22, డిసెంబర్ 2019, ఆదివారం

గ్యాస్ట్రిక్ సమస్య నివారణ


  1. అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

    Why You Must Avoid Deep Fried Foods?సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిలో బాగా నూనెలో వేయించిన ఆహారాలు మీ పొట్టకు హాని కలిగిస్తాయి. జంక్ ఆహారం తిన్న తర్వాత పొట్టలో నొప్పి, కొంత అసౌకర్యం కలుగుతుంది. దీనికి కారణం బాగా వేయించిన ఆహారంలో కొవ్వు అధికంగా వుండి మీకు అధిక కేలరీలు చేరుస్తుంది. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు పదార్ధాలు తక్కువగా తినాలి. వాటికొరకు ప్రత్యేకంగా ఇష్టపడకండి. ఈ ఆహారాలు మీకు గ్యాస్ సమస్యలు, ఇతర పొట్ట అసౌకర్యాలు కలిగిస్తాయి.

    జంక్ ఫుడ్ వలన వచ్చే సమస్యలు!
    గుండె మంట - బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినండి.
    గ్యాస్ సమస్యలు - పొట్ట లైనింగ్ లో మంట వస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు అజీర్ణం, వాంతులు, వికారం, బరువు తగ్గటం, కడుపు ఉబ్బరించటం, ఆకలి లేకపోవుట, త్రేన్పులు గా వుంటాయి. అధిక వేపుడు ఆహారం తింటే పొట్ట గ్యాస్ ఏర్పడి త్వరగా నిండిపోయిందనుకుంటాం. కనుక వేపుడులు లేదా జంక్ ఫుడ్ బాగా తగ్గించండి.
    కడుపులో పుండ్లు - పొట్ట లోపలి భాగంలో లేదా పెద్ద పేగు పైన పుండ్లు వస్తాయి. వీటిని పెప్టిక్ అల్సర్ అంటారు. పైలోరి అనే బాక్టీరియా ఈ సమస్య కలిగిస్తుంది. దీనికి కారణం వేపుడు ఆహారాలు పొట్టలో ఎసిడిటీ, పుండ్లు కలిగించడమే. కనుక జంక్ ఫుడ్ మాని పొట్ట సమస్యలు తగ్గించుకోండి. వేపుడులు తింటే పొట్ట యాసిడ్లు కూడా పెరుగుతాయి. ఇవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది.
    అజీర్ణం - పొట్టలో అసౌకర్యం మొదలై అది అజీర్ణానికి దోవతీస్తుంది. ఇది తీవ్ర సమస్య కానప్పటికి సాధారణ సమస్య. ఇది ఫ్యాటీ ఫుడ్ అంటే యాసిడ్ కలిగి పొట్టకు బరువుగా వుంటుంది. ఈ పొట్ట సమస్య ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మెల్లగా తింటూ తగ్గించుకోవచ్చు. మీ ఆహారం మీరు బాగా నమిలితే, అది తేలికగా జీర్ణం అవుతుంది మీ పొట్ట సమస్యలు తగ్గిస్తుంది.
    జంక్ ఫుడ్ బదులుగా వండిన ఆహారాలు - జంక్ ఫుడ్ అధికమైతే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకుగాను బాగా వేయించిన ఆహారాలు వదలండి. బదులుగా వండిన లేదా ఉడికించిన పదార్ధాలు తినండి. నొప్పి కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకొని చక్కని ఆహార ప్రణాళిక రూపొందించండి.

    మీరు ఏ రకం ఆహారాలు తినాలి? శాకాహారాలైన, తోటకూర, బచ్చలికూర, బ్రక్కోలి, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి అధికంగా తినాలి.

    వివరించిన ఈ సమస్యలు గ్యాస్, అధిక యాసిడ్ల ఉత్పత్తి తగ్గించే వేపుడు ఆహారాలు ఎందుకు తినరాదో తెలుపుతాయి.

    పొట్టలో గ్యాస్ ఏర్పడితే ఏం చేయాలి నవీన్ సలహాలు ?

    Effects of Gas In Stomachనేటి రోజులలో పొట్టలో గ్యాస్ ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ప్రతివారూ కూల్ డ్రింకులు తాగడం లేదా బేకరీ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ లు అధికంగా తినటంతో అజీర్ణం, మలబద్ధకం వంటివి ఏర్పడి పొట్టలో గ్యాస్ పుడుతుంది. పొట్టలో గ్యాస్ వున్నపుడు ఏమీ చేయలేము. అది తోచనివ్వదు, స్ధిమితంగా వుండలేము. ఈ సమస్యకు కారణం జీవనశైలిలో మార్పు అని గ్రహించాలి.

    గ్యాస్ ఏర్పడటానికి కారణాలను మరింత వివరంగా పరిశీలిస్తే, వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే అతిగా నిద్రపోవడం, కొన్ని మందుల వలన జీర్ణాశయంలో, కొన్ని సూక్ష్మ జీవుల వలన అని చెప్పవచ్చు. గ్యాస్ ఏర్పడితే, పైనుండి నోటి ద్వారా త్రేన్పులవలన లేదా కిందనుండి అపాన వాయువగా గాని బయటికి పోవాలి. లేకుంటే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఇన్ ఫెక్షన్ లోపంవంటివాటి వల్ల, కార్బోహైడ్రేట్లు అంటే దుంపకూరలు, పప్పులు వంటివి ఎక్కువగా వాడడం వల్ల పేగులలో వుండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది.
    కడుపు ఉబ్బరిస్తుంది. ఆయాసంకలుగుతుంది, గుండెలో మంట, తేన్పులు వస్తాయి.

    కడుపు ఉబ్బరాన్ని నివారించడానికిగాను వ్యాయామం అతిముఖ్యమైంది. అందుకుగాను ప్రతి రోజు అరగంట నుండి ఒక గంట వరకు ఉదయం, లేక సాయంత్రంవేగంగా నడవాలి. లేదా అరబిక్, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రించరాదు. ఆహారానికి నిద్రకు ఉపక్రమించటానికి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే ఆహారాలు తగ్గించాలి. మసాలాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఒకే సమయానికి మితంగా ఆహారం తినాలి. ఈ చిట్కాలతో గ్యాస్ ఏర్పడటం తగ్గకపోతే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వా
  2. ధన్యవాదములు 
  3. మీ నవీన్ నడిమింటి 
  4. *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
     మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
    ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
    https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


Loading
  1. అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

    Why You Must Avoid Deep Fried Foods?సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిలో బాగా నూనెలో వేయించిన ఆహారాలు మీ పొట్టకు హాని కలిగిస్తాయి. జంక్ ఆహారం తిన్న తర్వాత పొట్టలో నొప్పి, కొంత అసౌకర్యం కలుగుతుంది. దీనికి కారణం బాగా వేయించిన ఆహారంలో కొవ్వు అధికంగా వుండి మీకు అధిక కేలరీలు చేరుస్తుంది. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు పదార్ధాలు తక్కువగా తినాలి. వాటికొరకు ప్రత్యేకంగా ఇష్టపడకండి. ఈ ఆహారాలు మీకు గ్యాస్ సమస్యలు, ఇతర పొట్ట అసౌకర్యాలు కలిగిస్తాయి.

    జంక్ ఫుడ్ వలన వచ్చే సమస్యలు!
    గుండె మంట - బాగా వేయించిన ఆహారాలు అనేక సమస్యలు తెస్తాయి. వాటిలో గుండె మంట ఒకటి. తరచుగా వేపుడు ఆహారాలు తింటే ఛాతీలో కిందిభాగంలో మంట వస్తుంది. అది పొట్టకు కూడా వ్యాపిస్తుంది. దీనినే గుండెమంట అంటారు. గుండె మంట తరచుగా వస్తూంటే, సమస్యలు ఎక్కువవుతాయి. అటువంటి సమస్యలు రాకుండా వేపుడు ఆహారాలు తగ్గించి, ఉడికించిన ఆహారం తినండి.
    గ్యాస్ సమస్యలు - పొట్ట లైనింగ్ లో మంట వస్తే గ్యాస్ సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు అజీర్ణం, వాంతులు, వికారం, బరువు తగ్గటం, కడుపు ఉబ్బరించటం, ఆకలి లేకపోవుట, త్రేన్పులు గా వుంటాయి. అధిక వేపుడు ఆహారం తింటే పొట్ట గ్యాస్ ఏర్పడి త్వరగా నిండిపోయిందనుకుంటాం. కనుక వేపుడులు లేదా జంక్ ఫుడ్ బాగా తగ్గించండి.
    కడుపులో పుండ్లు - పొట్ట లోపలి భాగంలో లేదా పెద్ద పేగు పైన పుండ్లు వస్తాయి. వీటిని పెప్టిక్ అల్సర్ అంటారు. పైలోరి అనే బాక్టీరియా ఈ సమస్య కలిగిస్తుంది. దీనికి కారణం వేపుడు ఆహారాలు పొట్టలో ఎసిడిటీ, పుండ్లు కలిగించడమే. కనుక జంక్ ఫుడ్ మాని పొట్ట సమస్యలు తగ్గించుకోండి. వేపుడులు తింటే పొట్ట యాసిడ్లు కూడా పెరుగుతాయి. ఇవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది.
    అజీర్ణం - పొట్టలో అసౌకర్యం మొదలై అది అజీర్ణానికి దోవతీస్తుంది. ఇది తీవ్ర సమస్య కానప్పటికి సాధారణ సమస్య. ఇది ఫ్యాటీ ఫుడ్ అంటే యాసిడ్ కలిగి పొట్టకు బరువుగా వుంటుంది. ఈ పొట్ట సమస్య ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మెల్లగా తింటూ తగ్గించుకోవచ్చు. మీ ఆహారం మీరు బాగా నమిలితే, అది తేలికగా జీర్ణం అవుతుంది మీ పొట్ట సమస్యలు తగ్గిస్తుంది.
    జంక్ ఫుడ్ బదులుగా వండిన ఆహారాలు - జంక్ ఫుడ్ అధికమైతే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకుగాను బాగా వేయించిన ఆహారాలు వదలండి. బదులుగా వండిన లేదా ఉడికించిన పదార్ధాలు తినండి. నొప్పి కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకొని చక్కని ఆహార ప్రణాళిక రూపొందించండి.

    మీరు ఏ రకం ఆహారాలు తినాలి? శాకాహారాలైన, తోటకూర, బచ్చలికూర, బ్రక్కోలి, బీన్స్, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పెరుగు వంటివి అధికంగా తినాలి.

    వివరించిన ఈ సమస్యలు గ్యాస్, అధిక యాసిడ్ల ఉత్పత్తి తగ్గించే వేపుడు ఆహారాలు ఎందుకు తినరాదో తెలుపుతాయి.

    పొట్టలో గ్యాస్ ఏర్పడితే ఏం చేయాలి నవీన్ సలహాలు ?

    Effects of Gas In Stomachనేటి రోజులలో పొట్టలో గ్యాస్ ఏర్పడటం సర్వసాధారణమైపోయింది. ప్రతివారూ కూల్ డ్రింకులు తాగడం లేదా బేకరీ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ లు అధికంగా తినటంతో అజీర్ణం, మలబద్ధకం వంటివి ఏర్పడి పొట్టలో గ్యాస్ పుడుతుంది. పొట్టలో గ్యాస్ వున్నపుడు ఏమీ చేయలేము. అది తోచనివ్వదు, స్ధిమితంగా వుండలేము. ఈ సమస్యకు కారణం జీవనశైలిలో మార్పు అని గ్రహించాలి.

    గ్యాస్ ఏర్పడటానికి కారణాలను మరింత వివరంగా పరిశీలిస్తే, వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే అతిగా నిద్రపోవడం, కొన్ని మందుల వలన జీర్ణాశయంలో, కొన్ని సూక్ష్మ జీవుల వలన అని చెప్పవచ్చు. గ్యాస్ ఏర్పడితే, పైనుండి నోటి ద్వారా త్రేన్పులవలన లేదా కిందనుండి అపాన వాయువగా గాని బయటికి పోవాలి. లేకుంటే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. జీర్ణవ్యవస్థ, పేగుల ఇన్ ఫెక్షన్ లోపంవంటివాటి వల్ల, కార్బోహైడ్రేట్లు అంటే దుంపకూరలు, పప్పులు వంటివి ఎక్కువగా వాడడం వల్ల పేగులలో వుండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది.
    కడుపు ఉబ్బరిస్తుంది. ఆయాసంకలుగుతుంది, గుండెలో మంట, తేన్పులు వస్తాయి.

