27, జనవరి 2021, బుధవారం

సంతానలేమికి కారణమవుతున్న అండం విడుదల్లో లోపాలుఎందువల్ల కలుగుతాయి ? నెలా నెలా అండం విడుదల ఎందుకు జరగదు ? అండం విడుదల కానపుడు పీరియడ్ వచ్చే అవకాశం వుందా ?ఇలాంటి సమస్య సాధారణంగా ఏ స్త్రీలలో వుంటుంది? అండం విడుదలకు హార్మోన్లకు మధ్య సంబంధం ఎలా వుంటుంది ?మొదలైన ప్రశ్నలన్నీ PCOD ప్రొబ్లెం వున్న వాళ్లు అడుగుతుంటారు. అలాంటి వారిలో అవగాహన కోసం..


గర్బధారణ సమస్యలు - పరిష్కారాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

శుక్ర కణాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూనే ఉంది. ఎందుకిలా?

నా మయసు 33. నా పెళ్లయి ఇప్పటికి ఐదేళ్లు.అయినా ఇంత వరకు సంతానం కలగలేదు. ఈ కార ణంగా నేను వీర్యకణాల పరీక్షచేయించుకుంటే. మి. గ్రాముకు 20 మిలియన్ల శుక్రకణాలు ఉన్నట్లు రిపోర్టువచ్చింది. కణాల సంఖ్య పెరిగేందుకు డాక్టర్ కొన్ని మందులు సూచించారు. ఆమందులు క్రమం తప్పకుండా వాడుతూనే ఉన్నాను. అయినా శుక్ర కణాల సంఖ్యరోజురోజుకూ తగ్గుతూనే ఉంది. ఎందుకిలా అవుతోంది? సంతానం గురించిన అభిలాష ఈమూడేళ్లుగా అమితంగా వేధిస్తోంది. సంతానం గురించి అడిగే ప్రతి ఒక్కరికీసమాధానం చెప్పలేక మానసికంగా ఎంతో వ్యధకు గురవుతున్నాను. ఈ సమస్యకుపరిష్కారం చెప్పండి.

సాధారణంగా ఒక మి.గ్రా. వీర్యంలో శుక్ర కణాలు 40 నుంచి 120 మిలియన్ల దాకా ఉంటాయి. అవి 40 మిలియన్లకు మించిన వారిలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే సంతానం కలగడానికి శుక్రకణాల సంఖ్య ఒక్కటే కాదు. ఆ కణాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయన్నది చాలా ముఖ్యం. శుక్ర కణాల ఆకృతి మారిపోయినా, అవి 50 శాతానికి పైగా అనారోగ్యంగా ఉన్నా, వాటిలో గర్భాశయంలోకి ఈదుకుపోయే గుణం తగ్గిపోయినా సంతానం కలగకపోవచ్చు. మామూలుగా అయితే గర్భాశయం వద్దకు చేరిన వీర్యం ముందు గడ్డలుగా మారుతుంది.

ఓ 45 నిమిషాల్లో ఆ గడ్డలు కరిగిపోయి ఈదుకుంటూ గర్భాశయంలోకి వెళతాయి. అయితే కరిగిపోయే ఆ సమయం 45 నిమిషాల కన్నా మించితే శుక్రకణాలు ఈదే ధర్మాన్ని కోల్పోతాయి. అది సంతానలేమికి కారణం కావచ్చు. ఇవే కాకుండా వీర్యంలో ఫ్రక్టోస్ పరిమాణం తగ్గినప్పుడు కూడా గర్భం రాకపోవచ్చు. అరుదుగా కొందరిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల శుక్రకణాలను దెబ్బ తీసే యాంటీబాడీస్ పుడతాయి. ఇవి శుక్రకణాలను ఎప్పటికప్పుడు చంపడం వల్ల కూడా కొందరికి సంతానం కలగకపోవచ్చు. మందులు వాడుతున్నా మీలో శుక్రకణాల సంఖ్య తగ్గడానికి ఇదో ప్రధాన కారణం కావచ్చు.

ఒకసారి సెక్సాలజిస్టును సంప్రదించి వీర్య పరీక్ష చేయించుకోండి. సమస్య ఏమిటో గుర్తిస్తే దాని పరిష్కారం గురించి ఆలోచించవచ్చు. మీ సమస్య ఏమిటో స్పష్టంగా బయటపడితే అందుకు అనుగుణమైన వైద్య చికిత్సలు లభిస్తాయి. దిగులు, ఆందోళనలతో ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితి రాకుండా సూచించిన మందులు క్రమం తప్పకుండావాడండి. మీకు సంతోషం కలగడం అసాధ్యమేమీ కాకపోవచ్చు.

మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతోంది. కానిఇంతవరకు సంతానం కలగలేదు. నా భార్యకు అన్ని రకాల పరీక్షలు చేసి ఎలాంటి లోపంలేదని నిర్ధారించారు. నాకు వీర్యపరీక్ష చేసి వీర్యకణాల సంఖ్య, కదలికలు చాలాతక్కువగా ఉన్నాయని చెప్పారు. వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏమిటి? ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. డాక్టర్స్ టెస్ట్‌ట్యూబ్బేబిని సూచిస్తున్నారు. నాకేమో ఇష్టం లేదు. నా సమస్యకు ఆయుర్వేదంలో మంచిఫలితాలు ఉన్నాయని తెలిసింది. నిజమేనా? దయచేసి వివరంగా తెలియజేయండి?

వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గిపోవడానికి మానసిక ఆందోళన, వాతావరణ కాలుష్యం, వెరికోసిల్, హార్మోన్ల లోపాలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు. వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గిపోవడాన్ని 'ఆలిగోఅస్థినోస్పెర్మియా'గా పేర్కొంటారు. ఐ.వి.ఎఫ్, ఇక్సి వంటి కృత్రిమ పద్ధతులు అవసరం లేకుండానే ఆయుర్వేద మందుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సంతానలేమి సమస్యలకు, శృంగార సమస్యలకు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా 'వాజీకరణ ఔషధాలు' ఉన్నాయి. వాజీకరణ ఔషధాలను నిపుణులైన ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో వాడినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.

నావయస్సు 35 సంవత్సరాలు. పెళ్ళయి ఏడు సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకుసంతానం కలగలేదు. వీర్యపరీక్ష చేయించుకుంటే 'నిల్ కౌంట్' అని రిపోర్టువచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళితే వృషణాలపై గ్రేడ్-1 'వెరికోసిల్' ఉన్నదనిచెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. హార్మోన్లలో ఎలాంటి లోపం లేదని అన్నారు.ఎంతో మంది డాక్టర్లను కలిశాం. కానీ మా సమస్యకు శాశ్వత పరిష్కారంచూపించలేకపోతున్నారు. ఆయుర్వేదంలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి?

వీర్యంలో వీర్యకణాలు పూర్తిగా లేనివారిని 'అజోస్పెర్మియా'గా పేర్కొంటారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇతర వైద్య విధానాల్లో దీనికి సరియైన చికిత్సలేదనే చెప్పవచ్చు. కానీ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మంచి పరిష్కారం పొందవచ్చు. కాకపోతే మందులు ఆరునెలల నుంచి ఏడాది పాటు వాడవలసి ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడే పురుషులలో 15 శాతం మందిలో అజోస్పెర్మియా సమస్య కనిపిస్తోంది. వెరికోసిల్ గ్రేడ్ -1, గ్రేడ్-2 ఉన్న వారికి ఆయుర్వేద చికిత్స ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే మందుల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

గర్భస్రావం

పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.

  • సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ స్రావం జరగడానికి అనేక కారణా లున్నాయి. అందు లో ముఖ్య మైనవి .

