5, ఆగస్టు 2020, బుధవారం

మైగ్రేన్ తలనొప్పి నివారణకు నవీన్ నడిమింటి సలహాలు

మైగ్రేన్, తలనొప్పి: లక్షణాలు, చికిత్సా విధానం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

మైగ్రేన్ తలనొప్పి

అప్పుడే ఆఫీసు నుంచి ఇంట్లో అడుగు పెట్టిన మూర్తి తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు."అయ్యో ఏమైందండీ"అంది అరుణ గాబరాగా..

"ఏంలేదు తలనొప్పి "అన్నాడు మూర్తి."పదండి డాక్టర్ దగ్గరకి వెళదాం"అంటుంటే "వద్దులే, అదే తగ్గిపోతుంది, మాత్ర వేసుకుంటా "అన్నాడు మూర్తి." లేదండీ.. ఈ మధ్య తరచూ ,తలనొప్పి అంటున్నారు" అని బలవంతంగా డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లింది అరుణ.

డాక్టర్ వివరాలన్నీ అడిగి,బి.పి,షుగర్ చెక్ చేసి,తలకి స్కాన్ కూడా తీసి,అది "టెన్షన్ హెడ్ ఏక్ "అనీ పని చేసేచోట ఒత్తిడి ఎక్కువగా వుండటం, కంప్యూటర్ వాడేటప్పుడు, ఒకే పొజిషన్లో కూచోవడం,అపసవ్య పధ్ధతిలో కూచోవడం ఇవన్నీ కారణమయి వుండవచ్చని వివరించాడు.

మందులతో పాటు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు.

వంటింట్లో పోపు పెడుతున్న ప్రియాంకకి ఉన్నట్టుండి ధనధనమనితలలో సుత్తులతో మోదుతున్నట్టు నొప్పి మొదలయింది. ఈ మధ్య కొన్ని వాసనలు తగిలినప్పుడూ, కొన్ని రకాలయిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడూ తలకు ఒక పక్కనే నొప్పి మొదలయి రెండు మూడు రోజులు నిలబడిపోతోంది. ఏ విధమయిన శబ్దం విన్నా, వెలుతురు చూసినా చికాకుగా వుంటోంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నాయి. కంగారు పడి హాస్పిటల్ కి వెళితే ,వాళ్లు అన్ని రకాలుగా పరీక్షించి "పార్శ్వ నొప్పి "(మైగ్రేన్ )అని చెప్పారు. కొన్ని రకాలయిన మందులు వాడమని చెప్పి పరిసరాలూ ,మనసూ కూడా ప్రశాంతంగా వుంచుకోవాలని సూచించారు.

మూడు రోజులక్రితం, యాక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలిన మాధమరావు బాగానే తిరుగుతూ తిరుగుతూ హఠాత్తుగా తీవ్రమయిన తలనొప్పితో బాధ పడుతూ,స్పృహ కోల్పోతే కంగారుగా హాస్పిటల్లో చేర్చారు. పరీక్షల్లో తేలిందేమంటే తలకి తగిలిన దెబ్బ వలన మెదడులో రక్తం గూడు కట్టిందనీ, వెంటనే ఆపరేషన్ చేయాలనీ లేకపోతే ప్రాణప్రమాదమనీ.

వీరి ముగ్గురి కథలూ ఇలా వుంటే డాక్టర్ కిరణ్ కథ పూర్తిగా వేరుగా వుంది. అతను ఏ దురలవాట్లూ లేని ఆరోగ్యంగా తిరిగే యువ డాక్టర్. అతని భార్యకూడా డాక్టరే. ఒక పది రోజులుగా సన్న గా వేధించే తలనొప్పిని లెక్క చేయకుండా బిళ్లలేసుకుని రోగులను చూస్తూ, వైద్యం చేస్తూనే వున్నాడు.

హఠాత్తుగా ఒక రోజు వాంతులయి ,ఫిట్స్ కూడా రావడంతో చాలా ఆందోళనకు గురయి న్యూరాలజిస్ట్ ని సంప్రదిస్తే సి.టి.స్కాన్ తీసి"బ్రెయిన్ ట్యూమర్ "అని నిర్థారించి, అప్పటికే అడ్వాన్స్డడ్ స్టేజ్ లో వుందన్నారు.

దీనిని బట్టి అర్థం చేసుకోవలసిందేమంటే తలనొప్పికి సాధారణమైన ,ప్రమాదంలేని కారణాలతో బాటు (ఉదా,,,,ఒత్తిడి ,ఆందోళన),అసాధారణమైన,ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణమై వుండవచ్చని.

వయసు, జాతీ, వర్గం, జెండర్, భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ పట్టి పీడించే ఆరోగ్య సమస్య ఈ తలనొప్పి.

అసలు జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీని బారిన పడకుండా వుండరు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొక సారయినా దీని బారిన పడుతూ వుంటారంటే ,ఇది ఎంత కామన్ గా వచ్చే సమస్యో అర్థం అవుతుంది కద

తలనొప్పి అంటే ఏమిటి? అది ఎలా ,ఎందుకు వస్తుంది? దానిలో రకాలేమైనా వున్నాయా?

తల భాగంలో కలిగే బాధనే తలనొప్పి అంటారు.తల చుట్టూ వుండే కండరాలూ, రక్తనాళాలూ, నరాలూ, కపాలంలో వుండే ఎముకల పై పొరా ,బ్రెయిన్ ని చుట్టుకుని వుండే "మెనింజెస్ "అనే పొరలూ,ఇవన్నీ నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి.

మరీ ముఖ్యంగా మెదడు అడుగు భాగం ఈ నొప్పికి తీవ్రంగా స్పందిస్తుంది. విచిత్రంగా మెదడులో పెయిన్ రిసెప్టార్స్ లేని కారణం వల్ల,మెదడుకి దెబ్బతగిలినా,కోసినా కూడా నొప్పి తెలియదు.

వాపు కారణం గానో ,కణుతుల కారణంగానో అది వ్యాకోచించి ఒత్తిడి పెరిగినపుడు మాత్రమే నొప్పి తెలుస్తుంది.

తల నొప్పి ఎలా వస్తుందంటే, యేదయినా దెబ్బ తగిలినపుడు పెయిన్ రిసెప్టార్స్ స్పందించి,అక్కడున్న నాడీ కణాలలో తీవ్రమయిన స్పందనలని కలగ జేస్తాయి, తద్వారా పెప్టయిడ్స్, సిరటోనిన్ అనే పదార్థాలు అనే పదార్థాలు విడుదలవుతాయి. ఇవి మెదడు పొరలలోనూ,రక్తనాళాలలోనూ,వాపుని కలగ జేస్తాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి కూడా .ఈ కార్యక్రమమంతా నొప్పిని మెదడుకు తెలియ జేస్తుంది. కొన్ని రకాల మందులు ఈ సిరటోనిన్ ని బ్లాక్ చేయడం ద్వారా తలనొప్పిని తగ్గిస్తాయి

నిద్రపోతున్న యువతి

తలనెప్పులూ రకాలూ

IHS ఇంటర్నేషనల్ హెడ్ ఏక్ సొసైటీ వారు తలనెప్పులని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు.

  • ప్రయిమరీ హెడేక్స్
  • సెకండరీ హెడేక్స్

ప్రయిమరీ హెడేక్స్ తల చుట్టూ వుండే కండరాలలోనూ, రక్తనాళాలలోనూ, నరాలలోనూ యేదైనా వత్తిడి కలిగినపుడూ లేదా యేదైనా దెబ్బ తగిలినప్పుడూ వచ్చే తలనెప్పులు.

ఇవి 20-40 సంవత్సరాల వయసులో వస్తూ వుంటాయి.

తలనెప్పులలో తొంభై శాతం నెప్పులు ప్రయిమరీ హెడేక్సే.

ఇవి తరచూ వస్తూ పోతూ వుంటాయి. ప్రమాదంలేనివి. వీటికి యే ఇతర జబ్బులూ కారణం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు మెదడులో జరిగే రసాయనిక చర్య వీటికి కారణమని భావిస్తున్నారు.

కారణాలు

  • అలసట, శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి
  • నిద్రలేమి
  • అతినిద్ర
  • ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం
  • డీహైడ్రేషన్
  • మలబధ్ధకం
  • కంప్యూటర్ల ముందూ,ఆఫీసులోనూ,పని చేసే చోట ఒకె పొజిషన్లో ఎక్కువ సేపు కూచోవడం వలన కండరాలు పట్టేయడం.
  • ఇవి సర్వ సాధారణ మయిన కారణాలు.
  • మళ్లీ ప్రయిమరీ హెడేక్స్ ని మూడు రకాలుగా విభజించ వచ్చు అవి టెన్షన్ హెడేక్స్ , క్లస్టర్ హెడేక్స్ , మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్స్.
  • టెన్షన్ హెడేక్: ఇది చాలా కామన్ గా వచ్చే తలనొప్పి. ప్రతి యేటా ప్రపంచ జనాభాలో 1.6 బిలియన్ల మంది దీని బారిన పడుతూ వుంటారు. ఇది ఆడవాళ్లలో ఎక్కువగా కనపడుతుంది.
  • శారీరక లేదా మానసిక ఒత్తిడి ముఖ్య కారణం.
  • లక్షణాలు: తలచుట్టూ బిగించినట్లుగా, టైట్ గా అనిపిస్తుంది.
  • సాధారణంగా మధ్యాహ్నం పూట వస్తుంది.
  • మెడ నుండీ,తలకు గానీ,తల నుండీ మెడకు గానీ వ్యాపిస్తుంది.
  • కొన్ని గంటలనుండీ కొన్ని రోజుల వరకూ వుండవచ్చు.

క్లస్టర్ హెడేక్స్: ఇవి మగ వారిలో ఎక్కువ కనపడతాయి. తలకు ఒక పక్కన వస్తుంది, ఒక కంటి చుట్టూ నొప్పిగా వుంటుంది, కన్ను ఎర్రబడటం, నీరు కారడం. ఒక్కొక్క సారి కన్ను మూతబడటం,బుగ్గ వాచడం కూడా జరగ వచ్చు.

ఈ తలనొప్పి రోజులో అప్పుడప్పుడూ వచ్చిపోతూ ఉంటుంది.

అలా కొన్ని వారాలూ, నెలలూ కనపడి మళ్లీ కొంతకాలం అసలు కనపడక పోవచ్చు, అందుకే వీటిని "క్లస్టర్ హెడేక్స్ "అంటారు.

ఇవి రావడానికి కారణం "హైపోథలామస్ "(బయలాజికల్ క్లాక్ )లో యేర్పడినఅసాధారణ పరిస్థితి అని భావిస్తున్నారు

ప్రతి యేటా ఒక మిలియన్ పైగా దీని వలన బాధ పడుతున్నారు.అందువలన విలువైన పనిగంటలు నష్టపోవలసి వస్తుంది.దీనికి చికిత్స "ట్రిప్టాన్ "గ్రూపు మందులు వాడటం

మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్ : దీనినే పార్శ్వనేప్పి అంటారు. ఇది చాలా తీవ్రమయిన నొప్పి. తలకు ఒక పక్కనే వస్తుంది. ఏటా 848 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

నొప్పి లక్షణం: ధన్ ధన్ మని కొట్టుకుంటున్నట్టూ,సుత్తులతో మోదుతున్నట్టూ వుంటుంది ,దీనినే "థ్రాబింగ్ లేక పల్సటైల్ హెడేక్ "అంటారు.ఇది ఆడవారిలో ఎక్కువగా కనపడుతుంది.

తలనొప్పితో పాటు వికారం ,వాంతులూ వుంటాయి,కాంతినీ ,శబ్దాలనీ తట్టుకోలేక పోవడం,చీకటినీ,నిశ్శబ్దాన్నీ కోరుకోవడం దీని లక్షణాలు.

కొన్ని గంటల నుంచి కొన్నిరోజులపాటు వేధిస్తుంది. పని గంటలు నష్టపోవడానికి కూడా కారణమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యంతో పనిమానెయ్యడానికి ఆరవ ప్రధాన కారణంగా మైగ్రేన్ నిలుస్తోందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

కారణం: జెనెటిక్ కారణాలతో పాటు , పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా ప్రభావం చూపుతాయంటున్నారు.

కొంతకాలం క్రితం మెదడులోని రక్త నాళాలలో కలిగే మార్పులు కారణం అనుకునే వారు,ఇప్పుడు నరాల పనితీరు సక్రమంగా లేకపోవడం మైగ్రేన్ కి కారణమని భావిస్తున్నారు,అలా వాస్క్యులర్ థీరీ వెనక్కు వెళ్లిపోయింది.

మైగ్రేన్ తలనొప్పి కి ముందు గా హెచ్చరించే సూచనలు

  • కళ్ల ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం
  • కళ్లు చీకట్లు కమ్మడం
  • కళ్ల ముందు వెలుతురు
  • కళ్లలో నీళ్లు రావడం
  • కళ్లెర్ర బడటం
  • చెవులలో శబ్దాలు
  • మాట్లాడలేకపోవడం
  • శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం

ఇన్వాలెంటరీ జెర్కీ మూవ్‌మెంట్స్

ఈ లక్షణాలు మైగ్రేన్ తలనొప్పి రాబోతోందని సూచిస్తాయి వీటినే "ఆరా "అంటారు.

  • ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్
  • కొన్ని రకాల ఘాటైన వాసనలూ
  • కొన్ని రకాల ఆహార పదార్థాలూ
  • నిద్రలేమి
  • మలబధ్ధకం
  • ఒత్తిడి
  • ప్రీ మెన్సట్రువల్ టెన్షన్
  • ఆల్కహాల్ ముఖ్యంగా రెడ్ వైన్
  • స్మోకింగ్
  • ఇవన్నీ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపిస్తాయి వీటినే ట్రిగ్గర్ ఫాక్టర్స్ అంటారు.
  • మైగ్రేన్ వచ్చి తగ్గిన వెంటనే కూడా మందకొడిగానో,అత్యుత్సాహంగానో ,డిప్రెషన్ గానో కనిపించవచ్చు, నీరసం, నిస్త్రాణ, మూడీగా వుండటం కూడా జరగవచ్చు.

మైగ్రేన్ ని మళ్లీ మూడు రకాలు గా కూడా విభజిస్తారు

క్లాసికల్ మైగ్రేన్ : ఆరా "లక్షణాలుంటాయి , తలనెప్పీ, వాంతులుంటాయి

కామన్ మైగ్రేన్ : "ఆరా "వుండదు ,తలనెప్పీ , వాంతులుంటాయి

కాంప్లికేటెడ్ మైగ్రేన్ : నరాలలో చచ్చు వచ్చినట్టుంటుంది (న్యూరలాజికల్ డెఫిసిట్ )

ప్రివెన్షన్ లేక మైగ్రేన్ రాకుండా నిరోధించడం ఒకనెలలో నాలుగు అటాక్స్ కంటే ఎక్కువ వస్తే ,మైగ్రేన్ రాకుండా నిరోధించేందుకు మందులు వాడతారు

సెకండరీ హెడేక్స్: ఇవి శరీరంలోని కొన్ని వ్యాధుల ప్రభావం వలన కలిగే తలనెప్పులు.

జ్వరాలు, వైరల్ ,బాక్టీరియల్ ,టి.బీ,లేదా చీము గడ్డల వలన వచ్చే జ్వరాలు

తలకు, బలమైన దెబ్బ తగిలి నప్పుడు----బ్రెయిన్లో రక్తం గూడు కట్టినా,కపాలం ఎముక చిట్లినా, రక్తస్రావమయినా, కంకషన్ ఇంజురీ (అంటే అదురు దెబ్బ)అయినా

పళ్లకి సంబంధించిన వాపులూ,దెబ్బలలోనూ

కళ్లు: దృష్టి దోషాలూ,ట్యూమర్లూ,అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా

చెవి సమస్యలలో: వాపులూ, చీముగడ్డలూ

ముక్కు సమస్యలలో: ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది "సైనసైటిస్ "లో వచ్చే "సైనస్ హెడేక్ " నుదురు దగ్గర,ముక్కు మొదట,బుగ్గల ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది,ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది.

జీర్ణాశయ సమస్యలు, వాంతులు,విరోచనాలు,

బి.పి ఎక్కువయినప్పుడు

బ్రెయిన్ ట్యూమర్ ,ఇతర కాన్సర్లలో తలనెప్పే ప్రధాన లక్షణం

స్ట్రోక్ లో బ్రెయిన్ స్ట్రోక్ లో తలనొప్పి ఎక్కువగా వుంటుంది

గర్భిణీ లో తలనెప్పీ, బి.పి పెరగడం గుర్రపు వాతానికి దారి తీస్తాయి.

చిన్న పిల్లలలో అంటే 10-20మధ్య వయసు వారిలో మెదడులో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ,ఫిట్స్‌కీ కారణమవు తాయి

మెనింజైటిస్,ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది.

నిద్ర లేమి సమస్యలు

కొన్ని విచిత్రమైన తలనెప్పులు

  • ప్రయిమరీ కాఫ్ హెడేక్: తీవ్రమైన దగ్గుతెర వచ్చాక కానీ, తుమ్ములు వచ్చాక కానీ వచ్చే తీవ్రమైన తలనొప్పి
  • ప్రయిమరీ ఎక్జర్షనల్ హెడేక్: వ్యాయామం తర్వాత వచ్చే తలనొప్పి
  • ఐస్క్రీమ్ హెడేక్‌: చాలా చల్లగా వున్న ఆహార పదార్థాలని త్వరగా తినడం వలన వచ్చే తలనొప్పి.
  • రిబౌండ్ హెడేక్‌: తలనొప్పి మందులు ఎక్కువగా వాడి హఠాత్తుగా ఆపేయడం వలన కలిగే తలనొప్పి
  • ప్రయిమరీ సెక్స్ హెడేక్: సంయోగం తర్వాతా, సుఖప్రాప్తి సమయంలోనూ వచ్చే తలనొప్పి .అప్పుడప్పుడూ దీనికి సబ్ అరఖ్నాయిడ్ హెమరేజ్ కారణమవుతూ వుంటుంది. అందుకే అశ్రధ్ధ చేయగూడదు.

అయితే తల నెప్పులు సాధారణ కారణాల వలన ,వస్తున్నాయా? లేక అసాధారణమైన ,ప్రమాదకరమైన జబ్బుల వలన వస్తున్నాయా తెలుసుకుని ,జాగ్రత్తగా తగిన పరీక్షలు చేసి వ్యాధిమూలాలను అన్వేషించి తగిన చికిత్స ఇవ్వడం వలన ప్రాణప్రమాదాలను తప్పించవచ్చు.

తలనొప్పి తో బాటు ఈ కింది లక్షణాలు కనపడితే తప్పనిసరిగా,ఆ తలనొప్పి కారణాన్ని శోధించాలి

  • జ్వరం వుండడం
  • బరువు తగ్గడం
  • నలభై యేళ్ల వయసు తర్వాత తలనొప్పి రావడం
  • కాన్సర్ ,హెచ్ .ఐ.వి లాంటి వ్యాధులు వుండడం
  • హఠాత్తుగా తలనొప్పి తీవ్రమవడం
  • తలకి దెబ్బ తగిలాక తలనొప్పి రావడం
  • స్పృహ కోల్పోవడం
  • ఫిట్స్ రావడం
  • కాళ్లూ చేతులూ చచ్చుబడటం

వ్యాధి నిర్థారణ

తలనొప్పి అనేది నిజం చెప్పాలంటే జబ్బు కాదు .అనేక జబ్బులలో కనపడే ఒక లక్షణం. రోగితో మాట్లాడి ,వ్యాధి లక్షణాలు సమగ్రంగా తెలుసు కోవడం వలన చాలావరకూ వ్యాధి నిర్థారణ జరిగిపోతుంది అంటే అది ప్రయిమరీ హెడేకా?,సెకండరీ హెడేకా? అనేది అవగాహనవుతుంది.

ప్రయిమరీ హెడేక్ కి కారణమైన శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకోమని సలహా ఇవ్వడంతో పాటు ,పెయిన్ కిల్లర్స్ అదీ ప్రమాదం కలిగించని పారసిటమాల్ ,అసిటమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు

సెకండరీ హెడేక్‌లో

బి.పి చెక్ చేయడం

రక్త పరీక్షలునిర్వహించడం

న్యూరలాజికల్ పరీక్షలు నిర్వహించడం

ఎక్స్ రే పరీక్షలు

సి.టి స్కాన్

యం.ఆర్ .ఐ

సి.టి. యాంజియో గ్రామ్

ఇవన్నీవ్యాధి నిర్థారణకీ ,తలనొప్పికి మూలకారణాన్ని అన్వేషించడానికీ తోడ్పడతాయి. ఒకసారి తలనొప్పికి మూలకారణం తెలిశాక,చికిత్స సులువవుతుంది

చికిత్స

ప్రయిమరీ హెడేక్స్ ని తగ్గాలంటే పాటించాలిసిన విషయాలు

ఒత్తిడిని తగ్గించుకోవడం

రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం

క్రమం తప్పని వ్యాయామం. దీనివలన కండరాలు రిలాక్సవుతాయి.

వేళ తప్పని సమతుల మితాహారం

మైగ్రేన్ వున్న వాళ్లు, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. ఛీజ్ ,నట్స్ ,ఆల్కహాల్ ,స్మోకింగ్ వీటికి దూరంగా వుండాలి, తమకు పడని వాసనలకి కూడా దూరంగా వుండటం మంచిది.

రోజుకి కనీసం యెనిమిది గంటలు చక్కని ప్రశాంతమైన నిద్ర పోతే చాలా వ్యాధులు దూరంగా వుంటాయి.

గోరు వెచ్చని నీటితో స్నానం,యోగా,మెడిటేషన్ లాంటివి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి.

ఇలా జీవన శైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహాతో ప్రమాదంలేని పెయిన్ కిల్లర్స్ ని యెంచుకుని వాడాలి.

చిన్నపిల్లలలో యాస్పిరిన్ వాడకూడదు.

మైగ్రేన్ తలనెప్పులుండే వాళ్లు ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు, సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ , తోపాటు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ని చికిత్సకోసమూ,తరచూ ఎటాక్స్ రాకుండా ప్రొఫైలాక్టిక్ గానూ కూడా వాడవచ్చు.

ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా..

మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.

ఇంకా ఇతర లక్షణాలను బట్టి మందులు వాడుకోవాలి అంటే వాంతులవుతుంటే వాంతుల మందులు వాడటం అలా .మెనింజైటిస్ ,బ్రెయిన్ ట్యూమర్ ఇంకా ఇతర జబ్బులవలన వచ్చే తలనెప్పులకి ,ఆయా వ్యాధులకి తగిన చికిత్స చేయడం ద్వారా తలనొప్పిని నివారించవచ్చు.


తలనొప్పి


రక్తపోటు పెరగడం (హై - బిపి /హైపర్ టెన్షన్)

 

“తలనొప్పిగా ఉంది. ఈ రోజు ఇహ పని చేయలేను" అనే మాటను మనం అనేక సందర్భాలలో అనేక సార్లు అంటూ ఉంటాము. లేదా వింటూ ఉంటాము. కొంతమంది దీనిని నిస్త్రాణకు పర్యాయపదంగా కూడా వాడుతుంటారు. అయితే చాలా రకాలైన భౌతిక కారణాలూ, మానసిక పరిస్థితులూ తలనొప్పికి దారితీస్తాయనేది మాత్రం నిజం, అడుగడుగునా ఎదురయ్యే లక్షణం కాబట్టి చాలా మంది తలనొప్పిని చాలా తేలికగా తీసుకుంటారు. అదే తగ్గిపోతుందిలెమ్మని అశ్రద్ధ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇది ప్రమాదభరితమైన వ్యాధికి ప్రప్రథమ సంకేత సూచికగా ఉండే అవకాశముందని గ్రహించరు.

 

సాధారణంగా వచ్చీపోయే తలనొప్పులకు కారణాలు అత్యంత సాధారణమైనవే అయినప్పటికీ వాటిని నిర్ణయించడానికి మీకు కొంత విశ్లేషణ అవసరమవుతుంది. ఆయుర్వేద సంహితలు తలనొప్పిని 'శిరశ్మూల' అనే పేరుతో వివరించాయి. సంహితా గ్రంథాలు తలనొప్పిని కారణాలను ఆధారంగా చేసుకుని కాకుండా, దోషాలను ఆధారం చేసుకుని విభజించి వర్ణించాయి. ఇలా చేయడం వలన తలనొప్పి ఎన్ని రకాలైన కారణాలతో వచ్చినప్పటికీ వాటిని ఒకటిగా చేర్చి అధ్యయనంచేయడానికీ, లేదా చికిత్సలను చూచించడానికి వీలవుతుంది. ఇది ఆయుర్వేద ప్రత్యేకత.

 

ఉదాహరణకు కఫ, పిత్త, వాతాల వల్ల వచ్చే తలనొప్పులను చూద్దాం.

కఫం ప్రధానంగా ఉన్న తలనొప్పిలో కఫ లక్షణాలు - అంటే, తల బరువుగా ఉండటం, కళ్లనుంచి నీరు కారడం, చేవిలోపల (అభ్యంతర కర్ణం లేదా ఇన్నర్ ఇయర్ లో) వాపు జనించడం, ముక్కునుండి స్రావాలు కారడం, ముక్కులోపల శ్లేష్మపు పొరలు ఉబ్బి గాలిని అడ్డుకోవడం, పాలిప్స్ తయారవడం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాతఃకాలాన శరీరంలో కఫ పేరుకుపోవడం దీనికి కారణం. అలాగే వర్షాలు పడే రోజులలోనూ, చలికాలంలోనూ, ఈ 'కఫజశిరష్శూల' ఎక్కువగా కనిపిస్తుంటుంది. భోజనం చేసిన తరువాత కూడా ఇది కనిపించడానికి అవకాశాలున్నాయి. 

 

రెండవరకమైనది శరీరంలో పిత్త దోషాన్ని ఆధారం చేసుకుని వచ్చే 'పిత్తజ శిరశ్శూల'. దీనిలో పైత్యపు లక్షణాలు (కళ్లు మంటలు పుట్టడం, తలనుంచి ఆవిర్లు చిమ్ముతున్నట్లుండటం, ముక్కునుంచి రక్తం కారడం ఇత్యాదివి) ఎక్కువగా ఉంటాయి. మిట్టమధ్యాహ్నం పూట, ఎండలు మండిపోతున్నప్పుడు ఈ రకమైన నొప్పి వస్తుంటుంది.

 

చివరిది 'వాతజ శిరశ్శూల', దీనిలో వాయువుకు ఆపాదించిన లక్షణాలు (కళ్లు తిరుగున్నట్లుండటం, కళ్లు పొడిగా ఇసుకపోసినట్లు మెరమెరలాడడం, తలలో విభిన్న ప్రదేశాలలో విభిన్న రకాలుగా నొప్పి రావడం మొదలైనవి) ఎక్కువగా కనిపిస్తాయి. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక వ్యాధులుగా సూర్యవర్తం, అనంతవాతం, శంఖకం, అర్థావభేదం అనే వ్యాధుల వివరణలు కూడా మనకు శాస్త్ర గ్రంథాలలో కనిపిస్తాయి.

 

తక్కువ నిడివితో బాధించే తలనొప్పినీ, దాని సమగ్ర రూపాన్నీ తేలికగా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడూ తలనొప్పి వస్తుంది. అదే విధంగా ఒత్తిడికి లోనైనప్పుడూ, ఆదుర్దాగా ఉన్నప్పుడూ, ఎండలోనూ వడగాల్పులలోనూ తిరిగినప్పుడూ తలనొప్పి వస్తుంది. అలాగే సినిమా, టివి. కంప్యూటర్ తదితరాలను తదేకంగా చూసినప్పుడు కూడా, కంటి కండరాలు ఒత్తిడికి లోనవ్వడం వలన తలనొప్పి వస్తుంది. అంతే కాకుండా తక్కువ వ్యవధిలో ఎక్కువ స్థాయిలో వ్యాయామం చేసినా తలనొప్పి వచ్చే అవకాశముంది.

 

తలనొప్పి ఉన్నప్పుడు కొంతమంది బ్రెయిన్ ట్యూమరేమోనని అనుమానంతో కంగారు పడుతుంటారు. నిజానికి తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాద భరితమైన వ్యాధుల వలన అయ్యే అవకాశం ఒక శాతం మాత్రం, అయితే ఆ ఒక్క శాతాన్ని ఎవరికీ వారు తమకే అన్వయించుకోవడం వల్ల అసలైన చిక్కు వస్తుంది.

 

మనం నరాల ద్వారా, మెదడు ద్వారా నొప్పిని గ్రహిస్తాము. అయితే ఈ మెదడు మాత్రం తలలోపల జనించే నొప్పిని గ్రహించలేదన్న సంగతి చాలా మందికి తెలియదు. కపాలంలోని ఎముకమ కింద ఉండే మెదడు వెలుపలి పొరలూ, వెన్నుపామూ, రక్తనాళాలూ, మెదడు గదులను వేరుపరిచే తంతు నిర్మితమైన విభాజికాలూ ఇవన్నీ మెదడులో ఏర్పడిన నొప్పిని ప్రసారం చేస్తాయి.

 

ప్రమాద సంకేతాలు:

తలనొప్పి సాధారణంగా కనిపించే లక్షణమే అయినా కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు మాత్రం దానిని సీరియస్ గా తీసుకోవాలి.

ఈ క్రింద పేర్కొన్న ప్రమాద సంకేతాలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి:

తలనొప్పి నిద్రతో తగ్గకపోవడం, పైగా నిద్రను చెడగొట్టడం. నొప్పి తీవ్రంగా, తెరలు తెరలుగా రావడం.

తలను పక్కకు తిప్పినప్పుడుల్లా నొప్పి ఎక్కువ కావటం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి మరింత తీవ్రరూపాన్ని దాల్చడం.

కణతలలో నొప్పి కేంద్రీకృతమై ఉండటం, ఏ పక్క కణతలో నొప్పి ఉందో అదే పక్క కంటి చూపు మసక బారటం.

35 సంవత్సరాల వయసు పైబడిన తరువాత జీవితంలో మొదటిసారిగా మైగ్రేన్ తరహా తలనొప్పి రావడం. తలనొప్పి ప్రమాదకరమైన స్థాయిలో ఉందా, లేదా అనేది అంచనా వేయడానికి ఈ కింది విషయాలు. వాటిని అనుసరించి ఉండే వివరణలూ తోడ్పడుతాయి.


టెన్షన్ తలనొప్పి:

తలనొప్పికి అత్యంత సాధారణమైన కారణమూ, ప్రధానమైన కారణమూ టెన్షనే. టెన్షన్ తలనొప్పిలో తల వెనుక ప్రాంతంలోనూ, మెడ ప్రాంతంలోనూ నొప్పి ఉంటుంది. నొప్పి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. మధ్య మధ్యలో సాంత్వన లభించవచ్చుగాని, అది స్వల్పకాలికమే. తీవ్రత విషయంలో నొప్పి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. నిద్రను చెడగొట్టక పోవడం ఈ తరహానొప్పి ప్రధాన లక్షణం. పైగా రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోతే నొప్పి తగ్గినట్లనిపిస్తుంది. తలనొప్పి ఎలా ఉంటుందో చెప్పమన్నప్పుడు చేతులతో ఒత్తుతున్నట్లుగా ఉంటుందనీ, నలగగొడుతున్నట్లుగా ఉంటుందనీ, లేదా ఒక బిగుతైన పట్టీని తల చుట్టూ బిగించినట్లుగా ఉంటుందనీ బాధితులు చెబుతుంటారు. జాగ్రత్తగా తరచి చూస్తే ఈ తరహా నొప్పితో బాధపడే వారందరి జీవితాలలోనూ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలూ, నిరంతరంగా రగిలే వ్యధలూ కనిపిస్తాయి. పోను పోనూ తలనొప్పి ఉన్నదన్న ఊహ కూడా తలనొప్పిని కొనసాగిస్తుంది.

 

ఒకోసారి కూర్చోవటం, పడుకోవడం, వాహనాలను నడపటం వంటివి సరైన రీతిలో చేయనప్పుడు కూడా మెడ కండరాల మీద ఒత్తిడి పడి, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడి, తలనొప్పి వస్తుంది.

 

సూచనలు:

టెన్షన్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు జీవనశైలిని కాస్తంత మార్చుకుంటే సరిపోతుంది. ఆర్గనైజ్డ్ గా, వ్యూహాత్మకంగా ఉంటే అనవసరమైన హడావుడికి ఆస్కారం ఉండదు. విశ్రాంతిగా గడపడం, ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించిన విధానంలో శరీర మర్ధనలను చేయించుకోవడం వంటి వాటి వలన మంచి ఫలితం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు సమస్య ఎక్కడ ఉందో కనుకోనడానికి సమగ్రమైన కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. మనసును ఆహితమైన ఇంద్రియార్థాలనుంచి మరల్చుకోవాలి. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన జ్ఞాన, విజ్ఞానం ధైర్య, స్మృతి, సమాధులు తోడ్పడుతాయి. అలాగే శారీరక వ్యాయామమూ, కొన్ని ప్రత్యేకమైన ఔషధాలూ అవసరమవుతాయి.

 

ఔషధాలు:

సర్పగంధ చూర్ణం, బ్రాహ్మీఘృతం, వచాచూర్ణం, జటామాంసీ చూర్ణం, తగరు చూర్ణం.

ఇన్ఫెక్షన్లు:

తలనొప్పికి వైరల్ ఇన్ఫెక్షన్లూ, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లూ కారణాలవుతాయి. అధిక ఉష్ణోగ్రత వలన శరీరం నిర్జలీయంగా మారినప్పుడు తల నొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాకుండా సూక్ష్మక్రిములు విడుదల చేసే విషపదార్థాలు కూడా తలలోని రక్తనాళాలను వ్యాకోచపరిచి తద్వారా తలనొప్పిని కలిగిస్తాయి. ఈ స్థితిలో ప్రధానంగా రక్తనాళాలు మార్పులకు లోనవుతాయి. కనుక తలను కలిపినప్పుడూ, ముందుకు వంచినప్పుడూ రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు సంభవించి నొప్పి మరింత తీవ్రతరమవుతుంది. ఈ తరహా తలనొప్పుల్లో కీటాణు నాశక ఔషధాలను వాడాల్సి ఉంటుంది.

 

ఔషధాలు:

కర్పూరాదివటి, ఖదిరాదివటి, గంధకవటి, సంజీవనీవటి, టంకణ భస్మం, తాళ సింధూరం, వ్యాధిహరణ రసాయనం. దంత సమస్యలు: చిగుళ్ల వ్యాధులు, పిప్పిపళ్లవంటివి స్థానికంగా బాధించడమే కాకుండా నరాల ద్వారా ఎగువకు ప్రసరించి తలనొప్పిని సైతం కలిగించే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'రిఫర్డ్ పెయిన్' అంటారు. దీనిలో ప్రధాన సమస్యకు చికిత్స చేస్తే తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది.


గృహచికిత్సలు:

1. ఇంగువను పొంగించి వేడిగా వున్నప్పుడు పిప్పి పన్ను మీద ఉంచాలి. 2. అన్న భేది, పొంగించిన ఇంగువ, పటిక వీటిని మెత్తగా నూరి ఉండలాగ చేసి నొప్పిగా వున్న దంతంపైన ఉంచాలి. 3. సుగంధిపాల ఆకును నూరి పిప్పి పంటిమీద వుంచాలి. 4. తుమ్మ బంకనుగాని, మునగచెట్టు బంకనుకాని పిప్పి పన్నుమీద వుంచాలి. 5. జెల్లెడు పాలను సేకరించి కాటన్ బడ్ ను ముంచి పన్ను మీద మాత్రమే ప్రయోగించాలి. 6. పిప్పళ్ళు, సైంధవలవణం, జీలకర్ర, పటిక వీటిని సమతూకంలో తీసుకొని మెత్తగా దంచి టూత్ పౌడర్ మాదిరిగా రోజు రెండు పూటలా దంత ధావనానికి వుపయోగించాలి.

 

మదాత్యయం (అల్కహాలిజం):

ఆల్కహాల్ వలన తలనొప్పి వస్తున్నప్పుడు ఒకరింతలు, కడుపులో గడబిడ వంటివి అనుబంధ లక్షణాలుగా కనిపిస్తాయి. మద్యం సేవించిన తరువాత శరీరంలో జలీయాంశం తగ్గిపోతుంది. అప్పుడు తలలోని కొన్ని సున్నితమైన రక్తనాళాలు అతిగా సాగి నాడీ స్పందనలతో పైకి కిందకి ఉబుకుతుండటం వలన తలంతా పోట్లు పొడుస్తున్నట్లుగా నొప్పి బయల్దేరుతుంది. దీనికి తోడు మద్యంలో ఉండే విషపదార్థాలు కూడా రక్తనాళాలు వ్యాకోచం చెందడానికి దోహదపడతాయి. అంతటితో ఆగకుండా మద్యం రక్తంలో ఉండే గ్లూకోజ్ నిల్వలను అమాంతం తగ్గించేసి నీరసానికీ, నిస్సత్తువకూ కారణమవుతుంది. మద్యపానం తరువాత – హంగోవర్ వల్ల వచ్చే తలనోప్పిలో - & ద్రవ పదార్థాలను, తీపి పదార్థాలను, పిండి పదార్థాలను, తీపి పదార్థాలను తగినంతగా తీసుకోవాలి.

 

ఔషధాలు:

కళ్యాణకఘృతం, జహర్ మొహరా, వసంతకుసుమాకర రసం, శతావర్యాది ఘృతం, సువర్ణ మాక్షిక భస్మం, ముక్తాపిష్టి, వరాటికాభస్మం, శంఖభస్మం, గుడూచీసత్వం, విషతిందుకవటి.

 

నీటికాసులు (గ్లాకోమా):

కనుగుద్దులో ఉండే ద్రవాంశం పరిమితి స్థాయికి మించి పెరిగితే లోలోన ఒత్తిడి ఎక్కువై 'గ్లాకోమా' అనే స్థితి ప్రాప్తిస్తుంది. దీనిని తెలుగులో 'నీరుకాసులు' అంటారు. ఈ వ్యాధిలో తలనొప్పి ఒక ప్రధాన లక్షణం. దీనికి వాపును తగ్గించే 'శోథ హర' చికిత్సలు అవసరమవుతాయి.

 

ఔషధాలు: ప్రవాళపిష్టి, స్వర్ణ,మాక్షిక భస్మం, చంద్రోదయవర్తి (అంజనం), త్రిఫలాగుగ్గులు, సప్తామృత లోహం.

 

మైగ్రేన్ తలనొప్పి:

ఈ నొప్పి ఎక్కువగా ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీనిని తెలుగులో 'ఒంటి కణత నొప్పి' లేదా పార్శ్వ నొప్పి అంటారు. సాధారణంగా మైగ్రేన్ యుక్తవయసులో మొదలవుతుంది. కొన్ని కుటుంబాలలో అనువంశికంగా కొనసాగుతుంటుంది. ఈ తరహా నొప్పితో బాధపడేవారు ఎప్పుడూ చిరాకుగా, అసహనంగా ఉంటారు. చిన్న శబ్దాన్ని కూడా భరించలేరు. మిరిమిట్లు గొలిపే కాంతిని సహించలేరు. తలపోటు కళ్లకు పైన, లేదా కన్నుల వెనుక మొదలై తలలో ఒక పక్కకు సర్దుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ఒక పక్కనే ఎక్కువగా వస్తుంది.

 

కళ్లముందు మెరుపులు మెరుస్తున్నట్లుగా, మసకలు కమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకోసారి కొద్దిసేపు ఏమీ కనిపించకపోవచ్చు. కొద్దిసేపు మాటకూడా మామూలుగా రాకపోవచ్చు, తలనొప్పిని అనుసరించి వాంతులూ, ఒకరింతలూ ఉంటాయి. కొంతమందిలో ఒంటికణత నొప్పి వారానికి రెండుమూడు సార్లు వస్తే మరి కొందరిలో జీవితకాలం మొత్తంలోనే రెండు మూడుసార్లు వస్తుంది. అయితే వచ్చినప్పుడు మాత్రం నాలుగు నుంచి పన్నెండు గంటల పాటు తల్లడిల్లేలా చేస్తుంది. అదృష్టవశాత్తూ చాలామందిలో గాఢనిద్ర మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

 

మైగ్రేన్ తలనొప్పి తిరగబెట్టడానికి కొన్ని అంశాలు దోహదపడతాయి: విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరకంగా అలసిపోవడం, బహిష్టు సమయాలు, ప్లోరోసెంట్ లైట్లను చూడటం, తదేకంగా సినిమాలు లేదా టీవీలు చూడటం ఇటువంటివి. అలాగే చాక్లెట్లు, వెన్న, మద్యం మొదలైన ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంది.

 

మైగ్రేన్ తలనొప్పికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది - బాగా శ్ర్రమ పడిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకుంటుండగా మొదలు కావడం. అందుకే చాలామందిని వారాంతపు శెలవురోజున, సెలవులలో తొలిరోజున ఈ నొప్పి ఇబ్బంది పెడుతుంది.

 

మైగ్రేన్ కి ఆయుర్వేదం విధానంలో మంచి చికిత్సలున్నాయి: ఈ తలనొప్పికి ప్రధానంగా 'నిదాన పరివర్ణనం' (కారణాలకు దూరంగా ఉండటం) అవసరం, పిత్తాన్ని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి ఇవి దోహదపడుతాయి. రోగి వ్యక్తిగత శారీరక స్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ చికిత్సలను ఇవ్వాల్సి ఉంటుంది.


గృహచికిత్సలు:

1. పొద్దు తిరుగుడు గింజల పేస్టును నుదురుమీద రాసుకోవాలి. 2. సూర్యోదయానికి ముందు వెల్లుల్లిరసాన్ని, తుమ్మి మొక్క రసాన్ని రెండేసి చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాల్లో వేసుకోవాలి. 3. మునగాకు రసాన్ని రెండేసి చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్ గా వేసుకోవాలి.

 

ఔషధాలు:

అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుటిక, గోరోచనాది గుటిక, కస్తూర్యాది గుటిక, కస్తూరి మాత్రలు, మహా సూర్యవర్తి రసం, సూర్యావర్తి రసం క్షీరబలా తైలం (101 అవర్తాలు), వామనామృతం బిళ్లలు, వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు.


నిత్యరోంప (సైనసైటిస్):

సైనసైటిస్ లో తలనొప్పి ఉండే అవకాశం ఉంది. దీని గురించి చెప్పడానికి ముందు, అసలు తలలో ఉండే సైనస్ ల గురించి కొంత చెప్పాలి.

 

ముక్కుకు ఇరుపక్కలా, తలలోపల గాలి గదుల వంటి నిర్మాణాలుంటాయి. వీటిని 'సైనస్' లు అంటారు. ఇవి స్వతస్సిద్ధంగా తల ఎముకలను బరువులేకుండా, తేలికగా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా మనం మాట్లాడుతుండగా వెలువడే శబ్దాలను బిగ్గరగా చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇంతటితో ఈ సైనస్ ల ప్రత్యేకత అయిపోలేదు; శరీరేతర పదార్థాలనూ, హానికరాంశాలనూ వెలుపలికి నేట్టేయడానికి శ్లేష్మాన్ని కూడా తయారుచేస్తారు. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది - ఈ గాలి గదుల లోపలి శ్లేష్మపు పొరలు వివిధ రకాల ఇన్ ఫ్లమేషన్ ల వలన ఉబ్బిపోయి తమ స్రావాలను తామే అడ్డుకుని లోపల పెరుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా తలబరువు, తలనొప్పి మొదలైనవి వస్తాయి. ఇలా సామాన్యంగా జలుబు చేసిన తరువాత జరుగుతుంది.

 

నొప్పి ఎక్కువగా నుదురు లోపలగాని, కళ్ల వెనుక భాగానగాని ఉంటుంది. ముక్కు బిగెయ్యడం, ముక్కు కారడం మార్చిమార్చి జరుగుతాయి. తల ముందుకు వంచినప్పుడు మరింత బరువుగా అనిపిస్తుంది. చెంపల్లోపల – ఎముకల లోపలి భాగంలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి ఉదయం పూట ఎక్కువగా ఉండి, సూర్యుడు నడినెత్తికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. రోజువారీ పనులతో ముక్కుదిబ్బడ తొలగడం వలన ఇలా జరుగుతుంది. ఈ లక్షణాలాధారంగా ఈ తరహా నొప్పులను ఆయుర్వేదంలో వివరించిన 'సూర్యావర్తం'తో పోల్చవచ్చు. దగ్గు, తుమ్ము వంటివి ఈ తలనొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. అలాగే ధూమపానం మొదలైనవి కూడా దీనిని తీవ్రతరం చేస్తాయి. సైనసైటిస్ వలన వచ్చే తలనొప్పిలో మాటీమాటీకీ ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచాల్సి ఉంటుంది. ఆయుర్వేద రసాయన చికిత్సలు దీనికి తోడ్పడతాయి. ఆయుర్వేదం ఈ తలనొప్పికి స్వేదకర్మ మొదలైన ఆయుర్వేద ప్రక్రియలతో పాటు పలు శక్తివంతమైన రసౌషధాలను సూచించింది. తగిన వైద్య సలహా మేరకు వీటిని వాడుకోవచ్చు.


గృహచికిత్సలు: 1. తులసి, అల్లం, ఎలాక్కాయలు, మిరియాలు, మునగాకులను కషాయం కాచుకుని తాగాలి. 2. వావిలి రసం (పావులీటరు), నువ్వుల నూనె (పావులీటరు), ఉల్లిముద్ద (పావుకిలో) వీటినన్నిటిని కలిపి సన్నని సెగమీద ఉడికించాలి. నూనె మాత్రం మిగులుతుంది. దీనిని రోజువారిగా తలకు రాసుకోవాలి. 3. తుమ్మి ఆకులను (గుప్పెడు, వెల్లుల్లి గర్భాలను (మూడు), ఉప్పును (చిటికెడు) కలిపి ముద్దచేసి రసం పిండాలి. దీనిని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ గా నాలుగైదు రోజులు వేసుకోవాలి.

 

ఔషధాలు:

ఆరోగ్యవర్ధీనీ వటి, చిత్రక హరీతకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహిరసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, నవాయాస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజ గుగ్గులు, పైకి వాడాల్సివని - అసన బిల్వాది తైలం, బలా గుడూచ్యాది తైలం, బలాశ్వగంధాది తైలం, రాస్నాది చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫలాది తైలం.


మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్త్వెకల స్పాండిలోసిస్):

మెడలోని వెన్నుపూసలు అరిగినప్పుడు తత్సంబంధమైన నరాలు, కండరాలు ఇరిటేట్ అవుతాయి. ఫలితంతా తలనొప్పి ప్రాప్తిస్తుంది. ఈ తరహా తలనొప్పి ఉదయం పూట కాకుండా సమయం గడుస్తున్నకొద్ది ఎక్కువవుతుంటుంది. మెడ లాగడం ఉంటుంది. దీనికి 'గుగ్గులు' వంటి ఇన్ ఫ్లమేషన్ తగ్గించే మందులు అవసరమవుతాయి.

 

ఔషధాలు:

ఏరండపాకం, మహాయోగరాజగుగ్గులు, వ్యాధిహరణ రసాయనం, కాంతలోహ భస్మం, రౌష్య భస్మం, వాత విధ్యంసినీ రసం, మహావాత విధ్వంసినీ రసం, అమసుందరివటి, అమవాతారి రసం, చోప్ ఛీన్యాది చూర్ణం, లక్ష్మీవిలాసరసం, (నారదీయ), శిలాజిత్వాది లోహం, బృహత్ వాత చింతామణి రసం. బాహ్యప్రయోగాలు - మహానారాయణ తైలం, ప్రసారణీ తైలం.


చెవి సమస్యలు:

మధ్య కర్ణం (మిడిల్ ఇయర్) వ్యాధిగ్రస్తమైనప్పుడు - ఇన్ఫెక్షన్ వల్ల – నరాల ఇరిటేటై, తలనొప్పిని కలిగించడానికి ఆస్కారం ఉంది. వైద్యసలహాతో కీటాణునాశక ఔషధాలను వాడితే ఈ సమస్య తగ్గుతుంది.

 

గృహచికిత్సలు:

1. అల్లం రసాన్ని వేడిచేసి రెండు మూడు చుక్కల చొప్పున రోజుకు రెండు మూడు సార్లు డ్రాప్స్ గా వేయాలి. 2. జిల్లేడు ఆకులను బాగా పండిపోయిన వాటిని తెచ్చి, నెయ్యి రాసి నిప్పుసెగను చూపించి పిండితే రసం వస్తుంది. దీనిని రెండు మూడు చుక్కలు చెవుల్లో డ్రాప్స్ గా వేయాలి. 3. వెల్లుల్లి/మునగాకు/ముల్లంగి వీటిలో ఏదో ఒక దాన్నుంచి రసం తీసి వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు చెవిలో డ్రాప్స్ గా వేయాలి.

 

ఔషధాలు: శారిబాదివటి, కాంచనార గుగ్గులు, సర్పగంధఘనవటి. బాహ్యప్రయోగాలు - బిల్వ తైలం, క్షార తైలం.

 

అంగిటి ముల్లు (టాన్సిలైటిస్):

టాన్సిల్స్ వాచినప్పుడు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. టాన్సిలైటిస్ లో గొంతునొప్పి ప్రధానంగా ఉన్నా, ఒక్కొక్కసారి దానితోపాటు అనుబంధంగా జ్వరం మొదలైనవి కూడా జతచేరి తలనొప్పికి కారణమవుతాయి.

 

గృహచికిత్సలు:

1. పటికను (పావు చెంచా) వేడి నీళ్ళలో (కప్పు) వేసి గొంతు తగిలేలా పుక్కిట పట్టాలి. 2. త్రిఫలా చూర్ణం (చెంచాడు) నీళ్ళలో వేసి కాషాయం కాచి పుక్కిట పట్టాలి. 3. వెల్లుల్లిని ముద్దుచేసి, రసం పిండి కొద్దిగా వేడి చేయాలి. దీనికి తేనె కలిపి కాటన్ బడ్ తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. 4. పసుపు, మిరియాల చూర్ణాలను (చిటికెడు) వేడి పాలతో తీసుకోవాలి.


ఔషధాలు: కాంచనార గుగ్గులు, లఘుమాలినీవసంత రసం, తాళీసాది చూర్ణం, త్రిభువన కీర్తిరసం, ఇరిమేదాది తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసాకంటకారిలేహ్యం, కఫకేతురసం, తుండికేరి రసం.


టెంపోరల్ ఆర్టిరైటిస్:

ఇది ఒక ప్రత్యేక తరహా తలనొప్పి, కాస్త వయస్సు మళ్లిన వారిలో - కణతలలో - అదీ సాధారణంగా ఒక పక్కనే వస్తుంటుంది. ఇది స్థానికంగా ఉండే రక్తనాళాలు వ్యాధిగ్రస్తం కావడం వలన జనిస్తుంది. రోజుల తరబడి ఉంటుంది. వేలితో తాకిచూస్తే కణతలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నొప్పిగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు నొప్పి మరింత ఉధృతమవుతుంది. దీనితోపాటు కణతలలోని రక్తనాళాలలో రక్తం గడ్డలు ఏర్పడితే చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక దీనికి అత్యవసరంగా వైద్య సహాయం తీసుకోవాలి.


ఔషధాలు: లశునాదివటి, నాగార్జునాభ్రరసం, యష్టిచూర్ణం, స్వర్ణసమీరపన్నగ రసం.


తలకు దెబ్బతగలడం (హెడ్ ఇంజ్యురీ):

తల మీద పైపైన తగిలినా తల లోపల నొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిలో తలకు దెబ్బ తగిలిందన్న జ్ఞాపకం లేకుండానే లోపల కపాలం కింద రక్తస్రావమై మెదడుకు, కపాలపు ఎముకకు మధ్య చేరి మెదడు మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు తలనొప్పే కాకుండా మగతగా ఉండటం, అయోమయం ఆవరించడం వంటివి కూడా ఉంటాయి.దీనికి సమగ్రమైన పరీక్షలు అవసరమవుతాయి.


మెదడుకు సంబంధించిన వ్యాధులు (మెనింజైటిస్ తదితరాలు):

మెదడుకు, లేదా వెన్నుపామును ఆవరించి ఉండే కండరాలు ఇరిటేటైనప్పుడు తలనొప్పి తీవ్రాతితీవ్రంగా, నిరంతరంగా బాధిస్తుంది. దీనితోపాటు మెడ కూడా బిగదీసుకుపోతుంది. అలాగే వాంతులు, ఒకరింతలు, వెలుతురును చూడలేకపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలుంటాయి. ఇది అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి. మెదడు పొరలు వ్యాధిగ్రస్తం కావాడం మెనింజైటిస్), మెదడు కణజాలాలు వ్యాధిగ్రస్తం కావడం (ఎన్ కెఫలైటిస్), హైబిపీ వలన మెదడులో రక్తనాళాలు చిట్లడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాంటి తలనొప్పిని కలిగిస్తాయి. ఇది ప్రమాదకరమైన స్థితి, దీనికి అత్యవసరంగా వైద్యసహాయం పొందాలి.

 

ఔషధాలు: శిరః శూలాది వజ్రరసం, స్మ్రతిసాగర రసం, రౌష్య భస్మం, ఉన్మాదగజకేసరి రసం, వాతకులాంతక రసం, కంజనకారి రసం.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

4, ఆగస్టు 2020, మంగళవారం

మొలలు ఫైల్స్ ఫిషర్ సమస్య కు అవగాహనా మార్గం



తీవ్రమైన నొప్పి, ఎవరికీ చెప్పుకోలేని బాధ, మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావటం, మలబద్ధకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్యలకు పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా కారణం కావచ్చు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న ఈ సమస్యలకు జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్సతో సంపూర్ణంగా నయం చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌.
మలద్వారంలో ఉండే రక్తనాళాలు ఉబ్బి, వాపునకు గురై తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవటాన్ని పైల్స్‌ అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడి కి గురవటం, దీర్గకాలంగా దగ్గు ఉండటం, గర్భధారణ సమయంలో, కాలేయ వ్యాధులతో బాధపడే వారిలో పైల్స్‌ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మలవిసర్జన మార్గంలో రక్తనాళాలు వాపునకు గురవటం వల్ల ఇంటర్నల్‌ పైల్స్‌ ఏర్పడతాయి. మలద్వారం చివరి ప్రాంతంలో ఉన్న రక్తనాళాలు వాపునకు గురై, వాటిపైన ఉన్న మ్యూకస్‌ పొర బయటకు పొడుచుకొని రావడాన్ని ఎక్‌ ్సటర్నల్‌ పైల్స్‌ అంటారు. దీనిలో తీవ్రమైన నొప్పితోపాటు రక్తస్రావం ఉండవచ్చు.
ఫిషర్స్‌ : మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను ఫిషర్‌ అంటారు. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండి, మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడి మలద్వారం ద్వారా ఫిషర్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం విరేచనాలు కావటం, గర్భధారణ సమయంలో ఫిషర్‌ ఏర్పడే అవకాశం ఉంది.
ఫిస్టులా : రెండు కణజాలాల మధ్య ఉండే ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. మానవశరీరంలో ఫిస్టులా ఎక్కడైనా ఏర్పడవచ్చు. సర్వసాధారణంగా ఏర్పడేది ఏనల్‌ ఫిస్టులా. ఉబకాయం ఉన్నవారిలో రెండు పిరుదుల మధ్య ప్రాంతంలో మలద్వారం పక్కన ఏర్పడుతుంది. చర్మంపైన చిన్న మొటిమలా ఏర్పడి నొప్పి, వాపు ఏర్పడి రెండు,మూడు రోజుల్లో పగిలి చీము కారుతుంది.

పైల్స్‌ని త్వరగా తగ్గించే నవీన్ సలహాలు 


పైల్స్, హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా ఉంటుంది వీటితో బాధపడేవారి పరిస్థితి. అయితే, ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొంతమంది అలోపతి వంటి మందులను ఆశ్రయిస్తారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.


    
మలద్వారం లోపల, చుట్టూ వాపువచ్చి పెరిగే కణితులనే పైల్స్, హెమరాయిడ్స్, మొలలు అంటారు. ఇవి రక్తనాళాలు, కండ మొదలైనవాటితోనే ఏర్పడే కణసముదాయాలు. ఇవి రకరకాల సైజుల్లో ఉంటాయి, మలద్వారం బయట కూడా ఇవి పెరగొచ్చు. ఇది తీవ్ర సమస్య కాదు, ఎందుకంటే సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం, అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిల్లో ఒకటి.

చాలామందికి మొలల సమస్య ఉందని కూడా తెలియదు. కొన్ని లక్షణాలతో సమసయని గుర్తించొచ్చు. మలద్వారం వద్ద నొప్పి, రక్తస్రావం చాలా సాధారణం. చాలామందికి మలద్వారం వద్ద వాపు లేదా పెద్ద బొడిపెలలాగా పెరుగుతాయి.. వాటినే పైల్స్ అంటారు. ఈ సమస్య కారణంగా దురద, స్రావం కూడా సాధారణమే.

అదృష్టవశాత్తూ, ఈ సమస్యకి పరిష్కారం మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి.. మనం బాధపడాల్సిన అవసరం లేదు.

పైల్స్ తగ్గించే నవీన్ సలహాలు  ఇవే..

ఆయుర్వేద నిపుణులైన బిఎన్ సిన్హా మొలలకి ఏకైక కారణం మలబద్ధకమని అందుకు గల కారణాలు తెలిపారు. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి ఇది మరింత సాధారణం. ఏ రకమైన వ్యాయామం చేయని వారికి, శరీరం కదపని వారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

2-3 వారాల వ్యవధిలోనే సమస్యని మెరుగుపర్చే ఇంటి చిట్కాలు :

1) త్రిఫల చూర్ణం పొడి – మొలల సమస్యకి ప్రధాన కారణం మలబద్ధకం. కాబట్టి త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, అలాగే పైల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.


ఎలా వాడాలి? 4గ్రాముల త్రిఫల పొడిని వేడినీటిలో కలిపి ప్రతిరోజూ నిద్రపోయేముందు తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. .

2) ఆముదం నూనె- ఆముదంలో యాంటీఆక్సిడెంట్లు, ఫంగస్, బ్యాక్టీరియా అలాగే వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇది మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది.


ప్రతిరోజూ రాత్రిపూట పాలల్లో 3 ఎంఎల్ ఆముదం నూనెను కలిపి తీసుకోమని బిఎన్ సిన్హా సూచిస్తున్నారు. అలాగే మొలల ప్రాంతంలో కూడా ఈ నూనెను రాయాలి. బయటనుండి నూనెను రాయడం, లోపలకేమో పాలలో కలిపి తీసుకోవటం వలన అది ప్రభావవంతంగా నొప్పి, ఇతర మొలల లక్షణాలను తగ్గిస్తుంది.

3) రాత్రిపూట అధిక భోజనం వద్దు –మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అన్ని ఆరోగ్య సమస్యలకి మూలం మన ఆహారపద్ధతులే. మొలలను కారణమయ్యే మలబద్ధకాన్ని ముందుగా తగ్గించాలి. అందుకు తగ్గ ఆహారాన్నే తీసుకోవాలి. అలా అని ఎక్కువ పీచుపదార్థమే (ఫైబర్) ఉన్న ఆహారం తీసుకోకూడదు. పీచు పదార్థానికి ఆహార పరిమాణాన్ని పెంచే లక్షణం ఉంది. అందుకని దానికి దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువగా విరోచనకారులైన పదార్థాలు తింటే మలం మరీ పల్చగా మారి, మొలలతో బాధపడుతున్నవారికి అసౌకర్యంగా మారుతుంది. బాగా వేయించిన పదార్థాలు హెమరాయిడ్లను (మొలలను) మరింత తీవ్రతరం చేస్తాయి. అవి జీర్ణవ్యవస్థను మందగించేలా చేసి,ప్రేగులు సరిగ్గా పనిచేయనివ్వకుండా చేసి, లోపలి వాపులను పెంచుతాయి. దీనివల్ల మరింత చికాకుగా, నొప్పిగా ఉంటుంది. రాత్రి పూట అధికభోజనం, ఎక్కువ కారాలు, మసాలాలు ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా రక్తస్రావం ఉన్న పైల్స్ కి అయితే ఇవి భరించలేని బాధని కలిగిస్తాయి. అందుకని కేవలం ఆరోగ్యకరమైన,తేలికైన ఆహరాన్నే తీసుకోండి.


4) నీరు ఎక్కువగా తాగడం – పైల్స్ ని అరికట్టడానికి ఇది చాలా సులభ పద్ధతి. సరిపడినంత నీరు తీసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వలన ప్రేగులు కూడా చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ నీరు తాగటం వలన మలబద్ధకం, దాని ద్వారా పైల్స్ రెండూ నివారించబడతాయి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నివారణే చికిత్స కన్నా మెరుగైనది అని అంటుంటారు కదా, మరి ఈ సింపుల్ చిట్కాని అమలుచేసి ఆరోగ్యకర జీవనశైలితో మీరెందుకు జీవించకూడదు?

5) సలాడ్లు – మొలలతో బాధపడేవారు... ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే దోసకాయ వంటి సలాడ్లను తినమని సలహా ఇస్తున్నారు బిఎన్ సిన్హా. క్యారట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి, ఇవి మొలలను తగ్గించటంలో సాయపడతాయి. వీటిలోని విటమిన్ సి, కె లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

6) ఇంగువ – మొలల సమస్య ఉన్నవారిని రోజువారీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు బిఎన్ సిన్హా. అది కూరల్లోనైనా వేసుకోవచ్చు. లేదా గ్లాసు నీటిలోనైనా కలుపుకుని తాగొచ్చు. మన దేశవాళీ వంటదినుసు అయిన ఇంగువకి కొన్ని జబ్బులను నయం చేసే గుణం ఉంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరిచి మొలల సమస్యని కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:


నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్సార్‌, ఫిస్టులోగ్రామ్‌, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, కొలోనోస్కోపీ మొదలైన నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సరైన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండేటట్లు చూసుకోవడం, మాంసాహారం తక్కువగా తినడం, మలవిసర్జన ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉండే విధంగా చూసుకోవటం, సరైన వ్యాయామం చేయడం, ఊబకాయం రాకుండా చూసుకోవటం మేలు.
హోమియో వైద్యం : జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా పైల్స్‌, ఫిషర్స్‌, ఫిస్టులా, మలబద్ధకం వంటి సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యలు మళ్లీ తిరగబెట్టకుండా హోమియో వైద్యం తోడ్పడుతుంది.


పాటించాల్సినవి-పాటించకూడనివి
నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

పడుకునే ముందు ఒకగ్లాసు వేడి పాలను తాగడం వల్ల మర్నాడు ఉదయం మలవిసర్జన సాఫీగా అవుతుంది.

మలబద్దకం ఉన్నవారు వేడి పాలలో కొంచెం ఆముదం కలుపుకుని తాగవచ్చు.

రోజులో మూడుసార్లు వేడినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

మలబద్దకం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కాయగూరలు, సలాడ్లు, తాజా ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

2, ఆగస్టు 2020, ఆదివారం

కంటి చూపు సమస్య&కంటి లో ఇన్ఫెక్షన్ కు పరిష్కారం మార్గం



సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న నానుడి వినే ఉంటారు. అన్ని అవయవాల్లోకి కళ్లు చాలా కీలకం. అన్నింటికీ కంటి చూపు ప్రధానం. తన కళ్ల ముందున్న ప్రపంచాన్ని చూసే అదృష్టం ఈ భూమిపై నూటికి నూరు శాతం మందికీ లేదు. ఆ అదృష్టం ఉన్నవారు దాన్ని కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కంటి సమస్య చిన్నదైనా సరే 'ఆ ఏముందిలే' అని తీసిపారేయవద్దు. ఏ సమస్య దేనికి దారితీస్తుందో...? చివరికి ఆ అదృష్టం లేకుండా చేస్తుందేమో...? తస్మాత్ జాగ్రత్త.

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఏటా లక్షల సంఖ్యలో కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత అంధత్వానికి దారితీసేవి కూడా ఉంటున్నాయి. కొందరికి కళ్లద్దాలు, మందులతోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొందరికి సర్జరీలతో నయం చేయడానికి అవకాశం ఉండవచ్చు. కొందరి విషయంలో అప్పటికే చేయి దాటి ఉండవచ్చు.

పైకి కనిపించకపోవచ్చు...

కొన్ని సమస్యలు పైకి కనిపించవు. అయితే, కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే వైద్యులను సంప్రదించినట్టయితే పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించేందుకు వీలుంటుంది.

కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్: చాలా వరకు కంటి సమస్యలు ఈ పరీక్ష ద్వారా బయటపడతాయి. గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ఏఎండీ సమస్యలు తెలుస్తాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర

కొన్ని వ్యాధులు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయడం అవసరం. అప్పటికే కుటుంబంలో ఎవరైనా కంటి వ్యాధులతో బాధపడుతుంటే అవి వారసత్వంగా మీకూ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికే ఏదైనా కంటి సమస్య ఉన్నట్టు బయటపడితే అది వారసత్వంగా వచ్చిందా, కాదా? అన్నది తెలుస్తుంది. దాన్నిబట్టి వైద్యం చేసేందుకు వీలుంటుంది.

representation image

కన్ను పనితీరు

కంటిలో ముందు భాగంలో కనిపించే కార్నియా ద్వారా కాంతి లోపలికి ప్రసారం అవుతుంది. ఐరిస్ ఈ కాంతి ఎంత మేరకు అవసరమో ఆ మేరకే కనుపాప తెరచుకునేలా నియంత్రిస్తుంది. కనుపాప వెనుక లెన్స్ ఉంటాయి. ఇది తనకు చేరిన చిత్రాలను ఎలక్ట్రానిక్ సంకేతాల రూపంలో రెటీనాకు పంపిస్తుంది. ఈ సంకేతాలు రెటీనా నుంచి ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెదడుకు వెళతాయి. దాంతో మన కళ్ల ముందు ఏముందీ మెదడుకు తెలిసిపోతుంది. 

ఎలాంటి ఆహారం

ముదురు ఆకుపచ్చటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర మంచి చాయిస్. చేపలు కంటిచూపును కాపాడే మంచి బలమైన ఆహారమట. వీటిలో ఉండే ఓమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ కంటిని కాపాడతాయంటున్నారు నిపుణులు. చేపలు తినలేని వారు వాల్ నట్స్ తీసుకోవడం బెటర్. వీటిలోనూ ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారట్లు కళ్లకు మంచివి. అలా అని ఒక్క క్యారట్లే తినడం కూడా సరికాదు. పైన చెప్పుకున్నవి కూడా ఆహారంలో భాగం కావాలి. మొలకెత్తిన గింజలు కూడా మంచివి. 

representation image

కళ్లకు, మెదడుకు మధ్య అనుసంధానం చాలా కీలకమైనది. ప్రతీ కణం చక్కగా పనిచేసేందుకు వీలుగా ఎన్నో చానల్స్ నిర్మాణమై ఉంటాయి. కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయడం వల్ల కంటి చూపు బాగుంటుంది. ఇందులో రెటీనా, స్కెలరా, పుపిల్, ఐరిస్, కార్నియా, లెన్స్, మాక్యులా, ఆక్వియెస్, విట్రయెస్ హ్యుమర్, ఆప్టిక్ డిస్క్, ఆప్టిక్ నెర్వ్ మొదలైనవి ఉంటాయి. వీటి మధ్య సమాచారం సరిగా జరిగేందుకు వీలుగా తగిన పోషకాలు అవసరపడతాయి. ల్యూటీన్, జెక్సాంతిన్, క్రిప్టోక్సాంతిన్, బెటా కెరోటిన్, జింక్, బయోఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఏ, సీ అనేవి రెటీనాలోని కణాలు సరిగా పనిచేసేందుకు చాలా చాలా అవసరం. 

బరువు పెరిగినా కళ్లకు ముప్పే

ఊబకాయం వంటి సమస్యలతో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. అలాగే గ్లకోమాకు దారితీస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగకుండా చూసుకోవాలి. అది మీ వల్ల కాకపోతే వైద్యులను సంప్రదించాలి.

పొగతాగినా ముప్పే...

చాలా మందికి తెలియని విషయం. పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో కంటిచూపు దెబ్బతింటుందని. పొగతాగడం వల్ల మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ) సమస్యకు దారితీస్తుంది. కేటరాక్ట్, ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటాయి. దీంతో అంతిమంగా అంధత్వం ఏర్పడుతుంది.

సాధారణంగా కనిపించే సమస్యలు

మయోపియా లేదా దగ్గరి చూపు మందగించడం, హైపరోపియా లేదా దూరదృష్టి తగ్గడం, ఆస్టిగ్ మ్యాటిజమ్, ప్రెస్బియోపియా. ఇంకా...

ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ)

ఈ సమస్య 50 ఏళ్లకు పైబడిన వారిలో వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ కూడా అధికం అవుతుంది. పొగతాగేవారిలో ఏఎండీ రిస్క్ రెండు రెట్లు అధికంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసులకు వచ్చే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏఎండీ సమస్యలో రెటీనాలోని మాక్యులాకు రక్త ప్రసారం తగ్గుతుంది. దీని వల్ల చూపు క్షీణిస్తుంది. దీనికి చికిత్స లేదు.

representation image

కేటరాక్ట్

వయసు పెరుగుతుంటే కంటిలో శుక్లం ఏర్పడడం ఎక్కువ శాతం కనిపించే సమస్య. ప్రపంచంలో 51 శాతం అంధత్వానికి ఇదే కారణమట. మధుమేహం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు, ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం వంటివి కేటరాక్ట్ రావడానికి దారితీస్తాయి. 

డయాబెటిక్ రెటినోపతీ

టైప్1, టైప్ 2 మధుమేహంతో బాధపడే వారిలో డయాబెటిక్ రెటినోపతీ సమస్య ఎదురవుతుంది. ఎక్కువ కాలం మధుమేహంతో బాధ పడేవారిలో రెటీనా పరమైన సమస్యలు బయటపడే అవకాశాలు ఎక్కువ. రెటీనా రక్త నాళాల్లోంచి లీకేజీ ఏర్పడడం వల్ల చూపు కోల్పోతారు. అందుకే డయాబెటిస్ వచ్చినప్పటికీ దాన్ని అన్ని వేళలా అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

గ్లకోమా

అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా వచ్చి ఉంటే, వయసు 60 దాటితే వారిలో గ్లకోమా ముప్పు అధికంగా ఉంటుంది. ఇది రెటీనా నుంచి మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే ఆప్టిక్ నెర్వ్ దెబ్బతినడం వల్ల ఏర్పడే సమస్య. పైకి లక్షణాలు కనిపించవు, కానీ చూపు మాత్రం దెబ్బతినిపోతుంది. ఆలస్యంగా గుర్తిస్తే కంటి చూపు పూర్తిగా కోల్పోతారు. గ్లకోమా వచ్చి కంటి చూపు కోల్పోతే ఇక దాన్ని పునరుద్ధరించడం దాదాపుగా అసాధ్యం.

అధిర రక్తపోటు సమస్య వల్ల కూడా కంటిలోని కణాలు దెబ్బతిని చూపుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. పర్యావరణ కాలుష్యం, స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్ మందులు, సంతాన నిరోధం కోసం నోటి ద్వారా తీసుకునే మాత్రలు కంటికి కావాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయి. దీంతో చూపునకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.

శస్త్రచికిత్సలు

చూపు మందగించి కళ్లద్దాలు ధరించడం ఇబ్బందిగా అనిపిస్తే... వైద్యులను సంప్రదించినట్టయితే శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అలాగే కంటిలో శుక్లం సమస్యకు, గ్లకోమాకు కూడా శస్త్రచికిత్సలు ఉన్నాయి.

కంట్లో ఏవైనా పడితే

సబ్బు నీరు పొరపాటుగా కంటిలోకి వెళితే వెంటనే భగ్గుమని మండుతుంది. కంటిని నలపకుండా వెంటనే ధారగా కంటిలోకి ఫిల్టర్ వాటర్ ను స్ప్రే చేయండి. లేదా దోసిలితో తీసుకుని కంటిలోకి నీటిని చిమ్మండి. ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ కంట్లో పడినా ఇలానే చేయండి. లేదా సెలైన్ వాటర్ తో అయినా కంటిని శుభ్రం చేసుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటున్నారా..?

సాధారణంగా మనలో చాలా మంది చేసే పని కళ్లద్దాలను అసలు శుభ్రం చేయకపోవడం. కానీ దీనివల్ల కూడా పలు సమస్యలు రావచ్చు. ఎందుకంటే ఎక్కడపడితే అక్కడ పడేసి, ఏ చేతులతో పడితే ఆ చేతులతో కళ్లద్దాలను పట్టుకుంటాం గనుక కళ్లద్దాలపై ఎంతో బ్యాక్టీరియా చేరుతుంది. కళ్లద్దాలను శుభ్రం చేసుకునేందుకు ఐవేర్ స్టోర్లలో క్లీనింగ్ లిక్విడ్ లభిస్తుంది. దాంతో రోజుకొకసారి అయినా కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటుండాలి. అలాగే కాంటాక్ట్ లెన్సులు కూడా. ఇవి పెట్టి తీసుకునే ముందు చేతులను సబ్బుతో కడుక్కోవడం తప్పనిసరి.

ఏడాదికి ఒక్కసారైనా...

మనం తరచూ కళ్ళ రెప్పలను మనకు తెలియకుండానే ఆడిస్తుంటాం. ఇది సహజ చర్య. ఎందుకంటే కంటిలోపల ఎప్పుడూ తేమగా ఉండాలి. పొడిబారకూడదు. అలా తడిని ఉంచేందుకే రెప్పులు మూసి తెరుస్తుంటాం. కానీ, ఏదైనా చాలా ఆసక్తిగా చదువుతున్నప్పుడు, కంప్యూటర్ పై పనిచేస్తున్న సమయాల్లో కను రెప్పలు ఆర్పడాన్ని మనకు తెలియకుండానే నియంత్రిస్తాం. దాంతో కళ్లలో తేమ తగ్గుతుంది. కొన్ని రకాల ఇతర సమస్యల్లోనూ కంట్లో డ్రైనెస్ ఏర్పడుతుంది. అందుకే కంటి వైద్యులను ఏడాదిలో ఒక్కసారైనా సంప్రదించడం ఎంతో అవసరం.

కళ్లకు విశ్రాంతి

కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారా...? అయితే, మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు 20, 20, 20 సూత్రాన్ని పాటించాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది.

చలువ అద్దాలు

కళ్లకు చలువ అద్దాలతో తగిన ఉపయోగం ఉంది. ఎండ సమయంలో వీటిని ధరించడం వల్ల సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, కొనే ముందు అద్దాలు అల్ట్రా వయలెట్-ఏ, అల్ట్రా వయలెట్-బీ కిరణాలను నిరోధించేవా, కావా అన్నది చూడాలి. ఈ కిరణాలు కళ్లపై పడితే శుక్లం సమస్య ఎదురవుతుందని, ఏఎండీకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. చలువ కళ్లద్దాలు ధరించడం వల్ల క్యాటరాక్ట్ సమస్య రాకుండా చూసుకోవచ్చట. ముఖ్యంగా చిన్నారులు, యుక్తవయసులోని వారికి కళ్లద్దాల ద్వారా రక్షణ కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరిని సంప్రదించాలి...?

ఆప్టీషియన్: వైద్యులు రాసిన గ్లాసెస్ ను ఇవ్వడం వరకే వీరి పాత్ర పరిమితం

ఆప్టో మెట్రిస్ట్: వీరు కళ్లను పరీక్షించి ఏమైనా వ్యాధులు ఉన్నాయా? అన్నది నిర్ధారిస్తారు. చూపును పరీక్షించి తగిన గ్లాసులను సూచిస్తారు.  అవసరం మేరకు వ్యాధుల నియంత్రణకు మందులు సైతం సూచిస్తారు.

ఆప్తమాలజిస్ట్: వీరు పూర్తి స్థాయి కంటి వైద్య నిపుణులు. వ్యాధి నిర్ధారణ చేయడంతోపాటు వాటికి చికిత్స సూచిస్తారు. అవసరం మేరకు సర్జరీలు సైతం నిర్వహిస్తారు. గ్లాసులు, కాంటాక్ట్ లెన్స్ లను కూడా సూచిస్తారు.

ఇవి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి

- ఎర్రబారి, కంట్లో నొప్పిగా ఉంటే ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్ వద్దకు వెళ్లాలి.

- ఉన్నట్టుండి పాక్షికంగా, పూర్తిగా కంటి చూపు మందగిస్తే...

- ఎదురుగా ఉన్నవి రెండుగా కనిపిస్తే

- కంటి పాప ముందు నల్లటి చుక్కలు కనిపిస్తే

- ఏదో కంటిచూపునకు అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంటే...

- కుడి ఎడమవైపుల ఉన్నవి కనిపించకుంటే... రాత్రి సమయాల్లో చూపు మందగించినట్టు అనిపిస్తే...

- రంగుల మధ్య తేడాను గుర్తు పట్టలేకుంటే

- దగ్గర్లో ఉన్న వస్తువులు మసకబారినట్టు అనిపిస్తుంటే

- కళ్ల వెంట నీరు కారుతుంటే... బాగా దురదగా అనిపిస్తుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స పొందాలి.

- అధిక కాంతి వల్ల రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతుంటే కంటి వైద్యుడి సూచన మేరకు యాంటీగ్లేర్ కోటింగ్ ఉన్న గ్లాసెస్ ను వాడుకోవాలి. 

- చలువ కళ్లద్దాలు పెట్టుకున్నప్పటికీ సూర్యుడి వైపు చూడొద్దని నిపుణుల సూచన.

- కళ్ల నుంచి మానిటర్ కనీసం అడుగు దూరంలో ఉండాలి. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీ వెనుక వైపున లైట్, విండో ఉండరాదు. ఎందుకంటే ఆ వెలుగు స్క్రీన్ పై పడి గ్లేరింగ్ ఉంటుంది. దీంతో కళ్లు శ్రమకు గురవుతాయి.

- బ్లూ రంగు కళ్లకు హానికరం. అందుకే గ్రాఫిక్ ప్రాపర్టీస్ లోకి వెళ్లి కలర్ సెట్టింగ్స్ లో ఈ మేరకు మార్పులు చేసుకోవాలి.

- కళ్లలో పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ అయితే, ఆ లెన్స్ లో కళ్లలో అమర్చుకునే ముందు, తర్వాత తీసే సమయంలోనూ కళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. 




కంటి సంక్రమణలు/అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు అంటే ఏమిటి?

కంటి సంక్రమణలు/అంటువ్యాధులు చాలా సాధారణం మరియు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ అన్ని కూడా కంటి సంక్రమణలు/అంటువ్యాధులను కలిగించగలవు ఫలితంగా ఎర్రదనం, వాపు, దురద, కంటి నుండి స్రావాలు మరియు కళ్ళ నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. అధికంగా సంభవించే కంటి అంటురోగాలలో ఒకటి కండ్లకలక, ఇది సాధారణంగా వైరల్ సంక్రమణ వలన కలుగుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ కంటి సంక్రమణలు/అంటురోగాలతో ముడిపడి ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు:

  • కండ్లకలక మరియు బ్లేఫరైటిస్:
    • ఉబ్బిన కళ్ళు.
    • నొప్పి.
    • వాపు.
    • కళ్ళు నుండి నీరు కారడం.
  • బాక్టీరియల్ కెరటైటిస్:
  • హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కెరటైటిస్:
    • నొప్పి.
    • తగ్గిన లేదా అస్పష్టమైన చూపు.
    • కన్నీళ్లు కారడం.
    • స్రావాలు కారడం.
    • పుండు.
    • దురద.
    • కాంతిభీతి (ఫోటోఫోబియా).
  • ఎండోప్తాల్మిటిస్ (Endophthalmitis):
    • నొప్పి.
    • చూపు మందగించడం
    • ఎర్రదనం
  • కంటి కురుపు (stye):
    • నొప్పి.
    • చీముతో నిండిన ఒక గడ్డ
    • కళ్ళు ఎరుపు రంగులో కనిపిస్తాయి మరియు నీటితో నిండి ఉంటాయి.

వీటి ప్రధాన కారణాలు ఏమిటి?

కంటి సంక్రమణలు/అంటురోగాలకు కారణాలు ఒకొక్క సంక్రమణకు భిన్నంగా ఉంటాయి మరియు వీటిని కలిగి ఉండవచ్చు:

  • కండ్లకలక: తరచుగా ఇది కండ్లకలకతో బాధపడుతున్న వ్యక్తిని ప్రత్యక్ష చూడడం లేదా తాకడం ద్వారా సంక్రమిస్తుంది.
  • బాక్టీరియల్ కెరటైటిస్ (Bacterial keratitis): ఇది తరచూ కాంటాక్ట్ లెన్స్ ధరించడం వలన లేదా గాయం ఫలితంగా సంభవిస్తుంది.
  • హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కెరటైటిస్ (Herpes simplex virus keratitis): ఇది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వస్తుంది.
  • ఎండోప్తాల్మైటిస్ (Endophthalmitis): దీనిలో సూక్ష్మజీవ సంక్రమణ వలన వాపు. ఇది తరచూ కంటి శస్త్రచికిత్స, గాయం, మరియు ఇంట్రావిట్రియల్ (కంటి లోపల) ఇంజెక్షన్స్ (సూది మందులు) చేసిన తర్వాత సంభవిస్తుంది.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స?

ఆరోగ్య చరిత్ర మరియు సూక్ష్మ శారీరక పరీక్ష ఆధారంగా కంటి సంక్రమణలు/అంటువ్యాధులు నిర్ధారణ అవుతాయి.

ఒక స్లిట్ లాంప్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి కంటి వైద్యులు కళ్ళను పరిశీలించవచ్చు.

పరిశోధనలు  వీటిని కలిగి ఉంటాయి:

  • సూక్షమజీవుల పరిశీలన కోసం కార్నియా లేదా కంజుంటివా నుండి స్క్రాప్లింగ్స్ తీసి సాగుచేయడం .
  • కింది కంజుక్టివల్ సంచి (lower conjunctival sac) లేదా కనురెప్ప స్రావాలు యొక్క సాగు.
  • కార్నియా యొక్క జీవాణుపరీక్ష (Biopsy).

చికిత్స సంక్రమణ రకం, లక్షణాలు మరియు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కనిపించే కంటి సమస్యల యొక్క కొన్ని చికిత్సలు క్రింది విధంగా ఉంటాయి:

  • వైరస్ వలన కండ్లకలక సంభవిస్తే  వైద్యులు యాంటీవైరల్ డ్రాప్స్ లేదా జెల్ల్స్ను సూచించవచ్చు. బాక్టీరియా వలన కండ్లకలక సంభవిస్తే   దాని కోసం ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్ ఎజెంట్ అవసరం అవుతుంది.
  • క్లోరాంఫినికల్ (Chloramphenicol) అనేది బాక్టీరియల్ కెరాటైటిస్ కోసం అత్యంత సాధారణంగా సూచించబడే మందు.
  • హెర్పెస్ సింప్లెక్స్ కెరాటైటిస్ ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీవైరల్ ఎజెంట్ మరియు సమయోచిత స్టెరాయిడ్స్తో చికిత్స పొందుతుంది.
  • ఎండోప్తాల్మైటిస్ (Endophthalmitis) ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్స్ తో పాటు ఇంట్రావీనస్ (నరాలలోకి) సూది మందులు మరియు కంటికి చేసే ఇంజెక్షన్లు కూడా అవసరం కావచ్చు.
  • కంటికురుపు యొక్క చికిత్స కోసం పారాసెటమాల్ లేదా ఇతర నొప్పి నివారణలు  అవసరం అవుతాయి. కొన్ని నిమిషాలు కంటి మీద ఒక వెచ్చని వస్త్రాన్ని పెట్టుకోవడం అనేది వాపును తగ్గిస్తుంది.

కంటి సమస్య పూర్తిగా తగ్గిపోయేంత వరకు కాంటాక్ట్ లెన్స్ ధరించడాన్ని నివారించమని కంటి వైద్యులు సలహా ఇస్తార

కంటి సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) కొరకు మందులు


Medicine NamePack Size
AzibactAzibact LR Readymix 100
AtmATM 250 Tablet
AzibestAzibest 100 Suspension
CiploxCiplox 100 Tablet
AzilideAzilide -XL 200 Redimed
ZithroxZithrox 100 Suspension
AzeeAzee 250 Mg Tablet 6's
Dexoren SDexoren S Eye/Ear Drops
CifranCifran Infusion
AzithralAzithral DT 250 Tablet
RitolideRitolide Tablet
ChlorocolCHLOROCOL DROPS 10ML
ZomycinZomycin 250 Tablet
AzitagAzitag Tablet
Chloromycetin (Pfizer)Chloromycetin 250 Capsule
ZybactZybact 250 Mg Tablet
ChlorophenicolChlorophenicol 250 mg Capsu
Zycin(Cdl)Zycin 250 mg Tablet
Chlor SuccChlor Succ Injection
ZycinZycin 100 mg /5 ml Redimix Suspension
CloralCloral Lozenges
ZyroZyro 500 Mg Tablet
DaclorDaclor 250 Mg Tablet
Low DexLow Dex Eye/Ear Drops
EnteroENTERO CAPLET 500MG TABLET 6S

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.




1, ఆగస్టు 2020, శనివారం

వైరల్ ఫివర్ మరియు టైఫాయిడ్ ఫీవర్ కి తీసుకో వలిసిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి


జ్వ‌రం వెంట‌నే త‌గ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

ఇప్పుడు ఎక్క‌డ చూసినా చాలా మందికి జ్వ‌రాలు వ‌స్తున్నాయి. మ‌లేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి చాలా మంది ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. ఈ క్ర‌మంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోయి వ్యాధి మ‌రింత తీవ్ర‌త‌ర‌మై ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతోంది. అయితే విష జ్వ‌రాలే కాదు, ఎలాంటి జ్వ‌రాలు వ‌చ్చినా అధికంగా ఉన్న ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రిస్తే చాలు, వ్యాధి నుంచి వెంట‌నే కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు కొన్ని సూచ‌న‌లు పాటిస్తే జ్వ‌రాన్ని వెంట‌నే త‌గ్గించుకునేందుకు వీలుంటుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. దీంతో శ‌రీర ఉష్ణోగ్ర‌త కొద్దిగా పెరిగినా, స్నానం వ‌ల్ల క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త త‌గ్గుతూ వ‌చ్చి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. దీంతో జ్వ‌రం త‌గ్గుతుంది.

2. ఉన్నితో చేసిన షూ సాక్సుల‌ను చ‌ల్ల‌ని నీటిలో త‌డిపి బాగా పిండాలి. అనంత‌రం వాటిని కాళ్ల‌కు వేసుకుని దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకోవాలి. దీంతో శ‌రీర ఉష్ణోగ్ర‌త క్ర‌మంగా త‌గ్గుతూ సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. జ్వ‌రం ఇలా వేగంగా త‌గ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్‌గా ప‌నిచేసే టిప్‌. చిన్నారుల‌కు ఇలా చేయ‌డం వ‌ల్ల వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరిగి జ్వ‌రం వెంట‌నే త‌గ్గుముఖం ప‌డుతుంది. దీని వ‌ల్ల జ్వ‌ర‌మే కాదు ఛాతిలో ఉన్న క‌ఫం కూడా పోతుంది.

3. చిన్న‌పాటి నాప్‌కిన్ ట‌వ‌ల్స్‌ను తీసుకుని చ‌ల్ల‌ని నీటిలో త‌డిపి వాటిని నుదుటిపై లేదా మెడ‌, కాలి మ‌డ‌మ‌ల‌పై వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. ట‌వ‌ల్స్ పూర్తిగా ఆరిపోయినా కూడా మ‌ళ్లీ, మ‌ళ్లీ ఇలాగే చేస్తుంటే జ్వ‌రం వెంట‌నే త‌గ్గుముఖం ప‌డుతుంది.

4. జ్వ‌రం వ‌చ్చిన వారు సాధార‌ణంగా తినే తిండి కంటే కొద్దిగా త‌క్కువ తింటే బెట‌ర్‌. ఎందుకంటే మ‌నం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు శ‌రీరం కొంత శ‌క్తిని ఖ‌ర్చు చేస్తుంది. ఈ క్ర‌మంలో బాగా తింటే ఆ తిన్న‌దాన్నంతా జీర్ణం చేసేందుకే శ‌రీరం క‌ష్ట‌ప‌డుతుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాడేందుకు కావ‌ల్సిన శ‌క్తి శ‌రీరానికి ఉండ‌దు.

5. జ్వ‌రం వ‌చ్చిన వారు ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి. ప్ర‌ధానంగా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నారింజ‌, ద్రాక్ష‌, కివీ వంటి పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. ఈ పండ్ల వ‌ల్ల రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. నూనె ఎక్కువ‌గా ఉండే ఆహారం, జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌ట్టే ఆహారాన్ని తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

6. కూర‌గాయ‌లు, చికెన్ క‌లిపి వండే చికెన్ సూప్‌ను తాగితే శ‌రీరానికి ఎక్కువ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాడేందుకు త‌గిన శ‌క్తి వ‌స్తుంది. చికెన్ సూప్‌ను తాగ‌డం వ‌ల్ల జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు కూడా వెల్ల‌డిస్తున్నాయి.

7. తీపి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తినాలి. నీరు ఎక్కువ‌గా తాగుతుండాలి. దీంతో శ‌రీరానికి త‌గిన ద్ర‌వాలు అందుతాయి. ఇవి శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రిస్తాయి.

8. తుల‌సి ఆకులు, పుదీనా ఆకులు, అల్లం వంటి ప‌దార్థాల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని పాలు, చ‌క్కెర లేకుండా తాగాలి. దీంతో ఆయా ప‌దార్థాల్లో ఉండే ఔష‌ధ గుణాలు ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాడేందుకు స‌హ‌కరిస్తాయి.

9. ఆక‌లి స‌రిగ్గా లేక‌పోవ‌డం, మ‌జ్జుగా ఉండ‌డం, శ‌రీరంపై దుర‌ద‌లు రావ‌డం, ఫిట్స్ రావ‌డం, గొంతు నొప్పి, మంట‌, త‌ల‌నొప్పి, చెవి నొప్పి, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ వ‌స్తుంటే లోలోప‌ల జ్వ‌రం ఉంద‌ని తెలుసుకోవాలి. దీనికి స్పందించి త‌గిన చికిత్స తీసుకోవాలి

*వైరల్ ఫీవర్ గురించి ప్రతీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు?*


మీరు ఒక పేరెంట్ అయితే - మీరు 'జ్వరం' అనే పదాన్ని ద్వేషిస్తారు. ఇది మిమ్మల్ని భయపెడుతుంటుంది మరియు నిద్ర లేకుండా చేస్తుంది.


కానీ జ్వరం చాలా భయపెట్టేది - మరియు పేరెంట్ గా మీరు మీ బిడ్డకు ఆ అరిష్ట పదం ఏమీ చేయకూడదనుకుంటే - మీరు ఉత్సాహంగా థర్మామీటర్ పఠనం సాధారణంగా ఉంచడానికి - మీరు ఏదైనా చెయ్యాలా?


మీరు ఏమి చెయ్యాల్సిన అవసరం లేదు !


జ్వరం అంటే ఏమిటి? జ్వరం వ్యాధి యొక్క సూచన - వ్యాధి కాదు. మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగ్యూ మొదలయిన వివిధ వ్యాధుల ద్వారా జ్వరం సంభవిస్తుంది - కానీ పిల్లల విషయంలో - వైరస్ లోని వలన ఇది వస్తుంది.

*'మీ పిల్లలకు వైరల్ జ్వరం ఉన్నప్పుడు మీరు ఏమి చేయాలి*


చిన్ననాటి జ్వరాలు చాలావరకు వైరల్ - మరియు వైరల్ ఇన్ఫెక్షన్లకు సాధారణంగా పెద్ద చికిత్స అవసరం లేదు.


కాబట్టి, మీరు మొదట జ్వరంతో బిడ్డను వైద్యుడి దగ్గరకు తీసుకొని పోయినప్పుడు - వైద్యులు సాధారణంగా పిల్లల లక్షణాలు చూసి ఉపశమనానికి తేలికపాటి మందులను ఇస్తారు.


అయితే, మీరు ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు అయితే , మీ బిడ్డ వెంటనే కోలుకోవడం కోసం, అలాంటి చికిత్సకు మీరు తరచూ నిరాశకు గురి అవుతు అసంతృప్తి చెందుతారు మరియు యాంటీబయాటిక్స్ ఇవ్వమని వైద్యులను కోరుతారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే - ఆ యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కోసం మరియు పనికిరానివి మరియు వైరల్ ఇన్ఫెక్షన్ విషయంలో నిరుపయోగంగా ఉంటాయి.


ఇది మనం జీర్ణించుకోడానికి ఒక కఠినమైన విషయం అయినప్పటికీ - అర్థం చేసుకోడానికి కీలకమైనది ఏంటంటే - ఆ అనారోగ్య భాగాలు పిల్లల రోగనిరోధక శక్తి కోసం అదనపు కోచింగ్ లాగా ఉంటాయి. ఒక బిడ్డ పుట్టినప్పుడు - అతను / ఆమె కు చాలా తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది. మరియు అనారోగ్యం అనే పాఠశాలకు రోగనిరోధక వ్యవస్థ వెళ్తూ, చివరకు మంచి ఆరోగ్యం అనే గ్రాడ్యుయేట్ అవుతుంది. విసుగుగా అనిపించినా సరే చిన్నప్పుడే ఈ వైరల్ ఫీవర్ అనే విషయంలో నుంచి బయటకు రావడం ఉత్తమం.


మనస్సాక్షి ఉన్న తల్లితండ్రులుగా - మందులతో చికిత్స చేయాలి అనే ఆలోచన మాని ప్రేమతో, సౌకర్యంతో దానిని జయించండి.


*అధిక యాంటీబయాటిక్స్ తో జాగ్రత్త వహించండి*


ఆ యాంటీబయాటిక్స్ రెండు వైపులా పదునైన కత్తులు అని గుర్తుంచుకోండి. అనవసరంగా యాంటీబయాటిక్ ని ఉపయోగించడం అనేది శత్రువుతో యుద్ధం వ్యూహాలను పంచుకోవడం వంటిది. ప్రతిసారీ యాంటీబయాటిక్ వాడినప్పుడు, బ్యాక్టీరియా పోరాడటాన్ని మరియు కొత్త ప్రతిఘటన విధానాలను ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకుంటుంది. తదుపరిసారి యాంటీబయాటిక్ వాడినప్పుడు, ఇది అంత సమర్థవంతoగా పని చేయదు.


అలాగే యాంటీబయాటిక్స్ వారు చంపిన బాక్టీరియా యొక్క గుర్తింపు గురించి పట్టించుకోని విచక్షణారహిత కిల్లర్లు. అది వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాను చంపటం మాత్రమే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఇతర బాక్టీరియాలను కూడా తుడిచిపెట్టేస్తుంది.


*జ్వరం ఎల్లప్పుడూ "చెడ్డది" కాదు*


జ్వరం చాలా అసంతృప్తిని కలిగించేది, కానీ నమ్మడానికి కష్టమైనా - నిజానికి ఇది ఒక రక్షక యంత్రాంగం. శరీర ఉష్ణోగ్రత పెరుగుదల జరిగితే దీనినే జ్వరం అంటాం, ఇది రక్షణకు కారణమవుతుంది ఎందుకంటే ఇది వ్యాధికి కారణమయ్యే వైరస్ ని శరీరం వదిలిపెట్టమని వత్తిడి తెస్తుంది. అంతేకాకుండా, శిశువు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవాలని ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల జ్వరం అన్ని వనరులను ఉపయోగించి శరీరాన్ని రోగాలతో పోరాడటానికి తయారు చేస్తుంది.


కాబట్టి జ్వరానికి వైద్యుని సలహాతో జాగ్రత్తగా చికిత్స చేయాలి. జ్వరాన్ని తగ్గించే ఇదొక మందు వాడేసే తల్లిదండ్రులను మనం చూస్తూ ఉంటాం. ఇది అనారోగ్యాన్ని పొడిగిస్తుంది మరియు హానికరమైన అధిక మోతాదుకు దారి తీస్తుంది.


అణచివేసే జ్వరాలను విచక్షణారహితంగా - ఒక వైద్యుడిని సంప్రదించకుండా కొన్ని పెద్ద అనారోగ్యాలు చాలా కాలం పాటు గుర్తించబడకుండా అవుతాయి దాని ఫలితంగా నయం చేయటం కష్టం అవుతుంది.


ఒక జాగ్రత్త - వేచి చూసే విధానం చిన్ననాటి జ్వరంలో ఉత్తమం అని చెప్పవచ్చు .


సంక్రమణకు వ్యతిరేకంగా ఒక కోటను నిర్మించుకోండి


మీ శరీరం మీ రోగనిరోధక శక్తిని కష్టతరం గా నిర్మిస్తునప్పుడు- సులభమైన మార్గాల్లో దాని ప్రయత్నాలకు మీ వంతు సహాయం చేయండి. మీ బిడ్డకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని నిర్ధారించుకోండి. మీ పిల్లల కోసం వయస్సుకు తగిన టీకాను నిర్ధారించుకోండి. సమతుల్య ఆహారం, వ్యాయామం మరియు తగినంత నిద్ర ఉందా చూసుకోండి. మీ బిడ్డకు ఏ రకమైన ఒత్తిడి లేకుండా చూసుకోండి.మి నవీన్ నడిమింటి

*కొత్తగా పుట్టిన పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ: మనం తెలుసుకోవాల్సిన విషయాలు*


కొత్తగా పుట్టిన పాపాయిలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా వుంటుంది. వారు ఆ శక్తిని తమ తల్లుల నుంచి అందుకుంటారు/పొందుతారు.


2 లేదా 3 నెలల వయసు వచ్చేవరకు ఆ పసిబిడ్డ యొక్క రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందదు.


*తల్లి నుంచి పొందే రోగనిరోధక శక్తి*


బిడ్డ పుట్టే కంటే ముందే వారికి సంరక్షణనిచ్చే వ్యాధిరోగ నిరోధకాలు బిడ్డ గర్భంలోని ఆఖరి 3 నెలల కాలంలో గర్భంలోని మాయ ద్వారా బిడ్డకి అందుతాయి.


ప్రసవం జరిగేటప్పుడు తల్లి జననాంగం నుంచి బిడ్డ బయటకు వచ్చే సమయంలో ఆ ప్రదేశంలోని బాక్టీరియా అంతా ఒక చోట జమ అయ్యి బిడ్డలో రోగనిరోధక శక్తికి దోహదపడతాయి.


*తల్లిపాలు*


ప్రసవించిన వెంటనే బిడ్డ తాగే తల్లి పాలల్లో వుండే స్తన్యము (colostrum) ద్వారా పిల్లలని చెవి ఇన్ఫెక్షన్స్ నుంచి, అలెర్జీలు, అతిసారం, న్యుమోనియా, మెనింజైటిస్, మూత్ర మార్గము అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.


ప్రసవం అయిన వెంటనే పాల కంటే ముందు కొలొస్ట్రమ్ (colostrum) అనే ద్రవం ఏదయితే తల్లి స్తన్యo నుంచి స్రవిస్తుందో ఆ ద్రవం బిడ్డలో వ్యాధి రోగనిరోధక వ్యవస్థని పెంపొందించే ప్రతి నిరోధకాలను అందించే గొప్ప శక్తి కలిగి ఉంటుంది.


బిడ్డలను వ్యాధుల నుంచి రక్షించే వ్యాధి రోగనిరోధకాలకు అతిధ్యమిచ్చే అద్భుతమైన శక్తిని ప్రకృతి తల్లి పాలకు ప్రసాదించింది.


*టీకాలు*


ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కలిగించే సమర్ధవంతమైన, భధ్రమైన మార్గం టీకా.


బిడ్డ శరీరంలో అప్పటికే నిక్షిప్తమైన ప్రత్యేకమైన వైరస్ ని కాని బాక్టీరియాని గుర్తించి వాటికి అనుగుణంగా స్పందించడం ద్వారా ఆ వ్యాధితో పోరాడడం తద్వారా వచ్చే సమస్యలను నిరోధిస్తాయి. ధనుర్వాతం (tetanus), ఫ్లూ, మరియు గోరింత దగ్గులకు గర్భవతి అయిన స్త్రీ కి టీకాలు ఇవ్వడం వలన ప్రసవానంతరం ఆ వ్యాధులు రాకుండా తల్లి నుంచి బిడ్డకు ఆ టీకా వలన కలిగే ప్రయోజనం చేకూరుతుంది.


పుట్టిన వెంటనే మొదటగా బిడ్డకు ఇచ్చే టీకా మరలా 6 వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు తిరిగి ఇవ్వబడుతుంది. బిడ్డ పుట్టిన తరువాత సక్రమంగా నిర్ణీత సమయాల్లో ప్రత్యేకంగా వేసిన టీకాలు వారిని అనేక వ్యాధుల బారిన పడకుండా నివారిస్తాయి.


అప్పుడే పుట్టిన బిడ్డలకు యాంటీబయాటిక్స్ అవసరం రాకుండా ఎలా నివారించవచ్చు


అప్పుడే పుట్టిన బిడ్డలలో చాలా సామాన్యంగాను, తరచుగాను వచ్చే ఫ్లూ మరియు గోరింత దగ్గుకు కారణమైన వైరస్ కు యాంటీబయాటిక్స్ వాడవలసిన అవసరం లేదు.


యాంటీబయాటిక్స్ కన్నా ప్రేగుల్లో ఉండే బాక్టీరియా బిడ్డలో వ్యాధి నిరోధికతకు చాలా ముఖ్యం. యాంటీబయాటిక్స్ వాడకం తరువాత పిల్లలలో నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోబయాటిక్స్ ని సూచిస్తారు.


*పడుకునే సమయం*


అప్పుడే పుట్టిన పిల్లలకు మంచి నిద్ర కూడా రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కొత్తగా పుట్టిన పిల్లలు సామాన్యంగా రోజులో 18 గంటల నిద్రా సమయం లేదా ఉయ్యాల సమయం కావాలి అలాగే పాకే వయసు పిల్లలకి 12 నుంచి 13 గంటల నిద్ర, ప్రీస్కూల్ పిల్లలకి 10 గంటల నిద్రా సమయం చాలా అవసరo.


*తాజా గాలి మరియు సమృద్ధిగా సూర్యరశ్మి*


సమృద్ధిగా తాజా గాలి మరియు సూర్యరశ్మి ప్రస్తుత సమాజంలోని జనాభాలోని అత్యంత శాతం వారిలో తక్కువగా ఉన్న డి విటమిన్ పాపాయికి చక్కగా సూర్యరశ్మిని తగలనిస్తే పుష్కలంగా లభిస్తుంది.


తాజా గాలి తగిలేలా చూస్తే ప్రకృతిపరమైన సహజ సిద్దమైన నిరోధికత పెరుగుతుంది.


*చేతి శుభ్రత*


నెమ్మదిగా క్రమక్రమంగా పెరుగుతున్న పాపాయి తరచు చేతులు నోట్లో పెట్టుకోవడం వలన ఏ విధమైన రోగాలు రాకుండా పాపాయి చేతులు శుభ్రత చాలా అవసరo. అలానే కొత్తగా పుట్టిన పాపాయిని చూడడానికి ఎవరో ఒకరు తరచుగా వస్తూ వుంటారు. వారు పాపాయిని ఎత్తుకోవడానికి ముందే చేతులు శుభ్రం చేసుకోవటానికి అనుకూలంగా సానిటైసర్ ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి.

ధన్యవాదములు 

మి  నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.