల్ల కనురె ప్పలు మూసి తెరచేటప్పుడు ఎంతో బాధాక రంగా ఉంటుంది.
కళ్ళు మంట గా ఉంటాయి.
కంటిలో ఏదో నలత పడి ఉన్నట్లు ఉంటుంది .
కంటి చూపులో తగ్గుదల ఉంటుంది .
కంటిలో నీరు , పుసి కారుతుంది .
కారణాలు :
స్టెఫయిలో కోకస్ ఆరియస్ (staphylococcus aureus) బ్యాక్టీరియ వలన కంటి కురుపులు తరచుగా వస్తాయి.
రాత్రులు నిద్ర చాలకపోతే కొన్నాళ్ళకు కంటి కురుపులు వస్తాయి.
సమతుల్య ఆహారం లోపమువలన ,
కంటి శుబ్రత లోపించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
కళ్ళను ఏ కారణము చేతనైనా బాగా రుద్దడం వలన ,
ఇంటి వైద్యము :
ఒక స్పూన్ బోరిక్ పొడిని పావుకప్పు నీటిలో కరిగించి ... ఆ నీటితో కనురెప్పలను రోజులు 4-5 సార్లు కడగాలి.. ఇన్ఫెక్షన్ తగ్గి కురుపులు నయమవుతాయి.
అటువంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీనితోపాటు ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.
లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి.
కంటి కురుపుకు చింతకాయ గింజలు రెండు రోజులు నానబెట్టి ఆ గంధమ్ పట్టించాలి. మల్లీ (మరల) ఎప్పడికీ రావు .
ఒక కప్పు నీళ్లల్లో రెండు లేదా మూడు అలమ్ పూసలను బాగా కలిపి, ఆ నీటిని కండ్లు శుభ్రపర్చుకునేందుకు వాడాలి. లేదా
మీరు స్పటిక భస్మాన్ని (ఇది ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతుంది) కూడా వాడవచ్చు. ఇందువల్ల కంటిపై వాపు, ఎర్రబడిన కనురెప్పలు మామూలు స్థితికి వస్తాయి. నీరుకారడం కూడా తగ్గిపోతుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పసుపును బాగా మరగ కాచా లి. ఇలా అర గ్లాసు నీళ్ళుండేంతవరకు మరగకాచి, ఈ నీటిని వడగట్టి, ఒక శుభ్రమైన బట్టతో కంటిని శుభ్రం చేసుకొని రోజుకు రెండు లేదా మూడు చుక్కలను కంటిలో వేసుకోవడం వల్ల ఈ సమస్య సమసిపో తుంది. దీనిని 'ఐ డ్రాప్స్'గా వాడవచ్చు.
ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చిన చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి.
ఉల్లిపాయపై ఎండిన పొరను నిప్పుల మీద కాల్చి ఆ మసిని కంటి రెప్ప పై కురుపు మీద రాస్తే ఆ కురుపును త్వరగా నయం చేస్తుంది.
allopathic treatment :
కంటి కురుపులు సాదారణము గా ఒక వారము రోజుల్లో వాటంతట అవే నయమయిపోతాయి .
శుబ్రమైన గుడ్డ తో ,నీటితోను కళ్ళను తుడుస్తూ ఉండాలి .
ఏదైనా యాంటిబయోటిక్ కంటి చుక్కలు మందు (ciprofloxin or gentamycin or ofloxine Eye drops),
Tab Doxycyclin 100 mg 2 tabs per day 5-7 days ... or
Tab Ofloxine +Tinidazole (OFX tz) 1 tab twice daily for 5-7 days,
Oint ment Neosporin రాత్రి పూట పెట్టి పడుకోవాలి .
నొప్పి తగ్గడానికి : Tab. Aceclofen-p ... 1 tab 2 time / day . 2-3 days.
దురద తగ్గడానికి : tab. Cet 10 mg / levi cet 5 mg 1 tab twice / once daily 2-3 days.
వెన్ను నొప్పి ఉన్న వాళ్లకు అవగాహనా నవీన్ నడిమింటి సలహాలు
వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ?,Do we sleep on a bench in backbone pain?
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?(Do we sleep on a bench in backbone pain?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
చాలామంది వెన్ను నొప్పి ఉన్నప్పుడు కేవలం చెక్కబల్ల పైనే పడుకోవాలేమోనని అనుకుంటారు. అయితే అలా చేయడంవలన కండరాలు, ఎముకలు ఒరుసుకు పోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది. మరికొంతమంది పరుపు లేకుండా పడుకోవాలనే ఉద్దేశ్యంతో నేలమీద పడుకుంటారు.