కారణాలు

  • తల్లి వయసు : 19 నుంచి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చ డానికి అన్నింటి కన్నా క్షేమ మైనా వయసు. 29 ఏళ్ల వరకు పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత రిస్కు ఎక్కువుంటుంది.
  • జన్యుపరమైనవి : కనీసం 50 శాతం గర్భస్రావాలకు ఇవే కారణం. మొదటి మూడు నెలల్లోనే ఇవి చాలావరకు జరుగుతాయి. ప్రతీసారి అలా జరగాలని లేదు. జన్యుపరమైన లోపాలు గలిగిన పిండం ఎదగకుండా ఇది ఒక రకమైన సహజ సెలెక్షన్‌.
  • గర్భసంచిలో లోపాలు : పుట్టకతో గర్భకోశంలో ఉన్న లోపాల వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, సర్విక్స్‌ వదులగా ఉండటం, గర్భకోశ ఆకారం పిండం ఎదుగులకు సరిపోకపోవడం, చిన్నగా ఉండటం వంటివి జరగొచ్చు. దీని వల్ల మూడో నెలలోపు లేదా నాలుగు ఐదు నెలల పిండంగా ఉన్నప్పుడు కూడా గర్భస్రావాలు జరిగే అవకాశాలున్నాయి. సర్విక్స్‌ వదులుగా ఉండి గర్భం నిలువకపోవడం అనేది పుట్టుకతో వచ్చిన లోపం మాత్రమే కాకుండా క్రితం జరిగిన ప్రసవంలో చిరిగిపోవడం వల్ల అనేక మార్లు గర్భస్రావం జరగడం వల్ల, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశముంది. పిండానికి ఎలాంటి ఇన్‌ఫెక్షను సోకకుండా సర్విక్స్‌ కాపాడుతుంది. అది వదులు అయినప్పుడు గర్భకోశానికి, పిండానికి సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నొప్పులు ముందే మొదలైన గర్భస్రావం జరగొచ్చు.
  • కంతులు : ఇవి ఉన్న ప్రదేశాన్ని బట్టి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కంతులు గర్భకోశం లోపలివైపు ఉన్నప్పుడు పిండం ఎదగడానికి సరైన రక్తప్రసరణ జరగకపోవడం, ముందే కాన్పు, నొప్పులు రావడం అసలు గర్భం ధరించడానికే ఆలస్యం అవడం జరగొచ్చు. ఇవే కంతులు గర్భకోశానికి బయటివైపు ఉన్నప్పుడు ఇలా జరగడానికి అవకాశం కొంచెం ఎక్కువ.
  • ఇతర కారణాలు : అవాంఛిత గర్భం తీసివేయడానికి అనేసార్లు క్యూరుటు చేయించుకోవడం వల్ల గర్భకోశంలో అనవసరమైన పొరలు ఏర్పడే అవకాశముంది. క్షయ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. ఈ పొరలు రక్తప్రసరణను అడ్టుకుంటాయి. వీటిని హిస్టిరోస్కోపి ఆపరేషను ద్వారా తొలగించొచ్చు. పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోం, థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో లోపాలు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారిలో గర్భస్రావాలు జరగొచ్చు.
  • రక్తం గడ్డకట్టడంలో లేడాలు, ఎపిఎల్‌ఎ సిండ్రోం, ధూమపానం, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, మానసికంగా అశాంతి, ఉద్యోగంలో పనిఒత్తిడి వంటివి కూడా గర్భస్రావానికి కారణం కావొచ్చు.

చికిత్స :

  • రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్‌ యాసిడ్‌ వాడుకుని మళ్లీ గర్భం ప్లాన్‌ చేయొచ్చు. అబార్షన్‌ అయినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి, ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహం అయితే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగు, థైరాయిడ్‌ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.

గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్‌ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషను ద్వారా సరిదిద్దొచ్చు. లేదా నాలుగో నెలలో సర్విక్స్‌కు కుట్టువేసి వదులవడాన్ని నిరోధించొచ్చు.

  • గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు, వాడుకుని, విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగు చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనొవ్వొచ్చు.

కారణం లేకుండా గర్భస్రావం అవుతుందా?

గర్భం నిలబడకపోవటం అనేది తీవ్రమైన సమస్య కాకపోవచ్చు. అలా అని దీన్ని సర్వసాధారణమైన సమస్యగానూ తీసి పారేయలేం. ఎందుకంటే గర్భస్రావానికి సంబంధించిన కారణాలు అందరి విషయంలోనూ ఒకేలా ఉండవు. అందువల్లే కొన్ని కేసుల్లో కారణం లేకుండానే గర్భస్రావం కావడం కనిపిస్తోంది. అయితే తరుచూ గర్భస్రావాలను ఎదుర్కొన్న 70 శాతం మంది తల్లులు ఇలా గర్భం పోయినప్పుడు (దీన్నే వైద్య పరిభాషలో మిస్‌క్యారేజ్ అంటారు) కుంగిపోనవసరం లేదని చెబుతున్నారు వైద్యులు.

తరుచూ గర్భం కోల్పోతున్న వారిలో 15 శాతం మందికి 'యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్' కారణమవుతున్నాయి. తరుచూ గర్భస్రావాలు ఎందుకవుతున్నాయనే విషయంలో కచ్చితమైన కారణాలేమీ లేవు. అయినా సరే, ఏ కారణమూ లేకుండా తరుచూ గర్భస్రావాలు అవుతున్న 70 శాతం మంది ఆ తర్వాత మామూలుగానే పిల్లల్ని కనడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

గర్భం పోవడంతో మహిళలు తమను తామే నిందించుకుంటారు. బరువులు ఎత్తడం వల్లనో, పని ఎక్కువగా చెయ్యటం వల్లనో, మలబద్ధకం వల్లనో, మానసకి ఒత్తిడికి లోనవటం వల్లనో, శృంగారంలో పాల్గొనటం వల్లనో, తినకూడని వస్తువులు తినటం వల్లనో ఇలా జరిగిందని తమలో తాము బాధపడుతుంటారు. కానీ ఇవేవీ గర్భస్రావానికి కారణాలు కావు. ఇటువంటి అపోహలను మనసులో పెట్టుకుని బాధపడాల్సిన పనిలేదు. గర్భం పోవడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

గర్భం పోవటం అనేది చాలా రకాలుగా సంభవించవచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు ముక్కలన్నీ బయటకు వెళ్లిపోయి గర్భస్రావం కావచ్చు. అయితే ఒకసారి గర్భం పోయిందంటే అనేక అనుమానాలు మొదలవుతాయి. మళ్లీ గర్భం వస్తుందా, రాదా? ఒకవేళ వచ్చినా నిలబడుతుందా? మళ్లీ గర్భం కోసం ఎప్పుడు ప్రయత్నించవచ్చు? అని సవాలక్ష అనుమానాలతో పలువురు మహిళలు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది.

గర్భం దాల్చిన తొలి వారాల్లోనే గర్భం పోవటానికి ప్రధాన కారణం క్రోమోజోముల లోపం. నిజానికి ఇది జన్యుపరమైన పొరపాటు. అయితే వయసు 35 ఏళ్లు పైబడితే ఇటువంటి జన్యుపరమైన పొరపాట్లకు అవకాశం ఎక్కువ. అలాంటి వాళ్లలోనే గర్భం పోవడం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు, గర్భిణులు పొగతాగినా, మద్యం తాగినా, అధిక బరువున్నా, గర్భాశయంలో లోపాలున్నా, గర్భాశయ ముఖద్వారం(సర్విక్స్) బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, మధుమేహం ఉన్నా... ఇటువంటి సందర్భాల్లో గర్భం నిలబడకపోవచ్చు.

గర్భం దాల్చిన తొలి 12 వారాల్లో ఎప్పుడో ఒకసారి ఎరుపు స్రావం కనపడవచ్చు. ఈ పరిస్థితిని థ్రెటెన్డ్ మిస్‌క్యారేజ్ అంటారు. అయితే చాలామందిలో కొన్నాళ్లకు ఈ స్రావం ఆగిపోతుంది. కానీ కొద్దిమందిలో మాత్రం గర్భస్రావం అయ్యేంత వరకు వెళ్తుంది పరిస్థితి. దీనికి ఎలాంటి ప్రత్యేక కారణమూ ఉండదు.

పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం గర్భం పోయేటప్పుడు కనపడే సాధారణ లక్షణాలివి. యోని నుంచి చిన్న చిన్న రక్తపు గడ్డలు, కణజాలం ముక్కలు బయటకు రావచ్చు. అలావస్తే గర్భం పోయినట్టే లెక్క. కొందరిలో మాత్రం ఎలాంటి నొప్పి, స్రావం లేకుండానే లోపల బిడ్డ చనిపోతుంది. అయితే ఇలాంటి విషయాలు వైద్యులు పరీక్షలు చేసి గర్భం పోయిందని చెప్పేంత వరకు తెలియవు.

రుతుస్రావం కనబడటానికి, గర్భం పోవటానికి ఒక్కటే కారణం కాదు గనక, గర్భం దాల్చిన తరువాత ఏ రూపంలో రుతుస్రావం కనపడినా తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేసి కారణం ఏమిటన్నది నిర్ధారిస్తారు.

కొందరికి మొదటి 24 వారాల్లోపే గర్భం పోతుంది. వంద మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుంటుంది. దీన్ని నిర్ధారించడానికి రక్తపరీక్షలు, క్రోమోజోము పరీక్షలు, అల్ట్రాసౌండ్ వంటివి చేయిస్తారు. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం గర్భం పూర్తయ్యే వరకు బిగుతుగా ఉండాలి. అయితే కొందరిలో ఇది మధ్యలోనే బిగుతు సడలి 3-6 నెలల మధ్యే గర్భం పోయేలా చేస్తుంది. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ముందుగానే గుర్తించవచ్చు. ముందస్తు జాగ్రత్తగా సర్విక్స్‌కు ఒక కుట్టు వేస్తారు.

నిజానికి గర్భం పోవటమన్నది చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. దీనికి కారణం కడుపులో ఉన్న పిండం సజావుగా లేకపోవడమే. వరుసగా రెండుసార్లు గర్భం పోవటం 5 శాతం కంటే తక్కువగా, వరుసగా మూడుసార్లు పోవటం 1 శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి గర్భం పోయినంత మాత్రాన దిగులు పడాల్సిన పనిలేదు. గర్భం పోయిన తరువాత సహజంగా ఒక రుతుచక్రం అయ్యే వరకూ ఆగి, ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం వచ్చి, రెండు కంటే ఎక్కువసార్లు పోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డయాబెటిస్ ఉంది... ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా?

నా వయసు 28. గత రెండేళ్ల నుంచి షుగర్ ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గర్భవతుల్లో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండురకాలుగా చెప్పవచ్చు. మొదటిది డయాబెటిస్‌పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భందాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెరపాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జస్టెషనల్ డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ఇలా జస్టెషనల్ డయాబెటిస్ వచ్చినవారికి ఆ తర్వాత డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ.

ఇక రెండోదైన ప్రెగ్నెన్సీపై డయాబెటిస్ కారణంగా పిండంపై దుష్ర్పభావాలు పడి పిండం ఎదిగే దశలో అంటే... మొదటి లేదా రెండో ట్రైమిస్టర్‌లో పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెరపరీక్షలు ఇప్పుడు సునిశితంగా, శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఇలాంటివేవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలో అందరిలోనూ నిర్వహించే టిఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయించాల్సి ఉంటుంది.

ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయులు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థతకు లోనవుతారు. ఈ కండిషన్‌ను కీటో అసిడోసిస్ అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యవసర చికిత్స చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8, 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించడం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి, ఒకవేళ చక్కెరపాళ్లు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని... చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది.

అలా చక్కెరను అదుపు చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ, వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్‌ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని... వాటన్నింటినీ పాటిస్తూ, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే... వీరూ అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంది.

పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి..

నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడంమొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పివస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకుపిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి.

రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే.  దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం.

చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం  విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా  ఎక్కువ.

పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది.

ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.

కడుపులో బిడ్డ కదలికలు తెలిసేదెప్పుడు...?

నా వయసు 22. తొలిచూలు. ప్రస్తుతం నాలుగోనెల. గర్భవతులకు బిడ్డ కదలికలు తెలుస్తాయని చాలాచోట్ల చదివాను. నాకైతే ఇంకా బిడ్డ కదలికలు తెలియలేదు. ఇవి ఎప్పుడు తెలుస్తాయి? వీటి గురించి వివరించండి.

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత... ఎనిమిదో వారం నుంచే బిడ్డలో కదలికలు ఉంటాయి. అయితే తల్లి వాటిని 19-20 వారాల ప్రెగ్నెన్సీలో అనుభూతి చెందుతుంటుంది. అప్పటికే పిల్లలున్న వారైతే ఇంకాస్త ముందుగానే అంటే 18వ వారం నుంచే బిడ్డ కదలికలను గుర్తించడం మొదలుపెడతారు. బిడ్డ తల్లిగర్భంలో పిల్లిమొగ్గలు వేస్తుండటం, కాళ్లూచేతులు ఆడిస్తుండటం, కళ్లుమూసి తెరవడం, ఆవలించడం, పెదవులు తడుపుకుంటూ ఉండటం వంటివి చేస్తుంటాడు. వీటిలో బిడ్డ మొత్తంగా కదలడం, కాళ్లూ-చేతులను కదిలించడం వంటి పెద్ద కదలికలు తల్లికి తెలుస్తుంటాయి.

తల్లి అనుభూతి చెందే బిడ్డ కదలికలు 18-20వ వారం నుంచి క్రమంగా పెరుగుతూ పోతాయి. ఇలా 32వ వారం వరకూ కదలికల్లో పెరుగుదల ఉంటుంది. 32 వారాల తర్వాత కూడా బిడ్డలో కదలికలు ఉన్నప్పటికీ... తల్లిలో ఉమ్మనీరు కాస్త తగ్గడం జరుగుతుంది కాబట్టి వాటిని మునుపటంతగా తల్లి అనుభూతి చెందలేదు. అందువల్ల అప్పటివరకూ క్రమంగా పెరుగుతూ వస్తున్న కదలికలు కాస్త మందగించినట్లు అనిపిస్తాయి.

ఒకసారి బిడ్డ తన కదలికలు మొదలుపెట్టాక గరిష్టంగా ఒక్కోసారి 50-75 నిమిషాల పాటు (దాదాపు గంటన్నరపాటు) కదులుతూనే ఉండవచ్చు. ఒక్కో గంటలో ఇలా కదలడం అన్నది దాదాపు 32 సార్ల వరకూ జరగవచ్చు. తొలిసారి బిడ్డ కదలికను అనుభూతి చెందడాన్ని ఇంగ్లిష్‌లో క్వికెనింగ్ అంటారు. పుట్టిన బిడ్డలోనూ, పెద్దవారిలోనూ స్లీప్‌సైకిల్స్ ఉన్నట్లే కడుపులో ఉన్న బిడ్డకూ స్లీప్-అవేక్ సైకిల్స్ ఉంటాయి. తల్లి కడుపులోని బిడ్డ దాదాపు 60-90 నిమిషాలు పాటు నిద్రపోయి, ఆ తర్వాత మేల్కొని కాసేపు ఆడుకుని మళ్లీ పడుకుంటూ ఉంటుంది.

ఇలా రోజులో చాలా స్లీప్ సైకిళ్లు ఏర్పడుతుంటాయి. ఇదీ కడుపులో బిడ్డ నిద్రపోవడం, నిద్రలేవడం ప్రక్రియల్లోని ప్రత్యేకత. ఇక బిడ్డ కదలికలు సాధారణంగా ఉదయం వేళల్లో అంతగా ఉండవు గాని... మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఎక్కువగా ఉండటాన్ని గుర్తించవచ్చు. తల్లి ఆహారం తీసుకున్న తర్వాత బిడ్డ కదలికలు మరింత ఎక్కువవుతాయి. బిడ్డ కదలికలు మొదలుపెట్టిన తర్వాత వాటిని గుర్తించడానికి అనేక పద్ధతులు (మెటర్నల్ పర్‌సెప్షన్ ఆఫ్ ఫీటల్ మూవ్‌మెంట్స్) ఉంటాయి.

పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట బిడ్డ కదలికలను లెక్కపెట్టవచ్చు. గంటకు మూడు చొప్పున, రోజు మొత్తం మీద 10 సార్లు బిడ్డ కదులుతూ ఉంటే... కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ బిడ్డ కదలికలను 7, 8 నెలల సమయంలోనూ తల్లి అంతగా గుర్తించకపోతే ఆ విషయాన్ని డాక్టర్‌కు చెప్పాలి.

