6, సెప్టెంబర్ 2021, సోమవారం

మూత్రం సమస్య పై అవగాహనా కోసం ఈ లింక్స్ లో చుడండి

మూత్ర సమస్య ఉందా.. ఇలా చేస్తే తగ్గుతుందట..అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


మూత్రపిండాలు రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుంటాయి. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థమే మూత్రం. ఆ మూత్రం మూత్రాశయం (బ్లాడర్‌)లో నిల్వ ఉంటుంది. మూత్రాశయం సామర్థ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. కానీ, చాలావరకు అది మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేసేస్తుంటాం.

    

ప్రధానాంశాలు:

  • అనేక కారణాలతో అతి మూత్ర సమస్య
  • కొన్ని చిట్కాలతో సమస్య దూరం



మూత్రాశయం నిండినప్పుడు ఆ విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం లీకవుతూ ఉంటుంది.
undefined
అతి మూత్రం సమస్య ఎలా తెలుస్తుంది?

✿ ఒక మనిషి రోజులో 8 కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తే అతి మూత్రం సమస్య ఉన్నట్లే
✿ రాత్రిపూట ఒకటి, రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు మూత్రం పోసేందుకు నిద్ర లేవడం
✿ ఉన్నట్టుండి అర్జెంటుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రం ఆపులేకపోవడం
✿ లోదుస్తుల్లోనే మూత్రం లీక్ కావడం

అతి చురుకైన మూత్రాశయం ఉన్నవారు వెంటనే రెస్ట్ రూమ్‌కు వెళ్లాలని భావిస్తుంటారు. ఒకవేళ వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనే ఫీలింగ్ కలిగి ఉంటారు. అయితే అతి చురుకైన మూత్రాశయం కలిగిన వారిని వైద్యులు రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది పొడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం. రెండోది తడి కలిగిన అతి చురుకైన మూత్రాశయం.


అతి మూత్రం సమస్య ఉన్న వారిలో మూడింట రెండొంతుల మంది పొడి రకాన్ని కలిగి ఉంటారు. వీళ్లకు మూత్రం లీక్ కావడం వంటి సమస్య ఉండదు. అదే తడి రకాన్ని కలిగి ఉండే వారిలో తెలియకుండానే మూత్రం లీక్ అవుతూ ఉంటుందని, ఒకవేళ కాకపోయినా లీక్ అయిందనే భావనలో ఉంటారని వైద్యులు చెప్తున్నారు.
undefined
దగ్గినా, తుమ్మినా మూత్రం చుక్కలుగా పడుతోందని పలువురు చెప్తుంటారు. ఈ సమస్య ఎక్కవగా ఆడవారిలో వస్తుంది. సుమారు 50 శాతం మంది మహిళలు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు. సాధారణంగా 40,50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య కనపడుతుంది. ఊబకాయుల్లో, ఎక్కువమంది సంతానం కన్నవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా మూత్రం లీక్ అవుతుంది. అయితే మూత్రం తరచుగా లీక్ అవుతున్నా, నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా వారికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. టెన్షన్ ఫ్రీ వజైనల్ టిప్ (టీవీటీ) పద్ధతిలో మూత్రమార్గం కింద టేపులాంటిది అతికిస్తారు. కొందరికి ల్యాప్రోస్కోపీ సాయంతో కాల్పోసస్పెన్షన్ కూడా చేస్తారు.
గంటకు గంటకు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు వాపోతుంటారు. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేయవచ్చు. ఇన్‌ఫెక్షన్ కారణంగా కూడా అతిగా మూత్రానికి వెళ్లాల్సి రావొచ్చు. ప్రొస్టేట్ ఉబ్బు, స్ట్రిక్చర్, స్టినోసిస్ వంటి సమస్యల్లో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాదు. దీంతో మూత్రాశయం నిండి తరచుగా మూత్రం రావొచ్చు. క్షయ, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వల్ల అతిమూత్రం సమస్య ఏర్పడుతుంది. కొందరిలో మూత్రాశయ కండరం అతిగా స్పందించడం కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. మూత్రాశయం అతిగా స్పందించేవారికి యాంటీ కొలనర్జిక్ మందులు ఉపయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు ఏమీ కలగవు. కొందరికి నోరు ఎండిపోవడం, మలబద్ధకం వంటివి తలెత్తే అవకాశం ఉంది.

చాలా మంది వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని వైద్యులు చెప్తున్నారు. వయసుతో పాటు వచ్చే ప్రొస్టేట్ ఉబ్బు వంటి ఇతర సమస్యలే అతి మూత్రానికి కారణమవుతుందని వారు వెల్లడిస్తున్నారు. రాత్రి పూట మూత్రానికి ఎక్కువ సార్లు లేవడం వల్ల నిద్ర బాగా దెబ్బతింటుంది. దీంతో మరుసటి రోజు ఉదllయం బద్ధకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. జీవనశైలి మార్చుకోవడంతో ఈ సమస్యకు మంచి ఫలితం కనపడుతుంది.


