11, మే 2021, మంగళవారం

కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకుంటే మీ లో ఉన్న అనే కా సందేహాలపై వాక్సిన్ పై అపోలో హాలు అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి



Corona Vaccine: మొదటి డోసులో కోవ్యాగ్జిన్.. రెండో డోసులో కొవిషీల్డ్ టీకాలు తీసుకోవచ్చా..? వ్యాక్సిన్ వేసుకుంటే ఇతర మెడిసిన్స్ వాడొద్దా..?

‘నేను మొదటి డోసులో కోవ్యాగ్జిన్, రెండో డోసులో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా.? వ్యాక్సిన్ వేసుకుంటే ఇతర వ్యాధులకు వాడుతున్న మందులను ఆపేయాలా? మద్యం తాగొచ్చా‘ అంటూ ఎంతో మంది ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. వాటికి సమాధానాలివే..

Corona Vaccine: మొదటి డోసులో కోవ్యాగ్జిన్.. రెండో డోసులో కొవిషీల్డ్ టీకాలు తీసుకోవచ్చా..? వ్యాక్సిన్ వేసుకుంటే ఇతర మెడిసిన్స్ వాడొద్దా..?

కోవిడ్ తీవ్రతను వ్యాక్సినేషన్ ద్వారా వీలైనంత వరకు అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి 18 ఏళ్లు నిండినవారికి టీకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎన్నో అపోహలు నెలకొన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏదైనా మంచి ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకాలపై నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం

* కోవ్యాగ్జిన్, కొవిషీల్డ్‌లలో ఏ వ్యాక్సిన్ మంచిది? />ప్రస్తుతం దేశంలో ఈ రెండు వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న లబ్ధిదారుల వివరాలను కోవిన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక వ్యాక్సిన్‌ను ఎంచుకునే అవకాశం లేదు. ఇవి రెండూ కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. అందువల్ల రెండింట్లో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం

* మొదటి డోసు ఒక టీకా, రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా? />కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వేర్వేరు పద్ధతుల్లో అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ప్లాట్‌ఫాంలపై ఆధారపడి ఉన్నాయి. కోవాగ్జిన్ ఒక ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్. కొవిషీల్డ్ వైరల్ వెక్టార్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంది. అందువల్ల రెండు టీకాలను కలిపి తీసుకోవద్దు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)

* మొదటి డోసు టీకా తీసుకున్న తరువాత కరోనా సోకితే.. ఎన్ని రోజుల తరువాత రెండో డోసు తీసుకోవాలి? />కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నాలుగు వారాల తరువాత నేరుగా రెండో డోసు తీసుకోవచ్చు. వీరు మరోసారి మొదటి డోసు టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)

* రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే వరకు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలా? />మొదటి డోసు తరువాత ఎప్పుడూ తీసుకునే ఆహారాన్ని కొనసాగించాలి. ఆహారం విషయంలో ప్రత్యేక నియమాలు, డైట్ పాటించాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)

* గర్భిణులు, పిల్లలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? />కరోనా మహమ్మారి గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండో దశలో మహమ్మారి పిల్లలకు కూడా వ్యాపిస్తోంది. కానీ మన దేశంలో ఉపయోగిస్తున్న రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌ను గర్భిణులు, పిల్లలపై నిర్వహించలేదు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ గర్భిణులకు, పిల్లలకు వ్యాక్సిన్లను సిఫారసు చేయలేదు.(ప్రతీకాత్మక చిత్రం)

* ఇంతకు ముందు COVID-19 బారిన పడి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? />గతంలో కరోనా బారిన పడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివల్ల యాంటీ బాడీలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)తగ్గుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)

* టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి? />సాధారణంగా వ్యాధుల నివారణకు తీసుకునే అన్ని రకాల టీకాలు కొద్దిపాటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కొంతమందికి ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, అలసట, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కొన్ని గంటల్లోనే తగ్గిపోతాయి. అందువల్ల దుష్ప్రభావాలకు భయపడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చి

* వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కరోనా సోకదా? />రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీలు 6-12 నెలల వరకు రక్షణకు భరోసా ఇస్తాయి. అయితే టీ-కణాలు ఇచ్చే రక్షణ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇవి కూడా వైరస్‌ను సమర్థంగా నిరోధిస్తాయి. దేశ ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇచ్చిన తరువాత, అదనపు రక్షణ కోసం బూస్టర్ డోస్ ఇవ్వాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

 

కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి? వేసుకున్నవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

webdunia

1. జ్వరంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్​ వేసుకోవద్దు. పూర్తిగా తగ్గిన తర్వాతనే వేసుకోవాలి.
 