గర్భవతులు తరచూ డాక్టర్‌ను కలుస్తుంటారు డాక్టర్లు బిడ్డ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు కాబట్టి ఈ విషయంలో తల్లులు దిగులు పడటమో, ప్రత్యేకంగా గమనించడమో చేయాల్సిన అవసరం లేదు. ఇక మీ విషయానికి వస్తే ప్రస్తుతం మీకు నాలుగోనెలే కాబట్టి, మరో నెలరోజుల్లో మీరు మీ బిడ్డ కదలికలను గుర్తించే మధురానుభూతి కోసం వేచిచూడండి.

పోస్ట్ పార్టమ్ కేర్... ప్రసవం తర్వాత...

తొమ్మిది నెలల పాటు గర్భాన్ని మోసిన అమ్మ మళ్లీ మునుపటి దశకు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతుంది. మళ్లీ ఎప్పట్లాగే అమ్మ శారీరక స్థితి... గర్భం దాల్చడానికి ముందున్న స్థితికి వెళ్లాలంటే కనీసం ఆరు వారాలు పడుతుంది. ప్రసవం అయ్యాక జరిగే ఆ ఆరువారాల వ్యవధిని ‘పోస్ట్ పార్టమ్’ అంటారు. అంటే ‘పోస్ట్ పార్టమ్’ను తెలుగులో చెప్పాలంటే ప్రసవానంతర స్థితి అనుకోవచ్చు. ఈ దశ చాలా కీలకమైనది. నిర్లక్ష్యం చేస్తే ఈ దశలో కొన్ని ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు. లేదా పోస్ట్‌నేటల్ డిప్రెషన్‌లోకి వెళ్లవచ్చు. దీని వల్ల దీర్ఘకాలికంగా శారీరకంగా, మానసికంగా ప్రభావం పడవచ్చు. ప్రసవానంతరం తల్లి, కుటుంబం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కోసమే ఈ కథనం.

ప్రసవానంతరం తల్లిలో శారీరకంగా ఎన్నో మార్పులు వస్తాయి. కొన్ని బాధలూ కలుగుతాయి. అవి...

ప్రసవానంతర బాధలిలా..

నొప్పి:ప్రసవానంతరం సాధారణ ప్రసవం కోసం పెట్టే చిన్నపాటి గాటుకు వేసే కుట్ల వల్లగాని లేదా శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసే సిజేరియన్ తర్వాత వేసే కుట్ల వల్లగాని కొద్దిపాటి నొప్పి ఉంటుంది. దీనికోసం కొద్దిపాటి మోతాదుల్లో నొప్పి నివారణ మందులు ఇస్తారు. లేదా అక్కడ చన్నీళ్ల కాపడం పెడతారు. ఈ నొప్పి కనీసం వారంపాటు ఉంటుంది. ఒకవేళ వారం తర్వాత కూడా నొప్పి ఉన్నా, పెరుగుతున్నా, వాపు వచ్చినా లేదా ఎర్రగా మారి చీము వంటిదేదైనా స్రవిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఒక్కోసారి అక్కడ వేసిన కుట్లు తొలగించాల్సి రావచ్చు.

 

మూత్రసంబంధమైన సమస్యలు : బాగా పెరిగిపోయి ఉన్న పొట్ట తగ్గే క్రమంలో పొట్ట ఉబ్బుతుందనే భయం కొద్ది ప్రసవానంతరం తల్లులు నీళ్లు ఎక్కువగా తాగరు. దాంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఒక్కోసారి యోని ప్రాంతంలో ఉన్న నొప్పి వల్ల కూడా మూత్రవిసర్జనకు వెనుకాడుతుంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో కొందరికి పైప్ వేసి (క్యాథెరటరైజేషన్‌తో) మూత్రం బయటికి వెళ్లేలా చేయాల్సి రావచ్చు.

మూత్రం చుక్కలుగా కారడం : కొందరిలో ప్రసవం తర్వాత అక్కడి కండరాలు ఇంకా బలహీనంగానే ఉంటాయి కాబట్టి మూత్రాన్ని బిగుతుగా పట్టి ఉంచలేవు. దాంతో మూత్రం తమ ప్రమేయం లేకుండానే చుక్కలు చుక్కలుగా రాలవచ్చు. దీన్నే యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఈ సమస్యను నివారించడానికి తల్లులకు ప్రసవానంతరం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌ల గురించి వివరించాల్సి ఉంటుంది. ఇవి పొత్తికడుపు కింది (పెల్విక్) భాగంలోని కండరాలకు శక్తిని చేకూరుస్తాయి.

మలవిసర్జనకు సంబంధించిన సమస్యలు : మలబద్దకం అన్నది ప్రసవానంతరం తల్లుల్లో కనిపించే చాలా సాధారణమైన సమస్య. పైగా మనవద్ద పాటించే కొన్ని సంప్రదాయాలు, మరికొన్ని మూఢనమ్మకాలతో తల్లులకు తాజాపండ్లు, పండ్లరసాలు ఇవ్వకపోవడంతో తగినంత పీచుపదార్థాలు దొరకక పేగుల్లో మలం మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. అది ముందుకు జారడం కష్టమవుతుంది. దాంతో మొలలు రావడం వంటి పరిణామాలు రావచ్చు.

రొమ్ము సమస్యలు: ప్రసవానంతరం కొంతమందిలో రొమ్ము నుంచి పాలు బయటికి రాక ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి సమస్యను చన్నీళ్ల కాపడంతోనే సరిదిద్దవచ్చు. అయితే కొందరిలో రొమ్ము భాగంలో స్టెఫలోకోకస్ ఆరెశ్యాండ్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దీన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వడంద్వారా నయం చేయవచ్చు. ఇక కొందరిలో పాలిచ్చే భాగంలో చిన్నపాటి చీలికలు కనిపించవచ్చు. ఇలాంటి సమస్య కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇక మరికొందరిలో రొమ్ముతో బిడ్డకు పాలుపడుతున్నప్పుడు మూత్రసంబంధమైన కండరాలు బిగుసుకుపోతుంటాయి. దీంతో పాలిచ్చే సమయంలో తల్లులు నొప్పితో తల్లడిల్లుతుంటారు. ఇలాంటి వారికి నొప్పినివారణ మందులు వాడాల్సి రావచ్చు.

వెన్నునొప్పి: గర్భవతిగా ఉన్నప్పుడు పెరుగుతున్న పొట్ట తాలూకు భారం వెన్నుపై పడుతుండటం వల్ల గర్భవతుల్లో వెన్నునొప్పి మామూలే. అయితే పాలిచ్చే సమయంలోనూ సరైన భంగిమ పాటించకపోవడం వల్ల ఆ తర్వాత కూడా వెన్నునొప్పి రావచ్చు. కొన్ని సాధారణ వ్యాయామాలతో ఈ నొప్పి తగ్గుతుంది.

జీవక్రియలకు (ఫిజియలాజికల్) సంబంధించిన సమస్యలు: కొందరు తల్లులు ప్రసవం తర్వాత మొదటి రెండు వారాలూ తాత్కాలిక ఉద్వేగాలకు లోనవుతారు. ఈ దశలో వారు తీవ్ర వేదనలో మునిగిపోతారు. దీన్ని పోస్ట్‌పార్టమ్ బ్లూస్ అంటారు. దీనికి నిర్దిష్టంగా కారణం తెలియదు. బహుశా గర్భవతుల్లో వచ్చే మార్పులు క్రమంగా మామూలు దశకు వెళ్తున్న సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా ఇలా జరుగుతుండవచ్చు. అలాగే... పుట్టిన బిడ్డను సరిగా సాకగలనా అన్న సందేహాలు కూడా దీనికి దారితీయవచ్చు. కుటుంబసభ్యులంతా తల్లికి నైతిక స్థైర్యాన్ని అందించడం ద్వారా ఆమెను ఆ దశనుంచి బయటపడేయవచ్చు.