అయితే పడుకున్న తరువాత నేలమీద నుంచి లేవా ల్సివస్తే వంగాల్సి వస్తుంది. దీనివల్ల నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైగా నేలనుంచి చల్లదనం, తేమవంటివి శరీరానికి చేరి నడుము కండరా లను మరింత బిగుసుకునేలా చేస్తాయి. వాస్తవానికి మంచం బేస్ అనేది కుంగిపోకుండా, స్థిరంగా ఉంటే చాలు.
మంచి మందపాటి ప్లైవుడ్ షీట్ను మంచం బేస్గా ఉపయోగిస్తూ పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది.
వాటర్ బెడ్స్, ఆర్థోపెడిక్ బెడ్స్ వంటి వాటి వలన ఉపయోగం ఉంటుంది కానీ అవిచాలా ఖరీదుతో కూడి నవి.
జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు
వెన్ను నొప్పి దీర్ఘకాలంనుంచి బాధిస్తున్నప్పుడు రోజు వారీ కార్యక్రమాలన్నింటినీ గమనించండి. ఎక్కడ, ఏ భంగిమలో, ఏ సందర్భంలో నొప్పి వస్తున్నదో కని పెట్టండి. వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తు వుల వలన నొప్పి వస్తుంటే ప్రత్యా మ్నాయ పద్ధతుల గురించి ఆలోచించండి.
నిలబడి పని చేయాల్సి వచ్చినప్పుడు కూర్చుని పని చేయడం, బరువులను మోయాల్సి వస్తే హ్యాండ్సిల్స్ అమర్చుకోవడం వంటి చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారీ కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వర్తించ వచ్చు.
పథ్యాపథ్యాలు
మీరు అధిక బరువును కలిగి ఉంటే తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయండి.
స్థూలకాయం వలన వెన్నుపూసల మీద అదనంగా బరువు పడి నొప్పి తీవ్రతరమవుతుంది.
అధిక బరువును తగ్గించుకోవాలంటే తీపి వస్తువులు, వేపుడు పదార్థాలు, నూనెల వంటివి బాగా తగ్గించాలి.
తగిన వ్యాయామాన్ని చేయాలి. సూచనల మేరకు మందులు వాడాలి.
ఉదరంలో గ్యాస్ అధికంగా తయారైతే వెన్ను మీద వత్తిడి ఎక్కువ అవుతుంది.
అందుకే గుడ్డు, శనగపిండి వంటకాలు, ఉల్లి, చిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోస కాయ, మసాలాలు, పచ్చి సలాడ్స్ వంటి గ్యాస్ను తయారు చేసే వాతకర ఆహారాలను తగ్గించాలి.
మధుమేహం ఉన్నవారు పాదాలు నొప్పి వాపు పరిష్కారం మార్గం
డయాబెటిక్ ఫుట్ , Diabetic Foot
మధుమేహం ఉన్నప్పుడు పాదాలను గాజుకాయలా చూసుకోవాలి. కానీ చాలా మంది 'నాకెందుకు వస్తుందిలే'.. 'ఇన్నేళ్ల నుంచీ నాకు ఏ ఇబ్బందీలేదు.. ఇక ముందూ రాదు' అన్న ధీమాతో ఉంటారు. నిర్లక్ష్యం చేస్తారు. అంటే చేజేతులారా సమస్యను కొనితెచ్చుకోవటమే. ఒక సారి పుండుపడితే మానదు. కాబట్టి నాకే సమస్యా రాదన్న ధోరణి వదిలిపెట్టాలి. పాదాల సమస్య వచ్చే అవకాశముందని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50 శాతం చేతులారా కొని తెచ్చుకుంటున్నవేననీ, జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లు తీసేయడమనేది సగానికి సగం తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి తరచూ క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం ఎంత అవసరమో నిత్యం కాళ్లను పరిశీలించుకోవటం, సంరక్షణ చర్యలు తీసుకోవటం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి.
పదేళ్లకంటే ఎక్కువ కాలం మధుమేహం ఉన్నవారిలో సహజంగానే కాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కాళ్లలోని నాడులు (నరాలు), తర్వాత కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటికితోడు శరీరంలో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. ఈ మూడింటి ఫలితమే.. పాదాల సమస్యలు. వీటిని ఇంగ్లీషులో డయాబెటిక్ ఫుట్ అంటారు.
