19, నవంబర్ 2020, గురువారం

మోకాళ్ళు నొప్పులు తగ్గాలి అంటే ఆయుర్వేదం సహాయం అవగాహన కోసం ఈ లింక్స్ లో చూడాలి

మోకాళ్ళు నొప్పులు,శబ్దాలు తగ్గాలంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం .............


ఆయుర్వేద శాస్త్రం మనిషి శరీరంలోని జాయింట్లను 'సంధులు' అని వ్యవహరించిది. సంధి అంటే కూడిన, వ్యవహారిక భాషలో జాయింట్లను కీళ్లు అంటారు. కీళ్ళనొప్పులకు సంబంధించి, కీళ్ల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విస్తృతమైన వివరణలు లభిస్తాయి.

కీళ్ల ప్రధాన విధి శరీరంలో కదలికలను కలిగచేయడం, కొన్ని కీళ్లు తక్కువస్థాయి కదలికలు కలిగినవిగా ఉంటే, మరికొన్ని ఎక్కువస్థాయి కదలికలను కలిగిఉంటాయి.

ఉదాహరణకు భుజం కీలు శరీరంలో ఇతర కీళ్లకంటే అధిక స్థాయిలో, విభిన్న దిశలలో కదలికలు కలిగి ఉంటుంది. బంతిగిన్నె కీలుగా అందరికీ తెలిసిన ఈ జాయింటు ముందుకూ, వెనకకూ, లోపలికీ, బైటకూ,పైకి, కిందకూ ఇలా రకరకాల కోణాలలో కదలికలు కలిగి ఉంటుంది. ఇంత విస్తృతమైన కదలికలు ఉన్నప్పుడు సహజంగానే ఈ జాయింటుకు స్వస్థానం నుంచి పక్కకు వైదొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 'గూడ జారడా'న్ని మనం ఎక్కువగా చూసేది అందుకే. దీనికి విరుద్దంగా నడుము కింద భాగంలో ఉండే త్రికాస్థి శ్రేణ్యస్థిల సంగమం (సేక్రో ఇలియాక్ జాయింట్) లో దాదాపు కదలికలు పూజ్యమనే చెప్పాలి.


మనలో చాలామందికి కీళ్లకు సంబంధించిన ఉచితానుచితజ్ఞత అనేది కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంటుంది. మనం ప్రతినిత్యం అలవోకగా ఎన్నెన్నో పనులను చేతులతోను, కాళ్లతోనూ చేసేస్తుంటాము, అయితే ఆయా భాగాల కీళ్లలో నొప్పి మొదలైతే మాత్రం తేలికగా జరిగిపోయే చిన్న పనైనా అసాధ్యంగా మారుతుంది. జాయింట్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కారణాలవైపు దృష్టి సారించడం అవసరం. లక్షణాత్మకమైన చికిత్సకంటే కారణానుగుణమైన చికిత్స తీసుకుంటే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది.

1. అభిఘాతాలు / దెబ్బలు:

కీళ్ల మీద ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు జనిస్తుంది. ఎముకల చిట్ట చివరిభాగం సాధారణంగా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. జాయింట్లను ఒకటిగా బంధించి ఉంచే క్యాప్సూల్ తాలూకు లోపలి పొర ఈ తైలయుతమైన సైనోవియల్ ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఒకవేళ కీలుకు ఏదైనా హాని జరిగినా, దెబ్బ తగిలినా సైనో వియల్ పొరకు విఘాతం కలగడం, కీలు నుండి చిన్న చిన్న ముక్కలు విడిపోవడం వంటివి జరుగుతాయి. అప్పుడు సైనోవియల్ పొర విపరీతంగా స్పందించి, అత్యధికస్థాయిలో ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన ద్రవమూ, దానిలో ఉండే కొన్ని పదార్థాలూ కలిసి నొప్పికి, వాపునకూ కారణమవుతాయి.

ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బ తగిలిన విషయం దృష్టిలోకి రాకుండా, సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తరువాత హఠాత్తుగా జాయింటు వాచిపోయి కనపడుతుంది. అలాంటి సందర్భాలలో నింపాదిగా ఆలోచిస్తే దెబ్బ తగిలిన విషయం బైటపడుతుంది.


సూచనలు: దెబ్బలు తగిలినప్పుడు జాయింట్లలో వాపు రాకుండా ఉండాలంటే జాయింటును కొంచెం ఎత్తులో ఉంచాలి. కదలకుండా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ముక్కలను పొడిలాగా నూరి ఒక గుడ్డలో వేసి కీలుపైన కట్టుకడితే వాపు జనించడానికి ఆస్కారం ఉండదు. కీళ్ల చుట్టూ స్థానికంగా వేడిగా ఉంటే శీతల ఉపచారాలనూ, చల్లగా బిగదీసుకుని ఉంటే ఉష్ణ సంబంధమైన ఉపచారాలనూ ఆయుర్వేదం సూచించింది.

ఔషధాలు: పునర్నవాదిగుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం.

బాహ్యప్రయోగాలు - మర్మగుటిక, సురదారులేపం.

2. పాత దెబ్బలు, గాయాలు:

ఒకోసారి, చాలా సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బలూ, బెణుకులూ వర్తమానంలో కీళ్ల నొప్పులుగా మారుతాయి. నడుము నొప్పి దీనికి మంచి ఉదాహరణ. జాయింట్లలో ఎముకలు విరగడం, తప్పుకోవడాలు జరిగినప్పుడు అప్పటికి బాధ సమిసిపోయినా, తరువాత ఎప్పుడో తీవ్రమైన నొప్పిరూపంలో తిరగబెట్టే అవకాశం ఉంది.

సూచనలు: అంతకు ముందెప్పుడో దెబ్బతగిలి, ఇప్పుడు దెబ్బతగిలినకీలు నొప్పిగా తయారైతే స్నేహ స్వేదాలను చికిత్సగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ చికిత్సా ప్రక్రియలలో ఔషధ తైలాలను బాహ్యంగా ప్రయోగించి, పదమూడు రకాలైన స్వేద ప్రక్రియలలో ఒకదానిని ఎంచుకుని చమటను పుట్టించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సల వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవ్వటమే కాకుండా, కీళ్లకు ఇరువైపులా ఉండే కండరాలు కూడా బలంగా తయారై నొప్పి తగ్గుముఖం పడుతుంది.

ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, వాతవిధ్వంసినీరసం, రాసానా ఏరండాదిక్వాథం, బాహ్యప్రయోగం - మహానారాయణతైలం.

3. సంధి శూల (ఆస్టియోఆర్తరైటిస్):

మోకాళ్లలోనో, తుంటి కీలులోనో నొప్పి ఉంటూ, విశ్రాంతితో బిగదీసుకుపోవడం, కదిలేటప్పుడు మరింత బాధామయంగా తయారవ్వటం జరుగుతుంటే అది సంధి వాతాన్ని (ఆస్టియోఆర్తరైటిస్) సూచిస్తుంది. ఎముకల కణజాలాల సముదాయాలు శిథిలమవడం వలన ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితి ఎక్కువగా శరీరపు బరువును మోసే జాయింట్లు - అంటే మోకాళ్లు, తుంటి కీళ్లకే పరిమితమై ఉండటాన్ని బట్టి, అధిక బరువు వలన అరుగుదల ఏర్పడి. తత్ఫలితంగా నొప్పులు ఉత్పన్నం అవుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే లావుగా ఉండే వ్యక్తులందరిలోనూ కీళ్ల నొప్పులు ఉండకపోవటమూ, సన్నగా ఉండే వాళ్లలో కూడా కీళ్ల నొప్పులుండటాన్ని బట్టి సంధి వాతానికి కారణాలుగా వంశపారంపర్యత, జన్మతః ఏర్పడిన నిర్మాణ లోపాల వంటి వాటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది.

ఆయుర్వేదం వ్యాధులు రావటానికి గల కారణాలను తెలియచేస్తూ అతియోగం అనే దానిని ప్రముఖంగా చెప్పింది. జాయింట్లను అతిగా, అసహజంగా ఉపయోగించడమే అతియోగమంటే, బాక్సర్ల మణికట్టు నొప్పులకూ, ఫుట్బాల్ ఆటాగాళ్ల మోకాళ్ల నొప్పులకూ కారణం ఇలాంటి అతియోగమే.

సూచనలు: సంధివాతం (ఆస్టియోఆర్తరైటిస్) జాయింట్ల అరుగుదల వలన సిద్దిస్తుంది కనుక దీనిలో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కావడాలను, ఐస్ ప్యాక్ లను మార్చి మార్చి ప్రయోగించడం వలన కూడా నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంతే కాకుండా దీనిలో ఆముదం, పిండ తైలాలూ అయోఘంగా పనిచేస్తాయి. వీటిలో ఒక దానిని కొద్దిగా వేడి చేసి కీలు పైన పలుచగా రాసి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. అలాగే సరైన వ్యాయామాలను ఎంచుకుని సాధన చేస్తే కీళ్లు అల్లుకుపోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి.

గృహ చికిత్సలు: 1. వెల్లుల్లిని ముద్దగా నూరి రెండు చెంచాల మోతాదుగా నువ్వులనూనెతో కలిపి (ఒక చెంచాడు) రోజుకు రెండుసార్లు వేడినీళ్లతో తీసుకోవాలి. 2. పారిజాతం ఆకులను (పది) గాని, వావిలి ఆకులను (గుప్పెడు) గాని ముద్దగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి చిన్న మంటమీద సగం కషాయం మిగిలెంతవరకు మరిగించాలి. దీనికి ఆముదం (ఒక చెంచా) చేర్చి ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. 3. మహిసాక్షి గుగ్గిలాన్ని అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు వేడినీళ్ళతో పుచ్చుకోవాలి. 4. శొంఠికషాయానికి (అరకప్పు) ఆముదం (రెండు చెంచాలు) చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 5. శొంఠి (అరచెంచా), నువ్వులు (ఒక చెంచా), బెల్లం (అరచెంచా) అన్నీ కలిపి ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.

ఔషధాలు: యోగరాజగుగ్గులు, త్రయోదశాంగగుగ్గులు, లాక్షాదిగుగ్గులు, మహారాస్నాదిక్వాథం, మహావాతవిధ్వంసినీ రసం.

బాహ్యప్రయోగం - మహానారాయణతైలం. మోకాలు జాయింటు

4. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్):

కీళ్ళనొప్పులతో పాటు సాదారణారోగ్యం కూడా దెబ్బతింటే అది అమవాతాన్ని (రుమటాయిడ్ ఆర్త రైటిస్) ని సూచిస్తుంది. సంధి వాతం (ఆస్టియోఆర్తరైటిస్) లో మాదిగిగా దీనిలో కేవలం జాయిట్ల చివర్లు శితిలమవడం మాత్రమే ఉండదు. కేవలం బరువు మోసే జాయింట్లే వ్యాధిగ్రస్తం కావు. అంటే, సంధివాతంలో ఇన్ ఫ్లమేషన్ కు ఆస్కారం లేదు. అమవాతంలో అరుగుదలకు అవకాశం లేదు. రెండూ రెండు విభిన్నమైన వ్యాధులు. ప్రతి వందమందిలోనూ ముగ్గురు వ్యక్తులు అమవాతంలో బాధపడుతున్నారని ఒక అంచనా, అందునా, మగవారికంటే మహిళలే ఎక్కువగా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో ముందస్తుగా రెండు మడిమలూ, లేదా రెండు మణికట్లూ వాస్తాయి. నొప్పి ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. ఉదయంపూట ఈ లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. రక్తాల్పత కూడా ఉండవచ్చు.

కీళ్ళనొప్పులు ఎప్పుడూ ఒకే ప్రదేశానికి నిబద్ధం కాకుండా మారుతుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని కేవలం కీళ్ల వ్యాధిగా కాకుండా, శారీరక వ్యవస్థాగత వ్యాధిగా (సిస్టమిక డిసీజ్) పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అమవాతంలో కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగ ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం. దీనిలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. (అంటే, శరీరంలో ఉండే ప్రతిరక్షక కణాలు శరీరపు స్వంత కణజాలాలను బయటివాటిగా భావించి పాదదోలే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడటం). దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం (రుమాటిక్ ఫీవర్) మొదలైనవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా, దీర్ఘకాలం పాటు పునరావృత్తమౌతుంటాయి.