 

ప్రసవం తర్వాత వచ్చే తీవ్రమైన మాతృసంబంధ సమస్యలు

పోస్ట్‌పార్టమ్ హేమరేజ్: ప్రసవం తర్వాత ఎంతో కొంత రక్తస్రావం అవడం మామూలే. అయితే ప్రసవం తర్వాతి మొదటి 24 గంటల వ్యవధిలో 500 ఎం.ఎల్. కంటే ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. దీన్నే ప్రైమరీ పోస్ట్‌పార్టమ్ హేమరేజ్ అంటారు. అయితే చాలామందిలో మాయ ముక్కలు రక్తస్రావంతో పోతూ ఉండటం వల్ల గాని లేదా జననాంగాల వద్ద చీరుకుపోవడం వల్లగాని కొందరిలో అరుదుగా మూత్ర విసర్జక వ్యవస్థలో అయిన గాయాల నుంచి స్రవించిన రక్తం వల్ల గాని లేదా మరికొందరిలో రక్తం గడ్డకట్టడంలో లోపాల వల్లగాని రక్తస్రావం కావచ్చు. ఇలా ప్రసవం అయిన 24 గంటల తర్వాత కూడా రక్తస్రావం అయి అది ఆరు వారాల వరకు ఎంతోకొంత రక్తస్రావంలా కనిపిస్తుండవచ్చు. దాంతో మహిళల్లో రక్తహీనత ఏర్పడి ‘పోస్ట్‌నేటల్ అనీమియా’గా కనిపించవచ్చు.

ప్యుర్పేరియల్ పెరైక్సియా (జ్వరం):ప్రసవానంతరం మొదటి 14 రోజుల్లో మహిళ శారీరక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండటాన్ని జ్వరంగా పరిగణించవచ్చు. ఇది జననావయవ ప్రాంతాల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌లు లేదా రొమ్ము ఇన్పెక్షన్స్ లేదా థ్రాంబోఫ్లెబిటిస్ లేదా సిరల్లో రక్తం గడ్డకట్టడం వంటి ఇన్ఫెక్షనేతర కండిషన్స్ కారణంగా కనిపించే లక్షణం కూడా కావచ్చు.

పోస్ట్‌నేటల్ సైకోసిస్:కొందరిలో పోస్ట్‌నేటల్ సైకోసిస్ అన్నది తీవ్రమైన వ్యాకులతలా కనిపించే ఒక రకం మానసిక సమస్య. ఇందులో మహిళ ఒక్కోసారి స్కీజోఫ్రీనియా లక్షణాలతో కూడా కనిపించవచ్చు. ఇలాంటి మానసిక సమస్య ప్రసవానంతరం 5 నుంచి 15 రోజుల మధ్య అకస్మాత్తుగా మొదలవుతుంది. బాలింత తీవ్రమైన అయోమయం, ఉద్రిక్తత, అస్థిమితత్వం, విచారం వంటి లక్షణాలకు గురవుతుంది. ఇలాంటిప్పుడు ఒక్కోసారి ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. యాంటీడిప్రెసెంట్ మందులను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మోతాదుల్లో వాడాల్సి రావచ్చు. ఆమె మూడ్స్‌ను స్థిరంగా ఉంచేందుకు నరాలకు సంబంధించిన మందులు వాడాల్సి రావచ్చు.

థ్రాంబో ఎంబాలిజమ్:రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే కండిషన్‌ను థ్రాంబోఎంబాలిజమ్ అంటారు. 1000 ప్రసవాల్లో ఒకటికంటే తక్కువ సందర్భాల్లో ఈ స్థితి కనిపించవచ్చు. సాధారణంగా 35 ఏళ్లు దాటాక గర్భం దాల్చినవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో, సంక్లిష్ట గర్భధారణ (కాంప్లికేటెడ్ డెలివరీ) కలిగిన వారిలో ఈ కండిషన్ కనిపించవచ్చు.

పల్మునరీ ఎంబోలస్:గడ్డకట్టిన రక్తం (క్లాట్) ఊపిరితిత్తులు లేదా గుండె తాలూకు రక్తనాళాల్లోకి ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామమే పల్మునరీ ఎంబోలస్. దీనివల్ల ఒక్కోసారి మహిళ 2-4 గంటల్లో మృత్యువుకు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. అయితే వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే ఒక్క ఇంజెక్షన్‌తో ఆమెను మృత్యుముఖం నుంచి తప్పించవచ్చు.

పైన పేర్కొన్న అంశాల పట్ల అవగాహన పెంపొందించుకుంటే ప్రసవ అనంతర సమస్యలను తేలిగ్గా అధిగమించవచ్చు.

పాలు పట్టే సమయంలో ఆహారం

మన సంస్కృతీ, సంప్రదాయాల్లో ఉన్న నమ్మకాల ప్రకారం కొందరు పెద్దలు పాలిచ్చే తల్లులు చాలా రకాల ఆహారాన్ని తినకుండా చేస్తారు. కానీ బిడ్డకు తగినట్లుగా పాలు బాగా పడటానికి తల్లికి పాలూ, ఓట్స్, ఆకుపచ్చని ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, ఎక్కువ మోతాదుల్లో ద్రవాహారం (మజ్జిగ, కొబ్బరినీళ్లవంటివి), తాజాపండ్లు ఎక్కువగా అవసరం. అయితే బలం పట్టడానికి అంటూ కొందరు పెద్దలు ఎక్కువగా వరి అన్నం, నెయ్యి ఇస్తుంటారు. దీనివల్ల పాలు పడకపోగా... తల్లులు మరింత బరువు పెరుగుతారు. అందుకే అన్ని పోషకాలు సమంగా అందేలా సమతులాహారం ఇవ్వడం మంచిది.

గర్భం రాకుండా చూసుకోవడం

పాలిచ్చే సమయంలో గర్భం రాదనే అభిప్రాయంతో చాలామంది తల్లులు మామూలుగానే సంసారజీవితంలో పాల్గొంటుంటారు. అయితే బిడ్డకు పాలిచ్చే సమయంలో గర్భధారణ జరగకుండా చూసుకోవడం మంచిది. ఈ విషయంలో డాక్టర్ సలహా మేరకు కాపర్-టీ, మిరేనా వంటి సాధనాలు లేదా ప్రతి మూడు నెలలకోమారు తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ వంటి వాటి గురించి తెలుసుకోవడం మంచిది.

ఇలాంటి ఎన్నో జాగ్రత్తలతో కొత్తగా తల్లి అయిన మహిళ చాలా సులభంగా ప్రసవానంతర (పోస్ట్‌పార్టమ్) పరిణామాలను అధిగమించి ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చు.

గర్భధారణ వేళ శృంగార జాగ్రత్తలు .. !

తల్లిదండ్రులవడం స్త్రీ పురుషులిద్దరికి ఒక అద్భుతమైన వరం. అయితే, ఈ సమయంలో శృంగార పరమైన జాగ్రత్తలు ప్రతి దంపతులకు తప్పనిసరి. లేకపోతే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.

కొంతమంది స్త్రీలలో గర్భస్థ సమయంలో శృంగారోద్దీపనలు కొద్దిగా ఎక్కువైతే, మరి కొందరిలో తక్కువవుతాయి. చాలామందిలో చివరి నెలల్లో పైకి పెరిగిన పొట్ట, లోపల పెరుగుతున్న బిడ్డతో శృంగారం పట్ల పూర్తిగా నిరాసక్తత ఏర్పడుతుంది. వీరిలో శృంగార భంగిమల్ని మార్చుకోవడం లేదా అంగవూపవేశం, స్ట్రోక్స్ లేని స్పర్శలు, చుంబనాల శృంగారం వారి సమస్యను పరిష్కరిస్తుంది.

మొదటి మూడు నెలలు :

మొదటి మూడు నెలలలో వికారం, వాంతులు, తన దేహంలో ఏమవుతుందో తెలియని భయాందోళన, శరీరంలో బిడ్డ పెరగటం వల్ల కలిగిన వ్యాకులత, వాంతులతో తిండి తినకపోవడం, దీనివల్ల కలిగే నీరసం, రక్తంలో మారుతున్న హార్మోన్ల స్థాయి- ఇవన్నీ కూడా శృంగారాసక్తిని పూర్తిగా తగ్గిస్తాయి.

ఈ సమయంలో భర్త ఆమెతో చాలా సున్నితంగా వ్యవహరించాలి. మానసికంగా ఆమెను ఒత్తిడికి లోను చేయకూడదు. ఆమె శారీరకంగా, మానసికంగా ఉత్సాహం కనబరిచినప్పుడు మాత్రమే శృంగారంలో పాల్గొనాలి. బలవంతం చేయకూడదు. నిరాకరిస్తే నిందించ కూడదు.

