irregular periods symptoms

పీరియడ్స్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

సాధారణంగా మహిళలు కొన్ని విషయాల్లో చాలా భయాందోళనలు చెందుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పురుషుల కంటే స్త్రీలలోనే అధిక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్లో ముఖ్యంగా పీరియడ్ సమస్య చాలా వేధిస్తోంది. పీరియడ్స్ ప్రతి నెలా వచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి ఎంత ఇబ్బంది పెట్టినా…సమయానికి రాకపోతే కంగారు పడాలి అంటున్నారు నిపుణులు. కొంత మందిలో పీరియడ్స్ సక్రమంగా ప్రతి నెలా వస్తుంది. కానీ కొంత మంది స్త్రీలలో మాత్రం పీరియడ్స్ లో తేడాలుంటాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం కావొచ్చు.


అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ, శరీర తత్వం, ఆరోగ్య స్థితిగతుల వల్ల, ఆహారం, ఒత్తిడి, వాతావరణం లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు. సాధారణంగా పీరియడ్స్ 28 నుంచి 30 రోజుల్లోపు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 2, 3 రోజులు అటు ఇటుగా వస్తుంది. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ… అలా కాకుండా 40 రోజులు దాటినా రాకుండా ఉండటం… లేదంటే మూడు వారాలకన్నా ముందే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్లు మాత్రం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువు ఉండటం లేదా బరువు తక్కువగా ఉండటం వల్ల హార్మోనుల సమస్యలు తలెత్తుతాయి. దాంతో మీరు పీరియడ్స్ లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొంత బరువును కోల్పోవడం వల్ల చాలా మంది మహిళలల్లో తిరిగి సాధారణ పీరియడ్స్ రావడం జరుగుతుంది. అలాగే సంతానోత్పత్తిని కూడా పొందగలుగుతారు.  చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, థైరాయిడ్ లోపాలు, కుటుంబ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. పోషకాహారం తీసుకోకుండా విపరీతంగా డైట్ ఫాలో అయ్యేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది. పీరియడ్స్ క్రమం తప్పకుండా రావాలి అంటే బరువు మరీ పెరగకు

ఇవి తగ్గించుకుంటే పీరియడ్ సమయంలో సమస్యలు రావు
Period problems

సాధారణంగా స్త్రీలలో నెలసరి ఎన్ని రోజులు ఉంటుంది?

నెలసరిలో 3 నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ ఉంటే దాన్ని సరియైన నెలసరి అంటారు. చాలా తక్కువ మందిలో 5 నుంచి 7 రోజుల వరకు కూడా నెలసరిని సాధారణ నెలసరిగానే భావించవచ్చు. ఒక వారం రోజుల కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటే మాత్రం తాప్పకుండా డాక్టర్ ని కలవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీకు ప్రతినెలా వచ్చే నెలసరిలో ఏవైనా అనుకోని మార్పులు వచ్చినా కూడా వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్రతినెలా పీరియడ్ సమయంలో స్త్రీ ఎంత మోతాదులో రక్తం కోల్పోతుంది?

రెండు టేబుల్ స్పూన్ల రక్తాన్ని ప్రతి స్త్రీ తన నెలసరి సమయంలో కోల్పోతుందని ఒక అంచనా. అయితే ఖచ్చితంగా ఎంత రక్తాన్ని కోల్పోతారు అనేదానికి ఆధారాలు లేవు. స్త్రీలు వారి నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అనే విషయాన్ని గ్రహిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కలవాలి. పాడ్ ఎక్కువగా తడిచిపోవడం ద్వారా ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

నెలసరి రాకపోవడం లేదా ఆలస్యం అవడాన్ని గర్భం దాల్చినట్టుగా భావించవవ్చా?