అమవాతానికి పూర్తిస్థాయి చికిత్స తీసుకోనట్లయితే శాశ్వత అంగవైకల్యంతోపాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి పురోగమనంలో కాని, వ్యక్తీకృత లక్షణ తీవ్రతలో కాని, వ్యక్తీనుండి వ్యక్తికీ కొంత వ్యత్యాసమున్నప్పటికీ ఇది ప్రాప్తించిన ప్రతివారూ నిస్సృహలకు, నిరాశకూ లోనవుతారనేది మాత్రం నిజం. అయితే దీని సమగ్ర రూపాన్ని అర్థం చేసుకుని చికిత్స తీసుకుంటే నిరాశా నిస్పృహలకు తావుండదు. సూచనలు: అమవాతానికి కొంత విజ్ఞతతో చికిత్సచేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో రెండు అవస్థలుంటాయి; ప్రకోపావస్థ మొదటిదైతే, శమనావస్థ రెండవది. ఈ రెండు అవస్థలలోనూ 'అమం' అనేది అన్యాపదేశంగా ఉంటుంది. (అపరిపూర్ణంగా, వ్యత్యస్థంగాపచనమైన ఆహారం విషతుల్యంగా మారి, శరీరపుధాతువులలోనికి విలీనమైనప్పుడు దానిని అమం అంటారు)రుమటాయిడ్ ఆర్త రైటిస్ తగ్గాలంటే ముందు అమానికి చికిత్స జరగాలి. అమవాతంలో ఆకలి మీద వేటు పడుతుంది కనుక ఆహారం తేలికగా జీర్నమయ్యేదిగా, అంటే ద్రవయుక్తంగా ఉండాలి.

జీర్ణశక్తి మెరుగవుతున్నకొద్దీ క్రమంగా అన్నం, పెసరకట్టు, పులగం వంటివి చేర్చుకుంటూ వెళ్లాలి. ఆహారంలో ఏ పదార్థాలు సరిపడవో వాటిని వాటిని గుర్తించి వదిలివేయాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని కనిపెట్టడం కష్టమైతే దానికి ఒక పధ్ధతి ఉంది; ఆహార పదార్థాన్ని తినకముందూ, తిన్న తరువాత నాడిని చూసుకోండి, ఆహారం తీసుకున్న తర్వాత నాడి ఐదు శాతం పెరిగితే మీకు ఆ పదార్థం సరిపడటం లేదని గ్రహించాలి. పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో షోథహర ఔషధాలు (ఇన్ ఫ్లమేషన్ తగ్గించే మందులు) ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. యోగ, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుంచి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి. 

ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, స్వర్ణవాతరాక్షసం, వాత గజాంకుశరసం, సింహనాదగుగ్గులు, మహారాస్నాదిక్వాథం,

బాహ్యప్రయోగం: మహావిషగర్భతైలం. అరిగిన మోకాల

5. ఇన్ఫెక్షన్ వల్ల కీళ్లనొప్పి (ఇన్ ఫెక్టివ్ ఆర్తరైటిస్):

శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే జాయింట్లకు కూడా ఇన్ఫెక్షన్సోకే అవకాశం ఉంది. జలుబుకు కారణమైన వైరస్ కు సైతం తాత్కాలికంగా అయినప్పటికీ - కీళ్ల వాపును కలిగించే వీలుంది. అలాగే, జర్మన్ మీజిల్స్, హైపటైటిస్ వైరస్ లను కూడా ఈ నైజం ఉంది. జ్వరంతోపాటు వేళ్ల కణువుల వంటి చిన్న జాయింట్లలో నొప్పి ఉంటూ, అది ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతూ ఉంటే, దానిని రుమాటిజానికి చెందిన జ్వరంగా అనుమానించాల్సి ఉంటుంది.  

సాధారణంగా ఈ రకమైన జ్వరం గొంతునొప్పితో ప్రారంభమవుతుంది. జాయింట్లపైన ఏవైనా గడ్డలుకాని, కంతులుకాని లేస్తే, వాటినుంచి ఇన్ఫెక్షన్ జాయింట్ల లోనికి ప్రవేశించి, అక్కడినుంచి గుండె కవాటాలను చేరి, ఆ కవాటాలను లేదా వాల్వులను సైతం వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను అలా ఉంచితే అనైతిక లైంగిక సంబంధాలతో ప్రాప్తించే గనోరియా వ్యాధిలో జననాంగాల స్రావాలు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం, ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా జాయింట్లను చేరి వాటిని వ్యాధిగ్రస్తం చేయడమే.  

సూచనలు: ఇన్ఫెక్షన్ వలన కీళ్ల నొప్పులు ఉత్పన్నమైనప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి కీటాణు నాశక ఔషధాలు అవసరమవుతాయి. 

ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, శారిబాద్యాసవం, మహామంజష్టాదిక్వాథం, వ్యాధిహరణరసాయనం, భల్లాతకవటి. 

6. వాతరక్తం (గౌట్):

పాదం బొటనవేలు వాచిపోయి నొప్పిని కలిగించడమనేది గౌట్ వ్యాధి లక్షణం. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం విశదీకరించిన వాతరక్తంతో పోల్చవచ్చు. ఇది ఎక్కువగా మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది. ఐతే స్త్రీలలో చాలా అరుదనే చెప్పాలి. ఏ కొద్దీమందిలోనో కనిపించినా, అది బహిష్టులు ఆగిపోయిన తరువాతనే. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యలక్షణంగా కొనసాగుతుంటుంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా దీనికి తోడ్పడుతాయి. గౌట్ వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. వేళ్ల కణువుల్లో (ముఖ్యంగా కాలి బొటనవేలులో) ప్రప్రథమంగా గౌట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత క్రమంగా కాలి మడమలు, మోకాళ్లు, ఇతర వేళ్ల కణువులు, మణికట్టు, మోచేతులు.... ఇలా ఒక్కొక్క దానిలోనూ, నొప్పి మొదలవుతుంది.

ఏ అర్థరాత్రో హఠాత్తుగా కాలి బొటనవేలి బాధతో మెలకువ వస్తుంది. వ్యాధికి గురైన జాయింటు వేడిగా, ఎర్రగా ఉబ్బిపోయి కనిపించడమే కాకుండా నునుపుగా, ఉబికిన రక్తనాళాలతో కూడి కనిపిస్తుంది. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. చిన్నగా చేతితో తాకినా భరించలేరు. ప్రారంభావస్థలో అనుబంధ లక్షణంగా జ్వరం ఉంటుంది, గౌట్ బయటపడేముందు ఆకలి మందగించడం, వాంతి వచ్చినట్లుండటం, చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు కొంతమందికి అనుభవమవుతాయి.  

నొప్పి కొన్ని రోజులపాటు, లేదా కొన్ని వారాలపాటు బాధించి సద్దుమనుగుతుంది. ఆ సమయంలో కొద్దిగా దురదగా కూడా ఉండొచ్చు. నొప్పి మళ్లీ కొన్ని నెలల తరువాత తిరగబెడుతుంది. రానురాను ఇలాంటి పునరావృతాల మధ్య వ్యవధి తగ్గిపోయి నొప్పి ఒక నిరంతర లక్షణంగా, మారుతుంది. శారీరక శ్రమ, ఆపరేషన్లు, దీర్ఘవ్యాధుల వంటివీ, మిరిమీరి ఆహారాన్ని తీసుకోవడం (ముఖ్యంగా మాంసాహార భోజనాలు), త్వరితగతిన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కఠోరంగా ఉపవాస దీక్షలు చేయడం వ వంటివీ, మద్యపానం, మూత్రాన్ని జారీచేసే మందులు వంటివీ గౌట్ ను ఎక్కువ చేస్తాయి. దీని వల్ల రక్తంలో ల్యాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి సీరం యూరేట్స్ కు ఆస్కారం ఏర్పడుతుంది. గౌట్ కు ఒక ప్రధాన కారణం ఇలా సీరమ్ యూరేట్స్ పెరగడమే.

సూచనలు: గౌట్ వ్యాధి ఉన్నప్పుడు మద్యాన్నీ, మాంసకృత్తులు కలిగిన ఆహారాలనూ పూర్తిగా మానేయాలి. అలాగే తటాలున బరువు తగ్గటం కూడా మంచిది కాదు.

ఔషధాలు: మహామంజిష్టాదిక్వాథం, సిద్ధహరితాళభస్మం, తాళ సింధూరం, కైశోరగుగ్గులు, మహాయోగరాజగుగ్గులు, చవికాసవం, శారిబాద్యాసవం, భల్లాతకవటి.

7. సోరియాసిస్ వల్ల కీళ్ళనొప్పులు (సోరియాటిక్ ఆర్తరైటిస్):

చర్మం పైన మోస్తరు ఎరుపు రంగుతో వలయాలు మాదిరి పొరలు ఏర్పడి. వాటిపైన దళసరిగా పొలుసులు తయారవుతుంటే అలాంటి స్థితిని సోరియాసిస్ అంటారు. నిజానికి సోరియాసిస్ చర్మవ్యాధే ఐనప్పటికీ, దానిని ఉపేక్షిస్తే జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొద్దీ మందిలో ఈ సోరియాసిన్ చర్మంపైన మచ్చలుగా కనిపించకపోయినా, తలలో చుండ్రు మాదిరిగా భ్రమింపచేస్తూనో, లేదా వేలి గోళ్లను పిప్పిగోళ్లుగా కనిపించేలా చేస్తూనో ఉండవచ్చు. అప్పుడు సహజంగానే సోరియాసిస్ అన్న అనుమానం రాదుగాని, నిద్రాణంగా వ్యాధి మాత్రం కొనసాగుతూ జాయింట్లను వ్యాధిగ్రాసం చేస్తుంది. సోరియాసిస్ వలన కీళ్ల నొప్పులు వస్తుంటే ముందస్తుగా రక్తశోధనౌషధాలతోసోరియాసిస్ ను చికిత్సించాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. తెల్లగన్నేరు వేరు, కానుగ చెట్టు పట్ట, జాజి చిగుళ్లు అన్నీ కలిపి ముద్దగా నూరి లేపనం చేసుకోవాలి. 2. మనష్శిల, అన్నభేది, మైలతుత్థం వీటిని సమభాగాలు తీసుకుని గోమూత్రంతో సహా నూరి పైకి రాయాలి. ఇవన్నీ తీక్షణ పదార్థాలు కనుక కంటికి, నోటికి తగలకూడదు. 3. కానుగ గింజలను ముద్దగానూరి పిండితే నూనె వస్తుంది, దీనిని నిలవచేసుకుని రోజువారిగా పైపూతగా వాడాలి. 4. రేల లేత చిగుళ్లను మెత్తగా నూరి పులిసిన మజ్జిగతో కలిపిరాయాలి. 5. గుప్పెడు వేపాకులను ముద్దగానూరి రోజు రెండుపూటలా చన్నీళ్ళతో తెసుకోవాలి. 6. తెడ్ల పాలాకుతో సూర్యపాక విధానాన్ని అనుసరించి తైలం తయారుచేసి పైకి, లోపలికి (ఒక చెంచాడు గ్లాసుడు పాలతో) వాడాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్దినీ వటి, మహామంజిష్టాదిక్వాథం, పంచతిక్త గుగ్గులు, ఘృతం, అమృతభల్లాతక లేహ్యం, సర్పగంధవటి, చండమారుతం.

8. అంతర్గత రక్తస్రావం:

దెబ్బల వల్లనో,యథాలాపంగానో జాయింటులోనికి రక్తం స్రవిస్తే వాపు జనించడమే కాకుండా, కదలికలు కూడా పరిమితమై పోతాయి. అలాంటి సందర్భాలలో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది.

నవీన్ సూచనలు: జాయింట్లలోనికి రక్తస్రావమావుతున్నప్పుడు కారణాలను విశ్లేషించి తదనుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: చంద్రకళారసం, బోల బద్దరసం, నాగకేశరచూర్ణం.