ఏం జరుగుతుంది?
కాళ్లలో నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా చెబుతుంటారు. దూదిమీద స్తున్నట్టుందనీ,
ఇసుక మీద నడుస్తున్నట్టుందనీ, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని చెబుతుంటారు. రాత్రిపూట నిద్రలో కాళ్లు మంట మంటగా అనిపిస్తుండడం దీని ముఖ్య లక్షణం.
కాలి చెప్పు జారిపోతుండడం, గుండు సూదులు గుచ్చినట్లుండడం, తిమ్మిర్లు ఎక్కటం, చీమలు పాకుతున్నట్టు అనిపించడం. ఇవన్నీ పాదాల సమస్యలున్న వారు తరచూ
చెప్పేవే. మధుమేహ బాధితుల్లో నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు... నరం మీదుండే 'మైలిన్' అనే పూత, నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే 'యాక్సోప్లాజమ్' పదార్థం పోవడం. దీని వల్లే సంకేతాలకు అంతరాయం ఏర్పడుతుంది. నరాలు పనిచేయడానికి శక్తి అవసరం. అందుకు ప్రతీ నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలుంటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల నాడులు సమర్థవంతంగా పనిచేయవు. ఫలితంగా కాళ్లకు స్పర్శ తగ్గుతుంది. ఇక దెబ్బ తగిలినా సరే దాని తీవ్రతా, బాధా రోగికి తెలియదు. దీంతో అశ్రద్ధ చేస్తారు. పదేళ్లకు పైబడి మధుమేహం ఉంటే (నియంత్రణలో ఉన్నా సరే) రక్తంలో కొవ్వు పదార్థం, చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు సన్నబడతాయి. దీనికి తోడు రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకుని, కాళ్లకు రక్తప్రసారం తగ్గుతుంది.
దీర్ఘకాలంపాటు రక్తంలో ఉండిపోయే చక్కెర వివిధ నాళాలతో, కణజాలంతో చర్యజరిపి, వాటిని దెబ్బతీస్తుంది. దీన్ని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ప్రోడక్ట్స్ అంటారు. వీటికి తోడు
రక్తాన్ని పంపింగ్ చేసే గుండెకు కాళ్లు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి కాళ్లకు అందే పరిమాణం తగ్గుతుంది. ఇవన్నీ కలిసి సమస్యను జటిలం చేస్తాయి.
ముందే ఎలా గుర్తిస్తాం ?
కాళ్లలో రక్తప్రసారం తగ్గుతోందా? అన్న విషయాన్ని ముందే గుర్తించొచ్చు. దీనికి చీలమండల దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ, మోచేతి కీలు దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ
కొలవాలి. చేతుల్లో ఉండే రక్తపోటు కంటే కాళ్లలో ఉండే రక్తపోటు తగ్గకూడదు. దీన్ని కోలవడానికి 'డాప్లర్' అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. దీంతో రక్తనాళాల్లోని పీడనం, రక్తం వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది లేకపోతే డాక్టర్ల దగ్గరుండే సాధారణ రక్తపోటు మిషన్ల సహాయంతో కూడా కొలవచ్చు. ఏటా డాప్లర్ పరీక్ష చేయించుకుంటూ, రక్తప్రసారం
తగ్గుతున్న విషయాన్ని ముందే గుర్తిస్తే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి, నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటిస్ రోగుల
శరీరంపై పుండు పడి, త్వరగా మానకుంటే అది నయమ్యే వరకూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడం మేలు. దీంతో గాయం త్వరగా మానుతుంది. గాయమైనప్పుడు విశ్రాంతి
కోసం కదలకుండా ఉండాలి. కాబట్టి శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తగిన మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం మేలు. పుండు మానిన తర్వాత పరిస్థితిని బట్టి డాక్టరు సలహా మేరకు కొందరు మళ్లీ బిళ్లలు వాడొచ్చు.
ప్రత్యేక చెప్పుల అవసరం ఏమిటి?
మధుమేహం దీర్ఘకాలం ఉన్నప్పుడు పాదాలపైన చర్మం ఉల్లిపొరలా, పల్చగా తయారవుతుంది. పైగా కాళ్లకు స్పర్శ సరిగ్గా తెలియదు. కాబట్టి పాదానికి రక్షణ అవసరం. సాధారణ చెప్పులు ఈ పనిని సమర్థవంతంగా చేయలేవు. మధుమేహ బాధితుల కోసం ఎటువంటి పాదరక్షలు నిజమైన రక్షణను ఇస్తాయనే అంశంపై పరిశోధనలు జరిగాయి. ప్రత్యేక మెటిరీయల్తో తయారు చేసిన చెప్పులు మధుమేహ రోగులకు ఎంతో తోడ్పడతాయిని వెల్లడైంది.
చాలా మంది తమ సైజు చెప్పులు లేకున్నా కూడా వేసుకుంటారు. చెప్పుల్లో తేడా ఉంటే పెద్దగా పట్టించుకోరు. సర్దుకుపోతారు. దీని వల్ల మామూలు వారికి నష్టం లేదోమోగానీ, 'డయాబెటిక్ ఫుట్' ఉన్నవాళ్లకు సమస్యే. మధుమేహం ఉన్నవాళ్లు తమకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సున్నితమైన చెప్పులు వాడడమే మంచిది. ఈ
చెప్పులు..పాదం మీద ఒకచోటే ఒత్తిడి పడకుండా అన్ని వైపులా సమానంగా పడేలా తయారు చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ చెప్పుల్లో మూడు భాగాలుంటాయి. కింద- తేలికైన, దృఢమైన పియు (పాలియురెథేన్) సోల్ వాడుతున్నారు. దీని వల్ల మేకులు, ముళ్ల వంటివి దిగే అవకాశం లేదు. రెండోది- మన పాదం చెప్పుకు ఆనుకునే
కింది భాగంలో మైక్రోసెల్ పాలిమర్, మైక్రోసెల్ రబ్బర్ 'ఇన్సర్ట్' పెడుతున్నారు. దీని వల్ల పాదంపై ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఈ ఇన్స్టర్ను మామూలు చెప్పుల్లో పెట్టుకుంటారు. కానీ అది స్లిప్ అయిపోతుంది. మూడోది- లెదర్గానీ, కుట్లుగానీ పాదానికి తగలకుండా పైనంతా 'క్రాస్లింక్ పాలిమర్ షీట్'తో లైనింగ్ ఇస్తున్నారు. దీంతో పాదానికి పైనా, కిందా కూడా ఎక్కడా రాపిడి, గరుకుదనం తగలవు. మన అరికాళ్లల్లో ఒకపక్క గొయ్యిలా ఉండే ప్రాంతం ఉంటుంది కదా.. దానికి సపోర్టుగా కింది నుంచి ఉబ్బెత్తుగా 'ఆర్చ్' ఇస్తున్నాం. దీనివల్ల మడమ మీద ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వృద్ధుల్లో తరచూ కాళ్లు కొద్దిగా వాస్తుంటాయి. అలాంటప్పుడు చెప్పులు నొక్కుకుపోయి, పుళ్లు పడుతుంటాయి. అందుకని చెప్పులు పైన వదులు చేసుకోవడానికి వీలుగా 'వెల్క్రో స్ట్రిప్స్' ఇస్తున్నారు. వీటి సైజు పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఈ చెప్పులతో వాకింగ్ చేయవచ్చు. ఒక వేళ పుండుపడితే ఆ పుండు చెప్పుకు తగలకుండా, ఆ ప్రాంతంలో మెత్తటి 'సిలిపోస్' మెటీరియల్ను ఉంచుతున్నారు. ఇది నునుపుగా ఉండి, పుండుపై నేరుగా ఒత్తిడి పడనివ్వదు. డయాబెటిక్ చెప్పులు చెమట పీల్చకపోవడమే ఉత్తమం. ఎందుకంటే చెమట పీల్చుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత ఏ చిన్న దెబ్బతగిలినా అది గాయంలో చేరి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. అందుకని చెమట పీల్చుకోనివే మంచివి.
పుండుపడకుండా ఏం చేయాలి?
* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
* కాళ్లను, పాదాలను రోజూ రెండు పూట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కాలి వేళ్ల మధ్య, అరికాళ్లు కూడా జాగ్రత్తగా కడుక్కోవాలి.
* కడిగిన తర్వాత ఏమాత్రం తేమ లేకుండా తుడుచుకోవాలి. పొడిగా ఉండడానికి పౌడర్ రాసుకోవడం మంచిది.
* సాక్స్ వేసుకునే వాళ్లయితే నైలాన్వి వేసుకోవద్దు. కాటన్ మేజోళ్లే వాడాలి.
చెప్పులకూ, పాదానికి మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు వంటివి బయటకు రాకుండా రోజూ పరిశీలించాలి.
* మడమపై ఒత్తిడి పెంచే చెప్పులు వేసుకోవద్దు. మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను వాడడం మంచిది.
* పాదానికి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయక, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
* చెప్పులు లేకుండా నడవొద్దు. మట్టి రోడ్లు, పొలాల గట్లు, పంటచేలలో కూడా చెప్పులు వేసుకోవాలి.
* కాలి గోళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
*బస్సులు, కార్లలో ఎక్కువసేపు కూర్చుని ప్రయాణం చేయడం వల్ల కాళ్లలో నీరు చేరి ఉబ్బుతాయి. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చుని
ప్రయాణాలు చేయకూడదు.
* రోజూ టబ్బులో గోరువెచ్చని నీళ్లుపోసి, దానిలో 'బిటడిన్ సొల్యూషన్' కలపాలి. ఆ నీళ్లలో ఇరవై నిమిషాలు కాళ్లు పెట్టుకుని కూర్చుని, తర్వాత పొడిబారేలా
తుడుచుకోవాలి. వేళ్ల మధ్య పౌడర్ అద్దాలి. గాయం ఉంటే వదులుగా కట్టుకట్టాలి.
పుండుపడితే ఏం చేయాలి?
* డయాబెటిక్ ఫుట్ సమస్య ఉన్నవారికి కాలి మీద పుండు పడితే... పాదానికి విశ్రాంతి కల్పించాలి. చాలా మంది పుండు పడిన తర్వాత మధుమేహాన్ని
తగ్గించుకునేందుకు వ్యాయామం పేరిట సరైన చెప్పులు లేకుండా నడక ప్రారంభిస్తారు. అలా చేస్తే పుండు మరింత పెరిగి పెద్దది అవుతుంది.
* కాలి రక్తనాళాలు దెబ్బతిని, రక్తప్రసారం సరిగా ఉండదు. కాబట్టి నోటి ద్వారా, లేదా ఇంజక్షన్ ద్వారా తీసుకునే మందు గాయం వరకు చేరుతుందో లేదో అనుమానమే !
కాబట్టి కాలికి విశ్రాంతిచ్చి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
* గాయాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. 'సెలైన్'తో కడగడం ఉత్తమం. లేకపోతే మరగకాచి, చల్లార్చిన గోరువెచ్చటి నీటిలో చాలా కొద్దిగా (0.9 శాతం) ఉప్పు కలిపి దాంతో కడగవచ్చు. ఈ నీళ్లలో ద్రావకాలేవీ కలపకూడదు.
* కడిగిన తర్వాత తేమ లేకుండా దూదితో అద్దాలి. దానిపైన ఏదైనా పౌడర్ చల్లితే చెమట పీల్చుకుంటుంది. తేమ మిగిలిపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి.
* కట్టు కొద్దిగా వదులుగా కట్టాలి. పుండుకు ఎండ తగలనిస్తే త్వరగా మానే అవకాశాలుంటాయి. దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* రోజూ డాక్టరు దగ్గరకు వెళ్లడం కష్టం కాబట్టి. ఎవరికి వారే కట్టు కట్టుకోవటం నేర్చుకోవాలి. తరచూ డాక్టర్కు చూపించడం అవసరం.
* పుండ్ల విషయంలో సాధారణ ఆరోగ్యవంతులకు చేసే చికిత్స వేరు. మధుమేహం ఉన్న వారికి చేసే చికిత్స వేరు.
* గాయంపై స్పిరిట్ వేయకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వేయకూడదు. అంతగా వేయాల్సి వస్తే బాగా పల్చన చేసి వేయాలి.
* కొంత మంది బోరిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి పేస్టులా చేసి పుండుమీద కట్టుకడతారు. దీని వల్ల పుండు ఆరోగ్యవంతమైన కణజాలంతో, ఎర్రగా తయారవుతుంది గానీ, ఆ మర్నాటికే అది నల్లగా డెడ్ టిష్యుగా మారిపోతుంది. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది.
* చీము ఉన్నా నొక్కటానికీ, సూదితో గుచ్చటానికీ, 'కట్' చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ పైపైకి వ్యాపిస్తూ గాయం మోకాలికి పాకుతుంది. పాదాన్ని, కాలును పైపైకి తొలుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక గ్యాంగ్రీన్ ఏర్పడిందంటే సమస్య మరీ తీవ్రం. కాబట్టి మరీ అవసరమైతే రక్తప్రసారానికీ మరో మార్గం ఏర్పాటు చేసి అప్పుడు కట్ చేయాలి.
* పుండు మానిన తర్వాత మళ్లీ కొత్త పుండు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని వదలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా కూడా దాన్ని నియంత్రించొచ్చు. దీన్ని టోటల్ కాస్ థెరపీ అంటారు. దీని వల్ల నడవడానికి వీలుండదు. కాలిపై బరువు, ఒత్తిడి పడదు. పుండు త్వరగా మానుతుంది.
సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగం ఏమిటే
cycling as exercise -సైకిల్ తొక్కడము వల్ల ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cycling as exercise -సైకిల్ తొక్కడము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వ్యాయామం మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.
ప్రయాణ సాధనాల్లో అన్నిటికన్నా అద్భుతమైనది బైసికిల్ అంటే అతిశయోక్తి కాదు. అది కేవలం ప్రయాణ సాధనమే కాదు అతి తక్కువ ఖర్చుతో శరీరానికి అవసరమైన వ్యాయామాన్ని అందించే సాధనం కూడా! రక్తపోటు, నరాలు లాగడం, వెన్ను నొప్పి, పాదాలు, మడమల నొప్పి, కీళ్ల నొప్పులు, మెడనొప్పి, మానసిక వ్యాకులత లాంటి లెక్కలేనన్ని శారీరక, మానసిక వ్యాధులను అడ్రసు లేకుండా తరిమి కొట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దివ్యౌషధం ఈ వాహనం. ఇది అత్యంత సురక్షితమైనది కూడా.
సురక్షితంగా లేని సైకిల్ తొక్కే పరిస్థితులు :
- ప్రతికూల వాతావరణం-గాలి ,వాన , దూళి , దుమ్మి .,
- వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం-ప్రమాదాలు సంభవించే అవకాశాలు ,
- ఎత్తుపల్లాలు-,
- గోతులతో ఉండే రోడ్లు,
- ఇరుకైన వీధులు,
- అపాయకారి గల్లీలు,
- స్టార్లయితే జనం పెట్టే ఇబ్బందులు ,
- ముప్ఫై ఏళ్ల పైబడిన గృహిణులు సైకిల్ తొక్కడాన్ని వంకర దృష్టితో చూసే వాళ్లు ,
- కారు ఉండే సంపన్నులు సైకిల్ తొక్కాలంటే నామోషీగా ఫీలవడం..................................ఇలాంటి వాటిలో కొన్ని.
హెల్త్ బైసికిల్ :
అయితే సైకిల్ తొక్కడం చక్కటి వ్యాయామమే కాక సర్వరోగ నివారణి కూడా. వ్యాయామం కోసమో, లేదా ఆరోగ్య దృష్టితోనో, బాడీ ఫిట్నెస్కోసమో సైకిల్ను ఉపయోగించే వారు బయట తొక్కే సైకిల్నే వాడాల్సిన పని లేదు. ఇలాంటి వారికోసం ఇంట్లోనే కదలకుండా ఉంచి సైకిల్లాగా తొక్కే బైసికిల్ వచ్చింది. అదే హెల్త్ బైసికిల్. దీన్ని సులభంగా ఇంటి గదిలోపల ఉంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొక్కవచ్చు.ఎలా మొదలెట్టాలి?...ఈ హెల్త్ బైసికిల్ను ప్రారంభంలో నెమ్మదిగా తొక్కడం ప్రారంభించి క్రమంగా వేగం పెంచుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు ఎవరైనా వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు, వాంతులు, జలుబు, విరేచనాలు, జ్వరం, మూలశంక లాంటి వ్యాధులతో బాధపడే వారు సైక్లింగ్ చేయరాదు. సైకిల్ తొక్కడానికి ముందు తేలికగా టిఫిన్ చేయాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కావలినంతగా నీళ్లు తాగవచ్చు. ఫ్యాన్ వేసుకోవచ్చు కానీ ఎసి వద్దు. ఎదురుగా టీవీ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుంది.
సైకిల్ తొక్కడానికి ముందు జాగ్రత్తలు /సూచనలు :
- ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆదుర్దా లేకుండా ప్రశాంతంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాలి.
- ఇరవై నిమిషాల సైక్లింగ్ చాలు. గంటకు 15 కిలోమీటర్ల వేగం ఉంటే సరిపోతుంది.
- ఒకే సారి సైకిల్ తొక్కడాన్ని నిలిపివేయరాదు. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రావాలి.
- లూజ్గా ఉండే దుస్తులు వేసుకోవాలి.
- నాలుగు రోజులు చేసి వదిలిపెట్టి మళ్లీ ప్రారంభించడం లాంటివి చేయకూడదు.
- క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
- మనసుకు ఆహ్లాదంగా ఉండే మ్యూజిక్ లేదా సినిమా పాటలు లాంటివి వింటూ కూడా సైక్లింగ్ చేయవచ్చు.
- ఇక సైక్లింగ్ ప్రారంభించడానికి ముందు మీ ఎత్తుకు తగినట్లుగా సీట్ను అడ్జెస్ట్ చేసుకోండి.
- 15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్ చేయాలి. చెమట ఎక్కువగా ఉంటే ఆపి చెమట తుడుచుకుని మళ్లీ ప్రారంభించవచ్చు.
- హ్యాండిల్ బార్పై చెయ్యి ఉంచి వంగరాదు.
- వీపు, నడుము నిటారుగా ఉంచాలి.
- ప్రతిసారీ పెడల్ తొక్కేటప్పుడు కాళ్లను నేరుగా చేస్తుండాలి.
ఉపయోగాలు
- గుండె కొట్టుకోవడాన్ని సక్రమంగా ఉంచడంతో పాటు హృద్రోగాలకు దూరంగా ఉంచుతుంది.
- రక్తపు పోటు, బిపిలను అదుపులో ఉంచడంలో జాగింగ్కన్నా కూడా ఎక్కువ పరిణామకారి. దీనివల్ల కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు.
- పొట్ట సైజు, కొవ్వును తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి మంచి సాధనం.
- శరీరం కింది భాగానికి ఎక్కువ వ్యాయామం లభించి కాళ్లు దృఢంగా తయారవుతాయి.
- ఈ సైక్లింగ్ వల్ల అరగంటలో 330 కేలరీలు ఖర్చవుతాయి. అందువల్ల నడకకన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది.
- దీని వల్ల కూర్చోవడం, లేవడం, నడవడం, నిలబడ్డం లాంటి అనేక శారీరక ప్రక్రియలు సులభమవుతాయి.
- అజీర్ణం లాంటి సమస్యలు దూరమవుతాయి.
- మనిషిలో నిరాశను తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.
- స్ర్తిలలో బహిష్టుకు ముందు వచ్చే నొప్పి, ఇబ్బందులను దూరం చేస్తుంది.
- ఉత్తమ ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీరాకృతి ఇచ్చే ఈ హెల్త్ బైసికిల్ 30 ఏళ్లకే లావుగా తయారయి పోతున్న నేటి ఆధునిక మధ్య వయసు మహిళలకు అద్భుత వ్యాయామ సాధనం .
- వెన్నెముక సక్రమంగా ఉంటుంది.
- బాడీ షేప్ కూడా ఆకర్షణీయంగా తయారవుతుంది.
నష్టాలు /కష్టాలు :
- మధుమేహం సమస్య ఉన్న వారికి ఈ సైక్లింగ్ నిషిద్ధం-వీరికి నడక వ్యాయామము మంచిది .
- ఒకే చోట సైక్లింగ్ చేయడం బోర్ కొట్టవచ్చు.
- శరీరం పైభాగానికి వ్యాయామం లేక పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.
- హెల్త్ బైసికిల్ ధర ఎక్కువ అయినందున దిగువ, మధ్యతరగతి వారికి భారం కావచ్చు.
- తెల్లవారుజామునే లేచి వాకింగ్, జాగింగ్ లాంటివి చేయలేని వారు, బిజీ రోడ్లపై న, గతుకుల రోడ్లపైన సైకిల్ తొక్కడం కష్టం.
- అన్ని వయసుల వారూ సీటుపై కూర్చుని ఎలాంటి కష్టమూ లేకుండా సైక్లింగ్ చేసే వీలుండదు .
