21, అక్టోబర్ 2020, బుధవారం

శీఘ్ర స్కలనం సమస్య పై అవగాహన కార్యక్రమం ఈ లింక్స్ లో చుడండి



పురుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన లైంగిక సమస్యలలో శీఘ్ర స్ఖలనం ఒకటి. ఇది హెచ్చు శాతం మందిని  మానసికంగా కృంగదీస్తున్నది. పురుషుడు సంభోగం సందర్భంగా అంగస్తంభనను నిలుపకోలేకపోవడం ఈ సమస్యకు కారణం. ఉద్వేగం  పొందడానికి మునుపే స్ఖలనం జరగడం శీఘ్రస్ఖలనంగా చెప్పబడుతుంది. రతి ప్రారంభించిన నిమిషం లోపుగా వీర్య  స్ఖలనం జరిగితే దానిని శీఘ్ర స్కలనం లేదా  ప్రి-మెచ్యూర్ ఎజాక్యులేషన్ – ( పి ఐ) అంటారు. ఈ దుస్థితి పురుషునికి మానసికంగా ఇబ్బంది కలిగించి  తన లైంగిక భాగస్వామితో సంబంధాలను త్రుంచివేస్తుంది శీఘ్ర స్ఖలనం ప్రాథమిక (యావజ్జీవ ప్రాతిపదిక ) స్థాయిలో లేదా సెకండరీ స్థాయిలో ( తెచ్చుకొన్నది)  ఉంటుంది. ఈ దుస్థితికి కారణం  శారీరక , మానసిక లేదా జన్యుపమైనది కావచ్చు.  మానసిక ఒత్తిడి నిర్వహణ, ఔషధాల వాడకం, మానసిక వైద్య నిపుణుని సలహాలు మరియు సముచిత వ్యాయామం తో కూడిన  విభిన్న చికిత్సలు పరిస్థితిని చక్కదిద్దుతాయి. శీఘ్రస్ఖలనం సమస్య హెచ్చు  మోతాదులో ఉన్నప్పుడు, చికిత్స లోపం మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.. కొన్ని సందర్భాలలో , ఇది పుంస్త్వం/ పుంసకత్వం సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే వీర్యం యోనిలో ప్రవేశించడంలో విఫలమవుతుంది. ఎక్కువ మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్యను వైద్య సహాయంతో నయం చేయవచ్చు

శీఘ్ర స్కలనం యొక్క లక్షణాలు

డి ఎస్ ఎం  - 5  ప్రకారం  ఇక వ్యక్తి శీఘ్ర స్ఖలనం సమస్యను ఎదుర్కోవడానికి క్రిందివాటిలో ఏదయి కావచ్చు :

  • సంభోగం ప్రారంభించిన నిమిషంలోపుగా స్ఖలనం జరగడం
  • ఆరు నెలల పాటు అంతకంటే హెచ్చు కాలం శీఘ్రస్ఖలనం జరగడం
  • 75% నుండి  100 %  సంభోగం సందర్భాలలో  శీఘ్రస్ఖలనం జరగడం
  • లైంగిక భాగస్వాములలో లైంగికంపరమైన అసంతృప్తి, విసుగు, మానసిక ఒత్తిడి
  • మానసిక దుస్థితి కలగడం, లేదా వైద్య చికిత్స పర్యవసానం అట్టి పరిస్థితికి దారి తీయడం
  • లోగడ మాదక ద్రవ్యాలకు బానిస కావడం, శీఘ్ర స్ఖలనానికి దారితీసే కొన్ని మందులను సేవించడం

శీఘ్ర స్కలనం యొక్క చికిత్స 

చికిత్సకు పెక్కు ఐచ్చికాలు లభిస్తున్నాయి. వాటిలో సలహాలు తీసుకోవడం, ఔషధాల సేవన, లైంగిక ప్రవర్తనలో కొత్త విధానాలు, సమయోచితంగా మత్తు పొందడం వంటివి.