9. మందుల దుష్ఫలితాలు:

చాలా రకాల ఇంగ్లీషు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మం పైన దద్దుర్లు ఏర్పడడం, వాంతి వచ్చినట్లుండటం, కడుపులో గడబిడ వంటి లక్షణాలే కాకుండా కీళ్ళనొప్పులు కూడా ఇలాంటి అవాంచిత లక్షణాలలో భాగమే. అందుకే, ఏ మందునూ మీకై మీరు వాడకూడదు, ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వాడుతున్నప్పుడు కీళ్ళనొప్పులు వస్తే ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి. కీళ్ళనొప్పుల వెనుక సాధారణమైన కారణాల నుండి అసాధారణమైన కారణాల వరకూ ఎన్నో ఉంటాయి. నొప్పిని తగ్గించే మందు బిళ్లలను నేరుగా కొనేసి వేసుకోవడం దీనికి పరిష్కారం కాదు; అలా చేస్తే కడుపులో మంట పుట్టడమే కాకుండా, ఒకోసారి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉంది.


వ్యాయామం వలన నొప్పి మాయం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

వ్యాయామం వలన నొప్పి మాయం
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.


కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత రెండో కాలుతో కూడా అలాగే చేయండి. అలా ఒక్కో కాలుతో అయిదుసార్లు చేయండి.

వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. ఒక కాలుని పెైకి లేపాలి. పది అంకెలు లెక్కపెట్టేంత వరకూ అలాగే ఉంచాలి. అలాగే రెండో కాలుతో చేయాలి. ఒక్కో కాలుతోనూ అయిదుసార్లు అలా చేయాలి. అలా చేసేటప్పుడు క్రింద ఉన్న కాలుని నిటారుగా ఉంచలేకపోతే మోకాలు దగ్గర కొద్దిగా వంచండి. రెండో కాలుని ఎత్తండి.ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

వెల్లకిలా పక్క మీద పడుకోండి. కాళ్ళని చాచి నెమ్మదిగా మోకాళ్ళను ఛాతీవెైపు తేవాలి. వాటి వెనుక చేతులుంచి అలా చేతులతో మోకాళ్ళను చాతిని ఎంత దగ్గరగా తేగలరో అంత దగ్గరగా తీసుకురండి. తలని పెైకి లేవనీకండి. కాళ్ళని క్రిందికి తెచ్చిన తరువాత నిటారు చేయకండి. అలా అయిదు సార్లు చేయాలి.కాళ్ళని దూరంగా ఉంచి నిల్చోండి. చేతుల్ని నడుము మీద ఉంచండి. మోకాళ్ళని నిటారుగా ఉంచండి. వీలెైనంత వెనక్కి నడుమును వంచండి. అలా ఆ భంగిమలో ఒకటి, రెండు సెకండ్లు శరీరానుంచి మళ్ళీ మామూలు భంగిమలోకి రావాలి. ఇలా రోజూ చేస్తే నడుముకి మంచింది.ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా నడుమునొప్పి, మెడనొప్పి వస్తుంటాయి. ఒక వేళ మెడలోంచి నొప్పి చేతుల్లోకి ప్రాకినట్టుండటం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెైద్యుణ్ని కలవాలి.

నడుమునొప్పి కాళ్ళలోకి ప్రాకినా, తిమ్మిర్లెక్కినా మనకు వెన్ను సమస్యలున్నాయన్న అనుమానం రావాలి. నరాల మీద ఏదెైన కారణాల వల్ల వెన్నుపూసలో ఒత్తిడి పడితే, ఆ నరం వెళ్ళే మార్గంలో నొప్పి, తిమ్మిర్లు వస్తాయి.చాలా మంది ఈ సమస్యల్ని పట్టింకోకుండడం చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో సమస్య తీవ్రమై శస్త్ర చికిత్స తప్పనిసరవుతుంది. మొదటి స్థాయిలో ఇంటువంటి సమస్యల్ని పసిగట్టు వెైద్యుణ్ని కలవాలి. మొదటి స్థాయిలో గుర్తించే లక్షణాల్ని ‘రెడ్‌ప్లాగ్స్‌’ అంటారు.

ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పెైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

* మెడ, నడుమునొప్పి చేతుల్లోకి కాళ్ళలోకి వ్యాపిస్తే వెంటనే వెైద్యుడికి చూపించాలి.
* చేతులూ, కాళ్ళలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారినట్లనిపిస్తున్నా అలసత్వం చేయకూడదు. 
* చిన్నదెైనా పెద్దదెైనా దెబ్బ తగిలినా తర్వాత మెడ, నడుములో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పితో పాటు జ్వరం వస్తే ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి ఉండవచ్చుననే అనుమానం రావాలి. 
* నొప్పితో పాటు ఆకలి తగ్గినా, బరువు తగ్గినా వెన్నులో ఇన్‌ఫెక్షన్‌ గాని, కణితలు గాని వచ్చి ఉండవచ్చనే అనుమానం రావాలి. కాళ్ళలో గాని, చేతుల్లో గాని కండరాలలో పటుత్వం తగ్గినా, మలమూత్రాల మీద అదుపు తప్పినా, నడకలో మార్పు ఉన్నా వెంటనే వెైద్యుణ్ని సంప్రదించాలి.

చాలా వరకు వెన్ను సమస్యలు మందులు, ఫిజియోథెరపిలతో తగ్గిపోతాయి. 5 శాతం కన్నా తక్కువ మంది రోగుల్లోనే శస్త్రచికిత్సల అవసరముంటుంది. వెన్ను శస్త్రచికిత్స గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. వెన్ను శస్త్రచికిత్స జరిపితే కాళ్ళు, చేతులు పడిపోతాయని, ముందుకు వంగిలేకపోవడం బరువులెత్తకపోవడం లాంటివి చేయకూడదని ఎక్కువకాలం బెడ్గరెస్ట్‌ తీసుకోవాలని, నపుంసకత్వం కలగవచ్చని, ఆడవాళ్ళలో ప్రసవ సమయంలో వెన్నుకి మత్తు ఇవ్వడం వల్ల నడుమునొప్పి వసుందని భయాలున్నాయి. వెన్ను వంకర, (స్కోలియోసిస్‌, కైఫోసిస్‌) వస్తుంటే నడుము పెరిగే దాకా ఆగాలనుకుంటారు. అది తప్పు. ఏ వయస్సులో గుర్తిస్తే ఆ వయస్సులోనే శస్త్రచికిత్స చేయడం మంచిది. ఆగిన కొద్దీ వంకర వయసుతో పాటు పెరగవచ్చు. పెరిగే కొద్ది శస్త్రచికిత్స కష్టమవుతుంది.

కొంతమంది మెడకు, నడువుకు వెైద్యుల సలహా లేకుండా మెడకు కాలర్‌లు, నడుముకి బెల్టులు వాడుతుంటారు. ఇది తప్పు, అలా ఎక్కువ కాలం వాడడం వల్ల మెడ, నడుము భాగాల్లో కండరాలు బలహీనపడతాయి. దీంతో వెన్ను సమస్యలు వస్తాయి. అందుకని వెైద్యుల సలహ ప్రకారం ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులే ఆ బెల్టులు వాడాలి. సలహ లేకుండా వీటిని ప్రయత్నించవద్దు.విపరీతంగా నొప్పి ఉందా? బెడ్ రెస్ట్‌ తీసుకుంటే తగ్గిపోతుందని కొందరు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకుంటుంటారు. 48 నుంచి 72 గంటలకన్నా ఎక్కువ విశ్రాంతిని తీసుకోవడం మంచిందికాదు. అలా కదలకుండా ఉంటే కండరాలు బలహీనమయి, భవిష్యత్తులో వీటివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మనం సరెైన పద్దతిలో బరువులెత్తకపోయినా వెన్ను నొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చున్నా నడుము, మొడ నొప్పి రావచ్చు. పద్దతి ప్రకారం వ్యాయామం చేయకపోయినా, ఊబకాయంవల్లా, మానసిక ఒత్తిళ్ళు, ధూమపానం, సరెైన ఆహారం తీసుకోవకపోవడం వల్లా వెన్ను సమస్యలు రావచ్చు. మనం కూర్చునే కుర్చీల విషయంలో, వాటిలో కూర్చునే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి. కుర్చీ వెనుక భాకం మెడవరకూ ఉంటే మంచింది. కూర్చున్నప్పుడు మోకాలు తుంటి కన్నా ఎత్తులో ఉండకూడదు. పాదాలు రెండింటిని నేలమీద ఆన్చాలి. లేకపోతే పుట్‌ రెస్ట్‌ మీద ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వారంలో అయిదు రోజులు నడవడం లేదా వ్యాయామం చేయాలి. నడక వల్ల నొప్పులు దూరమవడమే కాక, రక్తంలోంచి ఎముకలు కాల్షింని ఎక్కువగా తీసుకుని ఎముకలు గట్టిపడతాయి. సిగరెట్లు లాంటి అలవాట్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా, పుస్తకపఠనం, ఆటలు, సంగీతంలాంటివి తోడ్పడతాయి. సమతులాహారాన్ని తీసుకోవాలి. తిరుతిళ్ళు మానేయాలి.

డాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య, స్పైన్‌ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డికాపూల్‌, హైదరాబాద్‌.

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.


మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి. పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారు.

మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స: 
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం. 
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి, అల్ట్రాసౌండ్‌, ఐ.ఆర్‌.ఆర్‌., ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

గుండె బాగా కొట్టుకుంటుంది. 
శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 
కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూటజ్ఛీట) ఖర్చు అవుతాయి. 
మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది. 
చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది. 
ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది. 
రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు: 
నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి. రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు. బ్రిస్క్‌ వాకింగ్‌.

తీసుకోవలసిన జాగ్రత్తలు: 
ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి. నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు. పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.

వ్యాయామం: 
మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది. స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది. ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.

ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది. కీళు సులువుగా కదులుతుంది. ఎముకలు బలపడతాయి. బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి. చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.

గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి. సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది. 

ధన్యవాదములు  🙏

మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

18, నవంబర్ 2020, బుధవారం

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం.. లాంటి అనారోగ్యాలు పట్టి పీడించడం సహజమే. కాబట్టి ఇలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల్ని మన రోజువారీ మెనూలో చేర్చుకోవాల్సిందే...ఈ లింక్స్ లో చూడాలి


చలి తగ్గినా దగ్గు,జలుబు వదలవా?నివారణకు నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం 


సీజన్‌తో నిమిత్తం లేని జబ్బులొస్తున్న విపరీత కాలమిది. లేకపోతే చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు.. ఎండా కాలంలో పట్టుకోవడమేమిటి? విచిత్రంగా లేదూ? ఇప్పుడు మెల్లగా చలిపోయి ఎండ పెరుగుతున్న వాతావరణంలో..  ఎంతో మందిని పట్టిపీడిస్తున్న శ్వాసకోశ సమస్యల గురించి వివరిస్తున్నారు మన నవీన్ 

     దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు ప్రధానంగా వైరస్‌లు, వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లటం, కాలుష్యం, వాతావరణ మార్పులే కారణాలు. యాంటీబయాటిక్స్‌ వాడటం, దుమ్ము, ధూళి, చల్లదనాలకు దూరంగా ఉండటం, పోషకాహారం తీసుకుని రోగ నిరోధకశక్తిని పెంచుకోవటం చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ శ్వాసకోశ సమస్యలకు వాతావరణ మార్పులు కూడా తోడైతే ఇన్‌ఫెక్షన్‌ను అదుపు చేయటం కొంత కష్టం. ఇప్పుడు ఇలాంటి ఇన్‌ఫెక్షన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఓ పక్క పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే, మరోపక్క రాత్రుళ్లు గణనీయంగా పడిపోతున్నాయి. మరిముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రాత్రి చలి, పగలు వేడితో చిత్రమైన వాతావరణం ఉంటోంది. ఇలాంటి మార్పుల వల్ల ముక్కులోని లైనింగ్స్‌ పొడిబారి వైర్‌సలకు నివాసయోగ్యాలుగా మారుతున్నాయని వైద్యులంటున్నారు. ఈ సమస్యకు చలికాలంలో అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే రైనో, పారా ఇన్‌ఫ్లుయెంజా వైర్‌సలకు ఇతర బ్యాక్టీరియాలు తోడవుతున్నాయి. ప్రత్యేకంగా వేసవి వాతావరణంలో ‘ఎంటిరోవైరస్‌’ అనే ఓ సరికొత్త వైరస్‌ విజృంభిస్తోంది. ఇది చికిత్సకు లొంగని వైరస్‌. ఈ సమస్యలకు కాలుష్యం కూడా తోడవుతోంది. పల్లెలతో పోలిస్తే సిటీల్లో గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత 20 పట్టణాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. ఇలా కాలుష్యం, రోగనిరోధకశక్తి సన్నగిల్లటం, డ్రగ్‌ రెసిస్టెన్స్‌లాంటి కారణాలు కలగలిసి సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. చలికాలంలో ఇబ్బందిపెట్టే వైర్‌సలు ఉప్పెనలా వేధించి తగ్గిపోతే వేసవి ప్రారంభంలో దాడిచేసే వైర్‌సలు ఒంట్లోనే దాక్కుని పదే పదే తిరగబెడుతూ ఎక్కువకాలంపాటు వేధిస్తాయి.
 