- ధన్యవాదములు
- మీ నవీన్ నడిమింటి
- 970 370 666 0
- ==============================
- *సభ్యులకు విజ్ఞప్తి*
- ******************
- ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
- https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
స్కిప్పింగ్ ఎక్సర్సిస్ వాళ్ళు ఉపయోగం ఏమిటే
Skipping as Exercise, స్కిప్పింగ్ మంచి వ్యాయామము ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు
- స్కిప్పింగ్ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుంది.
- శరీరంలో వుండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.
- దీనిని చేయడం వల్ల మనస్సు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి.
- రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
- చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.
- ఊబకాయాన్ని నియంత్రించేందుకు స్కిప్పింగ్ చేయాలి .
- పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. ఇక్కడ డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించేయవచ్చును .
- స్కిప్పింగ్ చేసిన తరువాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతుంది.
- స్కిప్పింగ్ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.
- స్కిప్పింగ్ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
- చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
- చిన్న వయసువారు స్కిపింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.
- అధిక రక్తపోటు వారు ఈ వ్యాయామం చేయకూడదు.
- సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు ఏ మాత్రం చేయకూడదు. పూర్తిగా కొలుకున్నాము అనుకున్న తరువాత మాత్రమే స్కిపింగ్ చేయాలి. లేదా
- మూడు నెలలు తరువాత వైద్యుల సలహా మేరకు స్కిప్పింగ్ చేయవచ్చు.
- హెర్నియా రోగులు స్కిప్పింగ్ చేయకూడదు.
- గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకూడదు.
తోక ఎముక నొప్పి నివారణ నవీన్ సలహాలు
Coxodynia , తోక ఎముక నొప్పి తీసుకోవసిన జాగ్రత్తలు , కాక్షోడినియా
మనిషికి తోక ఉండదు కాని తోకలాంటి భాగము వెన్నేముక వెన్నెముకలో ఉంటుంది . వెన్నెముక చివర త్రిభుజాకారం లో అంతమయ్యే ఎముక అది . దాని నొప్పితో కొంతమంది బాధపడడుతుంటారు . ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తే శరీర బరువు ప్రభావము ఆ ఎముకవీద పడి బాధిస్తుంది . వైద్యభాషలో దీనిని " కాక్సీడినియా" అంటారు . ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కుర్చీలో కూర్చొని చేస్తున్నవే .
వీపు చిట్టచివర కాళ్ళు రెండుగా చీలేచోట వేలుపెట్టి నొక్కినప్పుడు బాధ అనిపించినా , మూత్రవిసర్జన సమయం లో లేదా ఆ తర్వాత లేచి నిలుచుంటున్నప్పుడు ఆ భాగము లో నొప్పి అనిపించినా మీలో ఇబ్బంది మొదలైందని గుర్తించంది . ఈ నొప్పి తొడలలోకి , కొన్ని సమయాలలో పురజాలలోకి ప్రాకవచ్చును .
శరీర బరువు అధికంగా క్లవారికి ఈ ఇబ్బంది అధికం ,
ఎక్కువ దూరము డ్రైవింగ్ చేసే వాళ్ళలోనూ ఇది కనిపిస్తుంది .
కొన్ని రకాలమందులు వాడడం వల్ల నూ ఇది రావచ్చును .
ఎక్కువకాలము మలబద్దకం తో బాధపడే వారు కొంద్రిని ఇది నొప్పిగా ఉండవచ్చును .
కాక్సిక్స్ ఎముక కు దెబ్బలు తగిలిన దాని చుట్టు ఉన్న నెర్వస్ ఇర్రిటేషన్ వలన కలుగ వచ్చును .
చికిత్స :
- కూర్చున్న పొజిషన్ నుండి పడుకునే పొజిషన్ కి మారడం వలన నొప్పి తగ్గును ,
- విరోచనం మందం అవకుండ పీచుపదార్ధాలు తీసుకోవాలి ,
- కూర్చునే కుర్చీ మెత్తగా ఉండే టట్లు చూసుకోవాలి ,
- డ్రైవింగ్ లో కొన్ని మెలకువలు పాటించాలి ,
- Butaproxyvon gel /ointment నొప్పిదగ్గర రాయాలి .
- Tab . Trim (tramadol + paracetamol ) రోజుకి 2 చొ.. వారం రోజులు వాడాలి ,
- వేడి నీళ్ళ కాపడం పెట్టవచ్చును ... నొప్పి తగ్గుతుంది .