  • సలహాల కల్పన మరియు సెక్స్ థెరపీ.
    సలహాల ప్రక్రియ మీ సలహాదారునితో (కౌన్సెలర్) మీ లైంగిక సమస్యలపై ముఖాముఖిగా మనసు విప్పి చర్చించడం.  మీ సలహాదారు లేక డాక్టరు పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ఎదురవుతున్న దుస్థితిని అధిగమించడానికి విధానాలను వివరిస్తారు. ఆందోళనకు, మానసిక ఒత్తిడికి మార్గం సూచిస్తారు.. సెక్స్ థెరపీ మరియి సంబంధాల సలహా ప్రక్రియ భాగస్వాముల మధ్య సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. 
  • ఔషధాలు
    స్ఖలనం ఆలస్యం కావడంలో సహకరించడానికి వివిధ రకాల మందులు సూచింప బడతాయి. వీటిలో ఆంటీడిప్రెషంట్స్, అనాల్జెసిక్స్ మరియు ఫాస్ఫోడైయ్స్టరేస్- 5 నిరోధకాలు చేరి ఉంటాయి. ఇవి స్ఖలనాన్ని నిదానం చేసే గుణం కలిగి ఉంటాయి ( అయితే ఇవి ఎఫ్ డి ఏ ఆమోదం పొందలేదు). మీ ఆరోగ్య స్థాయిని అనుసరించి మీ డాక్టరు ఈ మందులను విడిగా గాని, లేదా ఇతర కొన్న మందులతోపాటుగా గానీ సూచించవచ్చు. స్వయంగా మందులను తీసుకోవడం వల్ల తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. దీనితో ఈ జబ్బు ఎదుర్కొంటున్న వ్యక్తి వైద్యుని సలహా లేకుండా స్వయంగా మందులను తీసుకొనకూడదు
  • నడచుకోవడంలో విధానాలు
    కొందరిలో శీఘ్రస్కలనాన్ని కేవలం నడవడిక విధానంలో మార్పులతో సరిదిద్దవచ్చు. యోనిలో సంభోగంతో  కాకుండా లైంగికంగా ఇతర విధాలతో సాన్నిహిత్యం పెంపొందించుకోవడంపై దృష్టి నిలపడం ఒక ప్రక్రియ. ఇది పరిస్థితిని చక్కదిద్దుతుందని వెల్లడయింది. మీ డాక్టరు  శీఘ్రస్ఖలనాన్ని అధిగమించడానికి అదుపుచేయడానికి వీటిలో కొన్ని మార్గాలను సూచించవచ్చు.
  • సమయోచితమైన అనీస్థిటిక్స్
    మీ డాక్టరు అనీస్థిటిక్ క్రీములు, స్ప్రేలు సూచించవచ్చు. ఇవి జననాంగంపై వాడినప్పుడు అవి స్పర్శజ్ఞానాన్ని తొలగించి స్ఖలనాన్ని నివరిస్తాయి. వీటిని లైంగిక క్రియకు 10-15 నిమిషాల ముందు ఉపయోగించాలి.  వీటిలో కొన్ని స్ప్రేలు మందుల దుకాణంలో మందుల సూచిక లేకుండా లభిస్తాయి. కొన్నిటికి సూచిక అవసరం.  వీటిలో పెక్కు ఔషధాలు శీఘ్రస్ఖలనాన్ని అదుపు చేసినప్పటికీ, కొన్ని సందర్భాలలో అవి స్పర్శజ్ఞానం కోల్పోవడానికి, స్త్రీలు, పురుషులలో  లైంగిక కోరిక తగ్గడానికి దారి తీస్తాయని కొన్నినివేదికలు పేర్కొంటున్నాయి.
  • వ్యాయామాలు
    కటి కండరాలను ఒత్తిడి చేయడం వల్ల ఒక వ్యక్తి స్ఖలనాన్ని నిదానం చేయవచ్చు. బలహీనమైన కటి కండరాలు శీఘ్ర స్ఖలనానికి వీలు కల్పిస్తాయి.
    • సరియైన కండరాలను గుర్తించండి
      ఈ ప్రక్రియలో చోటుచేసుకొన్న కండరాలను గుర్తించడానికి సంభోగానికి ముందుగా మూత్ర విసర్జనను నిలిపివేయండి. ఈ కండరం స్ఖలనాన్ని నిలుపుతుంది. వాయువును సమయానుసారం బయటకు వదలడాన్ని  నిలపడం వల్ల కూడా స్ఖలనం అదుపుచేయబడుతుంది.
    • కండరాలను  మీ దారికి మలచుకొనండి
      మీ కటి కండరాలను 3 – 4 సెకన్లపాటు సంకోచం చేయండి తర్వాత సడలించందడి. ఈ వ్యాయామాన్ని 4-5 మార్లు కొనసాగించండి.. మీ కండరాలు గట్టి పడటంతో  వ్యాయామాన్ని ప్రతి సమయంలో  10 మార్లు వంతున రోజుకు మూడు మార్లు జరపండి.
  • పాస్- స్వీజ్ ప్రక్రియ
    ఈ ప్రక్రియ శీఘ్ర స్ఖలనం అదుపునకు సహకరిస్తుంది.. సంభోగానికి మునుపు తొలి ప్రక్రియలు యధావిధిగా జరపండి మీరు అంగస్తంభనను అదుపులో ఉంచుకొనలేక , స్ఖలనం జరిగితే, మీ భాగస్వామిని  మీ జననాంగాన్ని ఒత్తిపట్టుకొనాలని చెప్పండి. స్ఖలనం జరపాలనే కోరిక తీరేవరకు కొన్ని సెకన్లు  అలాగే ఉంచుకోవాలి.  ఈ ప్రక్రియను వీలయినన్ని మార్లు కొనసాగించండి. స్ఖలనం జరపకుండా మీ లైంగిక భాగస్వామిలోనికి చొచ్చుకువెళ్లండి. తద్వారా మీరు మీ స్ఖలనాన్ని  అదుపు చేసుకొనగలరు. తర్వాత మీరు స్ఖలనం నియంత్రణకు ఈ ప్రక్రియ అనుసరించే అవసరం ఉండదు. ఈ విధానాన్ని స్ఖలనం జరపకుండా మీ భాగస్వామి శరీరంలోకి చొచ్చుకు వెళ్ళేవరకు కొనసాగించండి. దీనిద్వారా మీరు స్ఖలనాన్ని అదుపులో ఉంచుకొనగలరు
  • తొడుగుల వాదకం
    మందమైన పదార్థం చేయబడిన రబ్బరు తొడుగులు ( కాండోంలు ) జననాంగంలో స్పర్శజ్ఞానాన్ని  జాప్యంచేసి స్ఖలనాన్ని అదుపు/ నిదానం చేస్తాయి  కొన్ని దేశాలలో కాండోములలో ‘క్లైమాక్స్ కాండోము’ లు లభిస్తున్నాయి. ఇవి స్పర్శజ్ఞానాన్ని తగ్గిస్తాయి.

స్వయంగా శ్రద్ధ తీసుకోవడం :

శీఘ్రస్ఖలనం లైంగిక జీవితంపై , భార్యాభర్తల సాన్నిహిత్యంపై చెడుప్రభావం కలిగిస్తుంది.  ఇది దంపతులలో మానసిక ఒత్తిడి కలిగించి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు  శీఘ్రస్కలనాన్ని ఎదుర్కొంటున్నారని పరిశీలనలు  వెల్లడిస్తున్నాయి. రెండు మూడు అనుభవాలతో దంపతులువారికివారే సరిపడుతున్నారు.

లైంగిక క్రియలో ఆందోళన సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ మనసును, శరీరాన్ని  ప్రశాంతంగా ఉంచుకోండి. సుఖ సాంసారిక జీవితం అనుభవించడానికి ప్రయత్నించండి.  శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం జ్ఞప్తిలో ఉంచుకోండి.మీ లైంగిక భాగస్వామిని సంతృప్తి పరచడానికి పెక్కు మార్గాలు ఉన్నాయి.  మీలో దానికి అవసరమైన జ్వాల రగులుతూ ఉంటుంది. మీ సాన్నిహిత్యం దెబ్బతినకుండా ఉంటుంది. మీకు సహాయం కావాలనుకొంటే, మీ డాక్టరును సంప్రతించడానికి సందేహించకండి.