పిల్లలు, పెద్దలే బాధితులు
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా పిల్లలు, పెద్దల్నే వేధిస్తాయి. ఐదేళ్లకంటే చిన్న పిల్లలు, 60-65 ఏళ్ల వయసు పెద్దలే ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ల బారిన పతుం టారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉండకపోవటం, పెద్దల్లో వ్యాధినిరోధక శక్తి క్షీణించటంతోపాటు మధుమేహంలాంటి వ్యాధుల మూలంగా ఇన్‌ఫెక్షన్లు తేలికగా దాడి చేస్తాయి. వీళ్లకు చలికాలంలో అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌తో సమస్య మొదలవుతుంది. ఇది క్రమంగా కింద కు పాకి, చివరికి ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల్లోకి పాకకముందే మెరుగైన చికిత్స అందించాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ సెకండరీ ఇన్‌ఫెక్షన్లతోపాటు ఇతర దీర్ఘకాల వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవాలి.
 
డ్రగ్‌ రెసిస్టెన్స్‌
జలుబు, దగ్గులాంటి రుగ్మతలకు సాధారణంగా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటాం. లేదంటే మెడికల్‌ షాప్‌కి వెళ్లి మందులు కొని వాడేస్తూ ఉంటాం. బాక్టీరియల్‌, వైరల్‌.. వీటిలో ఏ రకమైన ఇన్‌ఫెక్షనో తెలియకుండానే మందుల్ని వేసేసుకుంటాం. ఒకవేళ వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్‌ అయినా ఇన్‌ఫెక్షన్‌ కాస్త కంట్రోల్‌ కాగానే పూర్తి కోర్సు వాడకుండా మానేస్తూ ఉంటాం. ఇలా ఓవర్‌ ది కౌంటర్‌ మందులు వాడటం, పూర్తి మోతాదు వాడకపోవటం వల్ల మైక్రోఆర్గానిజమ్స్‌ మందులకు లొంగినట్టే లొంగి మరో కొత్త రూపంలో ఇతరులకు వ్యాపిస్తుంది. ఇలా సూక్ష్మజీవులు మందులకు స్పందించనంత సామర్థ్యా న్ని పెంచుకుంటూ చివరికి చికిత్సకూ లొంగనంత మొండి గా తయారవుతున్నాయి. అమెరికాలో యాంటీబయాటిక్స్‌ వాడకం సంవత్సరానికి 7 బిలియన్లు, చైనాలో 10 బిలియన్లే ఉంటే మన దేశం 13 బిలియన్లకు చేరిపోయింది. ఈ దుస్థితి నుంచి గట్టెక్కడానికి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాంటీ మైక్రోబియిల్‌ సర్వే చేపట్టింది. కానీ ఇలాంటి సర్వేల కంటే సొంతంగా కాకుండా, వైద్యులు సూచించిన మందుల్ని, సూచించినంతకాలం వాడేలా నియమాలు పాటించటం అలవాటు చేసుకోవాలి.

లక్షణాలు ఇవే!
  • జలుబు 
  • ముక్కు నుంచి నీరు కారటం 
  • తలనొప్పి, తుమ్ములు 
  • గొంతు నొప్పి 
  • ముక్కు దిబ్బెడ 
  • జ్వరం
వీళ్లే బాధితులు
  • శ్వాసకోశ సమస్యలు కొందరినే ఎక్కువగా, అత్యంత తేలికగా దాడి చేస్తాయి. వాళ్లెవరంటే? 
  • ఐదేళ్ల కంటే చిన్న పిల్లలు 
  • 60 - 65 ఏళ్ల మధ్య వయస్కులు 
  • రోగులు (షుగర్‌, హైపరటెన్షన్‌, కొరొనరీ హార్ట్‌ డిసీజెస్‌, మెదడు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగిన వాళ్లు) 
వైరస్‌కు బ్యాక్టీరియా తోడైతే?
వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ తోడైనప్పుడు వచ్చే రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌ మరింత మొండిగా తయారవుతుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా ఉన్నప్పుడు అది ఎగువ శ్వాసనాళానికే పరిమితమౌతుంది. ఆ వైర్‌సకు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా తోడైతే అది దిగువ శ్వాసనాళానికి పాకి అక్కడి నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇది కొంత ప్రమాదకరమైన స్థితి. ఈ దశలో పై లక్షణాలతోపాటు జ్వరం, దగు,్గ ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కూడా ఉంటుంది.
 
సమ్మర్‌ వైరస్‌ ‘ఎంటిరోవైరస్‌’
వేసవిలో విడవకుండా వేధించే దగ్గు, జలుబులకు ఈ వైరసే కారణం. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ చాలా రోజులు బాధిస్తోంది. అలాగని విపరీతమైన లక్షణాలూ బయటపడవు. తెరలుగా వేధించే దగ్గు, శ్లేష్మం రూపంలో అడపాదడపా కనిపిస్తూ అంతర్గతంగా వ్యాధి ముదిరి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసేలా చేస్తుంది.
 
ఇన్‌ఫెక్షన్లకు కారణం
  • ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ 
  • పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ 
  • స్టెఫలోకోకల్‌ బ్యాక్టీరియా 
  • ఎడినోవైరస్‌ 
  • న్యూమోకోకస్‌ 
  • రైనోవైరస్‌ 

ఇన్‌ఫెక్షన్లలో రకాలు
 
అప్పర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌: ముక్కు, గొంతు, స్వర పేటికలు ఇన్‌వాల్వ్‌ అవుతాయి.
 
ఇన్‌ఫెక్షన్‌ రకాలు... 
  • టాన్సిలైటిస్‌ 
  • ఫారింగ్జైటిస్‌ 
  • లారింగైటిస్‌ 
  • సైనసైటిస్‌ 
  • ఒటైటిస్‌ మీడియా

లోయర్‌ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌: శ్వాసనాళం, శ్వాసకోశాలు, ఊపిరితిత్తులు ఇన్‌వాల్వ్‌ అయి ఉంటాయి.
 
ఇన్‌ఫెక్షన్‌ రకాలు..
  •  బ్రాంఖైటిస్‌ 
  • న్యుమోనియా  
ఎంతకాలంలోగా వైద్యుల్ని కలవాలి?
జలుబు, దగ్గుల గురించి వైద్యులను కలిసేవాళ్లు చాలా అరుదు. మందులు వాడితే వారం రోజుల్లో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుందని జలుబు మీదో తమాషా జోకుంది. అయితే ఇదే సూత్రం అన్ని సమయాల్లో పనికిరాదు. వేసవి వచ్చినా వదలని శ్వాసకోశ సమస్యలకు వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి. జలుబు మూడు అంతకంటే ఎక్కువ రోజులపాటు తగ్గకుండా వేధిస్తూ ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని కలవాలి.

చేయాల్సిన పరీక్షలు..
  • చెస్ట్‌ ఎక్స్‌రే (దీంతో న్యుమోనియా తీవ్రత తెలుస్తుంది) 
  • నాసల్‌ స్వాబ్‌ (వైరస్‌ రకం తెలుస్తుంది) 
  • థ్రోట్‌ స్వాబ్‌ (ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిన తీరు తెలుస్తుంది) 
  • కల్చర్‌ (వైరస్‌ రకం తెలుస్తుంది) 
వైద్య చికిత్స
వ్యాధి వ్యాప్తి, తీవ్రతలను బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటారు. స్వల్ప ఇన్‌ఫెక్షన్లకు 5 రోజులపాటు మందులు సూచిస్తారు. అప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి రాకపోతే ఇతరత్రా పరీక్షలు చేసి వైరస్‌ కౌంట్‌, తత్వం, తీవ్రత, ఇన్‌ఫెక్షన్‌ పరిణామాలను బట్టి మరింత సమర్థమైన చికిత్సను అందిస్తారు.
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • శారీరక విశ్రాంతి తీసుకోవాలి. 
  • చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి. 
  • చల్లని వాతావరణంలో నుంచి హఠాత్తుగా వేడి వాతావరణంలోకి వెళ్లకూడదు. 
  • కాలుష్యానికి గురికాకుండా మాస్క్‌లు, స్కార్ఫ్‌లు వాడాలి. 
  • తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు కర్చీఫ్‌ అడ్డం పెట్టుకోవాలి. 
  • చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
  • వేడి పదార్థాలే తీసుకోవాలి. 
  • వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. 
  • ఉపశమనం కోసం వేడి నీటి ఆవిరి పట్టొచ్చు. 

కఫం తగ్గాలంటే..

శరీరంలోని అంతర్భాగాల పొరల్లో ఊరే ద్రవం ఒక్కోసారి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది క్రిమి సంబంధిత సమస్యలకు లోనైనప్పుడు ఆ ద్రవం గట్టిగా, జిగటగా మారుతుంది. దీనివల్ల కఫ సంబంధితమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ కఫం ముఖ్యంగా, శ్వాసకోశాల్లోనూ, శ్వాస వాహికల్లోనూ, ముక్కుల్లోనూ పేరుకుని, నోటిద్వారా, ముక్కు ద్వారా, కఫ రూపంలో బయటికి వస్తుంది. ఈ స్థితిలో ఒంట్లో వికారంగానూ, చికాకుగానూ ఉంటుంది. ఎప్పుడూ జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. కఫం తగ్గితే గానీ, ఈ సమస్యలు పోవు. అందుకే ఈ కింద చెప్పినట్లు చేయండి.

జు పిప్పళ్లు, మిరియాలు, శొంఠి ఈ మూడింటిలో ఏదో చూర్ణాన్ని సంచదార నీటితో కలిపి రాత్రిపూట తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
  • వెల్లుల్లి పాయలోని నాలుగు రేకులను గుజ్జుగా తయారు చేసుకుని ప్రతి ఆరుగంటలకు ఒకసారి తీసుకుంటే కఫ సమస్యలు తొలగిపోతాయి.
  • ఒక్కోసారి కఫం గొంతులో గరగరలాడుతూ ఊపిరాడటం కష్టమవుతుంది దగ్గు కూడా వస్తుంది. ఇలాంటి స్థితిలో...
  • మూడు మారేడు ఆకుల చొప్పున ఉదయం, సాయంత్రం నమిలిమింగాలి. ఇలా కనీసం నెలరోజులైనా చేస్తే ఎంతో మేలు కలుగుతుంది.
  • ఒక ఔన్స్‌ క్యాబేజీ రసాన్ని పూటకోసారి తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ముల్లంగి రసాన్ని కూడా ఇలాగే తీసుకోవచ్చు. కప్పు వేడినీటిలో కొంత తేనె కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.