ఉదా॥ విజయ మూడో నెలలో హార్మోన్ల అపసవ్యత వల్ల తీవ్రమైన ఆందోళన, చిరాకులకు లోనయ్యేది. భర్త ఇదేమీ గమనించకుండా ఆమె ప్రతిఘటించినా బలవంతంగా లోబర్చుకునే వాడు. ఇలా ఆమెలో శృంగారం పట్ల తీవ్ర స్థాయి అయిష్టతను కలిగించాడు. ఆమె అతన్నించి తప్పించుకోవడానికి పుట్టింటికి పారిపోవాల్సి వచ్చింది. అలాగే, విచివూతంగా మార్నింగ్ సిక్‌నెస్, వాంతులు, వికారాలు, చిరాకు, ఆందోళన ఇలాంటివేవీ లేని గర్భిణీ స్త్రీలలో సెక్స్ పట్ల అనురక్తి అంతగా తగ్గలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మధ్య మూడు నెలలు:

4, 5, 6 నెలలలో కొద్దిమందిలో ఆందోళన స్థాయి తగ్గి శారీరక, మానసిక అపసవ్యతలకు అలవాటు పడి కొద్ది శాతం శృంగారంలో ఆసక్తి కనపరుస్తారు. అయితే, 26 సంవత్సరాల శృతికి ఈ నెలల్లో పొత్తి కడుపు ఉన్నట్లుండి బిగుసుకు పోయేది. వైద్య సలహా మీద ఆమె గర్భాశయ కండరాల్లో సంకోచాన్ని తగ్గించే ‘డువాడిలన్’ అనే మందు వాడుతున్నప్పటికీ భర్తతో కల్సినప్పుడల్లా మళ్ళీ బిగుసుకు పోయేది. డాక్టరు ఒక్క శృతిని మాత్రమే కూర్చోబెట్టి దాంపత్య జీవితంలో సున్నితంగా ఉండాలనీ చెప్పింది. కానీ, ఆ సంగతి ఆమె భర్తకూ చెబితే బాగుండేది. భర్త మోటు ప్రవర్తనతో శృతి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. శృతికి ‘ఇరి యుటెరస్’ అనే సమస్య ఉందని, తను శృంగారానికి దూరంగా ఉండాలనీ డాక్టరు కఠినంగా భర్తతో చెప్పి ఉండాల్సింది. కనీసం భార్య చెప్పినప్పుడైనా భర్త విని ఉండాల్సింది. అలాగే, ఒకసారి గర్భవూసావమైన రమకు పరీక్షల్లో గర్భసంచి వదులుగా ఉందన్నారు. ఆమె గర్భసంచికి కుట్లు వేసి విశ్రాంతి తీస్కోక ముందే ఆమె భర్త తొందరపాటు తనం వల్ల మళ్ళీ ఆమెకు గర్భవూసావమైంది.

కాగా, 4, 5, 6 నెలల్లో ఏ ఆరోగ్య సమస్యలు లేని గర్భిణి స్త్రీలలో శృంగారం పట్ల ఆసక్తి కొంత వరకు ఉంటుందని సర్వేల్లో వెల్లడైంది.

చివరి మూడు నెలలు

ఈ నెలల్లో స్త్రీ, పురుషులిద్దరిలో శృంగారాసక్తి తగ్గుతుంది. పెరిగిన పొట్ట, పెరుగుతున్న బిడ్డ, బిడ్డకేమవుతుందోనన్న భయం, జాగ్రత్తలు ఇవన్నీ శృంగారాసక్తిని తగ్గిస్తాయి. శృంగార భంగిమ కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండదు. అయితే, ఈ సమయంలో శృంగార భంగిమల్ని మార్చుకోవడం మంచిది. ఉదా: పక్కకి తిరిగే భంగిమ, పొట్టపై భారం పడని విధంగా, సున్నితమైన స్ట్రోక్స్ ఇస్తూ చేసే పద్ధతి, 9వ నెలలో అంగవూపవేశం చేయకుండా పైపై, బాహ్య స్పర్శలతో కూడిన శృంగారం ఉత్తమం. 9వ నెల 2వ వారం నుండి అయితే, శృంగారం ఆపివేయడం మంచిది.

అలాంటి వారైతే మరింత జాగ్రత్త పడాలి!

పూర్వ గర్భవూసావాలు, రక్త స్రావాలు సంభవించిన గర్భిణీ స్త్రీల విషయంలో అయితే మరిన్ని జాగ్రత్తలు అవసరం. వీరు శృంగారం దాదాపు పూర్తిగా తగ్గించేయాలి. స్త్రీలలో భావవూపాప్తి వల్ల గర్భాశయ కండరాలు తీవ్ర సంకోచాలకు దారి తీసి అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే, వ్జైనా నించి, గర్భాశయం నించి రక్తవూసావం అవుతున్నప్పుడు కూడా శృంగారంలో పాల్గొనకుండా వెంటనే డాక్టరు వద్దకు వెళ్ళాలి. గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉండి, దానికి కుట్లు వేయించుకున్న గర్భిణీ స్త్రీలలో కూడా శృంగారం నిషిద్ధం! శృంగార సమయంలోని స్ట్రోక్స్ లేదా యోనిలో అంగం కదలికల వల్ల వ్జైనా లోపలికి ప్రవేశించిన గాలి బుడగలు రక్త ప్రవాహంలో కలిసి ‘ఎయిర్ ఎంబోలిజం’ అనే ప్రాణాంతక వ్యాధికి కారణం అవుతుంది.

అలాగే, ఉమ్మనీటి పొరలు చిట్లినప్పుడు కూడా బిడ్డకు ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండడానికి శృంగారాన్ని నిషేధించాలి. కొద్దిమంది డాక్టర్లు గమనించిన దాని ప్రకారం శృంగార సమయంలో తీవ్రమైన భావవూపాప్తి లేదా అంగజాల్ని పొందిన స్త్రీలకు గర్భాశయ కండరాలు తీవ్రమైన సంకోచ వ్యాకోచాలకు లోనై నెలలు నిండకనే ప్రసవం అయిందనీ తేల్చారు.

రెండోసారి సిజేరిన్ తప్పదా?

నాకు మొదటి కాన్పు సిజేరియన్ చేశారు. మాపాపకు ఇప్పుడు మూడేళ్ళు. అప్పట్లో ఉమ్మనీరు తక్కువగా ఉందని, సిజేరియన్తప్పనిసరి అని చెప్పి చేశారు. ఇప్పుడు రెండో కాన్పు కూడా మళ్ళీ సిజేరియనేఅవుతుందా? సహజ ప్రసవం జరగాలని నా కోరిక. ఒకసారి సిజేరియన్ చేసిన వారికిమళ్ళీ సిజేరియనే చేస్తారా? లేక సహజ ప్రసవం కూడా జరిగే అవకాశం ఉంటుందా?

మీకు మొదటిసారి సిజేరియన్ చేసిన డాక్టర్లు చెప్పింది కరెక్టే. ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా సిజేరియన్ చేస్తారు. అయితే రెండో ప్రసవానికి కచ్చితంగా సిజేరియన్ చేయాల్సిందేనని ఎవరూ చెప్పరు. సహజ ప్రసవం కోసం 'ట్రయల్ ఆఫ్ లేబర్'కు ప్రయత్నించవచ్చు. దీనిని వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటారు. అయితే ఈ ట్రయల్ ఇచ్చే ముందు మీ పెల్విస్ ఎసెస్‌మెంట్ చేసి, ప్రసవానికి ద్వారా సరిపోయేలా ఉందా? లేదా? అని వైద్యులు నిర్ధారణ చేస్తారు. పుట్టబోయే బిడ్డ బరువు 3.5 కిలోల లోపలే ఉంటే సహజప్రసవం అంటే.. 'ట్రయల్ ఆఫ్ లేబర్'కు తప్పనిసరిగా ప్రయత్నించవచ్చు.

నా వయస్సు 34 సంవత్సరాలు. నాకు గర్భసంచిలోగడ్డ(ఫైబ్రాయిడ్) ఉందని శస్త్రచికిత్స చేశారు. ఇది జరిగి మూడేళ్ళు అయింది.ఇప్పుడు నేను గర్భవతిని. ఎనిమిదో నెల. సహజ ప్రసవం వద్దని, సిజేరియన్చేస్తానని మా డాక్టర్ చెబుతున్నారు. మీరేమంటారు?