జీవన సరళి/ విధానం నిర్వహణ

శీఘ్రస్ఖలనానికి పెక్కు కారకాలు ఉంటాయి. అవి మానసికమైనవి మరియు శరీరకమైనవి కూడా. మానసిక ఒత్తిడి మరియు లైంగిక క్రియ సందర్భంగా ఆందోళన శీఘ్రస్ఖలనంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఒత్తిడి స్థాయిని అదుపు చేసుకోవడం, మీ లైంగిక భాగస్వామితో నిజాయతీగా దేనినీ దాచిపెట్టకుండా చర్చించడం వల్ల ఈ దుస్థితి నుండి బయటపడవచ్చు. ఒత్తిడిని తొలగించుకొంటే పరిస్థితి చక్కబడుతుంది. కొన్ని జీవనసరళి జబ్బులైన మధుమేహం, హెచ్చు బి పి, థైరాయిడ్ సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలు పరిష్కారమైతే  శశీఘ్రస్ఖలనం సమస్యకు పరిష్కారం లభిస్తుంది..

శీఘ్ర స్కలనం కొరకు అలౌపతి మందులు


Medicine NamePack Size
XyloXylo 2% Infusion
Xylocaine InjectionXylocaine Viscous Solution
Xylocaine HeavyXylocaine Heavy 5% Injection
XylocardXylocard Injection
CorectilCorectil Capsule
XyloxXylox Gel
ADEL Titanium Metallicum DilutionADEL Titanium Metallicum Dilution 1000 CH
Rexidin M Forte GelRexidin M Forte Gel
AlocaineAlocaine Injection
Dr. Reckeweg Titanium Metallicum DilutionDr. Reckeweg Titanium Metallicum Dilution 1000 CH
LcaineLcaine Injection
PenetalPenetal Tablet
NircaineNircaine Injection
UnicainUnicain Injection
Wocaine AWocaine A Injection
XylonumbXylonumb 2% Injection
XynovaXynova Gel
ZelcaineZelcaine Injection
Smuth CreamSmuth Cream
Quik KoolQuik Kool Gel
Ora FastOra Fast Cream
Orex LoOREX GEL 10GM
और पढ़


మధుమేహం – లైంగిక సమస్యలు హోమియో మందులు 

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహా వ్యాధి గ్రస్తులతో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే…

మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి.

కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి.

యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది.

తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.

ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

చికిత్స

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తి వంతమైన ఔషాధాలెన్నో హోమియో వైద్యంలో కలవు. వ్యక్తి యెక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకుని వైద్యం చేసినవో లైంగిక సమస్యలును త్వరితంగా నివారించవచ్చును.

మందులు

ఆసిడ్‌ ఫాన్‌

వీరికి నీరసం, నిస్త్రాణ ఎక్కువ.శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పని చేయును. అలాగే అంగము పూర్తిగా చెందక ముందే గాని, లేదా అంగప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతు, మధుమేహాంతో బాధపడేవారికి ఈ మందువాడి ప్రయోజనం పొందవచ్చును.

ఫాస్పరస్‌

వీరికి లైంగిక వాంఛ అధికం, కానీ సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించి దగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

లైకోపోడియం

ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికి ముఖ్యమైనది. అతిగా కామకాలాపాల్లో పాల్గొనడం వల్ల , హస్త ప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పొయిన వారికి ఈ మందు చాలా ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం అహాం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లు నుదిటిపై ముడతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఙతలు తెలిపితే వెంటనే కంటతడి పెడుతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే వారు లైంగిక సామర్ధ్యం కొరకు ఆ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

ఎగ్నన్‌ కాక్టన్‌

వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంచ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరుచుగా జరుగును. వీరికి సంభోగ వాంచ కూడా ఉండకపోవుట గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న మధుమేహా వ్యాధి గ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

అవైనా సటైవా

నిత్యం మద్యం సేవిస్తూ, సరైనా నిద్రలేక నరాల బలిహీనత ఏర్పడి సంభోగ శక్తిని కోల్పోయిన డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

సెలీనియం

మానసికంగా కామ వాంఛ కొరిక ఉన్నా శారీరక అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారకి ఈ మందు అలోచించదగినది.ఈ మందులే కాకుండా డామియాన, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ గారి సలహా మేరకు వాడి మధుమేహాంలో ఎదుర్కునే లైంగిక సమస్యలనుంచి విముక్తి పొందవచ్చును.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


20, అక్టోబర్ 2020, మంగళవారం

నరాల బలహీనత సమస్య పరిష్కారం ఈ లింక్స్ లో చూడాలి


(weak nerves)నరాల బలహీనత తో బాధపడుతున్నారు..... నవీన్ నడిమింటి  మీ సమస్యను పరిష్కరించుకోండి.

ప్రస్తుత సమాజం లో అనేక మంది నరాల బలహీనత తో బాధపడుతున్నారు. కాళ్ళు, చేతులు వణకడం, మాట్లాడు క్రమంలో కళ్లలోనుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసిన  , విన్న గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవటం , రాయాలంటే చేతులు వణకడం ......... ఇలా అనేక సమస్యలు కొందరిలో చూస్తూ ఉంటాం , మనము అనుభవిస్తూ ఉంటాం.
నవీన్ నడిమింటి  ఈ సమస్యలని పరిష్కరించుకోగలరు.
1. దీర్ఘ శ్వాస ప్రక్రియ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవొచ్చు.--ప్రశాంతమైన చోట కూర్చొని.ఊపిరితితుల నిండా గాలి తీసుకొని, గాలిని బయటకు వదలకుండా రెండు నుంచి మూడు నిముషాలపాటు ఉంచిన తరవాత నిదానముగా గాలిని వదలాలి.ఇలా రోజుకి పది నుంచి పదిహేను నిముషాలు ఈ ప్రక్రియ చేయుట ద్వారా మన నరాల బలహీనతను నివారించుకోవొచ్చు.
2. ఒక చెంచాడు బాల దుంప వేర్లు పొడి  , అశ్వ గ్రంధి దుంప వేర్లు పొడి (ఆయుర్వేద దుకాణాలలో దొరుకును ) తీసుకొని రెండిటిని కలిపి తీసుకొనుట మంచిది.
3.ప్రతిరోజు పాదరక్షలు (చెప్పుల) లేకుండా ముపై (30)నిముషాలు గడ్డిలో కాని , ఇసుకలో కాని నడువుట మంచిది. 
4. ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యకాంతి మీ శరీరం మీద పడేటటు కూర్చొనుట వలన మీ నరములు శక్తివంతమగును. 
5. మెగ్నీషియం లోపం వలన నరములు బలహీనపడును. మెగ్నీషియం మీ నరములకు మేలు చేయును. కనుక మెగ్నీషియం కలిగిన పదార్దాలు తినుట మంచిది . పదార్దాలు: డార్క్ చాక్లెట్ , వాల్ నట్స్, బాదాం,బచ్చలి కూర, పుచ్చకాయ, అరటిపండు. 
6.యోగ మరియు ధ్యానం ద్వారా మీ నరాల బలహీనత సమస్యను అధిగమించొచ్చు. 
7. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలు తప్పకుండ తాగటం మంచిది. 
8. ప్రతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో లో కొద్దిగా నిమ్మరసం, తెనే కలిపి తీసుకోవటం మంచిది. 
9. వారానికి ఒకసారి శరీర మర్దన (మసాజ్) చేయుట ద్వారా నరములు శక్తివంతంగా   మారతాయి.