    కడుపు ఉబ్బరాన్ని నివారించడానికిగాను వ్యాయామం అతిముఖ్యమైంది. అందుకుగాను ప్రతి రోజు అరగంట నుండి ఒక గంట వరకు ఉదయం, లేక సాయంత్రంవేగంగా నడవాలి. లేదా అరబిక్, స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. నీళ్లు బాగా తాగాలి. రాత్రిపూట ఆహారం తిన్న వెంటనే నిద్రించరాదు. ఆహారానికి నిద్రకు ఉపక్రమించటానికి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే ఆహారాలు తగ్గించాలి. మసాలాలు, బేకరీ ఆహారాలు తగ్గించాలి. ఒకే సమయానికి మితంగా ఆహారం తినాలి. ఈ చిట్కాలతో గ్యాస్ ఏర్పడటం తగ్గకపోతే, వైద్యులను సంప్రదించి తగిన మందులు వా
  2. ధన్యవాదములు 
  3. మీ నవీన్ నడిమింటి 
  4. *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
     మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
    ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
    https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/




20, డిసెంబర్ 2019, శుక్రవారం

కామెర్లు మూర్చ ఫ్రీ గా ట్రీట్మెంట్

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/
==================
👉 మూర్ఛ వ్యాధికి కామెర్లకు  ఉచితంగా మందులు ఇవ్వబడును
***********************
 ప్రతి ఆదివారం ఉదయం, మూర్ఛ వ్యాధి, కామెర్ల వ్యాధికి, ఆకు పసరు మందు ఉచితంగా ఇవ్వబడును.
 పై సమస్యలు ఉన్న వాళ్ళు, ఉదయం పరగడుపున టీ కాఫీలు అల్పాహారం సేవించు కుండా  రావాలి.మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ మీ వెంబడి తెచ్చుకోండి. ఎందుకంటే మందు తిని మజ్జిగ తాగా వలసి వస్తుంది. శనివారం ఫోన్ చేసి, తెలియజేసి రావలెను. పై రెండు సమస్యలకు ఎలాంటి పైకము తీసుకోకుండా ఉచితంగా ఇస్తారు.
 👉కామెర్ల వ్యాధికి మూడు ఆదివారాలు మందు తీసుకోవాలి
👉 మూర్ఛ వ్యాధికి ఆరువారాలు మందు తీసుకోవాల్సి వస్తుంది.
 పచ్చను ఏమి తినాలి ఏమి తినకూడదు అనె  వివరాలు
 మీకు మందు ఇచ్చేటప్పుడు తెలియజేస్తారు.
అనువంశిక వైద్యులు చింత రఘునాథ్ రెడ్డి గారు. ఈ సమస్యలకే కాకుండా, తెల్లబట్ట,
 మలబద్దక సమస్య లు, వాత నొప్పులు  మొదలగు వాటికి కూడా వైద్యం చేయబడును. మరి కొన్ని హెల్త్ ప్రొడక్ట్ కూడా వీరి దగ్గర దొరుకుతాయి.వీటికి అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లా వాసులు, కర్ణాటక వాసులు ఈ అవకాశాన్ని వినియోగించు వలసినదిగా కోరుతున్నాను ఈ ప్రాంతం వారికి దగ్గర పడుతుంది కాబట్టి.

👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
 మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
 మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి
 గ్రామీణ వైద్యులనుప్రోత్సహించండి
 వారి సేవలను గుర్తించండి
👉 వైద్యుని చిరునామా:-
చింతా రఘునాథ రెడ్డి,
 గ్రామం :-ఊట్కూరు,
 మండలం :-పరిగి
 తాలూకా :- హిందూపురం
జిల్లా  :-అనంతపురం. (AP)
 ఫోన్ నెంబర్:-8099266166
=====================
 తెలంగాణలో పై సమస్యలకు ఇక్కడ కూడా మందు ఇవ్వబడును
🔹 మద్యపానం మానడానికి, మూర్ఛ వ్యాధికి, కామెర్లకు, క్యాన్సర్ కు ఆదివారం ఉచితంగా మందులు ఇవ్వబడును
👉 చిరునామా:-
 మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్
 భీమారం, చింతగట్టు.
 కరీంనగర్ రోడ్డు. హనుమకొండ
 హనుమకొండ బస్టాండ్ నుండి 8కిలోమీటర్ల దూరం ఉంటుంది.
 వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు ఉంటా ది.
 కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా ది
👉 ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి.

 👉ఫోన్ నెంబర్-984941040


 జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం

చలి కాలం జలుబు దగ్గు ఇతర సమస్య కు జాగ్రత్తలు సలహాలు

*చలి కాలం లో వచ్చే  అన్ని రకాల జ్వరాలు మరియు దగ్గు జలుబు &అధిక  బరువు  తగ్గటానికి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

1.జ్వరాలు - నల్ల జీలకర్ర
-----------------
నల్ల జీలకర్ర ను మెత్తగా చూర్ణించి
పూటకు అరటీ స్పూన్ పొడిని వేడి వేడిపాలలో కలుపుకొని తాగుతూ వుంటే అయిదారు రోజుల్లో అన్ని రకాల జ్వరాలు, పాత జ్వరాలు కూడాహరించిపోతయ్.

2.జ్వరాలకు వేప:--

వంద గ్రాములు వేప చెట్టు మాను
బెరడును కచ్చాపచ్చాగా నలగొట్టి,
అరలీటర్ మంచినీళ్ళలో వేసి,
పావులీటర్ నీళ్ళు మిగిలేవరకు
మరిగించి గుడ్డలో వడపోయాలి.
చల్లార్చిన తర్వాత అందులో 50 గ్రా
తేనె కలిపి, జ్వరం వచ్చిన వారిచేత
తాగించాలి. తాగిన వెంటనే చెమటలుపట్టి జ్వరం దిగిపోతుంది. అవసరమైతేరెండవ రోజు కూడా ఇలాగే చేస్తే ఏజ్వరమైనా సునాయాసంగా తగ్గిపోతుంది. పిల్లలకు వయసును బట్టి
మోతాదు తగ్గించి  ఇవ్వాలి

*3.- విరేచనాలు తగ్గడానికి*
     👉పాత బెల్లం ఆవాలు ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి అర చెంచా మోతాదుగా రెండు పూటలా తింటుంటే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.
👉 పాత బెల్లం అల్లం సమభాగాలుగా తీసుకొని దంచి రోజూ రెండు పూటలా అరచెంచా మోతాదుగా తీసుకొని నీళ్లు తాగుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

*4.-నోటిపూతకు*
   
1. వస చూర్ణం 50 గ్రాములు
2. ధనియాల చూర్ణం 50 గ్రాములు
3.లోద్దుగచెక్క 50 గ్రాములు
ఈ మూడు సమభాగాలు కొంచెం మంచి నీళ్ళతో మెత్తగా నూరి
ఆ గంధాన్ని నోట్లు పూచిన చోట పట్టిస్తూ ఉంటే నోటి పూత తగ్గిపోతుంది.
" ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి

 *5.-అధిక బరువు నడకతో తరుగు*

నగరంలో ప్రతి 10 మందితో ఏడుగురున్నారు.సహజంగా పురుషుల కంటే మహిళలే ఈస్టోజన్ హార్మోను ఎక్కు
వగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమ
వుతోంది. దీంతో మహిళలు తక్కువ
 తిన్నా లావు అవుతున్నట్లు బాధపడుతుంటారు. ఇంటి పనికి ఒంటి బరువు కు సంబంధం లేదు వ్యాయాయం లేకపోవడం కారణమే వంట చేయగామిగిలినవి, ఫ్రిజ్ లో పెట్టుకొనితర్వాత వేడి చేసుకొని తినడం,రోజుకు నాలుగైదుసార్లు టీ, కాఫీలు తాగడం వలన బరువు పెరిగి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాను.

👉• అధిక బరువు వలన పని -
చేసుకోలేరు. కొంచెంసేపు
పనిచేసినాఅలసిపోతుంటారు. కొద్ది
దూరం నడిచినా ఆయాసం
వస్తుంది.
👉బరువు చికాకు పెరిగి రక్త
పోటు కూడా వచ్చేప్రమాదం ఉంది.
👉ఒక రకమైన ఆత్మన్యూనతా
భావానికి గురవుతుంటారు.
👉నివారణ చర్యలు
🔹ఎంత తీరిక లేని పని ఉన్న రోజు
తప్పనిసరిగా అరగంటసేపు నడవాలి
🔸 అరగంటసేపు నడిస్తే 🏃‍♀200 క్యాలరీలుకరుగుతాయి. ప్రతిరోజు 500 క్యాలరీల శక్తిని కరిగించాలి.
🔹నూనె పదార్థాలు తక్కువగా తినాలి.పోషకాలు ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు, చిక్కుడు గింజలు, కూరగాయలు , పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
🔹 టీ, కాఫీ తగ్గించాలి. రోజుకు
ఒకసారి తీసుకుంటే చాలు.
🔸🏃‍♀ ముఖ్యంగా మీరు వాకింగ్ చేసి వచ్చిన వెంటనే కాఫీ తాగకూడదు. ఏదైనా పళ్లరసాలు తాగండి.

https://www.blogger.com/u/1/blogger.g?blogID=7084904128746559076#allposts

థైరాయిడ్ సమస్య పై అవగాహనా సలహాలు నవీన్ నడిమింటి

🙏థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి శుభవార్త,
========================
 మీరు థైరాయిడ్ సమస్యతో  బాధపడుతున్నారా? జీవితాంతం మీరు ఇక గోలీలు వాడనవసరం లేదు. ఆయుర్వేదం ఔషధం ద్వారా
 మీరు రెండు పూటలా ఒక చెంచా చూర్ణాన్ని మంచినీళ్లతో సేవిస్తూ ఉంటే, మూడు నుంచి నాలుగు నెలల్లో శాశ్వతంగా థైరాయిడ్ తగ్గిపోతుంది. మీరు100 ఎం జి లోపల  మాత్రలు వాడుతుంటే,
 ఆయుర్వేద మందు వాడిన 20 రోజుల తర్వాత టాబ్లెట్స్ ను వాడడం ఆపివేయాలి.
 అల్లోపతిలో మీరు జీవితాంతం వాడవలసి వస్తుంది. కానీ నేను ఇచ్చే ఔషధం వాడుట వలన కేవలం మూడు నుంచి నాలుగు నెలలో
 పూర్తిగా తగ్గిపోతుంది.
పత్యం - మాంసాహారాలు పూర్తిగా మానివేయాలి. ఇక అన్ని రకాల కూరగాయలు తినవచ్చు.
  మందు కావలసినవారు సంప్రదించండి. కొరియర్ ద్వారా పంపిస్తాను.
 సమయం లేనప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి 

నెగిటివ్ మైండ్ నుండి ఎలా బయట పడాలి నవీన్ నడిమింటి సలహాలు

*నెగిటివ్ థాట్స్ పోవాలంటే..   ఆ మాయ నుంచి బయటపడే మార్గం నవీన్ నడిమింటి సలహాలు*.
            కొన్నిసార్లు ఏ పనీ చేయాలన్పించదు.. చాలా బద్ధకంగా ఉంటుంది. అలాగే చాలా నెగిటివ్ ఎమోషన్లలో కొట్టుకుపోతూ ఉంటాం.
   
*👉మీరు ఆఫీస్‌లో చేసే వర్క్ ఇంట్లో కూడా చేస్తుంటారా ?* ఇంట్లో ల్యాప్‌టాప్ ముందేసుకుని ప్రాజెక్ట్ వర్క్ పేరుతో అర్థరాత్రి వరకూ నిద్ర మేల్కొని ఉంటారా ? ఈ కేటగిరీలో మీరు కూడా ఉంటే నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే ఇది. యూనివర్సిటీ ఆఫ్ బెర్జిన్ దాదాపు 16, 426 వర్క్‌హాలిక్స్‌పై సర్వే జరిపింది. ఈ సర్వేలో ఆందోళన కలిగించే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫీస్ వర్క్ ఇంట్లో చేసేవాళ్లలో అత్యుత్సాహ థోరణే కారణమని తేలింది. ఇలాంటి వారిని భార్యాపిల్లలు కూడా పట్టించుకోరట. అలాంటి వర్క్‌హాలిక్స్ కూడా సంపాదనకే పరిమితమై… బంధాలకు దూరమవుతారని సర్వే వెల్లడించింది. ఇలా ఇళ్లలో కూడా ఆఫీస్ పనులను చక్కబెట్టేవాళ్లలో 32.7 శాతం మంది ఈ కోవలోకే వస్తారట. 8.9 శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని సర్వే వెల్లడించింది.
*👉మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్యాన్ని పొందాలి అనే ఒక దృఢ‌మైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.*
* ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
* తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని త్రాగాలి.
* 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి.
* 10 నిముషాల పాటు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి.
* స్నానానికి గోరువెచ్చని నీళ్ళను ఉపయోగించాలి.
* 9 గంటల్లోపు అల్పాహారం పోషకాలు ఉండేట్లు పుష్టికరంగా తీసుకోవాలి.
* 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి.
* 9 గంటల్లోపు రాత్రి భోజనం ముగించుకోవాలి.
* సి -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి, నారింజ, కమల, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, బెర్రీస్ తీసుకోవాలి.
* రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి.
* భోజనంలో ఆకుకూరలు, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి.
* బయట దొరికే జంక్‌ఫుడ్‌కి పూర్తి దూరంగా ఉండాలి.
*మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
*👉చాలా మంది చిన్న విషయం కు చాలా ఆందోళన ...ఆందోళన ఆందోళన ఆందోళన ఆందోళన .....వెళ్లడం కారణం*

నిజానికి ఆందోళన మనల్ని సమస్య పరిష్కారం వైపు వేగంగా నెడుతుంది. శక్తియుక్తులన్నీ ఒకే సమస్యపై లగ్నమయ్యేలా చేస్తుందంటున్నారు మానసిక నిపుణులు.