2. అలర్జీల లాంటివేవైనా ఉంటే తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్​ వేసుకోవాలి.
 
3. మొదటి డోసు వేసుకున్న తర్వాత ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే రెండో డోసు వేసుకోకూడదు.
 
4. బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారు, రోగనిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్​ వేసుకోకపోవడమే మంచిది.
 
5. బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
 
6. బ్లీడింగ్​ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్​ వేసుకోవాలి.
 
Ads by 
7. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్లు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
 
8. హెచ్​ఐవీ పేషెంట్లు, రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య ఉన్నవారు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
 
9. డయాబెటిస్, బీపీ​ అదుపులో ఉంటేనే వ్యాక్సిన్​ వేసుకోవాలి.
 
10. క్యాన్సర్​ రోగులు, కీమో థెరపీ చేయించుకున్నవారు డాక్టర్ల సలహా ప్రకారం నడుచుకోవాలి.
 
వ్యాక్సిన్ వేసుకున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
 
1. వ్యాక్సిన్​ వేసిన చోట నొప్పి, జ్వరం వంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయి. భయపడకూడదు.
 
2. చలి, ఆలసట, ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే ఇవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.
 
3. టీకా వేసుకున్న తర్వాత కూడా యథావిధిగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే.
 
4. వ్యాక్సిన్​ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేషన్​ బారిన పడకుండా ఉంటుంది. అలాగే సైడ్​ ఎఫెక్ట్​లను తగ్గిస్తుంది.
 
5. ఆల్కహాల్​ తీసుకోకూడదు. వ్యాక్సిన్​ తీసుకున్నవారు నెలన్నర రోజులకు పైగా మద్యం ముట్టరాదు. తాగితే లింఫోసైట్​ కణాలు సగానికి సగం పడిపోతాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్​ దెబ్బతింటుంది.
 
6. ప్రాసెసింగ్​ ఫుడ్​, జంక్​ ఫుడ్​ తీసుకోవద్దు. మంచి తృణధాన్యాలతో కూడిన బలవర్ధకమైన హెల్దీ ఫుడ్​ తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి.
 
7. వ్యాక్సిన్​ వేసుకున్న తర్వాత మూడు నెలలు పిల్లలను కనకుండా జాగ్రత్త పడాలి. అంటే కండోమ్​ ధరించి మాత్రమే సెక్స్​లో పాల్గొనాల్సి ఉంటుంది. లేకుంటే గర్భం వస్తే పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్​ పడే అవకాశం ఉంటుంది.





9, మే 2021, ఆదివారం

కోవినావైరస్ ఉన్న వరుకు ఆవిరి పట్టడం వల్ల నా ఉపయోగం ఏమిటి అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?అవగాహనా కోసం నవీన్ నడిమిటి సలహాలు 

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్‌ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్‌ సోకుతుందా? తదితర అనుమానాలను కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టీ శంకర్‌ నివృత్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

ఆవిరి మంచిదే

ఆవిరి పట్టడం మంచిది కాదా?

జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నపుడు పసుపు,ఆకుపచ్చని ట్యాబ్లెట్లతో ఆవిరి పట్టడం మంచిదే. ఆవిరి వల్ల ముక్కులో, గొంతులో, శ్వాస నాళాల్లో చేరిన వైరస్‌లు ఏవైనా అంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నా ఆవిరి పట్టడం మంచిదే.

వాసన కోల్పోతే వ్యాధి తీవ్రత ఎంత ఉంటుంది?

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

కరోనా సోకిన వారిలో మొదట జ్వరం, ముక్కు, గొంతుకు సంబంధించి లక్షణాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటివి కనిపిస్తాయి. 4, 5 రోజుల తర్వాత వాసన తెలియకపోవటాన్ని చాలామందిలో గుర్తిస్తున్నారు. కరోనా సోకిన వారం తర్వాత వాసన సాధారణ స్థితికి వస్తుంది. వాసన పోయిందని చెప్తున్నవారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. గొంతులో నొప్పి, గొంతు గరగర, ఇతర వ్యాధి లక్షణాలున్నట్టు అనిపిస్తే టెస్ట్‌ల కోసం పరుగెత్తకుండా వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు టెస్ట్‌లు చేయించుకోవాలి. మందులు వాడాలి. శ్వాస తీసుకోవటంలో తేడాలుంటే మాత్రం దవాఖానలో చేరాలి.