19, అక్టోబర్ 2020, సోమవారం

వరిబీజం వాపు నివారణకు అవగాహన కోసం నవీన్ సలహాలు అవగాహన కోసం

వృషణాలు[వరిబీజం వాపు నొప్పి ]సమస్య కు నవీన్ నడిమింటి సలహాలు 

     వరిబీజము  --అండ వృద్ధి --వృషణాల వాపు                   
 
             ఒక వైపు కిందికి జారిపోయి దానిలో చెడు నీరు, గాలి చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది .
 
      కరక్కాయ పొడి        -------------- 10 gr
      నేలవేము పొడి         -------------- 10 gr
      ధనియాల పొడి        -------------  10 gr
      దో. వే. లవంగాల పొడి       -------------  15 gr
      సునాముఖి ఆకు పొడి   ------------   40 gr
        కలకండ    పొడి   ------------  120 gr
         తేనె          ------------- తగినంత
 
         కల్వంలో కలకండ పొడి వేసి దానిలో మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి తేనె పోస్తూ  ముద్దగా నూరాలి.దీనిని తీసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
 
       ప్రతి రోజు ఆహారానికి ముందు 5 గ్రాముల మందును చప్పరించి నీళ్ళు తాగాలి. ఎక్కువ తీసుకుంటే   విరేచనాలు అవుతాయి.అందువలన 1,2  గ్రాముల నుండి ప్రారంభించి 5 గ్రాములకు పెంచాలి. 40 రోజులు  వాడాలి. దీనితో మంచి నీళ్ళ కంటే మజ్జిగ మేలు.
 
      ఈ మందు వాడుతుంటే మొదట మలబద్ధకం నివారింపబడుతుంది.తరువాత వృషణాల లోని నీరు తొలగింప  బడుతుంది.
 
           వృషణాలు పెద్దవైతే ---నివారణ                  
 
వావిలాకు              
గచ్చకాయ ఆకు
అవిశాకు
 
     అన్నింటిని నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి వేయించి ఒక బట్టలో వేసి పైకి లాగి కట్టాలి.
 

       వరిబీజం సమస్య తీవ్రత తగ్గడానికి    --- చిట్కా                     

     మునగ చెట్టు బంకను సేకరించి నానబెట్టి వరిబీజం పెరిగిన చోట లేపనం చేసి ఎండిన తరువాత కడుగుతూ వుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది.

శరీరంలో అతి వేడి సమస్య కు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చుడండి

*HEAT REDUCE remedies*

అతివేడి తగ్గడానికి నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం మాత్రమే 

               అతివేడి (వేసవి తాపం) నివారణకు  బ్రహ్మఫల చూర్ణం           
 
    పైత్య (అతి వేడి) శరీరం తో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ వుంటారు, తేనె రంగు శరీరం తో వుంటారు వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు  మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు.

    బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి      ---- 100 g
    అతిమధురం పొడి  ---- 100 gr
     కలకండ పొడి   ---- 100 gr
 
     అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
 
          10 గ్రాముల పొడిని కుండలోని  నీటిలో కలిపి  మూడు పూటలా తాగాలి.
 
          దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి.శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు,నపుంసకత్వం  నివారింప బడతాయి, 
 
పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు,  వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని  వాడితే సమస్య  నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది.

                 అతి వేడి --- నివారణ                      

      ఉష్ణము ఎక్కువైతే  పైత్యం ఎక్కువవుతుంది.  దీని వలన రక్తపైత్యము,  అధిక రక్తపోటు చర్మ రోగాలు  మొదలైనవి  వస్తాయి.  కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి.  ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి.    ఆవుపాల పాయసాన్నము తినాలి.

      పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు  మొదలైనవి వాడుకోవాలి.

      ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం,  కొబ్బరినీళ్ళు  తరచుగా వాడాలి.


      వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి.

     కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి.  ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది.

      చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో  సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది.

      వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది.

ఆహారం:--

      గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి   పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది.  రక్తంలోని మలినాలు   తొలగించబడతాయి.

      అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి.

     బార్లీ  నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది.
     వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది.

                   వేడి తగ్గడానికి

 తులసి రసం       ---- ఒక టీ స్పూను
నిమ్మ రసం         ----   "    "       "
అల్లం రసం        ----   "    '       "
చక్కెర              ----- ఒకటి లేక రెండు స్పూన్లు

     అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి,  అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట    మొదలైనవి నివారంప బడతాయి.

దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి.

     చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి.

2. తులసి రసం                  ----- ఒక గ్లాసు
నువ్వుల నూనె                   ----- ఒక గ్లాసు

       రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.

       తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి  సున్నితంగా మర్దన  చెయ్యాలి.

            అతి వేడి సమస్య --నివారణ                                      

                            దీని వలన పైత్యము ఎక్కువవుతుంది.

అతి మధురం పొడి           --- ఒక టీ స్పూను
పాలు                            --- అర గ్లాసు 
కలకండ లేదా చక్కెర        --- ఒక టీ స్పూను
 
       పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర  గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని  వలన వెంటనే వేడి తగ్గుతుంది.  ఇది ఇరవై రకాల  వేడి సమస్యలను నివారిస్తుంది.

         అతి వేడి నివారణకు అమృతాహారం              

     ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.

     అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి.