మంచి జరుగుతుంది..' అన్నభావన మనకు తక్షణ శక్తినివ్వొచ్చు. కానీ ఆపదంటూ వచ్చినప్పుడు అది సమస్యకు పరిష్కారం వెతక్కుండా చేస్తుంది.

వ్యక్తి స్థాయిలో అభివృధ్ధి చాలా ముఖ్యం. వ్యక్తి  ఎదుగుదల అనేక సామాజిక సమస్యలకు సరైన పరిష్కారం. కానీ చాలా సందర్భాల్లో మనం ఎదగడం కన్నా సమాజం గురించి ఎక్కువ physical, mental energyలను వృధా చేస్తుంటాం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

పాదాలు వాపు ఉన్న అప్పుడు తీసుకోవాలిసి జాగ్రత్తలు

*పాదాల వాపు మరియు నొప్పి వాళ్ళు నడవడం కష్టం అయినా అప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు*

పాదాలు వాచుకోవడాన్ని పాదాల వాపు అని కూడా
పిలుస్తారు. అది ఎక్కువ ద్రవం  లేదా నీరు పేరుకుపోవడానికి సంకేతం. పాదాలు, చీలిమండలలో నొప్పి లేనట్టి వాపు సాధారణ సమస్య. ఇది ప్రధానంగా వయసు మళ్లిన వారిలో మరియు గర్భిణులలో కనిపిస్తుంది. వాపు దానికి అది ఒక వ్యాధి కాదు.  అయితే అది వ్యాధి కారకానికి ముఖ్యమైనట్టి సంకేతం లేదా సూచన కావచ్చు. ఇట్టి వాపునకు వ్యాయామం, బరువు తగ్గించుకోవడం , పెచ్చుపెరిగే జబ్బులకు మందులు , ఆహారంలో మార్పులు  మరికొన్నింటి ద్వారా చికిత్స నిర్వహిస్తారు
*👉పాదాల వాపు యొక్క లక్షణాలు* -
      వాపు పాదమునకు గానీ లేదా చీలమండ ప్రాంతానికి గాని  సంబంధించి నొప్పి లేకుండా  ఉండి కాలముతో పాటు నొప్పి పెరిగితే , చర్మం రంగు మరియు చర్మం నిర్మాణంలో మార్పు రావచ్చు. జబ్బుఇతర లక్షణాలు చర్మం ఉష్ణోగ్రత పెరగడం,  తాకినప్పుడు వేడి స్పర్శ  కలగడం, పుండు ఏర్పడటం మరియు చీము ఉత్సర్గం వంటివి.

చర్మాన్ని వేలుతో క్రిందికి నొక్కినప్పుడు గుంట లేదా మాంద్యం ఏర్పడుతుంది, తర్వాత వేలును తీసినప్పుడు గుంటమూతబడి చర్మం వాపుతో కూడిన యధాస్థితికి వస్తుంది.

షూ మరియు సాక్స్ తీసిన తర్వాత పాదాల చర్మంపై కనిపించే చిన్న గుంటలు ( మాంద్యానికి గురైనట్టి ప్రాంతాలు) వాపునకు ముఖ్యమైన సంకేతం

గుంటలు నల్లగా ఉండి వాటి చుట్టూ గల చర్మం సాధారణ చర్మం రంగు కంటే లేతగా ఉంటుంది.
*👉పాదాల వాపు యొక్క చికిత్స* -
ఎక్కువ సమయం నిలబడిన కారణంగా వాపు ఏర్పడినప్పుడు దానిని విశ్రాతి తీసుకోవడం ద్వారా లేదా పాదాలను ఎత్తులో ఉంచడం ద్వారా నయం చేసుకోవచ్చు. పడుకొన్నప్పుడు మీ కాళ్లను తలదిండుపై గుండె కంటె ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా ఉంచుకోండి..

వాపు వేడి వాతావరణం కారణంగా ఏర్పడితే  మీరు దానిని సులభంగా నివారించవచ్చు, దానికోసం  వేడి వాతావరణానికి దూరంగ ఉండండి. మీ పాదాలను చల్లగా ఉంచుకోంది, దీనికై 15-20 నిమిషాలపాటు మీ పాదాలను చల్లని నీటిలో ఉంచండి.

పాదాల వాపు గుండె జబ్బుల కారణంగా ఏర్పడితే, లేదా ద్రవం నిలవడం వల్ల జరిగితే,  మీ డాక్టరు ఉప్పు వాడకాన్ని నియంత్రిఛమని సలహా ఇవ్వవచ్చు.(తక్కువ ఉప్పుతో ఆహారం) మరియు ఎక్కువగా నీరు త్రాగమని సూచించవచ్చు.

మీ శరీరపు బరువు ఎక్కువ కావడం వల్ల కూడా పాదాల వాపు కావచ్చు. ఈ సందర్భంగా మీ డాక్టరు తగిన ఆహారాన్ని తీసుకోమని, వ్యాయామం చేయమని  చెప్పవచ్చు. ఇవి శరీరపు బరువును తగ్గిస్తాయి.

గర్భం కారణంగా వాపు ఏర్పడితే, ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అయితే తీవ్రమైన వాపును నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎక్లాంసియా (మూర్చ) కారణంగా ప్రబలి ఉండవచ్చు.

వాపు ఉన్న చోట వీలయిన వెంటనే ఐసును 15- 20 నిమిషాలపాటు ఉంచండి. తర్వాత ఈ ప్రక్రియను మూడు నాలుగు గంటలకు ఒకమారు కొనసాగించంది.. ఈ చర్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.

తీవ్రమైన గాయాల సందర్భంగా డాక్టరు బలవంతంగా తోయడం, శస్త్రచికిత్స మరియు ప్రక్రియలు మరియు హెచ్చు నొప్పి నివారణకై విశ్రాంతి సూచించవచ్చు

నొప్పితో కూడిన వాపు సందర్భంగా మీ డాక్టరు నొప్పి నివారణ మాత్రలను సూచించవచ్చు. అవి పారసెటమాల్ మరియు ఇబుప్రొఫెన్ వంటివి. తర్వాత విశ్రాంతి సూచించవచ్చు

వ్యాయామం  హెచ్చు రక్తప్రసారానికి వీలు కల్పిస్తుంది మరియు శోషరస ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది దీనితో  మీ డాక్టరు లేదా ఫిట్ నెస్ నిపుణుని  సలహాతో కనీసం రోజుకు ఒక వ్యాయామం చేయడం ప్రారంభించండి వాకింగ్ లేదా జాగింగ్ వంటి ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి

పాదాలలో వాపు అనగా పాదాలలో ద్రవం పేరుకుపోవడం.  పాదం, చీలమండ మరియు కాలు వాపు గురించి చెప్పడానికి నొప్పి కలిగిన చోట వాటిని వేలితో నొక్కినప్పుడు గుంట పడుతుంది.
పాదాల వాపు చాలా సాధారణమైన  జబ్బు. మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే లేదా ఎక్కువ దూరం  నడిస్తే జబ్బుకు చికిత్స అవసరం లేదు. అయితే, వాపు ఎక్కువ కాలం ఉండి, ఇతర లక్షణాలతో కలిసి కనిపిస్తే, అంటే శ్వాసక్రియకు ఇబ్బంది, నొప్పి లేదా అల్సర్లు కనిపిస్తే అవి జబ్బు  తీవ్రరూపంలో ఉన్నదనడానికి సంకేతం.
మీ పాదాలలో ఒకటిగానీ లేదా రెండు కూడా గానీ వాచుకొంటే అది అసౌకర్యానికి, నొప్పికి, దైనందిన కార్యకలాపాలు జరపడానికి ఇబ్బంది కలిగిస్తుంది. మీరు గర్భంతో ఉన్నట్లయితే  పాదాలు సహజంగా వాపునకు గురవుతాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీ శరీరంలో  సాధారణ స్త్రీ కంటే హెచ్చుగా నీరు నిల్వ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే, రోజు చివరన నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అది తల్లికి, లేద శిశువుకు తీవ్రమైన సమస్య కానప్పటికీ తల్లికి అసౌకర్యంగా ఉంటుంది.
పాదాలలో వాపును కేశనాళిక వడపోతలో పెరుగుదలకు పోల్చవచ్చు. దీనివల్ల  పాదాల వాపు మందుల కారణంగా ప్రబలి ఉంటే లేదా రోగలక్షణం నిర్ధారణ అయితే డాక్టరును సంప్రతించడం అవసరం.
*💊పాదాల వాపు కొరకు మందులు*

1.-Telsartan HTELSARTAN H 40MG TABLET
2.-Telma HTELMA H 40MG TABLET
3.-Co DiovanCo Diovan 160 Mg/25 Mg Tablet
4.-Tazloc TrioTazloc Trio 40 Mg Tablet
5.-Hopace HHOPACE H 10MG TABLET
6.-S0LasixLASIX 150MG INJECTION 15ML
7.-PolycapPOLYCAP CAPSULE 8.-FrumideFrumide 40 Mg/5 Mg Tablet
9.-Misart HMISART H 40/12.5MG TABLET 10.-FrumilFrumil 40 Mg/5 Mg Tablet
  ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కిడ్నీ సమస్య లు ఉన్న వారికీ తీసుకోవాలిసిన జాగ్రత్త లు

*తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అవగాహనా కోసం నవీన్  నడిమింటి సలహలు*

         మూత్రపిండాల ప్రాధమిక కర్తవ్యం రక్తం నుండి వ్యదార్థాలను తొలగించడం, తద్వారా అవి మూత్రం ద్వారా శరీరం నుండి తొలగించబడతాయి. మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమవడంతో పాటు పూర్తిగా మూసివేయబడితే అది చాలా తక్కువ మూత్ర ఉత్పత్తికి దారితీసింది, దానిని తీవ్ర మూత్రపిండాల వైఫల్యం అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

శరీరంలో మూత్ర ఉత్పత్తి మరియు ద్రవం నిలుపుదల తగ్గుతుంది. ఇది చేతులు మరియు కాళ్ళు, లేదా ముఖం లో వాపు గా కనిపిస్తుంది.

శ్వాస ఆడకపోవడం, వికారం, మరియు వాంతులు కూడా సాధారణం.

ఆకలి తగ్గిపోవడం, మానసిక గందరగోళం, మరియు బలహీనత ఒక వ్యక్తి చూపించే ఇతర లక్షణాలు.

అధిక రక్తపోటును కూడా కలిగి ఉండవచ్చు, చేతి స్పర్శను తగ్గిస్తుంది మరియు గాయాలు నయం కావడానికి ఆలస్యం అవ్వవచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గితే తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం సంభవించవచ్చు.

మూత్ర నాళాలలో అడంకులు మూత్రపిండాలు నుండి మూత్రాశయం వరకు మూత్రాన్ని మృదువు ప్రవేశించడాన్ని నిరోధిస్థాయి. కాలక్రమేణా, మూత్రం ఒకటి లేదా రెండు మూత్రపిండాలలో ఎక్కువగా చేరి మూత్రపిండాల వాపుకు చేరతాయి (హైడ్రోనెఫ్రోసిస్). ఇది కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగిస్తుంది.

రసాయనాలు లేదా భారీ లోహాల లేదా మూత్రపిండాల కణజాలంపై శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే గ్లోమెరులోనెఫ్రిటిస్ వంటి స్వయం ప్రతిరక్షక దాడుల పరిస్థితులు ఏర్పడతాయి. మూత్రపిండాలకు ఏదైనా గాయం అవ్వడం కూడా మూత్రపిండ వైఫల్యాన్ని కలిగించవచ్చు.

తీవ్ర మూత్రపిండాల వైఫల్యం యొక్క అభివృద్ధి ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాలు:

తీవ్రమైన డీహైడ్రేషన్ .

తక్కువ రక్తపోటు.

ఆస్పిరిన్ వంటి మందులు.

మధుమేహం

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
తీవ్ర మూత్రపిండాల వైఫల్య నిర్ధారణ ఈ క్రింది పరిశోధనలను కలిగి ఉంటుంది:

వైద్యుడు శరీరం యొక్క వేర్వేరు ప్రాంతాల్లో వాపు మరియు ఇతర లక్షణాలకు పరిశీలిస్తాడు.

యూరియా, పొటాషియం మరియు సోడియం స్థాయిని అంచనా వేయడానికి రక్త, మూత్ర పరిశోధనలు నిర్వహిస్తారు. క్రియటిన్ (creatine) స్థాయిల అంచనా కూడా కీలకమైనదే.