ఆవిరి పడితే కరోనా చావదు.. ఈ ఆహారం తీసుకుంటే.. గోరువెచ్చని నీటిని..?

webdunia

కరోనా వైరస్ లక్షణాలు మారుతూనే వస్తున్నాయి. జలుబు, దగ్గు వంటి రుగ్మతలు కోవిడ్ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ జలుబు, దగ్గు మాత్రమే కోవిడ్ లక్షణాల్లో బేసిక్ కాదని.. రుచి తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏర్పడటం వంటివి కూడా కోవిడ్ లక్షణాల్లో ప్రధానమని వైద్యులు చెప్తున్నారు. అయితే తాజాగా ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ చనిపోతుందని వార్తలు వస్తున్న

 
ఈ వార్తల్లో నిజం లేదని కరోనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌లో ఆవిరి పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు. కరోనా వైరస్ ఇంటి చిట్కాలతో తొలగిపోదని చెప్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు తొలగిపోతాయని మాత్రమే చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు నుంచి ఆవిరి పట్టడం ద్వారా కాస్త ఉపశమనం మాత్రమే లభిస్తుందని.. కానీ వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
 
అయితే ఆయుర్వేద వైద్యులు మాత్రం వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు. గోరువెచ్చని నీటిని సేవించడం.. ద్వారా జలుబు దరి చేరదు అంటున్నారు. తద్వారా ఊపిరి తీసుకునే సమస్యలు వుండవంటున్నారు. కరోనా దరిచేరకుండా వుండాలంటే.. వారంలో కనీసం మూడు సార్లు ఆవిరి పడితే మంచిదని అంటున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు రోజుకు ఒకసారి, బయటకు వెళ్లి కూరగాయలు కొనేవాళ్ళు రెండుసార్లు, ఆఫీస్‌కు వెళ్లే వాళ్ళు మూడుసార్లు ఆవిరి పట్టాలని చెప్తున్నారు. 
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్‌ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. 
webdunia
 
పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొ



*ఆవిరి పట్టాలా... పట్టకూడదా...*


*మీరు త్రాగే వేడినీరు మీ గొంతుకి మంచిది.*


*కానీ ఈ కరోనా వైరస్ మీ ముక్కు యొక్క పారానాసల్ సైనస్ (ముక్కుకి సమీపమున వుండే ఖాళీ స్థలం) వెనుక 3 లేదా 4 రోజులు దాగి వుంటుంది.*


*మనము త్రాగే వేడినీరు అక్కడకి చేరదు*.


*4 లేదా 5 రోజుల తర్వాత పారానాసల్ వెనుక దాగి వున్న ఈ వైరస్ మీ ఊపిరితిత్తులకు చేరుతుంది*


*అప్పుడు మీకు శ్వాశ సమస్య వస్తుంది.(ఊపిరి పీల్చటంలో సమస్య)*


*అందువలన ఆవిరి పట్టుకోవటం చాలా అవసరం*                   


*అది పారానాసల్ సైనస్ వెనుక భాగానికి చేరుతుంది.*


*మీరు ముక్కులో వున్న ఈ వైరస్ ని ఆవిరితో చంపెయ్యాలి.*


*50 డిగ్రీల వద్ద ఈ వైరస్ నిలిపివేయబడుతుంది లేదా స్థంభించిపోతుంది.*


*60 డిగ్రీల వద్ద ఈ వైరస్ చాలా బలహీన పడుతుంది*. 

*అప్పుడు ఏ మానవునిలో వున్న వ్యాధి నిరోధకశక్తి అయినా దీనితో* *పోరాడగలుగుతుంది*.

*70 డిగ్రీల వద్ద ఈ వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది.*


*ఆవిరి చేసే పని ఇది.*


*ప్రజలందరికీ మరియు* *ఆరోగ్య శాఖకి* 

*ఈ విషయం తెలుసు*.