Rhematic Fever - రుమాటిక్‌ ఫీవర్‌


కీళ్ళ వాత రోగి జ్వరాన్నే రుమాటిక్‌ ఫీవర్‌గా పిలుస్తాం. చిన్న పిల్లలనూ, ముఖ్యంగా యవ్వనంలో అడుగుపెడుతున్న వారికీ సాధారణంగా ఈ వ్యాధి వస్తుంటుంది. విపరీతమైన జ్వరం వస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. గొంతులో నొప్పి కలుగుతుంది. ఊపిరి తీసుకుంటే నొప్పిగా ఉంటుంది. కాళ్ళూ చేతుల కదలికలు పట్టు తప్పినట్లుగా అనిపిస్తుంది. స్వాధీనంలో ఉండవు. ఎక్కువ రోజులపాటు ఉండే ఈ జ్వరాన్ని అశ్రద్ధ చేయడం మంచిదికాదు.


చాలామంది పిల్లలు రుమాటిక్‌ జ్వరం బారినపడి, సరియైన చికిత్స లేక గుండె వాల్వ్‌ దెబ్బతినటంతో ఎంతో బాధ పడుతున్నారు. మనదేశంలో ప్రతి ఏడాదీ లక్షలాది మంది పిల్లలు ఈ రోగం బారిన పడుతున్నారు. వారి గుండె వాల్వ్‌పాడై పోతోంది. దీని చికిత్స్‌ ఆపరేషన్‌ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అసలీ రోగానికి కారణం తెలీదు. హిమో లైటిక్‌ స్రెఎ్టో కోకై (Haemolytic Strepto Coci) అనే జీవాణువుల ద్వారా వ్యాపిస్తుంది. గొంతు భాగం, టానిల్స్‌ నెప్పి మంట, మూడు వారాల తర్వాత జ్వరం, కీళ్లనొప్పి మొదలుతుంది. దగ్గుతుమ్ము వల్ల ఈ రోగం ఒక పిల్లాడినించి ఇంకో పిల్లకి పాకుతుంది. తేమ, మురికి ప్రాంతాల్లో త్వరగా వ్యాప్తిస్తుంది. వెంటనే చికిత్స చేయాలి. కీళ్లు త్వరగా శరీర భాగాలను కదలనీయవు. ఇలా ముట్టుకుంటే చాలు తెగనెప్పి బాధ. రోగికి బాగా చెమటలు పట్టడం గుండె వేగంగా కొట్టుకోటం జరుగుతుంది. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌తో ప్రాణం పోవచ్చు. ఎలక్ట్రో కార్డియో గ్రామ్‌ ద్వారా జబ్బు తీవ్రతను కనుక్కోవచ్చు. గుండెవాల్వ్‌ కనక దెబ్బతింటే ఆపరేషన్‌ చేయక తప్పదు. వాల్వ్‌ది మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. మనకు పుట్టపర్తిలో ఈ ఆపరేషన్‌ సౌకర్యం ఉంది. ఈ రోగంరాగానే బెడ్‌ పై పూర్తి విశ్రాంతి తీసుకుని తీరాలి. డాక్టర్లు యాంటీ బయోటిక్‌ వాడతారు. పిల్లలకి ఈ వ్యాధి వస్తే వారికి 20వ ఏడువచ్చే దాకా జాగ్రత్తలు, వైద్యం తప్పని సరి సుమా.

వ్యాధి నిర్ధారణ :
  • elevated or rising antistreptolysin O titre or DNAase . మూలంగా మరియుఈ క్రింది గురుతులు ఉన్నదానిని  బట్టి నిర్ణయిస్తారు .
  • పోలి ఆర్థ్రైటిస్ (polyarthritis): కీళ్ళ కీళ్ళ కి మారే గుణమున్న కీళ్ళ నొప్పుల వ్యాధి .
  • కార్డైటిస్ (carditis) :  గుండె శోదము (ఇంఫ్లమేషన్‌) ఉండడము వలన - congestive heart failure with shortness of breath, pericarditis with a rub, or a new heart murmur. ఉండటాన్ని బట్టి .
  • సబ్ కుటేనియస్ నాడ్యూల్స్ (subcutaneous nodules): ఎముకలమీద , టెండాన్ల మీద నొప్పిలేని కణుపులు.
  • Erythema marginatum-- చర్మము పై ఎర్రని రాష్ (reddish rash)
  • Sydenham's chorea -- ముఖము ,చేతులు ఓ విధమైన వణుకు .
  • fever -- జ్వరము రావడము ,
  • Arthralgia-- కీళ్ళ నొఫ్ఫులు .
  • Raised ESR,-- రక్త పరీక్షలో ఇ.యస్.ఆర్ .. ఎక్కువగా ఉండడము ,
  • ECG -prolonged PR interval, ఇ.సి.జి. తీసినచో కనిపించును .
  • Leukocytosis: :-- తెల్ల రక్తకణాలు ఎక్కువగా ఉండును .
  • Abdominal pain : అప్పుడప్పుడు కడుపు నొప్పి ,
  • Nose bleeds : ముక్కు నుండి రక్తం కారడము ,
  • positive Throat culture:-- గొంగు రసాలు నుండి తీసిన స్వాబ్ పరీక్ష.
చికిత్స : 
వై్ద్యుల సహాయ , సలహా తోనే మందులు వాడాలి . ముఖ్యము గా 
  • Aspirin ,
  • corticosteroids , 
  • Antibiotics- pencillins , sulfadiazine , erythromycin  ,  మున్నగునవి .వాడుతారు.
  • Vaccine : దీనికి టీకా మందు కూడా వాడుకలోనున్నది .

ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

17, నవంబర్ 2020, మంగళవారం

కిడ్నీ లో రాళ్ళ నివారణకు ఈ లింక్స్ లో చూడాలి

మూత్ర పిండాల లో రాళ్ళు (కిడ్నీ స్టోన్ ), నివారణ మార్గాలు నవీన్ నడిమింటి సలహాలు :

 మూత్రపిండాల రాయి అనేది మూత్రపిండాలు లేదా మూత్ర మార్గములో ఏర్పడిన కఠినమైన, స్ఫటికాకార ఖనిజ పదార్థం.  మూత్రంలో రక్తం (హెమటూరియా) కిడ్నీ రాళ్ళు మరియు ఉదరం, పార్శ్వం లేదా గజ్జల్లో తరచుగా తీవ్రమైన నొప్పి వస్తుంది.  కిడ్నీ రాళ్లను కొన్నిసార్లు మూత్రపిండ కాలిక్యులి అంటారు.

 మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న పరిస్థితిని నెఫ్రోలిథియాసిస్ అంటారు.  మూత్ర మార్గంలోని ఏ ప్రదేశంలోనైనా రాళ్ళు ఉండడాన్ని యురోలిథియాసిస్ అని పిలుస్తారు, మరియు యురేటర్లిథియాసిస్ అనే పదాన్ని యురేటర్లలో ఉన్న రాళ్లను సూచించడానికి ఉపయోగిస్తారు.

 

 రాతి నిర్మాణం యొక్క పాథోఫిజియాలజీ

 పాపిల్లా యొక్క బాహ్య యూరోథెలియల్ ఉపరితలంపై కాల్షియం ఫాస్ఫేట్ నిక్షేపాలు (రాండాల్ ఫలకాలు) ఏర్పడటంతో కాల్షియం రాతి నిర్మాణం ప్రారంభమవుతుంది.  అందువల్ల, కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు సాధారణంగా కాల్షియం ఫాస్ఫేట్ (అపాటైట్ లేదా బ్రషైట్) యొక్క చిన్న భాగాన్ని కలిగి ఉంటాయి.

 ఈ ఫలకాలకు చిన్న కణాలు లంగరు వేయకపోతే, అవి మూత్రంలో కడుగుతాయి.  రాతి ఏర్పడటానికి క్రిస్టల్లాయిడ్లు సూపర్ సాచురేటింగ్ సాంద్రతలలో ఉండాలి;  ఈ పరిస్థితి నెరవేరినప్పుడు కూడా, సిట్రేట్, మెగ్నీషియం మరియు స్థూల కణాలతో సహా నిరోధకాల యొక్క తగినంత సాంద్రతల సమక్షంలో రాతి ఏర్పడకపోవచ్చు.

 మరోవైపు, యూరిక్ యాసిడ్ మరియు ఆల్కలీన్ యూరిన్ పిహెచ్ వంటి కొన్ని పదార్థాలు ఒక నిర్దిష్ట స్థాయి సూపర్‌సాచురేషన్‌లో రాతి ఏర్పడటానికి వీలుగా ప్రమోటర్లుగా పనిచేస్తాయి.

 మూత్ర సంతృప్తత ఏకాగ్రత ఉత్పత్తి యొక్క నిష్పత్తిని (ఉదా., కాల్షియం ఆక్సలేట్) మూత్రంలో దాని ద్రావణీయతకు అంచనా వేస్తుంది.  1 (సూపర్‌సాచురేషన్) కంటే ఎక్కువ విలువలతో, క్రిస్టల్ ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది;  1 కంటే తక్కువ విలువలు రాతి ఏర్పడటానికి మద్దతు ఇవ్వవు మరియు కొన్ని స్ఫటికాలు (యూరిక్ ఆమ్లం, సిస్టీన్) కూడా కరిగిపోవచ్చు.

 రాతి నిర్మాణం సూపర్‌సాచురేషన్ విలువలతో పరస్పర సంబంధం కలిగి ఉంటుంది మరియు సూపర్‌సాచురేషన్‌ను కొలవడం సహాయపడుతుంది, ఉదాహరణకు, ఆల్కలీ థెరపీని పొందుతున్న రాళ్లతో ఉన్న రోగులలో కాల్షియం-ఫాస్పరస్ సూపర్‌సాచురేషన్‌ను పర్యవేక్షించడంలో.

 వాణిజ్య ప్రయోగశాలలు మూత్ర జీవక్రియ ప్రొఫైల్‌లను అందిస్తాయి, వీటిలో కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ మరియు యూరిక్ ఆమ్లం యొక్క మూత్ర సంతృప్తత కూడా ఉంటుంది

 

 మూత్రపిండాల్లో రాళ్లు

 కిడ్నీ రాయి రకాలు

 మూత్రపిండాల రకాన్ని తెలుసుకోవడం కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది మరియు ఎక్కువ మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో ఆధారాలు ఇవ్వవచ్చు.  మూత్రపిండాల రాళ్ల రకాలు:

 కాల్షియం రాళ్ళు: చాలా కిడ్నీలో రాళ్ళు కాల్షియం రాళ్ళు, సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి.  ఆక్సలేట్ అనేది ఆహారంలో లభించే సహజంగా లభించే పదార్థం.  కొన్ని పండ్లు మరియు కూరగాయలు, అలాగే గింజలు మరియు చాక్లెట్ అధిక ఆక్సలేట్ స్థాయిని కలిగి ఉంటాయి.  మీ కాలేయం కూడా ఆక్సలేట్ ఉత్పత్తి చేస్తుంది.  ఆహార కారకాలు, అధిక మోతాదులో విటమిన్ డి, పేగు బైపాస్ సర్జరీ మరియు అనేక జీవక్రియ లోపాలు మూత్రంలో కాల్షియం లేదా ఆక్సలేట్ గా ration తను పెంచుతాయి.  కాల్షియం రాళ్ళు కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో కూడా సంభవించవచ్చు.

 స్ట్రువైట్ రాళ్ళు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి సంక్రమణకు ప్రతిస్పందనగా స్ట్రువైట్ రాళ్ళు ఏర్పడతాయి.  ఈ రాళ్ళు త్వరగా పెరుగుతాయి మరియు చాలా పెద్దవిగా మారతాయి, కొన్నిసార్లు కొన్ని లక్షణాలు లేదా తక్కువ హెచ్చరికతో.

 యూరిక్ యాసిడ్ రాళ్ళు: తగినంత ద్రవాలు తాగని లేదా ఎక్కువ ద్రవాన్ని కోల్పోయేవారిలో, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తినేవారిలో మరియు గౌట్ ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ రాళ్ళు ఏర్పడతాయి.  కొన్ని జన్యుపరమైన కారకాలు యూరిక్ యాసిడ్ రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

 సిస్టీన్ రాళ్ళు: వంశపారంపర్య రుగ్మత ఉన్నవారిలో ఈ రాళ్ళు ఏర్పడతాయి, దీనివల్ల మూత్రపిండాలు కొన్ని అమైనో ఆమ్లాలు (సిస్టినురియా) ఎక్కువగా విసర్జించబడతాయి.