ఉల్లి                          ----  50 gr
నూనె లేక నెయ్యి         ----  50 gr
పెరుగు                     ----   ఒక కప్పు 

   ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని  వేయించాలి. చల్లార్చి  ఒక కప్పు పెరుగు కలపాలి.  దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా   వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు.

    శరీరంలోని  అతి వేడి తగ్గడానికి తంగేడు కాఫీ                             

తంగేడు పూల పొడి                  --- 100 gr
పత్తి గింజల పొడి                     ---   50 gr
ధనియాల పొడి                      ---   50 gr
గులాబి రేకుల పొడి                ---   30 gr
             శొంటి పొడి               ---   20 gr
 చిన్న ఏలకుల పొడి              ---   20 gr
సుగంధ పాల వేర్ల పొడి            ---   10 gr
తంగేడు విత్తనాల పొడి           ---   10 gr
 
      అన్ని పదార్ధాలను కలిపితే  తంగేడు కాఫీ పొడి  తయారవుతుంది.
 
      కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి,  మెదడు చల్లబడుతుంది.  మెదడుకు బలం చేకూరుతుంది.
 
                అత్యుష్ణాన్ని  తగ్గించే పానీయం             
 
సుగంధ పాల వేళ్ళపొడి----- అర టీ స్పూను
ధనియాల పొడి          ----- అర టీ స్పూను
వట్టి వేర్ల  పొడి           ----- పావు టీ స్పూను
కలకండ పొడి            ----- ఒక టీ స్పూను
 
        ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి.  చల్లారిన తరువాత తాగాలి.
 
       దీని వలన   పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి )  తగ్గుతుంది.
 
పిత్త సంహార ముద్ర :--  దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు.
  
     బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన,  ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి  ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి.
 
      దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా  తగ్గుతాయి

 బార్లీ పేలాల పిండి
 చక్కెర

     రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది.

                  అతి వేడి  వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ                   

      ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి.

            శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నానం                       

      ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది.

      పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది.

       ఒండ్రుమట్టి  5,  10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి.

       వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి  విడిగా కలిపి పెట్టుకోవాలి.

వేపాకు పొడి           --- రెండు స్పూన్లు
తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు
పసుపు పొడి          --- రెండు స్పూన్లు

       బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు.  ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని  తగినంత నీటితో కలిపి శరీరానికి,  తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి.

      దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

   అతి వేడి ( పైత్య) దోషాల వలన ఏర్పడే   గుండె సమస్యల నివారణకు హృదయగుటికలు   
    
ఎండుద్రాక్ష                    --- పది గ్రాములు
కరక్కాయల పొడి           --- చిటికెడు
కలకండ                       --- అర టీ స్పూను
       కలిపి తీసుకోవాలి.

   మానసిక ఒత్తిడి ,  అతివేడి  ,  తలతిరగడం తగ్గడానికి               

1. రాత్రి ఒక చిన్న కుండ లో  ఒక గ్లాసు నీళ్ళు పోసి వాటిలో కొన్ని ధనియాలను , కొద్దిగా ఎండు  ఉసిరి ముక్కలను వేయాలి . ఉదయం ఆ నీటిని వడ కట్టుకొని దానిలో చక్కర కలుపుకొని తాగాలి   దీని వలన

    తలలోని అతివేడి తగ్గడానికి  --నవీన్ సలహాలు                   

     ఆముదం , నిమ్మరసం సమాన భాగాలుగా తీసుకొని కలిపి తలకు పట్టిస్తే  వేడి తగ్గుతుంది .  గంట తరువాత
తల స్నానం చేయాలి .

             శరీరం లో అతివేడి    --- నివారణ                          

 కారణాలు:--     Hyper Metabolism,  Hyper Thyroid , పిత్త ప్రకృతి ఆందోళన , విడాహక ఆహార సేవనము . వంటివి .
       వీటివలన  శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది .  రక్తప్రవాహ వేగం పెరుతుంది .

1. ఒక టీ స్పూను మెంతులను పెరుగులో రాత్రంతా నానబెట్టి  ఉదయాన్నే ఆ మెంతులను నూరి పెరుగుతో సహా తాగాలి .

2 ఒక స్పూను ధనియాలను నలగ గొట్టి రెండు కప్పు నీటిలో వేసి కాచి ఒక కప్పుకు రానిచ్చి వడకట్టి  కలకండ కలుపుకొని
   తాగాలి .
సూచన  :-- పగలు ఎక్కువ భోజనం ,  రాత్రిపూట తక్కువ భోజనం సెవించాలి.

          వేడి తగ్గడానికి    ----  సుగంధ పానీయం                        

సుగంధపాల వెళ్ళు                   ---- ఒక కిలో
         నీళ్ళు                           ---- 4 లీటర్లు
     పటికబెల్లం                         ---- ఒక కిలో 

         సుగంధపాల వేర్ల ను ఒక రోజంతా లేదా ఒక రాత్రంతా గాని నీటిలో నానబెట్టాలి . దీనిని ఉదయం స్టవ్ మీద పెట్టి
ఒక లీటరు నీళ్ళకు వచ్చే వరకు కాచాలి .  తరువాత ఆ నీటిలో పటికబెల్లం వేసి నీరు ఇంకి పోయి తీగ పాకం వచ్చే వరకు
కాచాలి . చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .

         ప్రతిరోజు  రెండు టీ స్పూన్ల పాకాన్ని గ్లాసులో వేసి  దానికి కుండలో నీళ్ళు  కలిపి తాగాలి .
         దీని వలన వేడి తగ్గి రక్తశుద్ధి జరుగుతుంది . మూడు నెలల వరకు తాగితే శరీరంలో మెరుపు వస్తుంది .

*శరీరంలో అదిక వేడి తగ్గుటకు మరికొన్ని నవీన్ సలహాలు :

1) బాదాం జిగురు ఇది అన్ని సూపర్ మార్కెట్స్ లొను, పెద్ద హోల్ సేల్ శాప్ లొను దొరుకుతుంది 250గ్రా తీసుకొచ్చి, రొజు రాత్రి 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసి తెల్లవారి త్రాగితె, మీ శరిరంలొ వుండె అదిక వేడి తగ్గుతుంది. చల్లగా మి శరిరం అవుతుంది. హాయగా వుండును.