యుక్త వయసు స్త్రీలలో పీరియడ్ రాకపోవడం లేదా ఆలస్యం అవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. నెలసరి మొదలైన కొత్తలో అమ్మాయిల్లో ఈ సమస్య చాలా సాధారణం. అయితే కొంతమందిలో మానసిక ఒత్తిడి, బరువు తగ్గడం, ఎక్కువగా వ్యాయామాలు చేయడం వంటివి కూడా పీరియడ్ ఆలస్యం అవడానికి కారణం అవుతాయి.  

గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్న వారిలో కూడా కొన్నిసార్లు నెలసరి ఆలస్యం అవడం లేదా అసలు నెల రాకపోవడం జరుగుతుంది. కొన్ని గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నపుడు అవి నెలసరిని తప్పిస్తాయి. అయితే మీకు ప్రతినెలా వచ్చే సాధారణ పీరియడ్ సరిగా రాకపోతే మాత్రం తప్పకుండా డాక్టర్ ని కలవడం మంచిది.

పీరియడ్ మొదలైనపుడు శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి రావచ్చు?

స్త్రీలలో నెలసరి మొదలైనపుడు పొత్తికడులో అలాగే వెన్ను భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నా ఎక్కువ రోజులు ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎందుకంటే అది కొన్నిసార్లు ఎండోమెట్రియాసిస్ సమస్యకు దారితీయవచ్చు. గర్భాశయం వెలుపల ఎండోమెట్రియల్ కణజాలం వృద్ధి చెందుతున్నా, కటి వలయం లోపల పెరుగుతున్నా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది.

స్త్రీలలో సాధారణంగా నెలసరి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది?

సాధారణంగానే స్త్రీలలో 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో నెలసరి వస్తుంది. యుక్త వయసు స్త్రీలలో అలాగే టీనేజ్ అమ్మాయిల్లో పీరియడ్ ఆలస్యం కావడం, 21 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో పీరియడ్ రావడం సాధారణమే. అయితే పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయో ఒక క్యాలండర్ లో నోట్ చేసుకోవడం ద్వారా మీ పీరియడ్స్ పై డాక్టర్ కి ఒక అవగాహన రావచ్చు. దీని ద్వారా మీకు పీరియడ్స్ విషయంలో అందోలన తగ్గుతుంది.

మానసిక ఒత్తిడి రుతుక్రమాన్ని దెబ్బతీస్తుందా?

మానసిక ఒత్తిడి, బరువు తగ్గడం వంటి అనారోగ్య లక్షణాలు స్త్రీలలో పీరియడ్స్ ని ఆలస్యం చేయడం, బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవడం వంటి సమస్యలకు దారితీస్తాయి. మానసిక ఒత్తిడి తక్కువగా ఉన్న స్త్రీలలో కంటే ఒత్తిడి ఎక్కువగా ఉన్న స్త్రీలలోనే నెలసరి విషయంలో సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు డాక్టర్ లు చెబుతున్నారు.

స్త్రీలలో 8 శాతం మంది మాత్రమే తమ నెలసరి విషయంలో సంతృప్తిగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తమ 35 సంవత్సరాల నెలసరి జీవితకాలంలో స్త్రీలకు 450 సార్లు నెలసరి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ ప్రమాదమా?

నెలసరికి నెలసరికి మధ్య బ్లీడింగ్ కనిపించడం అనేది చాలా తక్కువమందిలో జరుగుతుంది. అది కూడా చాలా తక్కువసార్లు జరుగుతుంది. అయితే ఇలా పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం అనేది కొన్నిసార్లు మాత్రమే సీరియస్ సమస్యలను సూచిస్తుంది దానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చు.

పీరియడ్ సమయంలో రక్తం గడ్డలు గడ్డలుగా రావడం సాధారణమేనా?

చాలామంది స్త్రీలలో పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ముద్దలుగా రావడం సాధారణంగానే చూస్తూ ఉంటాము. అయితే ఇలా రక్తం ముద్దలుగా రావడం అనేది ఎక్కువ రోజులు జరుగుతుంటే తప్పకుండా డాక్టర్ ని కలవాలి.

పీరియడ్ సమయంలో స్త్రీలు గర్భం దాల్చుతారా?

ఋతుచక్ర సమయంలో స్త్రీలు గర్భం దాల్చవచ్చు. తరువాతి నెలసరి సమయానికి 10 నుంచి 16 రోజుల ముందు కూడా అండం విడుదల అవుతుంది. అయితే నెలసరి సమయంలో భాగస్వామితో శృంగారం విషయంలో స్త్రీలు ఆందోళన చెందుతుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నపుడు నెలసరి సమయంలో శృంగారం అనేది ప్రమాదమేమీ కాదు అనేది నిపుణుల అభిప్రాయం.

పీరియడ్ లో కనపడే రక్తం రంగులు మారుతుందా?

అవును కొన్నిసార్లు రక్తస్రావంలో కనిపించే రక్తం గులాబీ ఎరుపు నుంచి గోధుమ రంగు వరకు కూడా కనిపిస్తుంది. ఇది సాధారణమే ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు. అంతేకాకుండా ఒకే నెలసరి సమయంలో రక్తం రంగు మారుతూ ఉండవచ్చు.

ముందస్తు నెలసరి సమస్య (PMS) నుంచి ఎలా బయటపడవచ్చు?

స్త్రీలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ముందస్తు నెలసరి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులో ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఒక అరగంట సైక్లింగ్ చేయడం, వేగంగా నడవడం, వారానికి మూడు రోజులు పరిగెత్తే వ్యాయామాలు చేయడం ద్వారా కూడా స్త్రీలు పి‌ఎం‌ఎస్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా పి‌ఎం‌ఎస్ విషయంలో ఉపయోగపడతాయి. రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవడం, అల్కాహాల్, కెఫీన్ కు దూరంగా ఉండటం, ఆహారంలో తక్కువ కొవ్వు, తక్కువ ఉప్పు, చక్కెర తీసుకోవడం కూడా పి‌ఎం‌ఎస్ సమస్య నుంచి బయటపడేస్తుంది.

*బహిష్టు సమయం లో వచ్చే కడుపు నొప్పి కి బాధలకు


*ఆడవాళ్లు బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. నొప్పి తగ్గడానికి వాళ్లు చేయని ప్రయత్నం ఉండదు. చాలా సందర్భాలలో ఆ నొప్పిని భరించలేక పెయిన్‌ కిల్లర్స్‌ను కూడా వాడుతుంటారు. ఇలా ఇష్టం వచ్చినట్టు పెయిన్‌కిల్లర్స్‌ వాడటం మంచిది కాదు. అందుకే కొన్ని వంటింటి టిప్స్‌ ద్వారా బహిష్టు నొప్పిని నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు.*


మందులు 

Mag.phos 6x  4 pills 3 times daily 30min before food.


అవేమిటో తెలుసుకుందామా...


     ఈ టైములో పొగలు కక్కే టీ తాగితే ఎంతో మంచిది. వేడి టీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో అల్లం, పిప్పర్‌మెంట్‌, లావెండర్‌, గ్రీన్‌ టీ, లెబన్‌గ్రాస్‌ వంటి హెర్బల్‌ టీలు తాగితే మంచిది. హెర్బల్‌ టీలు తాగడం వల్ల అలసట పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది.

     బహిష్టు సమయంలో నీరు ఎంత తాగితే అంత మంచిది. ఈ టైములో కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. అందుకే నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచి ఆడవాళ్లు నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నొప్పి, కండరాలు ఒత్తుకుపోవడం లాంటి బాధలు తలెత్తవు. 

     బహిష్టు సమయాల్లో వచ్చే నొప్పులు, తిమ్మిర్లపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం వాడకం వల్ల ప్రిమెనుసు్ట్రవల్‌ సిండ్రోమ్‌ కారణంగా వచ్చే అలసట కూడా పోతుంది. అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే కొంతమందికి బహిష్టులు సరిగా రావు. ఇలాంటి వారికి ఇది మందులా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా బహిష్టులు వచ్చేలా చేస్తుంది. అందుకే ఈ టైములో చిన్న అల్లంముక్కను తీసుకుని దాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో వేసి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్లను వడగొట్టి అందులో కాస్తంత తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ టీని బహిష్టు సమయంలో రోజుకు మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

     గర్భాశయం కండరాలపై హాట్‌ వాటర్‌ బ్యాగుతో మెల్లగా ఒత్తితే ఆ వేడికి కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం హీట్‌ ప్యాడ్స్‌ని కూడా వాడొచ్చు. 

     మనం తినే డైట్‌లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తే బహిష్టు నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా కాఫీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, కాఫీ తాగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోతాయి. దీని ప్రభావం గర్భాయం రక్తనాళాలపై పడే అవకాశం ఉంది. దాంతో అక్కడి రక్తనాళాలు బిగుసుకుపోతాయి. కాఫీ తాగలేకుండా ఉండలేమనే ఆడవాళ్లు బహిష్టులు రావడానికి ఒక వారం ముందర నుంచి కాఫీ తాగడం మానేస్తే మంచిది. ఆ తర్వాత ఫలితం మీరే గమనించండి. 

     ఎక్కువ ఉప్పు ఉన్న ఫ్యాటీ ఫుడ్స్‌ కూడా ఈ టైములో తినకూడదు. అలా చేస్తే పీరియడ్స్‌ నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. బహిష్టు సమయంలో అరటిపళ్లు తింటే మంచిది. వీటిల్లో పొటాషియం బాగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది. అరటిపళ్లే కాకుండా ఐరన్‌ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, పాలకూర, చిక్కుళ్లు వంటివి కూడా మీరు తీసుకునే డైట్‌లో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. 

     ఇవే కాకుండా దాల్చిన చెక్కతో చేసిన కొన్ని రెసిపీలు ఉన్నాయి. వాటిని ఈ టైములో తీసుకుంటే బహిష్టు నొప్పులు, బాధల నుంచి బయటపడొచ్చు. దాల్చినచెక్క యాంటి- క్లాటింగ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు అందులో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే బహిష్టి నొప్పుల నుంచి ఆడవాళ్లకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు దాల్చినచెక్కలో పీచుపదార్థాలు కూడా బాగా ఉంటాయి. వీటితోపాటు కాల్షియం, ఐరన్‌, మ్యాంగనీసులు ఉన్నాయి. దాల్చిన చెక్కతో చేసిన టీ బహిష్టు సమయంలో తాగితే ఎంతో మంచిది. వేడి నీళ్లల్లో పావు స్పూను దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. ఐదునిమిషాలు తర్వాత అందులో కొద్దిగా తేనె వేసి కలిపి తాగితే ఎంతో రిలీఫ్‌ వస్తుంది. నెలసరి మొదలవడానికి రెండురోజుల ముందర నుంచి దాల్చినచెక్క టీని రెండు లేదా మూడు కప్పులు తప్పనిసరిగా తాగాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు బాధలు తలెత్తవు. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అరచెంచా దాల్చినచెక్క పొడి, ఒక టేబుల్‌స్పూను తే నె వేసి బాగా కలిపి పీరియడ్స్‌ మొదటి రోజున మూడుసార్లు తాగితే బహిష్టు నొప్పులు తగ్గుతాయి.

*ఇర్రెగ్యులర్ పీరిరడ్స్ ?*

# ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మహిళల్లో సాధారణ సమస్య .

# ప్రతి మహిళల్లో రుతుక్రమం యొక్క సమయం 28 రోజులు . అయినా కూడా పీరియడ్ రేంజ్ 21 నుండి 31 రోజుల వరకూ ఉంటుంది . 

# 35 ఎళ్ళలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం , ఆలస్యంగా రావడం లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు.