*కానీ చాలామంది ఈ మహమ్మారిని ఒక అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు.*


*కాబట్టి వాళ్ళు ఈ సమాచారాన్ని బహిరంగంగా చెప్పరు.*


*ఇంటిదగ్గరే ఉండేవారు రోజుకి ఒకసారి ఆవిరి పట్టుకోవాలి.*


*ఒకవేళ మీరు సరుకులు, కూరగాయలు ఇలాంటివి కొనటానికి మార్కెట్ కి వెళ్తే రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టుకోవాలి.*


*కొంతమందిని కలిసేవాళ్ళు లేదా ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి.*


*ఆవిరి వారము*

*డాక్టర్లు చెప్పేదాని ప్రకారము ముక్కు మరియు నోటి ద్వారా ఆవిరి పీల్చటం వల్ల కోవిద్ -19 ని చంపబడుతుంది, కరోనా వైరస్ తొలగించబడుతుంది.*


*ఒకవేళ ప్రజలందరూ ఒక వారము రోజులు ఆవిరి ప్రచారాన్ని చేపడితే ఈ మహమ్మారి అంతమయిపోతుంది.*


*కాబట్టి ఒక సలహా:*


*ఉదయం మరియు సాయంత్రం ప్రతి సారీ ఒక 5 నిమిషములు ఆవిరి పీల్చే పద్ధతిని వారము రోజులు మొదలు పెడదాము.*


*ఒకవేళ మనమందరమూ ఈ పద్దతిని ఒక వారం రోజుల పాటు అనుసరించగలిగితే ప్రాణాంతకమైన కోవిద్ - 19 తుడిచి వేయబడు తుంది.*


*ఈ పద్దతి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వుండవు మరియు ఖర్చు కూడా వుండదు.*

*ఆలా చేస్తే మనమందరమూ కలసి ఈ కరోనా వైరస్ ని కట్టడిచెయ్యొచ్చు.*


*గమనిక: మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఆవిరి పట్టకండి ప్రమాదం అంటూ వైరల్ అయ్యింది..అందుకోసం ప్రముఖుల సలహా తీసుకొని ఈ పోస్టింగ్ పెట్టడం జరిగింది..*

కాలయాపన కోసం గ్రూప్ లో చేరవద్దు..మీ సమస్య లకు ఆయుర్వేద అల్లోపతి పరిష్కారం ఉచితంగా ఇస్తాను.మీ రిపోర్ట్స్ పంపినట్లు అయితే మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను.ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీరిచ్చే సూచన ఏంటి?

భయం మనిషిని కుంగదీస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి బయట పడేందుకు జాగ్రత్తలతో పాటు ధైర్యం కూడా చాలా అవసరం. రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. భౌతికదూరం పాటిస్తూ, మాస్కు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయించుకోవాలి.

– ధన్యవాదములు 🙏

నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

7, మే 2021, శుక్రవారం

నిద్రలో మూత్ర సమస్య నివారణకు అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి



పక్క తడపడం అంటే ఏమిటి?

పక్క తడపడం, దానినే రాత్రి సమయ నిగ్రహరాహిత్యం (night-time incontinence) లేదా నిద్రలో మూత్ర విసర్జన (nocturnal enuresis) అని కూడా పిలుస్తారు, ఇది నిద్రలో పునరావృత్తమైయ్యే అసంకల్పిత మూత్ర విసర్జన వ్యాధి. ఇది సాధారణంగా 5 నుండి 7 ఏళ్ళ వయస్సు తర్వాత జరుగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాఠశాల వయస్కులైన పిల్లల్లో కనిపించే ఒక సాధారణ పరిస్థితి. పిల్లలు మరియు యుక్తవయస్కులలో పక్క తడపడం సాధారణం అయినప్పటికీ, ఇది భారతదేశంలో తగినంతగా నివేదించబడలేదు. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి 1.4% -28% గా ఉంది. భారతదేశంలో దీని ప్రాబల్యం 7.61% -16.3% గా ఉంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిల్లలు సాధారణంగా 5 ఏళ్ళ నాటికి మూత్ర విసర్జన ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు, కానీ పూర్తిగా మూత్రాశయ నియంత్రణ పొందడానికి ఏ విధమైన స్థిర వయస్సు లేదు. కొంతమంది పిల్లలు 5 మరియు 7 సంవత్సరాల మధ్య ఈ సమస్యను ఎదుర్కొంటారు. వైద్యుల దృష్టికి తీసుకు వెళ్ళవలసిన సంకేతాలు మరియు లక్షణాలు:

  • పిల్లలు 7 సంవత్సరాల తర్వాత కూడా మంచం తడుపుతుంటే.
  • పక్క తడపడం మానివేసిన కొన్ని నెలలు తర్వాత మళ్ళి మొదలుపెడితే.
  • బాధాకరమైన మూత్రవిసర్జన, గులాబి లేదా ఎరుపు రంగులో మూత్రం, అధిక దాహం, గట్టి మలం లేదా గురక పెడుతుంటే.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ వాటిలో కొన్ని ఈ కింది కారణాలు కావచ్చు:

  • చిన్నమూత్రాశయం: మూత్రాశయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు.
  • మూత్రాశయం నిండిందని అని తెలుసుకోలేకపోవటం: మూత్రాశయాన్ని నియంత్రించే నరములు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటే, నిండిన మూత్రాశయం పిల్లవాడిని నిద్ర నుండి మేల్కొనేలా చెయ్యదు.
  • హార్మోన్ల అసమతుల్యత: రాత్రుళ్లు మూత్రం ఆలస్యంగా ఏర్పడెలా చేసే యాంటి డైయ్యూరెటిక్ హార్మోన్( antidiuretic hormone ) (ADH) తగినంత లేనప్పుడు.
  • మూత్రాశయ సంక్రమణ (infection): సంక్రమణ (infection) వలన మూత్రాన్ని నియంత్రించడంలో పిల్లవాడికి కష్టంగా ఉండవచ్చు. (మరింత సమాచారం: యూటిఐస్ చికిత్స (UTIs treatment))  
  • స్లీప్ అప్నియా(Sleep apnoea): పెద్ద టాన్సిల్స్ లేదా అడెనాయిడ్ల కారణంగా నిద్రపోయినప్పుడు శ్వాస నిరోధించబడుతుంది.
  • మధుమేహం: బిడ్డ సాధారణంగా రాత్రి పక్క తడపనప్పుడు, మధుమేహం ఒక మొదటి కారకం కావచ్చు.
  • దీర్ఘకాలిక మలబద్ధకం: దీర్ఘకాల మలబద్ధకం మూత్రపిండాల పనితీరును తగ్గించగలదు.
  • ఒత్తిడి: భయాన్ని ప్రేరేపించే ఒత్తిడి కూడా పక్క తడపడాన్ని ఉత్తేజపరచవచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మీ బిడ్డ యొక్క మూత్రవిసర్జన క్రమాన్ని తెలుసుకొనమనవచ్చు, మరియు డైరీని నిర్వహించమని అడగవచ్చు.

గమనించదగ్గ అంశాలు:

  • మూత్ర విసర్జన తరచుదనం
  • మల విసర్జన తరచుదనం మరియు చిక్కదనం
  • నిద్రపోయే సమయంలో ద్రవం తీసుకోవడం

ఈ పరీక్షలు ఉండవచ్చు:

  • మూత్ర సూక్ష్మజీవుల సాగు మరియు విశ్లేషణ: సంక్రమణ (infection), మధుమేహం, రక్తం యొక్క జాడలు లేదా ఏ ఇతర పదార్ధాల యొక్క తనిఖీ కోసం.
  • రక్త పరీక్షలు: రక్తహీనత, మధుమేహం, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర పరిస్థితుల తనిఖీ కోసం.
  • మూత్రాశయ అల్ట్రాసౌండ్: మూత్ర విసర్జన తర్వాత మూత్రంలో ఎంత మూత్రం మిగిలివుందో తెలుసుకోవడానికి.
  • మూత్రపిండ పరీక్ష(Urodynamic testing): మూత్రం యొక్క నిల్వ మరియు ఎలా ప్రవహిస్తుందో పరిశీలించడానికి.
  • సిస్టోస్కోపీ (Cystoscopy): మూత్రాశయంలోని కెమెరాను పెట్టడం ద్వారా మూత్రాశయ పరిస్థితులను తనిఖీ చెయ్యడం కోసం.

పక్క తడపడం ఒక ప్రధాన సమస్య కాదు అది పిల్లల అభివృధ్ధి దశను సూచిస్తుంది, కానీ పిల్లలు అసహనంతో మరియు తక్కువ స్వీయ-గౌరవంతో బాధపడతారు. ఈ పరిస్థితిని సరిదిద్దడంలో తల్లిదండ్రులూ నిస్సహాయతను ఎదుర్కుంటారు.

నిర్వహణ అనేది ఈ క్రింది వాటిని కలిగి:

  • తల్లిదండ్రులు మరియు పిల్లలకు మరియు పక్క తడపడాన్ని నయం చేయవచ్చని సలహా ఇవ్వడం.
  • ADH కు సమానమైన ఒక ఔషధాన్ని వైద్యులు సూచించవచ్చు, ఇది ADH వంటి ప్రభావాలను అందిస్తుంది మరియు యాంటీడిప్రేంట్, మూత్రాశయాన్ని విశ్రాంతపరచేది సూచించవచ్చు.

మందులు లేని పద్ధతులు: ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

  • వాడిపడేసే లేదా పునర్వినియోగపరచదగిన పీల్చుకునే లోదుస్తులు.
  • పక్క తడపడాన్ని సూచించే మొయిస్టుర్ అలరాలు (Moisture alarms).

స్వీయ రక్షణ చిట్కాలు:

  • రోజులో ఉదయం పూట పిల్లలు ద్రవం ఎక్కువ తీసుకునేలా చేసి సాయంత్రం ద్రవం పరిమితిగా తీసుకునేలా ప్రయత్నించాలి.
  • నిద్రపోయే ముందు పిల్లవాడితో మూత్ర విసర్జన చేయించాలి.
  • బిడ్డను ప్రోత్సహించండి, తద్వారా అతను / ఆమె సౌకర్యవంతంగా మరియు నమ్మకంగా ధైర్యంగా ఉంటారు.
  • మీ బిడ్డ మూత్రవిసర్జన చేసినా, తిట్టడం లేదా శిక్షించకూడదు లేదా అది ప్రయోజనం ఇవ్వదు.
  • షీట్లను శుభ్రపరిచేటప్పుడు మీ బిడ్డను సహాయం చేయమని ప్రోత్సహించండి, అందువలన అతను / ఆమె సౌకర్యంగా ఉంటారు

పక్కతడుపుట కొరకు అల్లోపతి మందులు


Medicine NamePack Size
D VoidD Void 0.01% Spray
SycodepSycodep 2 /25 Tablet
ADEL 28 Plevent DropADEL 28 Plevent Drop
MinirinMinirin Melt 0.1 Tablet
ToframineToframine 2 Tablet
Allen A71 Urinary Tract Infections DropAllen A71 U.T.I. (Urinary Tract Infections) Drop
ADEL 29 Akutur DropADEL 29 Akutur Drop
SBL Eschscholtzia californica DilutionSBL Eschscholtzia californica Dilution 1000 CH
TrikodepTrikodep Tablet
Trikodep ForteTrikodep Forte Tablet

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి 

6, మే 2021, గురువారం

ఊపిరితిత్తుల పైన కరోనా దాడి పూర్తి వివరణ అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి? అవగాహనా కోసం లీంక్స్ లో చూడాలి 

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

క‌రోనా వైర‌స్ ప్ర‌ధాన టార్గెట్ ఊపిరితిత్తులేనా! ఎందుకంటే కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌నే ఇబ్బంది ప‌డుతున్నారు ! నిజానికి వైర‌స్ చాలావ‌ర‌కు మ‌న గొంతు ద్వారానే శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు చేరుతుంది. కాబ‌ట్టి ముందుగా వాటిపైనే ప్ర‌భావం చూపిస్తుంది. దీనివ‌ల్ల శ్వాస‌మార్గంలో ఇన్‌ఫెక్ష‌న్ ఏర్ప‌డి శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. గొంతు నొప్పి, పొడి ద‌గ్గు వస్తోంది. క‌రోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలే క‌నిపిస్తాయి. కొంత‌మందిలో న్యుమోనియా ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌ను కాపాడుకోవ‌చ్చు. క‌రోనావైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డేస‌రికే 25 శాతం వ‌ర‌కు లంగ్స్ దెబ్బ‌తింటాయి. కాబ‌ట్టి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ఆల‌స్యం చేయకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం ద్వారా క‌రోనా నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?

శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైర‌స్ ప్ర‌వేశించింద‌ని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువ‌గా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, ద‌గ్గుతున్న‌ప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.

ఇత‌ర స‌మ‌స్య‌లు ఏముంటాయి

కొవిడ్‌-10 కార‌ణంగా న్యుమోనియా రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ వైర‌స్ కార‌ణంగా న్యుమోనియా వ‌స్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్ర‌వంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వ‌స్తుంది. దీనివ‌ల్ల తీవ్ర‌త ద‌గ్గు రావ‌డంతో పాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మైపోతుంది.

ఊపిరితిత్తుల పనితీరును ఎలా మెరుగుపరచాలి..?

ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్ర‌ధానంగా వాటి సామ‌ర్థ్యం, ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఊపిరితిత్తుల ప‌నితీరు బాగుంటేనే శ‌రీరానికి కావాల్సిన ఆక్సిజ‌న్ స‌క్ర‌మంగా అందుతుంది. కాబ‌ట్టి ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డాలంటే వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ వ‌ల్ల శ్వాస తీసుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది. త‌ద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫ‌లితంగా ఊపిరితిత్తులు ఆక్సిజ‌న్‌ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెరుగుతుంది. కాబ‌ట్టి ప్ర‌తిరోజు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయ‌డం మంచిది. పెద్ద‌లు అయితే క‌నీసం 30 నిమిషాలు, పిల్ల‌లు అయితే గంట పాటు వ్యాయామం చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

లంగ్స్‌లో దీర్ఘ‌కాలిక మంట త‌గ్గాలంటే స‌రైన పోష‌కాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయలు తినాలి. అర‌టి పండ్లు, యాపిల్‌, ద్రాక్ష‌, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.


కరోనా వైరస్ బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవడం ఎలా?నవీన్ నడిమింటి సలహాలు 

కరోనా వైరస్ సోకితే అది మనిషి శరీరంలో శ్వాస వ్యవస్థను బలంగా దెబ్బతీస్తోంది. దీంతో మనిషికి ఆక్సిజన్ మరింత అవసరమవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన శరీరంలోని ఊపిరితిత్తులను బలంగా చేసుకోవాలి. ఏ వైరస్ వచ్చినా తట్టుకుని నిలబడేలా చూసుకోవాలి. దీని కోసం ప్రతిరోజు 30 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్లి.. ప్రాణవాయువు లోపలకు వస్తుందని తెలిపారు. దీని వల్ల శరీరం ఉత్తేజంగా మారి రక్తం శుభ్రపడుతుందని పేర్కొన్నారు. ప్రాణాయామాన్ని ముఖ్యంగా మూడు పద్ధతుల్లో చేస్తారు. అవి కనిష్ఠ ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామం, ఉత్తమ ప్రాణాయామం.

1) కనిష్ట (అధమ) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చుని నిరంతరాయంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకోవాలి. దీన్నే పూరక అంటారు. ఉదర కింది భాగం ఉబ్బేట్టుగా కింది ఊపిరితిత్తులోకి శ్వాస తీసుకోవాలి. శ్వాస బయటకు విడిచే ముందర కాసేపు అలాగే ఉండాలి. బయటకు శ్వాస విడిచేటపుడు నెమ్మదిగా పొట్టలోకి తీసుకోవాలి. మళ్లీ శ్వాసలోనికి తీసుకోవటానికి ముందు కొద్ది క్షణాలు అలాగే ఉండి.. అప్పుడు లోపలకు శ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి

2) మధ్యమ ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవాలి. ఈ పద్దతిలో శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఛాతి మాత్రమే ఉపయోగించాలి. శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి వదలాలి. పొట్టభాగం అసలు కదలకూడదు.

3) ఉత్తమ (ఆద్య) ప్రాణాయామం
ఈ పద్ధతిలో వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీస్తూ భుజాలు పైకి లేపాలి. ఊపిరిని పైనున్న ఊపిరితిత్తులలోకి నింపాలి. చాలా అరుదుగా వాడే ఈ భాగం ఇలా చేయడం వల్ల సక్రమంగా పనిచేస్తుంది.

కనిష్ట, మధ్యమ, ఉత్తమ ప్రాణాయామాలు కలిసి చేయడమే పూర్ణయోగ శ్వాసక్రియ. ఈ పద్ధతిలో శ్వాస తీసుకునే సమయంలో అధమ, మధ్యమ, ఆద్య క్రియలు వరుసగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో గాలిని తీసుకోగలుగుతాయి. ప్రాణాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వాన్ని కూడా సాధించవచ్చు. ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చేయాలని

2, మే 2021, ఆదివారం

పిల్లలు లో కరోనా ఎలా గుర్తు పట్టాలి పిల్లలు విషయం లో తీసుకోవలిసిన జాగ్రత్త ఏమిటి లీంక్స్ లో చూడాలి

పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

children corona cases

పిల్లల్లో కరోనా ఎలా గుర్తించాలి? కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?

కరోనా ఫస్ట్​ వేవ్​ కన్నా సెకండ్​ వేవ్​ వరస్ట్​గా బీహేవ్​ చేస్తోంది. కరోనా పిల్లలకు సోకదు.. వారిలో ఇమ్యూనిటీ పవర్​ ఎక్కువుంటుంది అనుకుని ధైర్యంగా ఉన్నాం అందరం.. అయితే పాత కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపకున్నా.. కొత్త​ కరోనా వారిపై కూడా ప్రతాపం చూపుతోంది. ఇప్పడు 18ఏండ్ల లోపున్న పిల్లలు కరోనా బారిన భారీగానే పడుతున్నారు. కేసులు ఎక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.