2) రోజు 1 స్పూన్ సభ్జా గింజలను నిటిలొ అర్దగంట నానవెసి రాత్రి పడుకొనె ముందు లెదా ఎదొ ఒక సమయంలొ రొజు తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గితుంది.

3)  ఉసిరికాయ చూర్నం రొజు ఒక స్పూన్ రాత్రి పుట కడవలొని నీటిలొ తిసుకొన్నా అదిక వెడి తగ్గుతుంది.

4)  భూచక్ర గడ్డ అని ఆయుర్వెద శాప్ లొ దొరుకును దీన్ని రొజు ఒక స్పూన్ నిటిలొ తిసుకొవడం వల్ల అదిక వేడి తగ్గుతుంది.

5)  కీరాదొస రొజు ఒక కాయ తిసుకొవడం వల్ల శరిరానికి చలువ చెస్తుంది

6) పచ్చ కర్పురం పలుకులు రొజు అర్ద బటాని అంత లెదా కందిగింజ పరిమానం తిసుకొంటె అదిక వెడి తగ్గుతుంది

7) శతావరి రొజు ఒక స్పూన్ తిసుకొవడం వల్ల అదిక ఉస్ణొగ్రత తగ్గిపొవును.

8)  పెసరపప్పును ఉడికించి రొజు ఒక గ్లాస్ తిసుకొవడంవల్ల అదిక వెడి తగ్గించ వచ్చును.

9)  అలొవెరా జూస్ రొజు 20 నుంచి 30 గ్రాలు తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గుతుంది.

10) అన్నంలొ మజ్జిగ కలిపి రొజు తిసుకొంటుంటె మి శరిరంలొ అదిక వెడి తగ్గిపొతుంది.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

18, అక్టోబర్ 2020, ఆదివారం

బట్టతల రాకుండా జాగ్రత్తలు &వచ్చాక నివారణ పరిష్కారం మార్గం విశాఖపట్నం KGH లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎలా ఈ లి లింక్స్ లో చుడండి

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా.. శరీరంలో ఐరన్-ప్రోటీన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపంతో జుట్టు రాలడం అధికమవుతుంది. తద్వారా బట్టతల వచ్చేస్తుంది. అందుకే ఐరన్‌-ప్రోటీన్‌ ఆధారిత ఆహ



బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా.. శరీరంలో ఐరన్-ప్రోటీన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపంతో జుట్టు రాలడం అధికమవుతుంది. తద్వారా బట్టతల వచ్చేస్తుంది. అందుకే ఐరన్‌-ప్రోటీన్‌ ఆధారిత ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వయసు మీరుతున్న కొలదీ, హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ, ప్రారంభం నుండే జుట్టును కాపాడుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు వెంట్రుకల ఫాలికిల్‌ చనిపోవటం వల్ల త్వరగా బట్టతల కలిగే అవకాశం ఉంది.
 
తలపై చర్మం బిగుతుగా ఉండటం వల్ల, ఫాలికిల్‌లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. వీటి కన్నా, జుట్టు ఆరోగ్యాన్ని పెంచే హెయిర్‌ స్టయిల్స్‌ను పాటించటం చాలా మంచిది. అంతేకాదు.. కొన్ని రకాల హార్మోన్ మందులు, పిల్స్ వాడటం ద్వారా బట్టతస ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇంకా బట్టతలను నివారించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ జ్యూస్‌ను మాడుకు పట్టించాలి. రోజు మార్చి రోజు మాడుకు ఆనియన్ జ్యూస్‌ను పట్టించడం ద్వారా జుట్టు పెరుగుతుంది. ఇంకా జుట్టు రాలే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా మాడుకు అలోవెరా జెల్ పట్టించడం ద్వారా బట్టతల రాకుండా జాగ్రత్త పడవచ్చునని ఆయుర్వేద నిపుణుడు నవీన్ నడిమింటి చెప్పారు 

బట్టతల రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

సహజ మరియు చౌకైన మార్గాలు ఇవే .

1)  ఆముదం నూనె మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని సులభంగా పొందవచ్చు మరియు మీ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉత్తమంగా దోహదపడుతుంది. అంతే కాకుండా, ఆముదం నూనె వలన పలు రకాల జుట్టు మరియు చర్మ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఆముదం నూనెలో తలపై నెమ్మదిగా మర్దనా చేయడం వలన నెత్తిమీద చర్మానికి పోషణ లభిస్తుంది, జుట్టు ఆకృతి మెరుగవుతుంది మరియు జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది.

2)  కొబ్బరి నూనె బట్టతల నివారణకు సహాయపడే అత్యుత్తమ సహజ పరిష్కార మార్గాల్లో ఒకటి. మీరు కొంచెం కొబ్బరి నూనెను తలపై పోసుకుని, తలపై చర్మంపై బాగా మర్దనా చేయాలి. ఇది జుట్టు పుటికలను ప్రేరేపిస్తుంది మరియు మీ పలచని జుట్టు దట్టంగా మారుతుంది. కొబ్బరి నూనె నుండి అత్యధిక ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? ముందు రోజు రాత్రి మీ తలపై కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని, తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చి, దానితో తలపై మర్దనా చేసుకోవడం వలన మరిన్ని ఫలితాలు లభిస్తాయి.

3)  మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ ఉల్లిపాయల రసం వలన కూడా బట్టతలను నివారించవచ్చు. అవును, నిజంగానే ఉల్లిపాయల రసం వలన మీ జుట్టు పెరుగుతుంది ఎందుకంటే ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది, ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది నెత్తిమీద చర్మంపై గల హానికారక బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ను కూడా నాశనం చేస్తుంది. దీనిని తేనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. శక్తివంతమైన ఫలితాలు కోసం తేనెతోపాటు దాల్చినచెక్క పొడి, బ్రాందీ మరియు గుడ్డు పచ్చసొనను కలిపి ఉపయోగించాలి.