# చిన్న వయస్సు మరియు మధ్య వయస్సు వారిలో కూడా ఇర్రెగ్యులర్ పీరీయడ్స్ వుంటంది .

*కారణాలు* : ----

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు అనీమీయా , మోనోపాజ్ , ధైరాయిడ్ డిజార్డర్ , హార్మోనుల అసమతుల్యత , అల్లోపతి మందుల ప్రభావం , ఒత్తిడి , అపక్రమ డైట్ వ్యాయామం లేక పోవడం , క్రమంగా , అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం మరియు Birth Control pills వాడటం వల్ల life style మీద ప్రభావం చూపుతుంది .

*గృహ చికిత్సలు* : ----

1. మెంతులు + క్యారట్ + ముల్లంగి గింజలు. సమపాళ్ళలో తీసుకొని నూర వలెను.( Paste లాగా చేయండి ).

1 Table Spoon Paste + 1 Table Spoon అశోకారిష్టం లో కలిపి ప్రతి రోజు త్రాగండి . 

2. ఎండిన మామిడి ఆకులను కాల్చ వలెను. చూర్ణం తయారగును . 

1 Table Spoon మామిడి ఆకుల చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు త్రాగండి . 

3. బిరియాని ఆకుల కషాయం ప్రతి రోజు త్రాగండి . 

( 2 లేక 3 బిరియాని ఆకుల ముక్కలను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించండి . కషాయం తయారవును . ప్రతి రోజు త్రాగవలెను .

*గమనిక* : ----

1. అశోకారిష్ట ( ASHOKA RISTA ) ఆయుర్వేధ షాపులలో లభించును . 

2 . బిరియాని ఆకు = మసాల ఆకు ( Bay Leaf ). 

3. మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వరకు , ప్రతి రోజు త్రాగవలెను . Periods time లో త్రాగరాదు .

👉బహిష్టు సమయం లో

స్త్రీలు పగటినిద్ర, రాత్రిమేల్కోవడం,అతిగా పరిగెత్తడం, 

పెద్దగానవ్వడం,ఏడవడం,

మాట్లాడడం,దూర ప్రయాణమువంటివి చెయ్య కూడదు.దీనివలన శరీరంలో అతిగా ఉష్ణంపుడుతుంది. మి నవీన్ నడిమింటి

బహిష్టు సమయంలో కడుపులో నొప్పి ---నివారణ

నొప్పిగా వున్నపుడు నూలు గుడ్డను వేడి నీటిలో ముంచిభరించ గలిగినంత వేడిగా పొట్ట మీద వేసుకోవాలి. వెంటనేచల్లటి నీటిలో ముంచిన గుడ్డను దానిపై కప్పాలి, ఈవిధానాన్ని ఋతుస్రావం కొద్ది కొద్దిగా వున్నపుడు మాత్రమేచేయాలి. ఎక్కువగా వున్నపుడు చెయ్యకూడదు.

ఉదరచాలనం:-- పొట్టను ముందుకు, వెనుకకుకదిలించాలి. సీతాకోక చిలుక వ్యాయామం లాగా కాళ్ళనుఆడించాలి.

1. బటాణి గింజంత నీరుసున్నం తీసుకొని 50 గ్రాములవెన్నపూస మధ్యలో పెట్టి మింగాలి. విపరీతంగా వున్నకడుపు నొప్పి 10,15 నిమిషాలలో తగ్గి పోతుంది. 

బహిష్టు సమయంలో నడుము నొప్పి--నివారణ

నలగగొట్టిన శొంటి ---5 gr

" వాయువిడంగాలు -5 gr

రెండింటిని కలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి ఒకకప్పుకు రానివ్వాలి. వడకట్టి బెల్లం కలుపుకొని తాగాలి.దీనిని బహిష్టు వచ్చిన రోజు నుండి మూడు రోజులుఉదయం పరగడుపున వాడాలి. (1,2,3 రోజులు) ఆవిధంగా మూడు నెలలు వాడితే ఇక 

ఎప్పటికి నొప్పి రాదు

ధన్యవాదములు

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*

******************

ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.