ఒక వ్యక్తి మూత్రపిండాల వైఫల్యం యొక్క సంకేతాలను చూపించినట్లయితే, వైద్యులు గ్లోమెర్యులర్ ఫిల్ట్రేషన్ రేట్(Glomerular Filtration Rate) (GFR) ను తనిఖీ చేయడానికి కూడా పరిశోధనలకు ఆదేశిస్తాడు. ఇది మూత్రపిండాల యొక్క రక్తం వేడకట్టే లెక్కను తెలియజెస్తుంది మరియు మూత్రపిండాల వైఫల్యాన్ని నాటకీయంగా తగ్గిస్తుంది.

మూత్రపిండ అల్ట్రాసౌండ్, MRI, CT స్కాన్, మరియు ఉదర X- రే వంటి ఇతర పరీక్షలు ఉన్నాయి.

*తీవ్ర మూత్రపిండాల వైఫల్య చికిత్స:*

మూత్రపిండాల వైఫల్యం యొక్క చికిత్స మూలాధారమైన కారణం మరియు మూత్రపిండాల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం పై దృష్టి పెడుతుంది.

ప్రధానంగా, వైద్యులు ద్రవం, ఉప్పు, మరియు ప్రోటీన్ తీసుకోవడం తగ్గించడానికి ఆహారం లో మార్పులను సిఫారసు చేస్తారు.

శరీరంలో ద్రవం నిలుపుదల నివారించే ఔషధాలు డయ్యూరిటిక్స్. కాల్షియం అనుబంధకాలు రక్త పొటాషియం స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

డయాలసిస్ అనే ఒక ప్రక్రియ, ఒక యంత్రం ద్వారా రక్తాన్ని వడకట్టడంలో సహాయం చేస్తుంది. పరిస్థితి యొక్క తీవ్రతపై ఆధారపడి, డయాలసిస్ ఒక వారంలో అనేక సార్లు అవసరమవుతుంది.

*💊తీవ్ర మూత్రపిండాల వైఫల్యం కొన్ని మందులు డాక్టర్ సలహా మేర కు వాడాలి*

 1.-TorsinexTORSINEX A TABLET
2.-S0LasixLASIX 150MG INJECTION 15ML
3.-DytorDYTOR 10MG TABLET
4.-TormisTormis 10 Tablet
5.-FrumideFrumide 40 Mg/5 Mg Tablet
6.-TorsedTorsed 100 Mg Tablet0FrumilFrumil 40 Mg/5 Mg Tablet
7.-TorsemiTorsemi 10 Mg Tablet
8.-AmifruAMIFRU PLUS TABLET
9.-TorsidTorsid 10 Mg Tablet
10.-Exna KExna K 40 Mg/5 Mg Tablet
11.-TorvelTorvel 10 Mg Tablet
12.-TorvigressTORVIGRESS 10MG TABLET
ఆయుర్వేదం లో 👉
.పునర్నవ చూర్ణం కిడ్నీ ఎంత పాడుఅయిన మళ్ళీ ఆరోగ్య వంతంగా చేస్తుంది. పల్లేరు చూర్ణం క్రియటిన్ తగ్గిస్తుంది. చూర్ణాలకు ప్రామాణికం, పేరు తెలియాలి.శుద్దిచేయనవి వాడరాదు. ఉదాహరణకు : విషముష్టి, ఎర్ర చిత్రములం
*మూత్రం వెళ్లినపుడు మంట ఉంటే*
చంద్రప్రభావతి  (ఉదయం, రాత్రి )
చంద్రనసాన (2cap +నీరు )
కర్పూరశీరాజిత్ (3చిటెకలు +తేనే కలపాలి )

 *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://m.facebook.com/groups/113863975967610?view=permalink&id=449683769052294

18, డిసెంబర్ 2019, బుధవారం

శృగారం సమస్య కోసం నవీన్ నడిమింటి సలహాలు

శృంగార సమస్యలకు వాజీకరణ చికిత్సతో చెక్

          మారిన జీవనశైలి కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిడి, డయాబెటిస్‌ వంటి ఆరోగ్య సమస్యలు పురుషులలో లైంగిక పరమైన సమస్యలకు దారితీస్తున్నాయి. వీటిలో ప్రధానంగా అంగస్తంభన సమస్య పురుషులను మానసికంగా కృంగదీస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ వాజీకరణ చికిత్స ద్వారా పురుషులలో ఏర్పడే అన్ని రకాల లైంగిక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఆయుర్వేదం ద్వారా సాధ్యమే.

          పురుషులు బాధపడే శృంగార సమస్యలలో అంగస్తంభన, శీఘ్రస్ఖలన, కోరికలు తగ్గడం ప్రధానమైనవి. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అంగస్తంభన సమస్య. దీనిని ఆయుర్వేదంలో నపుంసికత లేక క్లైభ్యంగా పేర్కొనబడింది. శృంగారంలో పాల్గొన్నపుడు లేక హస్తప్రయోగం చేస్తున్నపుడు అంగం తగినంతగా స్తంభించకపోవడం లేక ఒకవేళ స్తంభించిన చివరివరకు తగినంతగా స్తంభించి ఉండకపోవడాన్ని అంగస్తంభన సమస్యగా చెప్పవచ్చును.

                   ఈ సమస్యతో బాధపడేవారిలో సెక్స్‌ కోరికలు మామూలుగానే ఉంటాయి. మగవారిలో సర్వసాధారణంగా అంగస్తంభన సమస్యతో 30 శాతం మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో 60 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్లమందికిపైనే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

కారణాలు :

              అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, డిప్రెషన్‌తో బాధపడడం జరుగుతుంది.
అంగంలోకి రక్తప్రసరణ జరగకపోవడం అన్నది అంగస్తంభన సమస్యకు ముఖ్యమైన కారణం.

          అంగస్తంభన సమస్య శారీరక, మానసిక కారణాల వల్ల ఏర్పడుతుంది. వీటిలో కూడా 60 శాతం శారీరక కారణాలు, 40 శాతం మానసిక కారణాలుగా చెప్పవచ్చు.
మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్‌, ఫెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ మొదలైన మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
డిప్రెషన్‌, పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్‌ సామర్ధ్యంపైన నమ్మకం లేనందున అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

          ఆల్కహాల్‌ తీసుకోవడం, పొగత్రాగడం, గుట్కాలు నమలడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుంది.
హార్మోన్ల లోపాల వల్ల ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

         అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా నాడులు, రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన సమస్య మిగిలిన వ్యాధుల కంటే ఎక్కువగా ఉంటుంది. నాడీ సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఏర్పడవచ్చు.

         ఎక్కువ కాలం ఇతర వ్యాధులకు వాడిన మందుల వల్ల కూడా 25 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు.
అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్‌, అల్సర్‌, కేన్సర్‌ సంబంధిత వ్యాధులకు, నొప్పి, వాపు తగ్గించే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

ఆయుర్వేద వాజీకరణ చికిత్స :

       అంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శృంగార సమస్యలు, సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారంటే ఆయుర్వేదం ఈ సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెప్పవచ్చు. ఆ విభాగాన్నే ‘వాజీకరణ చికిత్స’గా పేర్కొన్నారు. వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతోపాటు సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

జాగ్రత్తలు :

       అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడి లేకుండా యోగ, వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, పాలు, మినుములతో చేసినవి ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

         ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుండి 6 నెలలపాటు శృంగార సమస్యలపై ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే అంగస్తంభన సమస్యను సులభంగా తొలగించుకోవచ్చు.

రహస్యంగా ఏవో క్యాప్సూల్స్ వేసుకొని సెక్స్ బలహీనతల నుండి బయట పడవచ్చనుకోవడం చాలా తప్పు. "సిరులలో కెల్ల మగసిరి మిన్న, మగసిరి లేని సిరులు నిరర్ధకం. స్త్రీ పురుషుల అన్యోన్యతకు మూలం మగసిరియే కదా".

ఈ విషయంలో సిగ్గు పడుట తగదు. సప్త ధాతు సమతుల్యత లోపించుట వలన, అనారోగ్యము వలన సెక్స్ బలహీనతలు కలుగుతున్నాయి. దీనిని ఆయుర్వేదంలో " వాజీకరణ చికిత్స " అని అంటారు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

మీ పేరు, వయస్సు, చిరునామాలతో పాటు మీ సమస్యను తెలియపరచగలరు.
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

17, డిసెంబర్ 2019, మంగళవారం

Phymosis మగవాళ్ళు సమస్య అవగాహనా కోసం

Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ప్
  •  

  • Phymosis and ParaPhymosis-ఫైమోసిస్ మరియు పేరాపైమోసిస్

జననాంగాలకు సంబంధించిన విషయాల గురించి మన సమాజంలో చక్కటి ఆరోగ్యకరమైన సమాచారం, చర్చ జరిగేదే తక్కువ. అందులో పురుషాంగం చివ్వర ఉండే ముందోలు వంటి చిన్నచిన్న నిర్మాణాల గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు, అందుకు ఇష్టపడరు కూడా. కానీ నిజానికి వీటికి సంబంధించిన విజ్ఞానం తెలిసి ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం. పురుషాంగం చివ్వర ఉండే ఈ సున్నితమైన చర్మాన్ని.. 'ముందోలు' అనీ, 'పూర్వచర్మం' అనీ (ఇంగ్లీషులో ప్రొప్యూజ్‌, ఫోర్‌స్కిన్‌).. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మగబిడ్డ పుట్టిన దగ్గరి నుంచీ పురుషుడికి మలివయసు వచ్చే వరకూ జీవితంలోని ప్రతి దశలోనూ దీనికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. చిన్న పిల్లల్లో ముందోలు బిగుతుగా ఉండి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు రావటమన్నది తరచుగా చూసేదే. అలాగే పెళ్త్లెన కొత్తలో తలెత్తేవి, శృంగార జీవితాన్ని ఉన్నట్టుండి ఇబ్బందిపెట్టే సమస్యలూ కొన్ని ఉంటాయి. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, దీనికి వచ్చే సమస్యల గురించి కొంత తెలుసుకోవటం మంచిది.

పుట్టుకతో అతుక్కునే!
సాధారణంగా మగబిడ్డ పుట్టినపుడు- శిశువు అంగం ముందు భాగానికి (శిశ్నానికి), పైచర్మం అతుక్కొనే ఉంటుంది. మన వేలికి గోరు అతుక్కుని ఉన్నట్టు.. ఇంకా తేలికగా చెప్పుకోవాలంటే పుట్టగానే పిల్లిపిల్ల కనురెప్పలు అతుక్కుని ఉన్నట్టు.. శిశ్నం, దాని మీద చర్మం రెండూ అతుక్కుపోయే ఉంటాయి. పుట్టినపుడు కేవలం 4% మగ పిల్లల్లోనే ఈ ముందోలు చర్మం విడివడి కదులుతుంటుందని, సాధారణంగా మిగతా వారందరిలోనూ ఇవి అతక్కుపోయే ఉంటోందని వైద్యులు గుర్తించారు. బిడ్డ వయసు పెరుగుతున్నకొద్దీ నెమ్మదిగా శిశ్నం, దాని మీదుండే చర్మం క్రమేపీ విడివడతాయి. ఈ రెండూ పూర్తిగా విడివడితేనే.. పూర్వచర్మాన్ని వెనక్కిలాగటమన్నది (రిట్రాక్షన్‌) సాధ్యమవుతుంది. ఇవి పూర్తిగా విడివడటమన్నది 8-9 ఏళ్లకు గానీ పూర్తవదు. కొందరిలో మరి కొంతకాలం కూడా పట్టొచ్చు. కాబట్టి పూర్వచర్మానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే తప్పించి.. 8-10 ఏళ్లు వచ్చే వరకూ కూడా బలవంతంగా ఈ ముందోలును వెనక్కి లాగే ప్రయత్నం చెయ్యకూడదు. అలాంటి అవసరమేమీ ఉండదు. ఒకసారి ఈ రెండూ విడిపోతే శిశ్నం మీద పూర్వచర్మం ముందుకూ, వెనక్కూ తేలికగా కదులుతూ ఉంటుంది.