 ఇతర రాళ్ళు: ఇతర, అరుదైన మూత్రపిండాల్లో రాళ్ళు సంభవించవచ్చు.

 కిడ్నీ స్టోన్ ప్రమాద కారకాలు

 ప్రమాద కారకాలు:

 డీహైడ్రేషన్: తగినంత ద్రవాలు తాగకపోవడం వల్ల మూత్రం సాంద్రీకృతమవుతుంది.  ఇది స్ఫటికాలు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది.

 అనారోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలి: చక్కెర, కెఫిన్, లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగడం మరియు సోడియం (ఉప్పు) అధికంగా ఉన్న ఆహారం తినడం కాల్షియం రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.  ఊబకాయం కూడా పిల్లలను పొందే అవకాశం ఉంది.

 మూత్ర మార్గ లోపాలు: మూత్ర మార్గంలోని నిర్మాణ లోపం పీ యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది మరియు అది ఒక చిన్న కొలనులో సేకరించే ప్రాంతాన్ని సృష్టిస్తుంది.  పీ ప్రవహించడం ఆగిపోయినప్పుడు, క్రిస్టల్ ఏర్పడే పదార్థాలు కలిసి స్థిరపడి రాళ్ళు ఏర్పడవచ్చు.

 కొన్ని మందులు: కొన్ని ప్రిస్క్రిప్షన్ మరియు ఓవర్ ది కౌంటర్ మందులు పెద్ద మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.

 జీవక్రియ రుగ్మతలు: జీవక్రియ రుగ్మత (శరీరం విచ్ఛిన్నం మరియు ఆహారాన్ని ఉపయోగించే విధానంలో సమస్య) ఆక్సలేట్ (శరీరంలో తయారైన మరియు కొన్ని ఆహారాలలో లభించే పదార్థం) లేదా మూత్రంలో సిస్టిన్ యొక్క సాంద్రీకృత స్థాయికి దారితీస్తుంది.

 సిస్టినురియా: ఈ జన్యు పరిస్థితి మూత్రపిండాల నుండి పీలోకి ఎక్కువ సిస్టీన్ వెళ్ళడానికి కారణమవుతుంది, దీనివల్ల సిస్టీన్ రాళ్ళు ఏర్పడతాయి.

 ఇతర వైద్య పరిస్థితులు: గౌట్ (ఒక రకమైన ఆర్థరైటిస్), ఇతర మూత్రపిండ వ్యాధులు, థైరాయిడ్ లేదా పారాథైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే పరిస్థితులు మరియు కొన్ని మూత్ర మార్గము అంటువ్యాధులు (యుటిఐలు) సహా అనేక వ్యాధులు మరియు పరిస్థితులు మూత్రపిండాల రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

 కిడ్నీ రాయికి కారణాలు

 కిడ్నీలో రాళ్ళు సాధారణం.  కొన్ని రకాలు కుటుంబాలలో నడుస్తాయి.  అవి తరచుగా అకాల శిశువులలో సంభవిస్తాయి.

 వివిధ రకాల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయి.  సమస్యకు కారణం రాయి రకం మీద ఆధారపడి ఉంటుంది.

 మూత్రంలో స్ఫటికాలు ఏర్పడే కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాళ్ళు ఏర్పడతాయి.  ఈ స్ఫటికాలు వారాలు లేదా నెలల్లో రాళ్ళుగా అభివృద్ధి చెందుతాయి.

 కాల్షియం రాళ్ళు సర్వసాధారణం.  ఇవి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులలో ఎక్కువగా సంభవిస్తాయి. కాల్షియం ఇతర పదార్ధాలతో కలిపి రాయిని ఏర్పరుస్తుంది.

 వీటిలో ఆక్సలేట్ చాలా సాధారణం.  బచ్చలికూర వంటి కొన్ని ఆహారాలలో ఆక్సలేట్ ఉంటుంది.  ఇది విటమిన్ సి సప్లిమెంట్లలో కూడా కనిపిస్తుంది.  చిన్న ప్రేగు యొక్క వ్యాధులు ఈ రాళ్ళ ప్రమాదాన్ని పెంచుతాయి.

 కాల్షియం రాళ్ళు ఫాస్ఫేట్ లేదా కార్బోనేట్‌తో కలపడం నుండి కూడా ఏర్పడతాయి.

 ఇతర రకాల రాళ్ళు:

 సిస్టినురియా ఉన్నవారిలో సిస్టీన్ రాళ్ళు ఏర్పడతాయి.  ఈ రుగ్మత కుటుంబాలలో నడుస్తుంది.  ఇది స్త్రీపురుషులను ప్రభావితం చేస్తుంది.

 స్ట్రువైట్ రాళ్ళు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న మహిళల్లో కనిపిస్తాయి.  ఈ రాళ్ళు చాలా పెద్దవిగా పెరుగుతాయి మరియు మూత్రపిండాలు, యురేటర్ లేదా మూత్రాశయాన్ని నిరోధించగలవు.

 యూరిక్ యాసిడ్ రాళ్ళు మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి.  గౌట్ లేదా కెమోథెరపీతో ఇవి సంభవించవచ్చు.

 కొన్ని మందులు వంటి ఇతర పదార్థాలు కూడా రాళ్లను ఏర్పరుస్తాయి.

 మూత్రపిండాల్లో రాళ్లకు అతి పెద్ద ప్రమాద కారకం తగినంత ద్రవాలు తాగడం కాదు.  మీరు రోజుకు 1 లీటర్ (32 oun న్సుల) కంటే తక్కువ మూత్రాన్ని చేస్తే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది.

 లక్షణాలు

 మూత్రపిండంలోని రాళ్ళు తరచుగా ఎటువంటి సంకేతాలను కలిగించవు మరియు నిర్ధారణ చేయబడవు.  ఒక రాయి మూత్రపిండాన్ని విడిచిపెట్టినప్పుడు, అది మూత్రాశయానికి యురేటర్ ద్వారా ప్రయాణిస్తుంది.  తరచుగా రాయి యురేటర్లో ఉంటుంది.  మూత్రపిండాల నుండి మూత్రం ప్రవహించడాన్ని రాయి అడ్డుకున్నప్పుడు, అది మూత్రపిండాల వాపుకు కారణమవుతుంది (హైడ్రోనెఫ్రోసిస్), తరచుగా చాలా నొప్పిని కలిగిస్తుంది.

 మూత్రపిండాల రాళ్ల యొక్క సాధారణ లక్షణాలు:

 వెనుక మరియు వైపు పదునైన, తిమ్మిరి నొప్పి, తరచుగా కడుపు లేదా గజ్జలకు కదులుతుంది.  ప్రసవ ప్రసవ నొప్పుల కన్నా నొప్పి దారుణంగా ఉందని కొందరు మహిళలు అంటున్నారు.  నొప్పి తరచుగా అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది మరియు తరంగాలలో వస్తుంది.  శరీరం రాయిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది వచ్చి వెళ్ళవచ్చు.

 మూత్ర విసర్జన చేయవలసిన తీవ్రమైన భావన.

 ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం లేదా మూత్రవిసర్జన సమయంలో మండుతున్న అనుభూతి.

 రక్తం వల్ల ముదురు లేదా ఎరుపు రంగులో ఉండే మూత్రం.  కొన్నిసార్లు మూత్రంలో చిన్న మొత్తంలో ఎర్ర రక్త కణాలు మాత్రమే ఉంటాయి, అవి కంటితో చూడలేవు.

 వికారం మరియు వాంతులు.

 పురుషులకు, మీరు పురుషాంగం కొన వద్ద నొప్పిని అనుభవించవచ్చు.

 కిడ్నీ రాతి సమస్యలు

 పెద్ద మూత్రపిండాల రాళ్ళ చికిత్స తర్వాత సమస్యలు వస్తాయి.

 మీరు ప్రక్రియ చేసే ముందు మీ సర్జన్ వీటిని మీకు వివరించాలి.

 సాధ్యమయ్యే సమస్యలు మీకు ఉన్న చికిత్స రకం మరియు మీ రాళ్ల పరిమాణం మరియు స్థానం మీద ఆధారపడి ఉంటాయి.

 సమస్యలలో ఇవి ఉండవచ్చు:

 సెప్సిస్ అనే అంటువ్యాధి రక్తం ద్వారా వ్యాపించి, శరీరమంతా లక్షణాలను కలిగిస్తుంది

 రాతి శకలాలు వలన ఏర్పడిన నిరోధించబడిన యురేటర్ (మూత్రాశయం మూత్రపిండానికి మూత్రపిండానికి అంటుకునే గొట్టం)

 యురేటర్ కు గాయం

 యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)

 శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం

 నొప్పి

 రోగ నిర్ధారణ మరియు పరీక్ష

 రోగ నిర్ధారణ శారీరక పరీక్ష మరియు మీ వైద్య చరిత్ర యొక్క సమీక్షతో ప్రారంభమవుతుంది.  ఇతర పరీక్షలు:

 రక్త పరీక్ష: మీ మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో కొలవడానికి, సంక్రమణ సంకేతాలను చూడటం మరియు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి దారితీసే జీవరసాయన సమస్యల కోసం చూడటం.

 మూత్ర నమూనా పరీక్ష: సంక్రమణ సంకేతాలను వెతకడానికి మరియు రాతి ఏర్పడే పదార్థాల స్థాయిలను పరిశీలించడానికి- కాల్షియం, ఆక్సలేట్, యురేట్, సిస్టీన్, క్శాంథిన్ మరియు ఫాస్ఫేట్.

 ఇమేజింగ్ పరీక్షలు: రాళ్ల పరిమాణం, ఆకారం మరియు స్థానాన్ని చూడటానికి;  చాలా సరిఅయిన చికిత్సను నిర్ణయించండి మరియు కొన్నిసార్లు చికిత్స ఫలితాన్ని సమీక్షించండి.  ఉపయోగించిన ఇమేజింగ్ పరీక్షల రకాలు ఎక్స్-కిరణాలు, సిటి స్కాన్ మరియు అల్ట్రాసౌండ్.  ఎక్స్‌రే పరీక్షలు మరియు సిటి స్కాన్‌లు రెండూ తమ చిత్రాలను రూపొందించడానికి తక్కువ మొత్తంలో రేడియేషన్‌ను ఉపయోగిస్తాయి.

 రెండు రకాల ఎక్స్-కిరణాలు ఉపయోగించబడతాయి: మూత్ర మార్గము యొక్క ప్రామాణిక ఎక్స్-రే లేదా ఇంట్రావీనస్ పైలోగ్రామ్ (ఐవిపి) అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఎక్స్-రే.  ఒక IVP ఆదేశించినట్లయితే, ఎక్స్-రే తీసుకునే ముందు మీరు మీ సిరలో రంగు యొక్క ఇంజెక్షన్ అందుకుంటారు.  మూత్రపిండాలు, మూత్రాశయాలు మరియు మూత్రాశయంలోని సమస్యల యొక్క పదునైన చిత్రాన్ని పొందడానికి ఈ రంగును ఉపయోగిస్తారు.

 ఉదరం యొక్క CT స్కాన్ అనేది ఇమేజింగ్ పరీక్ష, ఇది ఉదర కుహరంలోని అవయవాల యొక్క 3 డైమెన్షనల్ వీక్షణను సృష్టిస్తుంది.  ఇది మీ సిరలో రంగు ఇంజెక్షన్తో లేదా లేకుండా ఉపయోగించబడుతుంది.  ఈ పరీక్ష రాతి పరిమాణం మరియు స్థానం మరియు రాయి ఏర్పడటానికి కారణమైన పరిస్థితులను చూపుతుంది.  అదనంగా, శరీరం యొక్క ఈ ప్రాంతంలోని ఇతర అవయవాలను అంచనా వేయవచ్చు.

 మూత్ర మార్గంలోని అల్ట్రాసౌండ్ మూత్రపిండాల రాళ్లను మరియు మూత్రపిండాల రాళ్ళ యొక్క పరోక్ష సంకేతాలను గుర్తించడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది, మూత్రపిండాల పరిమాణం మరియు ఆకృతిలో మార్పులు వంటివి.

 చికిత్స

 కిడ్నీలో రాళ్ళు సాధారణంగా దీర్ఘకాలిక సమస్యలకు గురికాకుండా స్వయంగా వెళ్తాయి.  వారు లేకపోతే, లేదా మీరు చాలా బాధలో ఉంటే, మీ డాక్టర్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

 మీ చికిత్స మీ రాయి ఎక్కడ మరియు ఎంత పెద్దది మరియు మీకు ఏ లక్షణాలు ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

 మొదట, మీరు వేచి ఉండండి

 మీ రాయి మీకు ఇబ్బంది కలిగించకపోతే, అది స్వయంగా వెళ్ళడానికి 2-4 వారాలు వేచి ఉండాలని మీ డాక్టర్ సూచించవచ్చు.  మీ శరీరం నుండి బయటకు వెళ్లడానికి అదనపు నీరు త్రాగమని ఆమె మీకు చెప్పవచ్చు.

 మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు రాయిని స్ట్రైనర్‌లో పట్టుకోవాలని ఆమె మిమ్మల్ని అడగవచ్చు.  మందులు ఎక్కువ రాళ్లను నిరోధించవచ్చో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రయోగశాల ఖనిజాల కోసం దీనిని పరీక్షించవచ్చు.

 మెడిసిన్స్

 మీకు అసౌకర్యం ఉంటే, మీరు రాయి నుండి నిష్క్రమించే వరకు వేచి ఉన్నప్పుడు మీ లక్షణాలను నిర్వహించవచ్చు.

 ఎసిటమినోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణలు సహాయపడతాయి.  వికారం తగ్గించడానికి మీకు మందు కూడా అవసరం కావచ్చు.

 ప్రిస్క్రిప్షన్ మందులు రాయిని వెంట తీసుకెళ్లడానికి సహాయపడతాయి:

 కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మరియు ఆల్ఫా-బ్లాకర్స్: ఇవి మీ మూత్రాశయాన్ని సడలించాయి, మీ మూత్రపిండాల నుండి పీ మీ మూత్రాశయానికి వెళుతుంది.  విస్తృత యురేటర్ రాయిని త్వరగా తరలించడానికి సహాయపడుతుంది.

 పొటాషియం సిట్రేట్ లేదా సోడియం సిట్రేట్: మీ రాయి యూరిక్ యాసిడ్ నుండి తయారైతే, దానిని కరిగించడానికి డాక్టర్ మీకు ఈ పరిష్కారాలలో ఒకదాన్ని ఇవ్వవచ్చు.

 సర్జరీ

 కొన్నిసార్లు, ఒక రాయి స్వయంగా బయటకు రావడానికి చాలా పెద్దది ది గా ఉం టే, మీవైద్యుడు దానిని విచ్ఛిన్నం చేయవలసి ఉంటుంది లేదా తీసివేయాలి. 

 రాయి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నందున మూత్ర విసర్జన చేయలేక పోవచ్చు.

 మీ వైద్యుడు అనేక విధానాల నుండి ఎంచుకోవచ్చు.

 షాక్ వేవ్ లిథోట్రిప్సీ (SWL) అనేది US లో అత్యంత సాధారణ చికిత్స.  ఇది చిన్న లేదా మధ్యస్థ రాళ్లకు ఉత్తమంగా పనిచేస్తుంది.  మీ డాక్టర్ కిడ్నీ రాయిని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి అధిక శక్తి ధ్వని తరంగాలను లక్ష్యంగా పెట్టుకున్నారు.  షాక్ తరంగాలు శరీరం వెలుపల నుండి వస్తాయి, అందుకే ఈ విధానాన్ని కొన్నిసార్లు ఎక్స్‌ట్రాకార్పోరియల్ SWL అంటారు.

 

 యురిటోరోస్కోపీ, ఇది చాలా సన్నని గొట్టం (యూరిటోరోస్కోప్) ను మూత్ర మార్గంలోకి రాతి స్థానానికి పంపడం, ఇక్కడ పరికరాలను రాయిని తొలగించడానికి లేదా సులభంగా తొలగించడానికి విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించవచ్చు.  అప్పుడప్పుడు, యురేటర్‌లో ఉంచిన చిన్న బోలు గొట్టం (యూరిటరల్ స్టెంట్) దానిని తెరిచి ఉంచడానికి మరియు మూత్రం మరియు ఏదైనా రాతి ముక్కలను హరించడానికి అవసరం.  మూత్రపిండాల నుండి యురేటర్‌కు మారిన రాళ్లకు యూరిటోరోస్కోపీని తరచుగా ఉపయోగిస్తారు.

 పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటోమీ, ఇది పెద్ద రాళ్లను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.  ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా వైపు లేదా వెనుక భాగంలో చిన్న (1 సెం.మీ) కోత అవసరం మరియు మూత్రపిండాల రాయిని తొలగించడానికి స్కోప్ ఉపయోగించడం అవసరం.  ఈ విధానం ఇన్‌పేషెంట్ ప్రాతిపదికన నిర్వహిస్తారు.

 కిడ్నీ రాయి నివారణ

 మూత్రపిండాల రాతి వ్యాధితో బాధపడుతున్న రోగికి కొన్ని సాధారణ జాగ్రత్తలు:

 మీ రోజువారీ ద్రవం తీసుకోవడం పెంచండి (నీటి తీసుకోవడం రోజుకు రెండు లీటర్లకు మించి ఉండాలి) -మీరు ఇప్పటికే మూత్రపిండ వైఫల్యం కలిగి ఉంటే, మీ వద్ద ఎంత నీరు ఉందనే దాని గురించి మీ వైద్యుడిని తనిఖీ చేయాలి.

 మీ ఆహారంలో జంతు ప్రోటీన్ యొక్క కంటెంట్ను తగ్గించండి (మాంసం తీసుకోవడం తగ్గించండి)

 కాఫీ, టీ మరియు కోలా తీసుకోవడం పరిమితం చేయండి

 విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోకండి.  సూచించినట్లు మాత్రమే తీసుకోండి.

 తక్కువ రోజువారీ ఉప్పు తీసుకోవడం (రోజుకు 2000 మి.గ్రా సోడియం పరిమితి)

 నిమ్మ మరియు క్రాన్బెర్రీ రసం సురక్షితంగా భావిస్తారు

 అధిక ఆక్సలేట్ కంటెంట్ ఆహారాలు తక్కువగా తీసుకోవడం (ఉదాహరణ: బచ్చలికూర, దుంపలు మరియు చాక్లెట్)

 మీ రోజువారీ చక్కెర తీసుకోవడం తగ్గించండి







జుట్టు ఊడిపోవడానికి నివారణకు ఈ లింక్స్ చూడాలి


జుట్టు రాలుట సమస్యలు-నివారణ మార్గాలు నవీన్ నడిమింటి సలహాలు 

జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాల

 పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మనదేశములో కేశసంపదకుకొదవలేదు.     స్త్రీలు  పొడవైనజుట్టుతో , పురుషులు  ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1%   కంటే  తక్కువ వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.

     జుట్టు రాలుట  (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన కారణాలు :
      .1. మానసిక ఒత్తిడి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం.
      2. వేళకు నిద్రపోక పోవడం    3. సమతుల పోష కాహారం లోపించడం.
      4. వాతావరణ కాలుష్యం.      5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.
      6. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్  ఎక్కువ తీసుకోవడం.
     7. జబ్బు చేసి బలహీన పడినప్పుడు  ఎక్కువ జుట్టు రాలుతుంది.
     8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే ఎక్సర్ సైజులు, డైటింగ్ లు
     9. ఎనీమియా (ఐరన్ లోపం ), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.
     10. టైఫాయిడ్ వల్ల,    11 యాంటీ క్యాన్సర్ మందులు వాడటం,రేడియో తెరఫీ వల్ల.
     12. ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్  హార్మోన్స్ లోపించడం లేదా ఎక్కువ కావడం.
     13. వంశ పారంపర్యంగా బట్ట తల రావడం.
    వంశపారంపర్యంగా, సహజంగా  వచ్చిన బట్టతల మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,
      ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు  జుట్టు వస్తుంది.
     జుట్టు రాలకుండా ఆపడానికి, తిరిగి వెంట్రుకలు మొలవడానికి  మార్గాలు:
   అల్లోపతీ వైద్యం: బట్టతల  ఏర్పడినచోట  HAIREX solution(Minoxidil) or HEBALDsolution(Minoxidil)
   పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.
   అలా కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత     కూడా రోజు రెండు పూటలు  పై మందు రాయాలి.
  ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం   1.నల్లమందు,లిల్లీపూరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు. క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం కనుగొన్నాడు.
 2. కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు 
రాలదు .                                                                                                                       3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను     కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే  ఒకటి రెండు నెలలలో  నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.
4.  ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు  రమ్ లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్  రాణి క్లియోపాట్ర  ఈ విధానం అవలంభించేదట.
5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే జుట్టు పెరుగును.
6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.
7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు రాలుటను నివారించును.
కొసమెరుపు B.P ని తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన ఔషధం (సైడ్ఎఫెక్ట్ గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.  
గమనిక: వయస్సు పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.

జుట్టు రాలుట సమస్య కు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చుడండి


జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద పద్దతులు నవీన్ నడిమింటి సలహాలు     జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాల

 పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మనదేశములో కేశసంపదకుకొదవలేదు.     స్త్రీలు  పొడవైనజుట్టుతో , పురుషులు  ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1%   కంటే  తక్కువ వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.

 జుట్టు రాలుట  (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన కారణాలు :

 .1. మానసిక ఒత్తిడి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం.   2. వేళకు నిద్రపోక పోవడం    

3. సమతుల పోష కాహారం లోపించడం.

4. వాతావరణ కాలుష్యం.    

 5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.

6. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్  ఎక్కువ తీసుకోవడం  7. జబ్బు చేసి బలహీన పడినప్పుడు  ఎక్కువ జుట్టు రాలుతుంది

   8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే ఎక్సర్ సైజులు, డైటింగ్ లు

 9. ఎనీమియా (ఐరన్ లోపం ), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.

10. టైఫాయిడ్ వల్ల,    

11 యాంటీ క్యాన్సర్ మందులు వాడటం,రేడియో తెరఫీ వల్ల.

12. ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్  హార్మోన్స్ లోపించడం లేదా ఎక్కువ కావడం.

  13. వంశ పారంపర్యంగా బట్ట తల రావడం.

 వంశపారంపర్యంగా, సహజంగా  వచ్చిన బట్టతల మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,

 ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు  జుట్టు వస్తుంది.

 జుట్టు రాలకుండా ఆపడానికి, తిరిగి వెంట్రుకలు మొలవడానికి  మార్గాలు:

  అల్లోపతీ వైద్యం: బట్టతల  ఏర్పడినచోట  HAIREX solution(Minoxidil) or HEBALDsolution(Minoxidil)

పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.

    అలా కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత     కూడా రోజు రెండు పూటలు  పై మందు రాయాలి.

  ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం   

1.నల్లమందు,లిల్లీపూరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు. క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం కనుగొన్నాడు.

 2. కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు రాలదు .

3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను     కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే  ఒకటి రెండు నెలలలో  నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.

4.  ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు  రమ్ లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్  రాణి క్లియోపాట్ర  ఈ విధానం అవలంభించేదట.

5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే జుట్టు పెరుగును.

6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.

7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు రాలుటను నివారించును.

కొసమెరుపు B.P ని తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన ఔషధం (సైడ్ఎఫెక్ట్ గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.  

గమనిక: వయస్సు పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.


  • విటమిన్ 'E' ఆయిల్, బాదం వంటి వాటితో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.  
  • ఆయుర్వేద వైద్యంలో మీరు తినే ఆహార పదార్థాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
  • మిల్క్, నట్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటిని తినండి.
తినే ఆహరం, ధ్యానం, అరోమాథెరపీ, ఆయిల్ మసాజ్ మరియు ఆయుర్వేద ఔషదాలు వంటి అన్ని కూడా జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద వైద్య శాస్త్రంలోకి వస్తాయి. మంచి ఫలితాలను పొందుటకు గానూ సంపూర్ణ విధానాలను అనుసరించాలి.