ఇప్పుడెందుకిలా?

జనవరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పిల్లలంతా స్వేచ్ఛగా బయట ఆడుకోవడం మొదలుపెట్టారు. యూత్​ కూడా బయట ఇష్టారాజ్యంగా తిరిగారు. అయితే ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి. ఓపెన్​ ప్లేసుల్లో రద్దీ పెరగడం, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకపోవడం, కొత్త కరోనాకు వేగంగా వ్యాపించే గుణం ఉండడమే కేసుల పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది.

పిల్లలు, టీనేజర్లలో కరోనా లక్షణాలు ఇలా ఉంటాయి..

పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి కరోనా సోకిన పిల్లల్లో ప్రధాన లక్షణాలు. వీటిత పాటు వాంతులు విరేచనాలు, తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే కచ్చితంగా కరోనా సోకిందని భావించాలి. చిన్నారులు నొప్పిగా ఉందని చెప్పరు కాబట్టి.. వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నా.. నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.
వీరు కూడా రుచి, వాసన కోల్పోతారు. అయితే పిల్లలు చెప్పలేరు. సరిగ్గా అన్నం తినకపోతే వారు రుచి, వాసన కోల్పోయినట్లుగా అనుమానించాలి. అయితే పిల్లలకు కరోనా సోకినా ఫాస్ట్​గానే క్యూర్​ అవుతారు. ఐసీయూలో ఉంచాల్సిన అవసరం రాదని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా లక్షణాల్లో మరి కొన్ని కీలక లక్షణాలను వారు చెబుతున్నారు. అవి ఏంటంటే.. చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడడం, వేలు గోర్లు లేదా బొటనవేలు నీలం రంగులోకి మారడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

టెస్టులు చేయించవచ్చా..? చికిత్స ఎలా తీసుకోవాలి?

చాలా వరకు పెద్దల లాగా వీరికి చికిత్స అవసరం పడదు. వ్యాధి లక్షణాలు కనపడితే టెస్టులు చేయించాల్సి ఉంటుంది. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్​ ను సంప్రదించాలి. ఒక వేళ తేలికపాటి లక్షణాలే ఉంటే ఇంట్లోనే ఉంచండి. హాస్పిటల్​కు తీసుకెళ్తే అక్కడుండే వారి వలన పిల్లలకు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే ఆన్​లైన్​లో డాక్టర్​ను సంప్రదించడం మంచిది. జ్వరం ఉన్న పిల్లలకు ఏ సమయంలో ఎంత ఉందో రాసుకోవాలి. అలాగే ఆక్సిజన్​ లెవల్స్​, పల్స్​ రేటు, వాంతులు, విరేచనాలు.. ఇతర వ్యాధి లక్షణాలు రాసి పెట్టుకోవాలి. ఆక్సిజన్​ లెవల్​ 94కంటే తగ్గిపోతే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు ఉన్న పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వారికి వేగంగా కోలుకునే శక్తి ఉంటుంది.

కరోనా సోకిన తల్లి పాలు ఇవ్వొచ్చా?

కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్న తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకోవచ్చు. మాస్క్​ పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించి పాలు కూడా ఇవ్వొచ్చు. ఎందుకంటే తల్లిపాల నుంచి బిడ్డకు వైరస్​ సోకే అవకాశం చాలా తక్కువే. అయితే తల్లి పాలు తాగిస్తే నష్టం కంటే లాభాలే ఎక్కువుంటాయి.

పిల్లలకు వ్యాక్సిన్​?

ప్రస్తుతానికైతే పిల్లలకు ఏ దేశంలో కూడా వ్యాక్సిన్​ ఇవ్వడం లేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. 12–15సంవత్సరాల పిల్లలకు తమ వ్యాక్సిన్​ వేసుకుంటే వంద శాతం రక్షణ ఉంటుందని అమెరికన్​ సంస్థ ఫైజర్​ ప్రకటించింది. 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్​ అందించేందుకు రిసెర్చ్​ చేస్తున్నట్లు అస్ట్రాజెనికా చెప్పింది.

రిక్వెస్ట్​: నచ్చితే లైక్​ కొట్టండి.. వీలయితే కామెంట్​ పెట్టండి.. దోస్తులకు షేర్​ చేయండి.  మరిన్ని వార్తలకు గూగుల్​లో  maatamuchata. com సెర్చ్​ చేయండి