4)   నిమ్మరసాన్ని సాధారణంగా బట్టతల నివారణకు ఉపయోగిస్తారు. బట్టతల నివారణ కోసమే కాకుండా, నిమ్మ రసాన్ని చుండ్రు, జుట్టు రాలిపోవడం, క్రెడిట్ క్యాప్ మరియు పొడి జుట్టు వంటి నెత్తిపై జుట్టు సంబంధిత సమస్యల నివారణకు కూడా ఉపయోగిస్తారు. దీనిని ఆలివ్ ఆయిల్ మరియు అలెవీరా వంటి ఇతర సహజ దినుసులతో కలిపి ఉపయోగించాలి; తర్వాత మృదువైన షాంపూతో తలను శుభ్రం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

5)  ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెరుగు వలన జుట్టుకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మరియు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది సహజ కండీషనర్ మరియు బట్టతలను నివారించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగును నెత్తిమీద చర్మానికి మాస్క్‌గా పూసుకోవడం లేదా తరచూ తింటూ ఉండటం వలన జుట్టు బాగా పెరుగుతుంది.
మీరు మీ బట్టతలను నివారించడానికి పలు ఇతర నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రతి నివారణ మార్గానికి పలు ప్రయోజనాలు లభిస్తాయి. మీరు వాటిని గుర్తించాలి. ఈ నివారణ మార్గాలను అనుసరించినట్లయితే, బట్టతల ఇంటిలోనే ప్రారంభమవుతుంది, ఇంటిలోనే ముగుస

6.-బట్టతల నివారణకు

వేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20 నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల స్నానము చేయాలి .
బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10, 10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి, ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు వస్తుంది

బట్టతల సమస్యకు విశాఖ కెజిహెచ్ చెక్:ఖరీదైన చెక్‌ పీఆర్పీ చికిత్స ఉచితo

  

విశాఖపట్టణం:బట్టతల వల్ల ఆ సమస్య ఎదుర్కొంటున్నవారు ఎంతో మానసిక క్షోభకు గురవుతుంటారు. ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదనుకుంటారు. అయితే ఇలా బట్టతల సమస్యతో కుమిలిపోతున్నవారికి ఆ సమస్యే లేకుండా చేస్తూ దేవుడిలా ఆదుకుంటోంది విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి.


బట్టతల సమస్య పరిష్కారం కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు ఇల్లూఒళ్లు గుల్ల చేసుకుంటున్నవారికి ఇక ఆ పరిస్థితి లేకుండా అభయహస్తం అందిస్తోంది. బట్టతల ప్రాబ్లెమ్ కు చెక్ చెప్పే ఖరీదైన,మేలిమి చికిత్స ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) ను విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి ఉచితంగా అందజేస్తోంది. ఇలా నెలకు 60 మందికి ఈ పిఆర్పీ ట్రీట్ మెంట్ అందిస్తూ వారి పాలిట దైవస్వరూపంగా భాసిల్లుతోంది.

బట్టతల సమస్య...మానసిక క్షోభ

బట్టతల సమస్యతో బాధపడే ప్రతిఒక్కరూ వారు ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి ఆ సమస్య లేకుండా చేసుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే ఇందులో చాలామంది ఆర్థిక సమస్య కారణంగా అటు చికిత్స చేయించుకోలేక, ఇటు మనసును సర్థుబాటు చేసుకోలేక తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు. మరోవైపు బట్టతల బాధితుల ఈ బలహీనతను ‘క్యాష్‌' చేసుకొనేందుకు అనేక సంస్థలు వారికి వివిధ రకాలుగా వల విసురుతూ ఉంటాయి. అందులో అనేకం బోగస్ సంస్థలు కూడా ఉంటుంటాయి. ఈ సంస్థల వల్ల అటు డబ్బు పోయి శని పట్టినట్లు అవుతుంటుంది బట్టతల బాధితుల పరిస్థితి.

కెజిహెచ్...అభయహస్తం

అయితే ఇలాంటి విపత్కర సమయంలో అలాంటి బట్టతల బాధితుల పట్ల ఆపద్భాంధవుడిలా అవతరించింది విశాఖ కెజిహెచ్ ఆస్పత్రి చర్మ వ్యాధుల విభాగం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమైన పిఆర్పీ చికిత్సను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తూ వారి జీవితంలో నూతన వెలుగులు నింపుతోంది. జుట్టు రాలిన చోట ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్పీ) చికిత్సతో మళ్లీ వెంట్రుకలను మొలిపించడమే ఈ ట్రీట్ మెంట్ విధానం. ఈ చికిత్సకు బయట మార్కెట్‌లో సొమ్ములు భారీగానే వసూలు చేస్తారు. కానీ ఈ ఖరీదైన ట్రీట్ మెంట్ ను కేజీహెచ్‌లో నెలకు 60 మందికి ఉచితంగానే చేస్తున్నారు.


చికిత్స విధానం...ఇలా

చికిత్స ఎలాగంటే?...ఇందుకోసం ముందుగా రోగి నుంచి రక్తాన్ని సేకరించి సెంట్రిఫ్యూజ్‌ అనే యంత్రం సాయంతో పీఆర్పీని విడదీస్తారు. ఆపై జుట్టు రాలిపోయిన చోట దానిని ఇంజెక్ట్‌ చేస్తారు. కొన్నివారాల తర్వాత నెమ్మదిగా వెంట్రుకలు రావడం మొదలవుతుంది. సమస్య తీవ్రత బట్టి రోజుల వ్యవధిలో 10 నుంచి 20 ఇంజెక్షన్లు చేస్తారు. వైద్యులు సూచించే కొన్నిరకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈ చికిత్స సత్ఫలితాలు ఇవ్వదని తెలుస్తోంది. అదొక్కటే ఇందు డ్రా బ్యాక్. అందుకోసమే ఈ ట్రీట్ మెంట్ చేయబోయే వ్యక్తికి రక్తం, షుగర్‌, హార్మోన్స్‌, కొవ్వుశాతం, లోకల్‌ పరిస్థితి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వంటి పరీక్షలు చేస్తారు. ఆ ఫలితాల ఆధారంగానే చికిత్స మొదలుపెట్టి జట్టు మెలిచేలా చేస్తారు.

వైద్యులు...వివరణ

ఇటీవలికాలంలో మారిపోతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలే జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం. ఈ సమస్యకు కెజిహెచ్ లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని ఇక్కడ చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ బాలచంద్రుడు మీడియాకు వివరించారు. పీఆర్పీ చికిత్సకు బయట భారీగానే ఖర్చు అవుతుందని...ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.2వేలు వసూలు చేస్తారని ఈ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ గురుప్రసాద్‌ తెలిపారు. అలా కనీసం 5 నుంచి 15 సిట్టింగ్‌లు ఈ ట్రీట్ మెంట్ కు అవసరం అవుతుందని...కానీ తాము కెజిహెచ్ లో ఈ ట్రీట్ మెంట్ ను ఉచితంగానే అందిస్తున్నామని...మెరుగైన ఫలితాలే వస్తున్నాయని డాక్టర్‌ గురుప్రసాద్‌ వెల్లడించారు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

17, అక్టోబర్ 2020, శనివారం

దంతాలు సమస్యలు కు అవగాహన కోసం ఈ లింక్స్ లో చుడండి

దంత సమస్యలకు ఆయుర్వేద వైద్యం అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు ...

చాలామంది అనారోగ్య సమస్యలలో పంటి నొప్పి కూడా ఒకటి. దీనికి కారణం చిగుళ్లు బలహీనంగా ఉండటం. ఈ సమయంలో చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి తినకూడదు. పంటి నొప్పిని వదిలించుకునేందుకు వంటింట్లోనే కొన్ని నియమాలను పాటించవచ్చు. అ

                చాలామంది అనారోగ్య సమస్యలలో పంటి నొప్పి కూడా ఒకటి. దీనికి కారణం చిగుళ్లు బలహీనంగా ఉండటం. ఈ సమయంలో చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి తినకూడదు. పంటి నొప్పిని వదిలించుకునేందుకు వంటింట్లోనే కొన్ని నియమాలను పాటించవచ్చు. అవి ఏమిటంటే...
 
1. పిడికెడు ఉత్తరేణి ముదురాకులు తీసుకొని రసం తీసి, కొంచెం సారా కలిపి పంటి నొప్పి ఏ వైపున ఉంటే ఆ వైపు చెవిలో వేసుకొని ఎండలో 10 నిమిషాలు పడుకుంటే పుచ్చిన దంతంలోని క్రిములు మెల్ల మెల్లగా, బుర బుర మంటూ చెవిలోంచి బయటకు వస్తాయి.
 
2. చెట్టు మీదే ఎండిన రామ్ములకాయల్ని సంగ్రహించి, వాటి విత్తనాలను భద్రపరచుకోవాలి. పిప్పి పళ్లతో విపరీతంగా బాధపడేవారికి ఇలా చేయాలి. నిప్పులపై మైలతుత్తం పొడిని ములక్కాయ విత్తనాలను కలిపి వేస్తే ఘాటైన పొగ వస్తుంది. కళ్లు మూసుకొని ఆ పొగను నోటిలోకి పీల్చి బందిస్తే వెంటనే పంటి రంధ్రం లోంచి క్రిములు రాలి పడతాయి. దీనితో నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది.
 
3. అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరినూనె, టీస్పూన్ మిరియాలపొడి, చిటికెడు ఉప్పు వీటిని అన్నింటిని కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది.

4. వెల్లుల్లిలో యాంటీబయోటిక్ ప్రోపర్టీస్ ఉంటాయి. 3 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి దానికి చిటికెడు ఉప్పును కలిపి పుచ్చి పంటిపై పెడితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
 
5. జామ ఆకులలో యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు 2 లేక 3 జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తినటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

6.- శొంటి , వస ఈ రెండింటిని ఉండలగా చేసి రాసిన యెడల పంటి జబ్బులు అన్ని శీఘ్రంగా పోవును .
7.- గిద్దెడు గంధపు పొట్టు ఒక కల్వంలో వేసి నూరి అందు ఒక తులమెత్తు కర్పూరం జేర్చి ఉదయమున దంతధావనం చేయునపుడు రాసి తోమిన యెడల పళ్ళు సందుల నున్న కల్మషం పోయి తెల్లబడును.
8.- ఉదయం దంతదావనం చేసి నూనె పుక్కిలించి వేసిన యెడల దంతముల చివరలు నెత్తురు జిమ్ముట ఎన్నడును బుట్టకుండా ఉండటయే కాక దంత పటుత్వం నూరేండ్ల వరకు చెడదు.
9.- పొడవుగా ఉన్న లవంగములు పిడక నిప్పుల మీద వెచ్చజేసి వెంటనే వానికి తగినంత శొంటి గంధములో బోసి మూడు దినములు ఉరబెట్టి పిమ్మట ఎండబెట్టి మునిపంటితో బట్టి ద్రవం దంతములు తడియునట్లు రాచిన యెడల తెల్లబడిన దంతములు పటుత్వం కలిగియుండును.
10.- ఒక తులం ఉప్పు నీరు సెగ మీద పెట్టి సగం అగునట్లు కాచి దింపి నాలుగు చిన్న కాకర కాయ పేడులు వేచి ఒక గడియ నాననిచ్చి అవి ఒక్కొకటి తీసి దంతములు నుండి ద్రవం ఉరునట్లు గీచిన యెడల కల్మషం పోవును .
11.- నిమ్మపండ్ల రసము, వేప పువ్వు రసము, చింతాకు రసము, నేరెడు వ్రేళ్ల రసము, ఇవి కలిపి దంతములకు రాసిన యెడల తెల్లబడును.
12.- జీలకర్ర, సైంధవ లవణం, పిప్పలి, ఇవి సమాన బాగాలుగా నూరి పండ్లకు రాచిన యెడల పోటు, వాపు , కదులుట, దురద, రక్తస్రావం, దుర్భలథ్వమ్ పోయి స్వచ్చంగా ఉండును.
13.- జీలకర్ర, ఉప్పు , వస, హారతి కర్పూరం ఇవి నీటితో నూరి దంతములకు రాసిన యెడల గార , పుప్పి, కదలిక వెంటనే మానును .
14.-తేనే , నిమ్మపండు రసము, మాదిఫల రసము ఇవి సమాన బాగములుగా గల్పి పుప్పి పండ్లకు రాచి రుద్దిన యెడల చూచు చుండగానే పురుగులు చచ్చి పడుటయే కాక దురద, వాపు ఇవి కూడా శాంతించును.
15.- పుప్పు పంటిలో దురదలు పుట్టిన యెడల మిరియాలు, వస నీటిలో అరగదీసి కొంచెం కవిరి కలిపి నూరి ఒక జాము విడవకుండా రాచిన యెడల దురద తగ్గుది 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.