ఆయిల్ మసాజ్

  • స్కాల్ప్ ను ఆయిల్ లతో మసాజ్ చేయటం వలన జుట్టు మరియు స్కాల్ప్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు కేవలం 5 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన జట్టు రాలటం చాలా వరకు నియంత్రించబడుతుంది.

  • వెంట్రుకల మొదల్లకు బలం చేకూర్చటానికి గానూ విటమిన్ 'E' గల ఆయిల్ తో స్కాల్ప్ కు మాసాజ్ చేయండి.

  • కొబ్బరి మరియు బాద నూనెలు శక్తి వంతంగా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. దీనితో పాటుగా, పొడి మరియు పొలుసులుగా రాలే స్కాల్ప్ ను కూడా తగ్గిస్తాయి.

  • జుట్టు పలుచబడటాన్ని తగ్గించుటకు, హెర్బల్ సీరంతో స్కాల్ప్ ను మసాజ్ చేయండి. ఈ హెర్బల్ సీరాన్ని కనీసం వారానికి 3 ఆర్లు వాడటం వలన జుట్టు మొదల్లకు కావలసిన పోషకాలు అందించబండతాయి.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే మరొక ఆయుర్వేదిక్ ఆయిల్- బ్రింగరాజ్ ఆయిల్. ఈ నూనెను నేరుగా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పోసి మసాజ్ చేసి కనీసం ఒక రాత్రి వరకు అలాగే ఉంచండి. తరువాత ఉదయాన శుభ్రమైన నీటితో కడిగి వేయండి.
ఆయుర్వేద చికిత్సలో తినే ఆహారాలు కూడా కీలకమే

  • జింక్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్, సల్ఫర్ వంటి శరీరానికి అవరమయ్యే పోషకాలను అధికంగా కలిగి ఉండే ఫాటీ ఆసిడ్ లను ఎక్కువగా తీసుకోండి. ఇవి వెంట్రుకల మొదల్లకు బలాన్ని చేకూరుస్తాయి.

  • మొలకెత్తే విత్తనాలు, పాలు, బటర్, నట్స్, సోయా బీన్స్ మరియు గ్రైన్స్ వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.

  • ఆరోగ్యకర మరియు బలమైనన్ వెంట్రుకల కోసం కలబంద రసం అవసరమని చెప్పవచ్చు. 3 నెలలకు రెండు సార్లు కలబంద రసాన్ని తాగటం చాలా మంచిది.

  • జుట్టు రాలుటను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా యోఘర్ట్ ను పేర్కొనవచ్చు. రోజు యోఘర్ట్ తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గుటను మీరు గమనించవచ్చు.

  • పండ్లు, కూరగాయలు, పచ్చని ఆకుకురాలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కావున జుట్టు రాలటం తగ్గుతుంది.

  • మెగ్నీషియం, కాల్షియం, నువ్వులు వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలటాన్ని తగ్గించే ఇతర ఆయుర్వేద ఔషదాలు

  • ఆయుర్వేద ఔషదాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు రాలుటను తగ్గిస్తాయి. రోజ్మేరీ, స్టింగింగ్ నేటిల్, బిర్చి మరియు హర్సేటల్ వంటివి ఉపయోగపడే ఇతర ఆయుర్వేద ఔషదాలు అని చెప్పవచ్చు. వీటిని నేరుగా స్కాల్ప్ కు అప్లై చేయటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

  • లికోరైస్ కూడా జుట్టు రాలుటకు వ్యతిరేఖంగా పని చేసే ఔషదంగా చెప్పవచ్చు. పడుకోటానికి ముందు లికోరైస్ సారాన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

  • మార్ష్మల్లౌ మరియు బర్డాక్ టీ జుట్టుకి మంచివి అని చెప్పవచ్చు.

  • మినపప్పు, బ్లాక్ బీన్స్ మరియు మెంతులను కలిపి ఒక పేస్ట్ ల చేయండి. ఈ మిశ్రమం ఒకే విధంగా అయ్యే వరకు వేడి చేయండి. ఈ మూడు మిశ్రమాలను పూర్తిగా కలిసే వరకు గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగి వేయండి. ఈ పద్దతిని వారంలో రెండు లేదా మూడు సార్లు అనుసరించి మార్పులను 
  • గమనించగలరు 
  • ధన్యవాదములు 🙏
  • మీ నవీన్ నడిమింటి 
  • విశాఖపట్నం 
  • 919703706660

16, నవంబర్ 2020, సోమవారం

కాళ్లు, చేతులు మంటలు తగ్గాలంటే ఆయుర్వేదం నవీన్ సలహాలు .. అవగాహన కోసం రెమెడీ...ఈ లింక్స్ లో చూడాలి

అరికాళ్ళలో మంటలను తగ్గించుకోవడం ఎలా? పూర్తి వివరాలు తెలుసుకోండి.అరికాళ్ళ మంటలు సమస్య అనేది అనేక వ్యాధుల లక్షణాలలో దీనిని ఒకటిగా చెప్పుకోవచ్చు అనేక రకాల కారణాల వలన ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు వైద్య భాషలో దీనిని న్యూరోపతి లేదా పారేస్తే సియా అని అంటారు దీనివలన అరికాళ్ళలో వేడిగా, సూదులు గుచ్చినట్లుగా మరియు మంటలుగా ఉండటం వల్ల చాలా బాధ పడుతూ ఉంటారు సాధారణంగా ఈ పాదాల మంటలు అనేది పాదాలకు సక్రమంగా రక్తప్రసరణ జరగకపోవడం వలన ఏర్పడతాయి ముఖ్యంగా కాళ్లల్లో దెబ్బతిన్న నరాల వలన ఇంకా వయసు పైబడుతున్న కొద్దీ నరాల బలహీనత వల్ల ఈ అరికాళ్ళ సమస్య సమస్యలు ఏర్పడతాయి ఇంకా కొన్ని చెడు అలవాట్ల వలన కొన్ని ప్రమాదకరమైన జబ్బుల వలన కూడా ఈ అరికాళ్ళ సమస్యలు ఏర్పడతాయి ఇంకా మధుమేహం కలిగిన వృద్ధులలో ఎక్కువ సమయం నిలబడి ఉండే ఉద్యోగులలో నరాల రుగ్మతలు ఉన్న వారిలో లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంకా కాళ్లల్లో పగుళ్ళు ఏర్పడటం వల్ల అరికాళ్ళ చర్మం పొరలుగా ఊడి పోవడం వలన కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి.

  1. credit: third party image reference
  2. ఈ అరికాళ్ళ సమస్యలను పూర్తిగా నివారించడం ఆ వ్యాధులకు తగిన చికిత్స తీసుకోవడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అయితే కొన్ని సూచనలు పాటించడం వల్ల అరికాళ్ళసమస్యల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చును ముందుగా సరియైన వ్యాయామం ప్రతిరోజు చేయవలెను అలాగే కొంత దూరము ప్రతిరోజు నడవవలెను దీనివల్ల రక్త ప్రసరణ జరిగి కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది అలాగే మల్లెల ఆకులను మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా లైట్ గా వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు ఉన్నచోట లేపనంగా రాయ వలెను అలాగే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని అరికాళ్ళ మీద రాసిన ఉపశమనం కలుగు తుంది అలాగే గోరువెచ్చటి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా అల్లం రసం ఈ మూడింటిలో ఏది అరికాళ్ళ మీద రాసిన త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది అలాగే విటమిన్ B3 పుష్కలంగా ఉండే గుడ్డు పచ్చసొన పాలు బఠానీలు చిక్కుల్లో మొలకెత్తే విత్తనాలు వంటి పోషక విలువలు అధికంగా ఉండే వాటిని తీసుకోవడంం ద్వారా ఈ పాదాల సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ విటమిన్ b3 అనేది నరాలకు బలాన్ని చేకూర్చి రక్త పీడనం వల్ల నరాల సమస్యలను నిరోధిస్తుంది అంతేగాక ఎక్కువగా ప్రోటీన్లు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అనగా చేపలు ఆకుకూరలు పాల ఉత్పత్తులు నట్స్ వంటిి పోషక విలువలున్న్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అరికాళ్ళ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.credit: third party image reference
  3. గోరువెచ్చని నీటిలో అరికాళ్ళ నుంచితే అరికాళ్ళ మంటలు నుంచి ఉపశమనం పొందవచ్చును అలాగే ఈ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపిన పాదాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ప్రతి దినము వ్యాయామాలు మసాజ్ వాకింగ్ జాగింగ్ పరిగెత్తడం వంటివి ప్రతిదినము చేయటం వలన కూడా కాళ్ల మంటలు తగ్గిపోతాయి అలాగే పాదరక్షలు లేకుండా గడ్డి ఇసుక మీద నడవడం వల్ల పాదాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది కానీ గట్టిగా ఉన్న నేల మీద వాకింగ్ అనేది చేయరాదు ఎందుకంటే దీనివల్ల నొప్పి మంటలు మరింత పెరుగుతాయి వయసు పైబడుతున్న కొద్దీ నరాల బలహీనత మూత్రపిండాల సమస్యలు వలన రక్తహీనత డయాబెటిస్ విటమిన్ బి 12 విటమిన్ బి 1 పాలక్ యాసిడ్ వంటివి వంటివి పాదాల్లో మంటలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు అల్లాన్ని మెత్తగా పేస్ట్ గా చేసి అరికాళ్ళ మంటలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల అరికాళ్ళ మంటల తగ్గటంతోపాటు అరికాళ్ళ చర్మపు పొరలు ఊడటం తగ్గిపోతుంది అలాగే మునగ చెట్టు బెరడు గంధంగా తీసి అరికాళ్ళ పై మూడు పూటలా అప్లై చేయడం వలన అరికాళ్ళ సమస్యలు తగ్గుతాయి అలాగే మందార ఆకుల రసాన్ని కూడా అరికాళ్ళ పై అప్లై చేయడం వలన మంటలు తగ్గిపోతాయి అలాగే మర్రి చెట్టు బెరడు పై కారే పాలను తీసుకొని మూడు పూటలా కాళ్లపై రాయడం వల్ల కూడా ఉపశమనం ఉంటుంది అలాగే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఐస్ గడ్డలు వేసి ఒక 10 నిమిషాలు కాళ్ళ నుంచి నా అరికాళ్ళ మంటలు తగ్గడంతోపాటు వాపు కూడా తగ్గిపోతుంది అలాగే వేడి ఆముదమును పాదాలకు అప్లై చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది కనుక పై పద్ధతులను అనుసరించి మన అరికాళ్ళ సమస్యలు తగ్గించుకొని

 చేతులు మంటలు :
10 గ్రాముల ఆవునెయ్యిలో 5 గ్రాముల మిరియాలు చితగ్గొట్టీవేసి, మరగకాయాలి.చల్లారిన తరువాత ఆ నేయితో మర్ధనా చేస్తూ ఆ నేతినే అన్నంలో కలుపుకొని తింటూ వుంటే మంటలు తగ్గిపోతయ్

అధిక వేడి తగ్గటానికి:

దోరగా వేయించిన ధనియాలపొడి, దోరగా వేయించిన జీలకర్ర పొడి, దోరగా వేయించిన సోంపు పొడి కలిపి ఒక సీసాలో పెట్టుకుని  నీళ్ళలో ఈ పొడిని, సరిపోయేంత పటికబెల్లం, కొన్ని ఎండు ఉసిరి ముక్కలు వేసి వుంచి రోజంతా ఆ నీరు తాగుతూ వుంటే అధిక వేడి తగ్గుతుంది.

లేదా

సబ్జా గింజలు అర చెంచా, అర గ్లాసు నీళ్ళలో వేసి,10 నిముషాల తరువాత అందులో పటిక బెల్లం వేసుకుని తాగితే
15 నిముషాల్లో వేడి దిగిపోతుంది.