పూర్వచర్మం అనేది నిజానికి రెండు పొరల కలయిక. దీనిలో పైపొర పొడిగా, పైనుంచి వచ్చే పురుషాంగ చర్మంలాగే ఉంటుంది, లోపలి వైపు మాత్రం ఇది మృదువుగా మన కనురెప్పల్లోని, నోటిలోని జిగురుపొరల్లా ఉంటుంది. దీని నుంచి నిరంతరం కొన్ని స్రావాలు ఊరుతుంటాయి. లోపల ఎప్పటికప్పుడు ఊడి, రాలి పోతుండే మృత చర్మ కణాలూ, ఈ స్రావాలూ కలిసి.. శిశ్నం మీద తెల్లటి ముద్దలా, పెరుగు మీది తరకల్లా ఏర్పడుతుంటాయి. దీన్నే 'స్మెగ్మా' అంటారు. ఒకసారి పూర్వచర్మం విడివడి, దాన్ని వెనక్కి లాగటం సాధ్యమవుతున్న తర్వాత.. తరచుగా దాన్ని వెనక్కి తీసి, ఈ స్మెగ్మాను శుభ్రం చేసుకోవటం అవసరం. మన నాలుక కింద ఉండే కుట్టులా.. పూర్వచర్మాన్ని పురుషాంగానికి అనుసంధానిస్తూ- కిందివైపు చిన్న కుట్టు లాంటిది (ఫ్రెన్యులం) ఉంటుంది. ఈ చర్మం అవసరమైతే సాగేలా, మళ్లీ దగ్గరకు ముడుచుకునేలా ప్రత్యేక నిర్మాణాలూ ఉంటాయి. శిశ్నాన్ని కప్పుకొని ఉండే ఈ పూర్వచర్మం ముందువెనకలకు కదులుతూ.. పురుషాంగం స్తంభించినప్పుడు వెనక్కి వెళుతుంటుంది. ఇది బిగుతుగా ఉంటే సమస్యే.

పిల్లల్లో ఫైమోసిస్‌!
కొందరు పిల్లల్లో పురుషాంగం మీద ఉండే ముందోలు చాలా బిగుతుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. దీన్నే 'ఫైమోసిస్‌' అంటారు. ఈ చర్మం బిగుతుగా ఉండటం వల్ల మూత్రం పోసుకునేటప్పుడు సమస్యలు రావచ్చు. ఈ బిగుతువల్ల మూత్రం పూర్తిగా బయటకు రాకుండా కొంత లోపలే ఉండిపోతుంటుంది. కొన్నిసార్లు మూత్రమార్గ రంధ్రాన్ని కూడా ఇది కప్పుకొని ఉండటం వల్ల మూత్రం ఈ చర్మం కిందకు వెళ్లిపోయి.. మూత్రవిసర్జన సమయంలో పురుషాంగం చివర బెలూన్‌లాగా ఉబ్బుతుంటుంది. అలాగే ముందోలు బిగువుగా ఉన్నవాళ్లు మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం తీసుకుంటారు. మూత్రం ధార కూడా చిన్నగా ఉంటుంది. వీళ్లు బాగా కష్టపడి విసర్జన చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ పూర్వచర్మం, శిశ్నం మధ్య మూత్రం చేరటం వల్ల ఇన్ఫెక్షన్లూ తలెత్తుతాయి. శిశ్నం వాచిపోయి 'బెలనోపాస్టయిటిస్‌' సమస్యకు దారితీయొచ్చు. అరుదుగా ఈ ఇన్ఫెక్షన్‌ మూత్ర నాళం ద్వారా పైకి పాకి మూత్రాశయం, కిడ్నీలకూ వ్యాపించొచ్చు. అందుకే పిల్లలకు పూర్వచర్మం బిగువుగా ఉండి, మూత్రవిసర్జనలో సమస్యలు ఎదురవుతుంటే సత్వరమే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అసవరం.

ఇలా మూత్ర విసర్జన సమయంలో అంగం ముందు భాగంలోని చర్మం ఉబ్బుతున్నపుడు, తరచుగా ఇన్ఫెక్షన్లు, జ్వరం వేధిస్తున్నప్పుడు, మూత్రం ధార సన్నగా వస్తున్నప్పుడు.. వైద్యులు సాధారణంగా సున్తీ చెయ్యటం అవసరమని సిఫార్సు చేస్తారు. దీనికి ముందు కొంతకాలం స్టిరాయిడ్‌ ఆయింట్‌మెంట్ల వంటివి రాసి చూడొచ్చుగానీ దీనికి సున్తీ శాశ్వత పరిష్కారం. సున్తీ ఇష్టం లేనివారికి ముందు చర్మాన్ని కొంత కత్తిరించే (స్లిట్‌) సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.

సున్తీ అనేది చిన్నపాటి సర్జరీ ప్రక్రియేగానీ దీన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయించటం మంచిది. ఈ సర్జరీకి ముందు కొన్ని రక్తపరీక్షలు, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమయం (బ్లీడింగ్‌, క్లాటింగ్‌ టైమ్‌) వంటి పరీక్షలు చేయటం అవసరం. రక్త సమస్యలేవైనా ఉంటే సున్తీ చెయ్యకూడదు. అలాగే పిల్లలకు నొప్పి, బాధ తెలియకుండా మత్తుమందు ఇచ్చి, ముందుగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజక్షన్‌ ఇచ్చి సున్తీ చెయ్యాలి.

సంశయం అక్కర్లేదు..
నిజానికి మగపిల్లలకు పుట్టగానే లేదా చిన్నవయసులోనే చిన్నపాటి సర్జరీ వంటి ప్రక్రియతో ముందోలు తొలగించటమన్నది (సున్తీ) మతాచార కారణాలరీత్యా చాలా సమూహాల్లో, చాలా సమాజాల్లో పరంపరాగతంగా వస్తోంది. సున్తీ వల్ల హెచ్‌ఐవీ వంటి వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గుతోందని, పురుషాంగ క్యాన్సర్లూ రావటం లేదని వైద్యరంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందోలు గురించి, అసలు దీనికేదైనా ప్రాధాన్యం ఉందా? లేదా? అన్నదాని గురించీ వైద్య పరిశోధనా రంగంలోనూ, బయటా కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనికి ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం లేదంటే మరికొందరు జీవపరిణామంలో ప్రాధాన్యం లేని అవయవమేదీ కొనసాగదంటూ రకరకాలుగా విశ్లేషిస్తుంటారు. మరి దేనిమీదా లేనంతటి విస్తృత చర్చ ఈ చిన్న చర్మం పొర మీద జరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ పూర్వచర్మం బిగుతుగా ఉండి ఇబ్బందిపెట్టటం వంటి సమస్య ఏదైనా తలెత్తినప్పుడు ముందోలును తొలగించటానికి సందేహించాల్సిన అవసరం లేదని వైద్యరంగం స్పష్టంగా సిఫార్సు చేస్తోంది.

పెద్దయ్యాకా రావచ్చు
పెద్దవయసులో ముందోలు బిగుతుగా మారి, అది ఫైమోసిస్‌ సమస్యగా తయారవటమన్నది సాధారణంగా మూడు దశల్లో ఎక్కువగా చూస్తుంటాం.

1. పెళ్త్లెన కొత్తలో. ఇది చాలా వరకూ పూర్వచర్మం బిగుతుగా ఉండటం వల్ల సంభోగ సమయంలో నొప్పి, బాధ, గట్టిగా ప్రయత్నిస్తే చర్మం చినిగి, చిట్లినట్లవటం వంటి కారణాల వల్ల వస్తుంది.

2. నడి వయసులో, అంటే 35-40 ఏళ్ల వయసులో పూర్వచర్మం ముందుకూ వెనక్కూ కదలకుండా బిగిసినట్త్లె, వాచి ఫైమోసిస్‌ రావచ్చు. ఈ వయసులో ఇలా వచ్చిందంటే చాలా వరకూ మధుమేహం వచ్చి, దాన్ని గుర్తించకపోవటమే కారణమవుతుంటుంది.

3. వృద్ధాప్యంలో. ఉన్నట్టుండి పూర్వచర్మం వాచి, బిగిసిపోయి 'ఫైమోసిస్‌' రావచ్చు. ఈ వయసులో ఇలా వస్తే అంగం చివరి నుంచి రక్తం, చీము వంటి స్రావాలు వస్తున్నాయేమో చూడటం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు పురుషాంగ క్యాన్సర్‌లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఏ వయసులోనైనా పూర్వచర్మం కదలటం కష్టంగా తయారై, బాధలు మొదలైతే దాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం ఉత్తమం.

యుక్తవయసులో
కొందరికి యుక్తవయసు వచ్చిన తర్వాత కూడా పూర్వచర్మం, అది తెరుచుకునే మార్గం సన్నగా ఉంటుంది. దీంతో పెళ్లయ్యాక శృంగారంలో పాల్గొన్నప్పుడు.. చర్మం బలంగా వెనక్కి లాగినట్త్లె.. ఆ సున్నితమైన చర్మం చిరిగి, గాట్లు పడుతుంది. కొందరికి అంగం మామూలుగా ఉన్నప్పుడు చర్మం తేలికగానే వెనక్కి వస్తున్నప్పటికీ.. స్తంభించినప్పుడు అంగం పరిమాణం పెరిగి చర్మం వెనక్కి రావటం కష్టమవుతుంటుంది. దీంతో చర్మం చిరిగినట్త్లె రక్తస్రావం అవుతుంది. క్రమేపీ ఇది మానిపోవచ్చుగానీ ఆ మానిన చోట చర్మం కొంత బిగువుగా ఉంటుంది. దీంతో ఆ తర్వాత మళ్లీ వెనక్కిలాగినప్పుడు అదే ప్రదేశంలో మళ్లీ చినుగుతుంటుంది. ఇలా తరచూ చిట్లటం, మానటం జరుగుతూ.. ఇదో ఇబ్బందికర వ్యవహారంగా తయారవుతుంది. యుక్తవయసులో, ముఖ్యంగా పెళ్త్లెన కొత్తలో, శృంగారంలో పాల్గొన్నపుడు ఈ సమస్య బాగా బాధిస్తుంటుంది. కొందరికి అసలు ముందోలు వెనక్కే రాకపోవచ్చు, మరికొందరికి కొంత భాగమే వెనక్కి వచ్చి, తరచూ చిరుగుతుండొచ్చు.

చికిత్స: పూర్వచర్మం బిగుతుగా ఉంటే.. రోజూ దాన్ని నెమ్మదిగా, కొద్దికొద్దిగా వెనక్కిలాగేందుకు ప్రయత్నించటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కొందరికి వైద్యులు స్టిరాయిడ్‌ క్రీములు ఇచ్చి.. రోజూ రెండుమూడుసార్లు పూర్వచర్మం మీద రాస్తుండమని చెబుతారు. దీనివల్ల చర్మం పల్చబడి, మృదువుగా వెనక్కిలాగటం తేలికయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరి విషయంలోనూ ఈ క్రీములతో అంత ఉపయోగం ఉండకపోవచ్చు. వీరికి చిన్న సర్జరీ చేసి, పూర్వచర్మాన్ని తీసెయ్యటం (సున్తీ) తేలికైన పరిష్కారం. పాశ్చాత్య దేశాల్లో కొందరు పూర్వచర్మాన్ని తీసేయించుకోవటానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి 'ప్రొప్యూజియోప్లాస్టీ' లేదా 'వై-వీ ప్లాస్టీ' వంటివి చేసే అవకాశం ఉంటుందిగానీ వీటితో ఫలితాలు అంత సహజంగా కనిపించకపోవచ్చు. సున్తీ అనేది సాధారణంగా అక్కడే మత్తు ఇచ్చి చేసేస్తారు, చాలా తేలికైన సురక్షితమైన పద్ధతి, కొద్ది గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. కాకపోతే దీనితో ఉండే ఒకే సమస్య ఒకట్రొండు రోజులు కొంత నొప్పి ఉండొచ్చు. ముఖ్యంగా అప్పటి వరకూ పూర్వచర్మం కింద ఉండిపోయిన శిశ్నం- ఒక్కసారిగా బయటపడినట్లయ్యే సరికి కొద్దిరోజులు అది సున్నితంగా అనిపిస్తూ, ఏది తగిలినా జివ్వుమనటం, బట్టలు వేసుకోవటం కష్టం కావటం వంటి ఇబ్బందులుండొచ్చు. ఇది 5-7 రోజుల్లో దానంతట తగ్గిపోతుంది. ఈ లోపు శిశ్నం మరీ సున్నితంగా అనిపించకుండా, కాస్త మొద్దుబారినట్లయ్యేందుకు దాని పైనరాసే క్రీముల వంటివి ఇస్తారు.

పెళ్త్లెన కొత్తలో కుట్టు తెగితే...
* పెళ్త్లెన కొత్తలో తరచుగా చూసే సమస్య ముందోలుకు కిందగా ఉండే చిన్న కుట్టు తెగిపోవటం. కొందరికి ఇది మరీ చిన్నగా, బిగుతుగా ఉండి.. పెళ్త్లెన కొత్తలో సంభోగానికి ప్రయత్నించగానే అది చినిగినట్త్లె నొప్పి బాధతో పాటు దాన్నుంచి కొద్దిగా రక్తం కూడా వస్తుంటుంది. ఇలా ఫ్రెన్యులం చినిగి, ఇబ్బందిగా ఉన్నవాళ్లు సంభోగ సమయంలో కదలికలు మృదువుగా ఉండేందుకు లూబ్రికెంట్ల వంటివి (కేవై జెల్లీ, లూబిజెల్‌ లేదంటే మామూలు కొబ్బరినూనె అయినా సరే) వాడటం మంచిది. ఫ్రెన్యులం పొట్టిగా ఉండి, సరైన స్రావాలు లేకుండా సంభోగానికి ప్రయత్నిస్తే అదిచినిగే, తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెగినది దానంతట అదే మానుతుంది, అప్పటి వరకూ సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. ఒక వారం పది రోజులకు అది మానిపోతుంది, అప్పుడు లూబ్రికెంట్‌ వాడుకుంటూ మళ్లీ సంభోగానికి ప్రయత్నించొచ్చు. మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తి.. కుట్టు దగ్గర తరచూ చినుగుతుంటే మాత్రం- వీరికి ఇతరత్రా ముందోలు బిగువుగా ఉండటం వంటి సమస్యలేమీ లేకపోతే వైద్యులు 'ఫ్రెన్యులోప్లాస్టీ' అనే చిన్న సర్జరీ చేసి, ఆ కుట్టును తిరిగి దగ్గరకు లాగి సరిచేస్తారు.

బిగిసిపోతే...
* కొత్తగా పెళ్త్లెన వారిలో చాలా తరచుగా చూసే మరో సమస్య... ముందోలు కొంత బిగువుగా ఉండి, సంభోగ సమయంలో అది వెనక్కివచ్చి అక్కడే ఒక రింగులా బిగిసిపోవటం! దీన్నే 'పారా ఫైమోసిస్‌' అంటారు. ఇలా బిగిసిన దాన్ని ముందుకు లాగటం చాలా బాధాకరంగా, కష్టంగా తయారవుతుంది. దీంతో చాలామంది నొప్పికి భయపడి, దాన్ని రెండు-మూడు రోజుల పాటు అలాగే వదిలేస్తారు. ఇది చాలా ఇబ్బందిపెట్టే సమస్య. దీన్ని సాధ్యమైనంత త్వరగా.. అంటే సంభోగం తర్వాత అరగంట లోపైనా మెల్లగా ముందుకు తేవటం మంచిది. అలా చెయ్యకుండా వదిలేస్తే ఆ చర్మం వాచిపోతుంది. ఆ స్థితిలో దాన్ని ముందుకు లాగటం మరీ కష్టం, వదిలేస్తేనేమో వాపు ఇంకా పెరుగుతుంటుంది. రింగులా తయారై ఈ చర్మం వాచినకొద్దీ శిశ్నం మీదా ఒత్తిడి పెరిగి, అదీ వాచిపోవటం ఆరంభమవుతుంది. కొన్నిసార్లు ఆ రింగులాంటి చర్మానికి రక్తసరఫరా తగ్గిపోయి, అది పుండులా తయారవటం వంటివీ జరుగుతాయి. ఈ స్థితిలో సాధ్యమైనంత త్వరగా పూర్వచర్మాన్ని ముందుకు లాగటం ముఖ్యం. అవసరమైతే వైద్యులు ఆ కాస్త ప్రదేశానికీ మత్తు ఇచ్చి అయినా.. దాన్ని ముందుకు తెస్తారు. మరీ ఇబ్బందిగా ఉంటే చిన్న కోతబెట్టి దాన్ని వదులు చెయ్యాల్సి వస్తుంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారికి అవసరమైతే ఆ వాపు, బాధలన్నీ తగ్గిన తర్వాత సున్తీ చేస్తారు.

మధ్యవయసులో..
35-40 ఏళ్ల వయసులో ఈ ముందోలు వాపు, నొప్పి, బిగిసిపోవటం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే 'బెలనోపాస్టయిటిస్‌' అంటారు. ఇలా వస్తే మనం తక్షణం చెయ్యాల్సిన పని- మధుమేహం ఉందేమో పరీక్ష చేయించుకోవటం! ఎందుకంటే మధుమేహుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చాలామందిలో మధుమేహం తొలిసారిగా ఇలాగే బయటపడుతుంటుంది కూడా. మధుమేహుల మూత్రంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మూత్రం పూర్తిగా బయటకు వెళ్లకుండా కొంత లోపలే చేరటం వల్ల ఈ ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయితే నొప్పి, ఎర్రగా వాచిపోవటం వంటి లక్షణాలుంటాయి. యాంటీబయోటిక్స్‌ చికిత్సతో ఇది తగ్గుతుంది. కొందరిలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా క్యాండిడ్‌ వల్ల వచ్చేవే ఎక్కువ. దీని లక్షణం ప్రధానంగా దురద. పెరుగు తరకల్లా తెల్లటి స్రావం వెలువడుతుంటుంది. పెళ్త్లెన వారిలో, ముఖ్యంగా మధుమేహులకు ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎవరికైనా సరే, మధ్య వయసులో 'ఫైమోసిస్‌' వస్తే ముందుగా గ్లూకోజు పరీక్ష చేయించుకొని, మధుమేహం ఉందేమో చూసుకోవాలి. వైద్యులు యాంటీబయాటిక్స్‌ లేదా యాంటీఫంగల్‌ మందులు సిఫార్సు చేస్తారు, వీటితో సమస్య తగ్గిపోతుంది. ఆ తర్వాత మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుని, రోజూ పురుషాంగ శుభ్రత పాటిస్తే ఇబ్బంది మళ్లీ రాకపోవచ్చు. వీరికి చాలావరకూ సున్తీ అవసరం కూడా ఉండదు. అలా కాకుండా తరచూ ఈ సమస్య ఎదురవుతూ, యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తుండటం, మధుమేహం నియంత్రణలో ఉన్నా కూడా ఇన్ఫెక్ఫన్లు రావటం వంటి సందర్భాల్లో వీరికీ సున్తీ చెయ్యటం మంచిది.

తెల్లబడిపోవటం
ముందోలు విషయంలో తరచుగా చూసే మరో సమస్య 'బెలనైటిస్‌ జెరోటికా ఒబ్లిటరాన్స్‌ (బీఎక్స్‌వో)'. ముందోలు చర్మమంతా తెల్లగా తయారై ఇబ్బంది మొదలవుతుంది. మూత్రంలో ఉండే అమ్మోనియా ఎప్పుడూ తగులుతుండటం వల్ల ఈ చర్మం చికాకుకు గురై, ముందోలు, శిశ్నం తెల్లగా తయారవుతాయి. దీనివల్ల పూర్వచర్మం బిగుతుగా కూడా తయారై ఫైమోసిస్‌ రావచ్చు. ముఖ్యంగా తరచూ అమ్మోనియా తగలటం వల్ల మూత్రమార్గం సన్నబడిపోవచ్చు. ఇలాంటివారికి సున్తీ చేసి ముందోలు తీసేస్తేనే అయిపోదు, సన్నబడిన మూత్రమార్గాన్ని కొద్దిగా వెడల్పు కూడా చెయ్యాల్సి (డైలేషన్‌) రావచ్చు.

వృద్ధుల్లో..
ఎవరికైనా- అప్పటి వరకూ ఎలాంటి సమస్యా లేకుండా అంతా బానే ఉండి, వృద్ధాప్యంలో ఉన్నట్టుండి పూర్వచర్మం బిగిసిపోయిందంటే వెంటనే మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. మన దేశంలో పురుషాంగ క్యాన్సర్‌ ఎక్కువ. వృద్ధాప్యంలో పూర్వచర్మం బిగిసిపోవటంతో పాటు పురుషాంగం నుంచి రక్తం లేదా చీములాంటిది వస్తుంటే ముందుగా క్యాన్సర్‌ను అనుమానించాలి. శిశ్నం మీద కణితి ఏర్పడితే సైజు పెరుగుతుంది కాబట్టి ముందోలు వెనక్కి రావటం కష్టమవుతుంది. చిన్నప్పుడు సున్తీ చేయించుకున్నవారికి పురుషాంగ క్యాన్సర్‌ రావటం అరుదు. కానీ ఇలాంటి ఆచారం లేనివారిలో సరైన పరిశుభ్రత పాటించకపోవటం, హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ల వంటివి పురుషాంగ క్యాన్సర్‌కు దోహదం చేస్తాయి. ఇది ప్రధానంగా అంగ శుభ్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి మన దేశంలో ఇది కొంత ఎక్కువగానే కనబడుతోంది. అందువల్ల వృద్ధాప్యంలో హఠాత్తుగా ముందోలు బిగుసుకుపోతే క్యాన్సర్‌ను అనుమానించాలి. ఇలాంటివారిలో శిశ్నాన్ని పట్టుకొని చూస్తే చేతికి గట్టిగా తగలటం గమనించొచ్చు. అనుమానం వస్తే బయాప్సీ చేసి క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. వీరికి సున్తీ చేస్తే పుండు మానటం వంటివన్నీ కష్టమవుతాయి కాబట్టి పూర్వచర్మం మీద 'డోర్సల్‌ స్లిట్‌' అనే పద్ధతిలో చిన్న కోత పెట్టి లోపల ఏముందో చూస్తే కణుతుల వంటివి ఉంటే కనబడతాయి. వాటి నుంచి అవసరమైతే ముక్క తియ్యటం, లేకుంటే కొన్నిసార్లు సున్తీ చేసి, ఆ పూర్వ చర్మాన్ని పరీక్షకు పంపించటం వంటివి చెయ్యాల్సి ఉంటుంది.
శుభ్రత ప్రధానం
చిన్నపిల్లల్లో ముందోలును బలవంతంగా వెనక్కి లాగాల్సిన పనిలేదు. వయసుతో పాటు దానంతట అదే వదులవుతుంది. అది వెనక్కి వస్తున్న పిల్లలు, పెద్దలంతా కూడా ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు ఒక్కసారి పూర్వచర్మాన్ని వెనక్కి తీసి, శిశ్నాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవటం అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే దీన్ని అలవాటుచెయ్యటం మంచిది. దానివల్ల సమస్యలు చాలా వరకూ రావు.


--డా .నవీన్ నడిమింటి 

15, డిసెంబర్ 2019, ఆదివారం

నరాలు వాపు నొప్పి నివారణ తీసుకోవాలిసినా జాగ్రత్తలు

*నరాల వాపు (నొప్పి) నొప్పులు నివారణ కు తీసుకోవాలిసిన జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*

        నరాల వాపు లేదా నరాల నొప్పి (అంజియోడెమా) అనేది చర్మం క్రింద లేదా చర్మం కణజాలంలో, లోపలి చర్మము క్రింద (dermis) వాపుతో కూడి ఉన్న ఒక విపత్కర పరిస్థితి. సాధారణంగా మందులు, ఆహారం, పుప్పొడి లేదా పుష్ప రజస్సు, పర్యావరణ విషపదార్థాల (టాక్సిన్స్) వల్ల కలిగే దుష్ప్రభావాలకు  (అలెర్జీలకు) నరాలవాపు (Angioedema) ఓ నిరోధక ప్రతిస్పందన. నరాల వాపు కారణంగా రక్తనాళాల నుండి ద్రవం స్రవించి పరిసర కండర కణజాలాల్లోకి వ్యాపిస్తుంది, తద్వారానే నరాల్లో వాపు ఏర్పడుతుంది. 
నరాల వాపు ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి?
పెదవులు, చేతులు, కాళ్ళు, నాలుక, మరియు కళ్ళ చుట్టూ వాపు సంభవించవచ్చు. అప్పుడప్పుడు, దురద లేదా ఉబ్బేక్కిన దద్దుర్లు (urticaria) ఏర్పడతాయి. నొప్పితో పాటు తేలికపాటి దురద ఉంటుంది. దద్దుర్ల చోట్లలో చర్మం ఎరుపుదేలడం, ఆ చోట్లలో చర్మం వెచ్చదనంగా మారడం వంటివి సాధారణంగా కనిపించే ఇతర లక్షణాలు. ఉబ్బురోగం (ఎడెమా) లేదా శ్వాసకోశంలో వాపు శ్వాస సమస్యలకు దారితీస్తుంది. జీర్ణాశయాంతర ప్రేగులలో వచ్చే ఉబ్బురోగం (Oedema) వికారం, వాంతులు, అతిసారం, లేదా నొప్పిని కలుగజేస్తుంది.
నరాల వాపు ప్రధాన కారణాలు ఏమిటి?
నరాల వాపు యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది సాధారణంగా ఒక ఔషధం వల్ల కల్గిన దుష్ప్రభావం యొక్క ప్రతిచర్య, పురుగు కాటు, లేటెక్స్ రబ్బరు, పెంపుడు జంతువు బొచ్చు, లేదా ఆహారసేవనం వల్ల వాటిల్లిన దుష్ప్రభావం ద్వారా ప్రేరేపించబడుతుంది.
కొన్ని మందులు సాధారణంగా దద్దుర్ల వాపుకు కారణమవుతాయి. ఆ మందులేవంటే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, స్టెరాయిడ్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, మరియు యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్.
కొందరు వ్యక్తులకు నరాల వాపు (ఆంజియోడెమా) వారసత్వంగా వస్తూండవచ్చు. ఇది జన్యు మార్పులు కారణంగా సంభవించవచ్చు.
అంటురోగం లేదా లుకేమియా వంటి కొన్ని ప్రాథమిక వైద్య పరిస్థితులు కూడా నరాలవాపు (ఆంజియోడెమా)కు కారణం కావచ్చు.
*నరాలవాపును నిర్ధారణ చేసేదెలా, దీనికి చికిత్స ఏమిటి?*
ప్రారంభంలో, వైద్యులు శారీరకంగా కనబడే లక్షణాల ఆధారంగా మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. నరవాపు ప్రభావిత ప్రాంతాన్ని డాక్టర్ తనిఖీ చేస్తారు  మరియు ఏదైనా అలెర్జీ కావడంవల్ల లేదా వైద్య చరిత్రవల్లనా, లేదా ఏదైనా దుష్ప్రభావానికి గురై నరాలవాపు దాపురించిందా అని డాక్టర్ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాడు. ఈ తనిఖీ ద్వారా నరాలవాపుకు కారణం ఏమిటో డాక్టర్ నిర్ణయిస్తారు. వైద్యులు చర్మ ప్రతిచర్య పరీక్ష లేదా రక్త పరీక్ష వంటి కొన్నిఅలెర్జీల పరీక్షలను కూడా నిర్వహించవచ్చు. C1 esterase నిరోధకం కోసం ప్రత్యేకంగా రక్త పరీక్ష నిర్వహిస్తారు. ఈ పదార్ధం యొక్క తక్కువ స్థాయిలు సమస్య వారసత్వంగా ఉందని సూచిస్తున్నాయి. C2 లేదా C4 వంటి పూర్తి పరీక్షలలో తేలే అసాధారణ ఫలితాలు, ఏదో అగోచర పరిస్థితి కారణంగానే అని సూచిస్తాయి. 
నరాల వాపు (ఆంజియోడెమా) కారణం ఆధారంగా, వైద్యులు మందులను సూచించగలరు. కొన్నిసార్లు, ఈ పరిస్థితికి అంటే నరాల వాపు సమస్యకు  మందులు అవసరం లేదు, దానంతటదే నయమైపోతుంది. అయితే, ఈ నరాల వాపుల్లో ఉగ్రమైన రూపు దాల్చిన (అంటే విపరీతమైన దద్దుర్లుతో కూడిన నరాల వాపు) నరాల వాపు సమస్యకు నిర్దిష్టమైన వైద్య చికిత్స చాలా అవసరం. ఈ చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం వాపు, దురద, మరియు నొప్పిని తగ్గించడం.
సాధారణంగా నరాల వాపు రుగ్మతకు ఉపయోగించే మందులు దురదను  పోగొట్టేందుకు ఇచ్చే మందులు, నొప్పి, వాపు నివారణకు వాడే మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు), రోగనిరోధక వ్యవస్థను అణచివేసే మందులు, నొప్పి మరియు వాపును తగ్గించే మందులు అయి ఉంటాయి.
ఒక ప్రతిచర్య వలన నరాలవాపు (ఆంజియోడెమా) దాపురించినట్లయితే, ఆ ప్రతిచర్యను కల్గించిన దాన్నినివారించడంతో సరిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో యాంటీ-హిస్టామిక్ మరియు స్టెరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు.
కొన్ని ఔషధాల వాడకం వలన నరాల్లో వాపు, నొప్పి (ఆంజియోడెమా) మీకు దాపురించి ఉంటే, అలాంటి పరిస్థితిలో మీ వైద్యుడిని సందర్శించి మీరు తీసుకుంటున్న ఔషధాల్ని ఆపడం గురించి మాట్లాడండి, ఇపుడు తీసుకుంటున్న మందులకు బదులు మీరు బాగా తట్టుకోగలిగిన ఔషధాల్ని సూచించమని డాక్టర్ ని అడగండి. 
వంశపారంపర్య నరాల వాపు రుగ్మతకు (ఆంజియోడెమా) చికిత్స చేయలేము, కానీ C1 ఎస్టేటేస్ ఇన్హిబిటర్ యొక్క స్థాయిని పెంచే మందులను ఉపయోగించి నరాలవాపు నొప్పిని, లక్షణాలను తగ్గించే చికిత్స చేయవచ్చు.

*నరాల వాపు (నొప్పి) కొన్ని మందులు*
1.-Low DexLow Dex Eye/Ear Drops
2.-DexacortDexacort Eye Drop
3.-Dexacort (Klar Sheen)Dexacort (Klar Sheen) 0.1% Eye Drop
4.- Quin Dx4 Quin Dx Eye Drop13SolodexSolodex 0.1% Eye/Ear Drops
5.-Apdrops DmApdrops Dm 0.5% W/V/1% W/V Eye Drop103Hungree SyrupHungree Syrup
6.-NormatoneNORMATONE SYRUP 210ML
7.-Lupidexa CLupidexa C Eye Drop
8.-Dexcin MDexcin M Eye Drop
9.-Ocugate DxOcugate Dx Eye Drop8Mfc DMfc D Eye Drop
10.-HysinHYSIN SYRUP 200ML
11 -Mflotas DxMflotas Dx 0.5%W/V/0.1%W/V Eye Drop
12.-Mo 4 DxMo 4 Dx Eye Drop
13.-Moxifax DxMoxifax Dx Eye Drop
14.-Moxitak DmMoxitak Dm Eye Drops
15.-MyticomMyticom Eye Drop
    పై మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
        పై  సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

ముక్కు నుండి రక్తం వచ్చినప్పుడు తెలిసుకోవాలిసిన జాగ్రత్తలు

ముక్కు నుండి రక్తం వస్తే:ఏమి చేయాలి అవగాహనా కోశము మీ Naveen Nadiminti సలహాలు 
         పిల్లలకు ముక్కు నుండి రక్తం వస్తే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి ముందు ముక్కులో రెండు చుక్కల దానిమ్మరసం వేస్తే రక్తస్రావం ఆగుతుంది

2.ముక్కును చన్నీళ్లతో కడిగి చన్నీటితో ముంచిన కాటన్ గుడ్డను ముక్కు మీద వేసి, హారతి కర్పూరాన్ని ముక్కు దగ్గరగా ఉంచి వాసన చూస్తే వెంటనే ముక్కు నుండి రక్తం కట్టుకుంటుంది.
3. పచ్చటి గరిక రసాన్ని దంచి రసం తీసి ముక్కులో రెండు రెండు చుక్కలు వేస్తే ముక్కు నుండి రక్తం ఆగిపోతుంది.

Bleeding in Children , పిల్లలు లో రక్తం పడటం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పిల్లలు లో రక్తం పడటం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రక్తం మనకు ఎంత ప్రాణావసరమో.. అది కనబడితే అంత చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతుండదు. అభంశుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారుగానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారుపడిపోతుంటారు. పసిబిడ్డల ముక్కువెంట రక్తం చాలా తరచుగా కనబడే సమస్య. ఇంత తరచుగా కాకపోయినా.. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం కూడా అంతే ఆందోళన రేపుతుంది. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదకరమేం కాదుగానీ.. మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం కచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే.

*పుట్టి 6 రోజులు కాలేదు.. మలంలో రక్తం. ఆకుపచ్చని వాంతులు. తీవ్రమైన ఏడుపు. పరీక్ష చేస్తే.. కడుపులో పేగు మడతబడినట్టు బయటపడింది. వెంటనే శస్త్రచికిత్సతో సరిచేయాల్సి వచ్చింది.

* 8 నెలల పాప. హఠాత్తుగా కడుపు నొప్పితో ఏడుపు మొదలుపెట్టింది. కొద్దిసేపటికి తగ్గినా.. మళ్లీ మళ్లీ తెరలు తెరలుగా కడుపునొప్పితో పాటు ఆకు పచ్చని వాంతులు, మలంలో రక్తం పడటం ఆరంభమైంది. పరీక్షల్లో పేగులోని కొంతభాగం మరోభాగంలోకి చొచ్చుకుపోయినట్టు తేలింది. వెంటనే ఆపరేషన్‌తో సరిచేయాల్సి వచ్చింది.

* 5 ఏళ్ల బాబు. రెండు రోజులకు ఒకసారి మల విసర్జనకు వెళ్లేవాడు. పైగా మలం గట్టిగా వచ్చేది. కొన్ని రోజులకు మలద్వారం నుంచి రక్తం పడటం మొదలైంది. తల్లిదండ్రులు కంగారుపడిపోయి డాక్టర్‌కు చూపించారు. మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌) వల్లే రక్తం వస్తున్నట్లు గుర్తించారు. ....ఇలా పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటం తరచుగా కనబడే సమస్యే. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతుంటాయి కూడా.

కడుపులోని పేగుల్లో కింది భాగం నుంచి రక్తస్రావమైతే అది ఎర్రటి ఎరుపు రంగులో (హెమటోకేజియా) కనిపిస్తుంది. అదే ఎగువభాగంలో పేగుల్లో రక్తస్రామమైతే కొద్దిగా రంగుమారి (melina) ఉంటుంది. పేగుల్లో కొద్దిపాటి రక్తస్రావమైనా అది మలంతో కలిసినప్పుడు ఎంతో పెద్దమొత్తంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు బాగా కంగారుపడిపోతుంటారు. అదృష్టమేంటంటే.. పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలావరకూ వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకురావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటకు పోయినా ప్రాణాపాయం కలగొచ్చు. అందువల్ల రక్తస్రావాన్ని అరికట్టేందుకు తక్షణం తగు చికిత్స చేయటం అవసరం.

గుర్తించటం
1. రక్తం ఎంత మొత్తంలో పడుతుంది? రంగు ఎలా ఉంది? విరేచనంతో కలిసి వస్తోందా? విడిగా పడుతోందా? విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ పడుతోందా? వంటి వివరాల ద్వారా కొంత మేర సమాచారం తెలుస్తుంది.
2. పరీక్షించటం ద్వారా- కామెర్లు, రక్తహీనత, కడుపుబ్బరం, ఫిషర్స్‌, పొట్టలో గట్టిగా తగలటం వంటి వాటిని గుర్తించొచ్చు.
3. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్‌ పరీక్ష, కడుపు ఎక్స్‌రే, ఎండోస్కోపీ ద్వారా కచ్చితంగా నిర్ధరిస్తారు. కొందరికి యాంజియోగ్రఫీ కూడా అవసరమవుతుంది.

ఎప్పుడు ప్రమాదం?
* రక్తం ఆగకుండా పడుతున్నా,
* పెద్దమొత్తంలో రక్తస్రావం అవుతున్నా
* రక్తం పడటంతో పాటు నొప్పి, కడుపుబ్బరం, లోపలి అవయవాలు ఉబ్బటం వల్ల కడుపు పెద్దగా అవటం వంటివి కనిపించినా,

చాలావరకు మామూలువే చాలామంది పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటమన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతట అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ల వంటి అనుమానాలూ అవసరం లేదు. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతుంటాయి. రక్తం ఆగకుండా, ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా కారణాలను కచ్చితంగా గుర్తించొచ్చని గ్రహించాలి.

ముక్కు నుండి రక్తం

పిల్లల్లో ముక్కువెంట రక్తం పడటమన్నది చాలా తరచుగా కనిపించే సమస్య. ఈ సమస్య మండు వేసవిలో, చలికాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వైద్యపరిభాషలో దీన్ని 'ఎపిస్టాక్సిస్-(epistaxis)‌' అంటారు. ఇంటి వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్లినట్లవుతుంది. లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని వీటిని కెలుకుతుంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎక్కడి నుంచి?--మన ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలుంటాయి. ముఖ్యంగా ముక్కు కొనకు ఒక అంగుళం లోపలగా.. సిరలు పైచర్మం కిందే, చాలా సున్నితంగా కూడా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని 'లిటిల్స్‌ ఏరియా' అంటారు. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తుంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు.

కారణమేమిటి?---
* ముక్కులోపల వేలు పెట్టి కదిలిస్తుండటం,
* జలుబు, అలర్జీల వంటివి వచ్చినప్పుడు చాలా బలంగా తుమ్ములు రావటం, లేదా గట్టిగా చీదటం,
* వేసవిలో వేడి మరీ ఎక్కువగా ఉండటం
* ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్ల వంటి వస్తువులు పెట్టుకోవటం,
...ఈ సందర్భాలన్నింటిలోనూ 'లిటిల్స్‌ ఏరియా'లోని రక్తనాళాలు చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణం ఏం చెయ్యాలి?--కంగారు పడకుండా బిడ్డను సాంత్వన పరచటం ముఖ్యం. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకుని
ఉండేలా కూర్చోబెట్టి.. ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తిపట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు.

*ఇలా 10 నిమిషాలు ఒత్తిపట్టి ఉంచాలి. మధ్యమధ్యలో ఆగిందా? లేదా? అని వదిలి చూసే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. 10 నిమిషాల తర్వాత కూడా ఇంకా రక్తం వస్తుంటే మరో 10 నిమిషాలు పట్టుకుని ఉండాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చెయ్యద్దు. అప్పటికీ తగ్గకుంటే?---ముక్కును పైన చెప్పినట్లుగా పది పది నిమిషాల చొప్పున రెండు దఫాలుగా ఒత్తి పట్టినా కూడా రక్తం వస్తూనే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లటం మంచిది. ఇదే కాదు, మనకు తెలియకుండా లోపల ముక్కులో ఏదైనా ఉందన్న అనుమానం ఉన్నా, అలాగే కేవలం ముక్కు నుంచే కాకుండా చెవులు, చిగుళ్ల వంటి వాటి నుంచి కూడా రక్తం వస్తున్నా, రక్తం మరీ ఎక్కువగా వేగంగా పోతున్నా, లేదా ఆటల్లో పడిపోవటం, ముక్కుకు బలంగా దెబ్బతగలటం వంటి సందర్భాల్లో కూడా వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్లటం మంచిది.

రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్‌ నైట్రేట్‌ సాయంతో లేదా విద్యుత్‌ పరికరాలతో ఆ ప్రాంతాన్ని 'కాటరైజ్‌' చేస్తారు. మొత్తానికి ముక్కు నుంచి రక్తం రావటమన్నది తల్లిదండ్రుల్లో భయాందోళనలను పెంచేదేగానీ మరీ అంత ప్రమాదకరమైనసమస్య మాత్రం కాదు.

నివారించేదెలా?----
* ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించెయ్యాలి.
* పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసెయ్యాలి.
* బలంగా ముక్కు చీదనివ్వద్దు.
* ముక్కు రంధ్రాల్లో పక్కులు ఎక్కువగా కడుతుంటే- ముక్కులో వేసేందుకు సెలైన్‌ చుక్కల మందులు దొరుకుతాయి, వాటిని రెండు పూటలా ముక్కులో వేసి, మెత్త బడిన

తర్వాత శుభ్రం చెయ్యటం మంచిది.
* వాతావరణం బాగా పొడిగా ఉండే వేసవిలోనూ, చలికాలంలోనూ పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ (వాజ్‌లైన్‌) రాయటం మంచిది.
* ఇంటి వాతావరణం మరీ పొడిగా ఉంటుంటే 'హ్యుమిడిఫైయర్స్‌' పెట్టటం ఉత్తమం.

మలంలో రక్తం: కారణాలేంటి?
* మలద్వారం వద్ద చీలిక (ఫిషర్‌): పిల్లల్లో ముఖ్యంగా తొలి రెండేళ్ల వయసువారిలో కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం కావటానికి ఇదే ప్రధాన కారణం. బయటకు వచ్చే
రక్తం చాలా ఎర్రగా ఉంటుంది. మల విసర్జన తర్వాత బొట్లు బొట్లుగా పడుతుంది. మలం పైన రక్తం చారికలు కూడా ఉండొచ్చు. సాధారణంగా ఇది మలబద్ధకం గలవారిలో మలం
పెద్దపెద్ద పెంటికలుగా బయటకు వచ్చిన అనంతరం కనబడుతుంది. మలద్వారం దగ్గరి పొరలు చిట్లి, చీలిక రావటం దీనికి మూలం. ఈ సమయంలో చాలా నొప్పి కలుగుతుంది.
దీంతో పిల్లలు మల విసర్జనను ఆపుకోవటానికీ ప్రయత్నిస్తారు. ఈ సమస్య రోజుల పిల్లల్లో కూడా ఎక్కువగానే కనబడుతుంటుంది. మలబద్ధకం తలెత్తకుండా చూడటం; మలం మెత్తగా, మృదువుగా వచ్చేలా మందులు వాడుకోవటం; బిడ్డను గోరు వెచ్చటి నీటి టబ్బులో కూర్చుండబెట్టటం, చీలికలు త్వరగా మానేందుకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఆయింట్‌మెంట్లు రాయటం అవసరం. సాధారణంగా చీలికలకు సర్జరీ అవసరం ఉండదు.

* పేగుల్లో తిత్తి (మెకెల్స్‌ డైవర్టికులమ్‌): పిండ దశలో బొడ్డు ద్వారా పేగుల్లోకి వెళ్లే నాళం (ఓంఫాలోమెసెంట్రిక్‌ డక్ట్‌) పుట్టిన తర్వాత కూడా మూసుకోకపోవటం వల్ల తలెత్తే సమస్య ఇది. దీంతో నొప్పి లేకుండానే మలద్వారం గుండా పెద్దమొత్తంలో రక్తం పడుతుంది. కొందరు పిల్లలు పేగుల్లోని గోడకు తిత్తితో పుడుతుంటారు. ఈ తిత్తి నుంచి ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ.. దాని ప్రభావంతో దీని చుట్టుపక్కల చిన్నపేగుల్లో పుండ్లు (అల్సర్స్‌) పడుతుంటాయి. ఇది రక్తస్రావానికి కారణమవుతుంది. 2% మంది పిల్లల్లో ఇది కనబడుతుంది. ఇది సమస్యాత్మకంగా తయారైనప్పుడు సర్జరీతో ఆ కొంత మేరా పేగును తొలగించటం అవసరం.

* పేగు చొచ్చుకురావటం (ఇంటససెప్షన్‌): కొందరిలో ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకు పోతుంటుంది. ఇది రెండేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. 6-9 నెలల వయసులో ఎక్కువగా కనబడుతుంటుంది. ఎక్కువ మందిలో చిన్నపేగులోని కొంతభాగం పెద్దపేగులోకి తోసుకుపోతుంది. పేగులు కదిలిన ప్రతిసారీ ఇది మరింత ముందుకు వస్తుంది. దీనికి తక్షణం ఆపరేషన్‌ అవసరం. ఎందుకంటే చొచ్చుకొచ్చిన చిన్నపేగుకు రక్తసరఫరా నిలిచిపోయి అది కుళ్లిపోయే ప్రమాదం ఉటుంది.

హాయిగా ఉన్న పిల్లల్లో కూడా ఈ సమస్య హఠాత్తుగా తలెత్తవచ్చు. ఉన్నట్టుండి పిల్లలు తీవ్రంగా ఏడుస్తారు. కొద్దినిమిషాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుందిగానీ కొంత సమయానికి ఇది మళ్లీ వస్తుంది.దీంతో కడుపుబ్బరం, పసుపు లేదా ఆకుపచ్చగా వాంతులు, మలద్వారం గుండా రక్తం పడటం.. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వెంటనే అల్ట్రాసౌండ్‌ పరీక్ష తప్పనిసరి. దీన్ని 3-6 గంటల్లోపే గుర్తిస్తే ఆపరేషన్‌ అవసరం లేకుండా.. 'హైడ్రోస్టాటిక్‌ రిడక్షన్‌' పద్ధతిలో మలద్వారం గుండా పీడనంతో నీటిని పంపించటం ద్వారా దీన్ని సరిచెయ్యచ్చు. వేగంగా ప్రవహిస్తున్న నీరు.. పెద్దపేగులోకి చొచ్చుకొస్తున్న చిన్నపేగును వెనక్కి నెడుతుంది. ఇది సత్ఫలితాన్ని ఇవ్వకపోతే ఆపరేషన్‌ ద్వారా సరిచేయాల్సి ఉంటుంది.

*పేగుల్లో పిలకలు (జువెనైల్‌ పాలిప్స్‌): కొందరు పిల్లల్లో పేగుల్లోని గోడలకు చిన్న చిన్న పిలకలు మొలుస్తుంటాయి. ఇవి రక్తస్రావానికి దారి తీస్తాయి. ఆ రక్తం మలం పైన చారలుగా కనబడుతుంది. 2-8 ఏళ్ల మధ్యవయసు పిల్లల్లో నొప్పి లేకుండా మలద్వారం నుంచి రక్తం పడటానికి ఈ పిలకలే ఎక్కువగా దోహదం చేస్తాయి. ఇవి చాలావరకు పెద్దపేగు చివరిభాగంలో (రెక్టో-సిగ్మాయిడ్‌) కనబడతాయి. ఈ పిలకలు తమకు తాముగా ఊడినప్పుడో, గట్టిగా మలవిసర్జన జరిగి ఇవి ఒరుసుకున్నప్పుడో వీటి నుంచి రక్తస్రావమవుతుంది. ఈ పిలకలు ఒకటే ఉంటే ఎండోస్కోపీ ద్వారాగానీ, సర్జరీతోగానీ తేలికగా తొలగించవచ్చు. చాలా పిలకలుండి, పేగుల్లో కొంతమేర ఆక్రమించి ఉంటే సర్జరీతో ఆ కొంతమేరా పేగును తొలగించాల్సి ఉంటుంది. పిలకలు ఎక్కువుంటే క్యాన్సర్‌ లక్షణాలున్నాయేమో చూడటమూ అవసరం.

*రక్తనాళాల లోపాలు (యాంజియో డిస్‌ప్లేసియా): పేగులకు రక్తసరఫరా చేసే నాళాల్లో లోపాలు కూడా మలద్వారం గుండా రక్తానికి దోహదం చేస్తాయి. కొన్నిసార్లు ఈ రక్తనాళాలు పేగుల్లో ఎక్కడోచోట ఉండలా బయటకు తోసుకొచ్చినట్లుంటాయి. అక్కడ పుండు పడటమో లేదంటే గాయం కావటం వల్లనో, ఇతరత్రా రక్తస్రావ సమస్యల వల్లనో రక్తం పడొచ్చు. ఎండోస్కోపీతో గానీ యాంజియోగ్రామ్‌ ద్వారా గానీ రక్తనాళాల లోపాలను గుర్తించొచ్చు. ఆపరేషన్‌ ద్వారా లోపాలు గల పేగు భాగాన్ని తీసేసి సరిచేస్తారు.

* పేగుల్లో వాపు, కణక్షయం (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌): సాధారణంగా ఇది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కనిపిస్తుంది. నెలలోపే.. పిల్లలకు పాలు పట్టిన తర్వాత మొదలవుతుంది. పాలు పేగుల్లో నిల్వ ఉండిపోవటం వల్ల.. పేగుల గోడల్లో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటం.. ఫలితంగా పుండు, రక్తస్రావం, రంధ్రం పడటం వంటి వాటికి దారితీస్తుంది.
పేగుల్లో వాపుతో బాధపడే పిల్లలు స్తబ్ధుగా ఉంటారు. పాలు తాగటానికి ఇష్టపడరు. కడుపుబ్బరం ఉంటుంది. తొలిదశలో పేగుల్లో వాపును గుర్తిస్తే యాంటీబయోటిక్స్‌ వంటివాటితో చికిత్స చేస్తే తగ్గిపోతుంది. కణాలు క్షీణిస్తుండటం, గ్యాంగ్రీన్‌ లేదా రంధ్రం పడటం వంటివి తలెత్తితే ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది.

*యాంటీబయోటిక్స్‌: కొన్నిసార్లు యాంపిసిలిన్‌, రిఫమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌, ఇనుము వంటి మందులతో పాటు చాక్‌లెట్లు, కొన్నిరకాల బీట్‌రూట్‌ దుంపల వంటివి తిన్నప్పుడూ మలంలో రక్తం మాదిరిగా ఎర్రటి చారలు కనిపిస్తాయి.

* పేగుల్లో అడ్డంకి: ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే పేగులు ఉబ్బటం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీంతో లోపల రక్తస్రావం కావటం, చివరికి రక్త ప్రసరణ తగ్గటం వల్ల పేగుల్లో గ్యాంగ్రీన్‌కు దారితీస్తుంది. పేగుల్లో అడ్డంకి కారణంగా మలద్వారం నుంచి రక్తం పడుతోందంటే అప్పటికే గ్యాంగ్రీన్‌ ఉందని అనుకోవచ్చు.

*ఆహారం పడకపోవటం: ఫుడ్‌ అలర్జీ వల్ల కూడా మలంలో రక్తం పడుతుంది. వీరిలో ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతులు, విరేచనాలు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. పోషణ లోపం కూడా ఉండొచ్చు. కొందరిలో ఆవు పాలు, సోయా ప్రోటీన్ల వంటివి అలర్జీకి కారణం కావొచ్చు.
ఆయుర్వేదం మందులు 
1.గురక రాకూడవుండలంటే 
బరువు తగ్గే ప్రయత్నం చెయ్యండి.ఉదయం ప్రాణాయామం చెయ్యండి.dee snoor టానిక్ వాడండి
2.దగ్గు తాగాలి అంటే 
కంఠ సుధారక వటి అనుంటాయి ఆయుర్వేదం మెడికల్ షాప్ lo. రెండు రెండు చప్పరించండి. వెంటనే తగ్గుతుంది
3.- ముక్కు పై చీము పొక్కల 
     
Kuppintaaku noori pasupu, salt kalipi raayandi morning and evening
     నేను చెప్పనా మందులు అన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వదలి మీ ఏజ్ మరియు సమస్య బట్టి మందులు మారుతుంది దయచేసి గమనించగలరు 
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి

మా హెల్త్ సమాచారం కోసం మా లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/