✿ రాత్రిపూట 7 గంటల తర్వాత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోకూడదు. చాలామంది రాత్రి పడుకునేముందు పాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు. దీంతో వారికి రాత్రిళ్లు ఎక్కువ మూత్రం వస్తుంది. మద్యం తీసుకోవడం కారణంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు.
✿ అధిక బరువు తగ్గించుకోవాలి. ఎందుకంటే అధిక బరువు మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది
✿ దూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే పొగ కారణంగా మూత్రాశయంపై ఎక్కువ ప్రభావం పడి సమస్య ఏర్పడుతుంది
✿ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా అతిమూత్రం సమస్యను పరిష్కరించవచ్చు

undefinedహైలురానిక్ యాసిడ్ వాడుతున్నారా..
అతి మూత్రం సమస్యను పరిష్కరించే కొన్ని చిట్కాలు:

✿ ఉసిరి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఉసిరి మూత్రాశయాన్ని క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మూత్రాశయ కండరాలను ఉసిరి బలంగా చేస్తుంది. దీంతో సమస్య దూరమవుతుంది.

✿ కుంకుడు కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా ఓ వారం చేస్తే అతి మూత్ర సమస్య కంట్రోల్‌లోకి వస్తుంది.
✿ జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వత వడగట్టి అందులో తేనెను కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే అతి మూత్రం సమస్య తగ్గుతుంది
✿ ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. తరచూ ఇలా చేస్తే అతి మూత్రం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
✿ నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిలో బెల్లం కలిపి లడ్డూల్లా చేసి ఈ సమస్యని దూరం చేసుకోండి.

గమనిక: 
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి

రోజ ఇలా చేస్స అదుపులో ఉంటుంది


డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? అయితే, జాగ్రత్త. కరోనా వేళ.. మధుమేహ బాధితులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

    
ఈ రోజుల్లో డయాబెటీస్ లేని వ్యక్తులను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల చిన్న వయస్సులోనే చాలామంది డయాబెటీస్ లేదా మధుమేహానికి గురవ్వుతున్నారు. వైరస్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో డయాబెటీస్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాయమం నుంచి ఆహారపు అలవాట్లు వరకు ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఒళ్లు కదల్చకుండా ఒక చోటే కూర్చుంటే.. చాప కింద నీరులా చక్కెర వ్యాధి తన పని తాను చేసుకుపోతుంది. అవయవాలను దెబ్బతిస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఏదైనా వైరస్ సోకితే చికిత్స కూడా క్లిష్టంగా మారుతుంది. అలాగే, వైరస్‌కు చికిత్స పొందిన తర్వాత బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా డయాబెటీస్ రోగులకే ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి.. ఇక్కడ తెలిపిన డయాబెటీస్‌కు గల కారణాలను, జాగ్రత్తలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.

Representational Image
☀ దేశంలో డయాబెటీస్ విజృంభించడానికి మొదటి కారణం జీవనశైలిలో మార్పు.
☀ ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయాల్సి రావడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం కూడా డయాబెటీస్‌కు దారి తీస్తోంది.
☀ స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
☀ రోజూ 30 నుంచి 45 నిమిషాల నడక, జాగింగ్, ఈత, లేదా ఏదైనా వ్యాయామం చేయాలి.
☀ ఒకే చోట కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తుంటే ఒంట్లో ఇన్సులిన్ వినియోగం చక్కగా ఉంటుంది.
☀ మధుమేహం వస్తే అన్నం మానేసి, చపాతీలు మానేయడం ఒక్కటే మార్గమని భావిస్తారు. కానీ, అది సరైన విధానం కాదు.


☀ డయాబెటీస్ వస్తే స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉండటం మంచిదే.
☀ మధుమేహానికి పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. క్రమబద్ధంగా తింటే చాలు.
☀ ఆహారాన్ని ఒకేసారి కాకుండా దశల వారీగా తక్కువ తక్కువగా తీసుకోవాలి.
☀ పాలీష్ పట్టించని బియ్యాన్ని మాత్రమే వండుకుని తినాలి.
☀ గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలు తీసుకోవాలి.


☀ కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి.
☀ వేళకు భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలకు దూరంగా ఉండాలి.
☀ నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్‌ వంటి పండ్లు డయాబెటీస్‌ను అదుపులో ఉంచుతాయి.
☀ ఉదయం వేళ రాగి జావ తాగడం ఎంతో మంచిది.
☀ రోజు ఏదో ఒక రూపంలో మెంతులను తీసుకోవడం మరింత ఉత్తమం.

కామెంట్‌లు లేవు: