వ్యాయామం వలన నొప్పి మాయం

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

వ్యాయామం వలన నొప్పి మాయం
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.


కాళ్ళు భుజాలు కొంచెందూరంగా ఉంచి గోడకు ఆనుకొని నిల్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా గోడకుర్చీ వేసినట్లు కనిపించే విధంగా మోకాళ్ళను నడుముకి 98 డిగ్రీలు ముందుకు ఉండేట్లు క్రిందకు నడుముని జార్చండి. నడుము ముందుకు రాకూడదు. గోడను తాకే ఉండాలి. మళ్ళీ మామూలుగా రండి. ఇలా అయిదుసార్లు చేయండి. బోర్లా పడుకోండి, ఒక కాలు కండరాల్ని గట్టిగా బిగించి పెైకి లేపండి. అలా పెైకి లేపిన కాలుని 10 అంకెలు అనుకునేంతవరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత రెండో కాలుతో కూడా అలాగే చేయండి. అలా ఒక్కో కాలుతో అయిదుసార్లు చేయండి.

వెల్లకిలా పడుకోండి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. చేతులు పక్కకి చాచి పడుకోవాలి. ఒక కాలుని పెైకి లేపాలి. పది అంకెలు లెక్కపెట్టేంత వరకూ అలాగే ఉంచాలి. అలాగే రెండో కాలుతో చేయాలి. ఒక్కో కాలుతోనూ అయిదుసార్లు అలా చేయాలి. అలా చేసేటప్పుడు క్రింద ఉన్న కాలుని నిటారుగా ఉంచలేకపోతే మోకాలు దగ్గర కొద్దిగా వంచండి. రెండో కాలుని ఎత్తండి.ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

వెల్లకిలా పక్క మీద పడుకోండి. కాళ్ళని చాచి నెమ్మదిగా మోకాళ్ళను ఛాతీవెైపు తేవాలి. వాటి వెనుక చేతులుంచి అలా చేతులతో మోకాళ్ళను చాతిని ఎంత దగ్గరగా తేగలరో అంత దగ్గరగా తీసుకురండి. తలని పెైకి లేవనీకండి. కాళ్ళని క్రిందికి తెచ్చిన తరువాత నిటారు చేయకండి. అలా అయిదు సార్లు చేయాలి.కాళ్ళని దూరంగా ఉంచి నిల్చోండి. చేతుల్ని నడుము మీద ఉంచండి. మోకాళ్ళని నిటారుగా ఉంచండి. వీలెైనంత వెనక్కి నడుమును వంచండి. అలా ఆ భంగిమలో ఒకటి, రెండు సెకండ్లు శరీరానుంచి మళ్ళీ మామూలు భంగిమలోకి రావాలి. ఇలా రోజూ చేస్తే నడుముకి మంచింది.ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా నడుమునొప్పి, మెడనొప్పి వస్తుంటాయి. ఒక వేళ మెడలోంచి నొప్పి చేతుల్లోకి ప్రాకినట్టుండటం, తిమ్మిర్లు, మొద్దుబారినట్టుండడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెైద్యుణ్ని కలవాలి.

నడుమునొప్పి కాళ్ళలోకి ప్రాకినా, తిమ్మిర్లెక్కినా మనకు వెన్ను సమస్యలున్నాయన్న అనుమానం రావాలి. నరాల మీద ఏదెైన కారణాల వల్ల వెన్నుపూసలో ఒత్తిడి పడితే, ఆ నరం వెళ్ళే మార్గంలో నొప్పి, తిమ్మిర్లు వస్తాయి.చాలా మంది ఈ సమస్యల్ని పట్టింకోకుండడం చూస్తుంటాం. అలాంటి వాళ్ళలో సమస్య తీవ్రమై శస్త్ర చికిత్స తప్పనిసరవుతుంది. మొదటి స్థాయిలో ఇంటువంటి సమస్యల్ని పసిగట్టు వెైద్యుణ్ని కలవాలి. మొదటి స్థాయిలో గుర్తించే లక్షణాల్ని ‘రెడ్‌ప్లాగ్స్‌’ అంటారు.

ఒక కుర్చీలో నిటారుగా కూర్చొని ఒక కాలుని చాచి, రెండో కాలుని కొద్దిగా పెైకెత్తుతూ అయిదేసిసార్లు ఒక్కో కాలుతోనూ చేయాలి. వీపు అనేటట్లు పడుకోవాలి. మోకాళ్ళను వంచి నెమ్మదిగా తలనెత్తి చేతుల్ని చాచి మోకాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే చేతుల్ని మోకాళ్ళకు తాకుతూ పది అంకెల్ని లెక్కపెట్టాలి. తిరిగి మామూలుగా వచ్చి మళ్ళీ చేయాలి. అలా పదిసార్లు చేయాలి.

* మెడ, నడుమునొప్పి చేతుల్లోకి కాళ్ళలోకి వ్యాపిస్తే వెంటనే వెైద్యుడికి చూపించాలి.
* చేతులూ, కాళ్ళలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారినట్లనిపిస్తున్నా అలసత్వం చేయకూడదు. 
* చిన్నదెైనా పెద్దదెైనా దెబ్బ తగిలినా తర్వాత మెడ, నడుములో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పితో పాటు జ్వరం వస్తే ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చి ఉండవచ్చుననే అనుమానం రావాలి. 
* నొప్పితో పాటు ఆకలి తగ్గినా, బరువు తగ్గినా వెన్నులో ఇన్‌ఫెక్షన్‌ గాని, కణితలు గాని వచ్చి ఉండవచ్చనే అనుమానం రావాలి. కాళ్ళలో గాని, చేతుల్లో గాని కండరాలలో పటుత్వం తగ్గినా, మలమూత్రాల మీద అదుపు తప్పినా, నడకలో మార్పు ఉన్నా వెంటనే వెైద్యుణ్ని సంప్రదించాలి.

చాలా వరకు వెన్ను సమస్యలు మందులు, ఫిజియోథెరపిలతో తగ్గిపోతాయి. 5 శాతం కన్నా తక్కువ మంది రోగుల్లోనే శస్త్రచికిత్సల అవసరముంటుంది. వెన్ను శస్త్రచికిత్స గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయి. వెన్ను శస్త్రచికిత్స జరిపితే కాళ్ళు, చేతులు పడిపోతాయని, ముందుకు వంగిలేకపోవడం బరువులెత్తకపోవడం లాంటివి చేయకూడదని ఎక్కువకాలం బెడ్గరెస్ట్‌ తీసుకోవాలని, నపుంసకత్వం కలగవచ్చని, ఆడవాళ్ళలో ప్రసవ సమయంలో వెన్నుకి మత్తు ఇవ్వడం వల్ల నడుమునొప్పి వసుందని భయాలున్నాయి. వెన్ను వంకర, (స్కోలియోసిస్‌, కైఫోసిస్‌) వస్తుంటే నడుము పెరిగే దాకా ఆగాలనుకుంటారు. అది తప్పు. ఏ వయస్సులో గుర్తిస్తే ఆ వయస్సులోనే శస్త్రచికిత్స చేయడం మంచిది. ఆగిన కొద్దీ వంకర వయసుతో పాటు పెరగవచ్చు. పెరిగే కొద్ది శస్త్రచికిత్స కష్టమవుతుంది.

కొంతమంది మెడకు, నడువుకు వెైద్యుల సలహా లేకుండా మెడకు కాలర్‌లు, నడుముకి బెల్టులు వాడుతుంటారు. ఇది తప్పు, అలా ఎక్కువ కాలం వాడడం వల్ల మెడ, నడుము భాగాల్లో కండరాలు బలహీనపడతాయి. దీంతో వెన్ను సమస్యలు వస్తాయి. అందుకని వెైద్యుల సలహ ప్రకారం ఎన్ని రోజులు పెట్టుకోమంటే అన్ని రోజులే ఆ బెల్టులు వాడాలి. సలహ లేకుండా వీటిని ప్రయత్నించవద్దు.విపరీతంగా నొప్పి ఉందా? బెడ్ రెస్ట్‌ తీసుకుంటే తగ్గిపోతుందని కొందరు నెలల కొద్దీ విశ్రాంతి తీసుకుంటుంటారు. 48 నుంచి 72 గంటలకన్నా ఎక్కువ విశ్రాంతిని తీసుకోవడం మంచిందికాదు. అలా కదలకుండా ఉంటే కండరాలు బలహీనమయి, భవిష్యత్తులో వీటివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మనం సరెైన పద్దతిలో బరువులెత్తకపోయినా వెన్ను నొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కదలకుండా కూర్చున్నా నడుము, మొడ నొప్పి రావచ్చు. పద్దతి ప్రకారం వ్యాయామం చేయకపోయినా, ఊబకాయంవల్లా, మానసిక ఒత్తిళ్ళు, ధూమపానం, సరెైన ఆహారం తీసుకోవకపోవడం వల్లా వెన్ను సమస్యలు రావచ్చు. మనం కూర్చునే కుర్చీల విషయంలో, వాటిలో కూర్చునే విధానంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి. కుర్చీ వెనుక భాకం మెడవరకూ ఉంటే మంచింది. కూర్చున్నప్పుడు మోకాలు తుంటి కన్నా ఎత్తులో ఉండకూడదు. పాదాలు రెండింటిని నేలమీద ఆన్చాలి. లేకపోతే పుట్‌ రెస్ట్‌ మీద ఉంచుకోవాలి. రోజు కనీసం అరగంట పాటు వారంలో అయిదు రోజులు నడవడం లేదా వ్యాయామం చేయాలి. నడక వల్ల నొప్పులు దూరమవడమే కాక, రక్తంలోంచి ఎముకలు కాల్షింని ఎక్కువగా తీసుకుని ఎముకలు గట్టిపడతాయి. సిగరెట్లు లాంటి అలవాట్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము, యోగా, పుస్తకపఠనం, ఆటలు, సంగీతంలాంటివి తోడ్పడతాయి. సమతులాహారాన్ని తీసుకోవాలి. తిరుతిళ్ళు మానేయాలి.

డాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య, స్పైన్‌ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డికాపూల్‌, హైదరాబాద్‌.

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

మోకాళ్ళ నొప్పులు నడివయసేలో
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.


మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి. పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారు.

మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స: 
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం. 
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి, అల్ట్రాసౌండ్‌, ఐ.ఆర్‌.ఆర్‌., ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

గుండె బాగా కొట్టుకుంటుంది. 
శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 
కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూటజ్ఛీట) ఖర్చు అవుతాయి. 
మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది. 
చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది. 
ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది. 
రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు: 
నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి. రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు. బ్రిస్క్‌ వాకింగ్‌.

తీసుకోవలసిన జాగ్రత్తలు: 
ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి. నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు. పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి. వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.

వ్యాయామం: 
మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది. స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది. ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.

ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది. కీళు సులువుగా కదులుతుంది. ఎముకలు బలపడతాయి. బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి. చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.

గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి. సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది. 

ధన్యవాదములు  🙏