మీకు ఝడౌఝ్ఛఛ్టిౌఝడ అనే శస్త్రచికిత్స జరిగింది. గర్భసంచిని కోసి అందులో ఉండే గడ్డను తీసివేయడం వల్ల మీ గర్భసంచి కొంతవరకు బలహీనం అయి ఉండొచ్చు. నెలలు నిండే కొద్దీ మీ గర్భసంచి వ్యాకోచిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా గతంలో శస్త్రచికిత్స చేసిన చోట చిరిగిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ డాక్టర్ చెప్పినట్లుగా వినండి. మీరు సహజ ప్రసవం కంటే సిజేరియన్ చేయించుకోవడమే మంచిది.

నా వయస్సు 28 సంవత్సరాలు. వివాహమై రెండేళ్ళుఅవుతోంది. ఈ మధ్య ఎక్కువగా వెజైనల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తోంటే డాక్టర్రొటీన్‌గా బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయిస్తున్నారు. తాజా రిపోర్టులో నాకుడయాబెటిస్ అని తెలిసింది. నేను గర్భం దాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలో వివరించగలరు.

మీకు చిన్న వయస్సులోనే డయాబెటిస్ రావడం విచారకరం. ప్రస్తుతం మీ బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోనే ఉన్నాయా అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు గ్లయికోసిలేటెడ్ హిమోగ్లోబిన్(ఏ6అ1ఛి) అనే పరీక్ష ద్వారా గత మూడు నెలలుగా మీ శరీరంలో చక్కెర స్థాయిల నియంత్రణ గురించి తెలుసుకోవచ్చు. మీ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయి 6 కంటే తక్కువగా ఉంటే మీరు గర్భం దాల్చేందుకు ప్రయత్నించవచ్చు. అయితే గర్భధారణ తర్వాత కూడా ప్రసవం జరిగే వరకు మీ శరీరంలోని చక్కెర స్థాయిలును నియంత్రణలో ఉంచుకోవలసి ఉంటుంది. ఇందుకోసం ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను తప్పనిసరిగా మీరు తీసుకోవలసి ఉంటుంది.

నా వయస్సు 55 సంవత్సరాలు. మల విసర్జన సమయంలోనా జననేంద్రియం నుంచి ఏదో బయటకి తగులుతోంది. ఏడాది నుంచి ఈ సమస్య నన్నువేధిస్తోంది. భయంతో నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా భర్త చనిపోయారు. నాకుఇద్దరు కుమారులు. ఈ మధ్య కాస్త ఎక్కువసేపు నిలబడి పనిచేస్తే చాలు ఈ గడ్డబయటికి వస్తోంది. ఇది క్యాన్సర్‌కు సంబంధించినదా? నన్నేం చేయమంటారు?

మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే.. మీరు భావిస్తున్నట్లుగా అది క్యాన్సర్ కాదు, గడ్డ కూడా కాదు. ఈ సమస్యను ప్రొలాప్స్ యూట్రెస్ అంటారు. అంటే.. మీ గర్భసంచి కిందికి జారిందని అర్థం. గర్భసంచికి సంబంధించిన పటుత్వం పోవడం వల్ల ఇలా సమస్య ఏర్పడుతుంది. మీరు వెజైనల్ హిస్టరెక్టమీ చేయించుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు భయం, అనుమానం వీడి ముందు మీకు దగ్గరలో ఉన్న మంచి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది.

పెళ్ళయి నిండా 2-3 నెలలు గడవకుండానే కొందరికిగర్భం వచ్చేస్తుంది. కొందరికి ఏడా ది, రెండేళ్ళు, 4-5 ఏళ్ళు గడిస్తే కానిరాదు. కనుక సంతానం కొరకు ఎంత కాలం ఎదురు చూసేక డాక్టర్ని సంప్రదించాలి?

దీనికి రూలంటూ ఏమీ లేదు. ‘‘ఇంకా గర్భం లేదేమిటి?’’ అనే ఆతృత దంపతుల్లో ఎప్పుడు మొదలైతే అప్పుడే డాక్టర్ని కలవటం మంచిది. అది ఆర్నెల్లు కావచ్చు. ఆరేళ్ళు కావచ్చు.కానీ వైద్యశాస్తప్రరంగా డాక్టర్లు కనీసం ఏడా దన్నా ఆగమని చెప్తారు. ‘‘ఒక ఏడాదిపాటు ఎలాంటి అవాంతరాలూ లేకుండా, గర్భనిరోధ క విధానాలు పాటించకుండా రెగ్యులర్‌గా దాంపత్య సంబంధాల్లో పాల్గొన్నప్పటికీ గర్భం రాకపోతే’’ డాక్టర్ని సంప్రదించడం మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. గర్భనిరోధాన్ని పాటించిన వాళ్ళు మరో 4,5 నెలలు అదనం గా ఎదురు చూడవచ్చు.

నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చినట్లేనా?

నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఆర్నెల్ల వయసుగల పాప ఉంది. నేను రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా ఇటీవల పాప్‌స్మియర్టెస్ట్ చేయించుకుంటే అందులో ్చ్టడఞజీఛ్చిజూ ఛ్ఛిజూజూట ఠీజ్టీజి ూ/ఇట్చ్టజీౌ ఎక్కువగా ఉన్నట్లు వచ్చింది. అంటే.. క్యాన్సర్ కణాలు ఉన్నట్లేకదా? మా అమ్మ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి రేడియో థెరపీచేయించుకుంటోంది. నాకు చాలా భయమేస్తోంది. గర్భసంచి తీసివేయించుకోవాలనిఅనుకుంటున్నాను. మీరేమంటారు?

పాప్‌స్మియర్ పరీక్ష నివేదిక ఒక్కటే చూసి భయపడకండి. సెర్వికల్ బయాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే.. గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన చిన్న ముక్కను సెర్వికల్ బయాప్సీకి పంపించిన తర్వాత ఒకవేళ ఆ పరీక్షలో క్యాన్సర్ నిర్ధారణ అయితే, అప్పుడు అనే శస్త్రచికిత్స ద్వారా మీ సమస్యను పరిష్కరించవచ్చు. అంతేగానీ క్యాన్సర్ వచ్చేసిందనే భయంతో తొందరపడి గర్భసంచిని తొలగించుకోవలసిన అవసరం లేదు. అసలు 9-45 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలంతా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే 100 శాతం ఈ క్యాన్సర్ బారినుండి తప్పించుకోవచ్చు.

నావయసు 24 సంవత్సరాలు. నేను గర్భవతిని అయ్యాక రెండో నెలలో స్కానింగ్ చేశారు.స్కాన్‌లో బిడ్డ గుండె కొట్టుకోవడం లేదని, మిస్డ్ అబార్షన్ అని చెప్పారు.దీంతో నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇది జరిగి ఆర్నెల్లు అవుతోంది.ఇప్పుడు నాకు రెండోసారి గర్భం దాల్చడానికి భయమేస్తోంది. నేను ఏమైనాజాగ్రత్తలు తీసుకోవాలా?

భయపడాల్సిన అవసరమేమీ లేదమ్మా. మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి మూడు నెలల ముందు నుంచి ఫోలిక్ ఆసిడ్ సప్లిమెంట్స్ తీసుకోండి. సాధారణంగా మూడు నెలలలోపు అబార్షన్‌లు జన్యులోపాల వలనగాని, ఇన్‌ఫెక్షన్ (టార్చ్ ఇన్‌ఫెక్షన్స్)ల వలనగాని, తల్లికి మధుమేహ వ్యాధి నియంత్రణలో లేనప్పుడుగాని, కొన్ని హార్మోన్ల అసమతుల్యత వలనగాని అవుతుంది. మీకు ఈసారి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అవగానే కొన్ని హార్మోన్ల అవసరం ఏర్పడవచ్చు.

నా వయసు 36 సంవత్సరాలు.నేను మూడేళ్ళ కిందట కాపర్-టి వేయించుకున్నాను. ఈ మధ్య ఒక వారం రోజుల నుంచిఇది కిందికి జారినట్లుగా తగులుతోంది. మా వారితో శారీరకంగా కలిసినప్పుడు ఆయనఅంగానికి ఏదో తగిలి నొప్పి పుడుతోందని చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ ఇలాంటిసమస్య మాకు ఎదురవలేదు. ఇప్పుడేం చేయాలి? నాకు చాలా భయంగా ఉంది?

మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. స్పెక్యులమ్ పెట్టి చూసి కాపర్-టి దాని స్థానంలో ఉందో లేదో చెబుతారు. తర్వాత అల్ట్రాస్కాన్ పెల్విస్ చేసి, అది గర్భసంచి పై భాగంలోనే ఉందా, లేక కిందికి జారిపోయిందా అనేది చెక్ చేయించుకోండి. ఒకవేళ కాపర్-టి కిందికే జారి ఉంటే దాన్ని గైనకాలజిస్ట్ తీసివేస్తారు. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. మీ సమస్య తప్పక పరిష్కారమవుతుంది.

నాకువివాహమై ఏడాది అవుతోంది. నా భార్యకు జననేంద్రియం దగ్గర స్వెల్లింగ్ (వాపు)వస్తుంది. మాకు దగ్గరలో ఉన్న డాక్టర్‌కి చూపిస్తే ఇన్‌ఫెక్షన్ అని చెప్పియాంటీబయాటిక్స్ రాసి ఇచ్చారు. అప్పటికి ఆ వాపు తగ్గినా గత మూడు నెలల్లోనాలుగుసార్లు అక్కడ వాపు వచ్చింది. నేను, నా భార్య అక్కడ చాలా శుభ్రంగాఉంచుకుంటాం. అయితే ఈ సమస్య పదే పదే ఎందుకొస్తోంది? దీనికి పరిష్కారం ఉందా?

మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ భార్యకు ఆ్చట్టజిౌజూజీn'ట ఇడట్ట ్చnఛీ అఛటఛ్ఛిటట వచ్చినట్లు అనిపిస్తోంది. ఇది తరచూ వస్తూ ఉంటే శస్త్ర చికిత్స (ఝ్చటటఠఞజ్చీజూజ్డ్చ్టీజీౌn) చేయవలసి ఉంటుంది. మొదట మీ భార్యకు ఊఆఖి, ్క్కఆఖి రక్త పరీక్షలు చేయించండి. డయాబెటిస్ ఉందేమో నిర్ధారించుకోవడం కూడా మంచిది. ఈ పరీక్షల నివేదికలతో మీకు దగ్గర్లో ఉన్న గైనకాలజి స్ట్‌ను సంప్రదించండి. మీ సమస్య పరిష్కారమవుతుంది.

గర్భాశయం జారిపోతే...

కొంత మందిలో గర్భాశయం కిందికి జారుతుంది. సమస్య తీవ్రమైనప్పుడు గర్భాశయ ద్వారాన్ని తోసుకుని జననాంగంలోకి కూడా ప్రవేశిస్తుంది. సమస్య ఉన్నవారు మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా కడుపు మీద ఒత్తిడి కలుగ చేసే పనులకు దూరంగా ఉండాలి. బరువులు ఎత్తడం, ఎక్కువ శ్రమ కలిగించే పనులు చేయడం మానుకోవాలి. అలాగే మలబద్దకం రాకుండా జాగ్రత్త పడాలి.

సమస్య ఉన్నవారిలో కొందరికి కాళ్లు మెలిక వేసి కూర్చుంటే ఉపశమనంగా ఉంటుంది. పొత్తి కడుపు బాగా సన్నబడుతుంది. పొత్తి కడుపు లోంచి ఏదో జారిపోతున్న భావన నిరంతరంగా ఉంటుంది. బహిష్టు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. మలబద్దకంతో బాధపడుతుంటారు. వీరు సెపియా-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున అలా 7 డోసులు వేసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది.

కొందరికి గార్భశయం వద్ద పుండులాంటిది ఏర్పడుతుంది. వీరు నిరంతరం ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఇతర విషయాలమీద ఏకాగ్రత కుదరదు. పొత్తికడుపులో నుంచి జారుతున్నట్టు అనిపించడం వల్ల వీరెప్పుడూ కాళ్లు మెలిక వేసి కూర్చుంటారు. మనసు ఎప్పుడూ అసహనంగా ఉంటుంది. జననాంగం మీద ఒత్తిడి పడినప్పుడు వీరికి శృంగార వాంఛలు ఎక్కువవుతాయి. వీరు మ్యూరెక్స్-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకోవచ్చు.

కొందరికి కడుపులోనూ, పొత్తి కడుపులోనూ ఏదో జరుగుతున్న భావన కలుగుతుంది. జననాంగం మీద చేతిని ఉంచి పైకి నెట్టడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం వల్ల బాధలు మరింత ఎక్కువవుతాయి. మల, మూత్ర విసర్జనకు తరుచూ వెల్ల వలసి వస్తుంది.

ఏ కారణంగానైనా వె ళ్లలేకపోతే ఛాతీ బరువుగా అనిపిస్తుంది. ప్రతి నెలా నిర్ణీత సమయం కన్నా ముందే బహిష్టు వస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కాకుండా కదిలినప్పుడు రక్తస్రావం అవుతుంది. దుర్వాసనగా కూడా ఉంటుంది. వీరు లిల్లియం టిగ్-200 మందును రెండు వారాలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక :ఇక్కడ సూచించిన మందులన్నీ ప్రథమ చికిత్సకోసం ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో తగ్గకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించండి.

సర్విక్స్ (గర్భాశయ ద్వారం) వాపు

సర్విక్స్‌లో వాపు రావడానికి కారణాలు అనేకం. ప్రసవ సమయంలో సర్విక్స్ చీరుకుపోవడం, ఆ భాగం ఇన్‌ఫెక్షన్లకు గురికావడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఇవే కాకుండా గనేరియా లాంటి సుఖవ్యాధులతో బాధపడుతున్నవారికి, గర్భనిరోధక సా«ధనాలు వాడే వారికి కూడా సర్విక్స్‌లో వాపు రావచ్చు. వ్యాధి తీవ్రమైనప్పుడు సర్విక్స్ ఎర్రబడి, అందులోకి నీరు చేరుకుని వాపు వస్తుంది. ముట్టుకుంటే చాలా నొప్పి వస్తుంది. వ్యాధి లక్షణాన్ని అనుసరించి హోమియో మందులు వాడితే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.

కొందరికి సర్విక్స్ ఎర్రగా మారి సూదులతో గుచ్చినట్లు నొప్పిగా ఉంటుంది. తెల్లబట్ట రక్తంతో కలిసి ఉంటుంది. రతి తరువాత రక్తస్రావం అవుతుంది. వీరు నైట్రిక్ యాసిడ్-200 మందును ఉదయం ఒకడోసు చొప్పున, సాయంత్రం ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

సంభోగ వాంఛ కొందరికి పూర్తిగా నశిస్తుంది. సర్విక్స్ గట్టిపడి, పెద్దదై ముట్టుకుంటే నొప్పి కలుగుతుంది. నెలసరి ఆగిపోవడం గానీ, ఆలస్యంగా రావడం గానీ, జరుగుతుంది. జననాంగంలో పొడారి పోవడంతో పాటు నెలసరి వచ్చే ముందు వేడిగానో చల్లగానో ఉంటుంది. ఒక్కోసారి విపరీతమైన దురదగా ఉంటుంది. కొందరికి చనుమొనలు పగుళ్లుబారతాయి. బాగా మలబద్ధకంగా ఉంటుంది. వీరికి గ్రాఫైటిస్-200 మందును ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసుచొప్పున అలా 7 డోసులు ఇస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.

కొందరికి బహిష్టు సమయంలో విపరీతమైన నీరసం ఉంటుంది. సర్విక్స్ బాగా గట్టిపడి పెద్దదవుతుంది. గర్భసంచి కూడా పెరుగుతుంది. తెల్లబట్ట ఎక్కువగానూ, బాగా వాసనతో ఉంటుంది. వీరు కార్బో అనిమాలిస్-200 మందును ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున 7 సార్లు ఇస్తే ఉశమనం లభిస్తుంది.

కొందరికి సర్విక్స్ గట్టిపడి వాస్తుంది. నెలసరి ఆలస్యంగా వచ్చి, రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. బహిష్టుకు ముందు, బహిష్టు సమయంలో కూడా స్తనాలు వాచి నొప్పి పెడతాయి. బహిష్టుకు ముందు సన్నటి దద్దుర్లలాంటివి వస్తాయి. వీరికి కోనియం-200 మందును ఉదయం ఒకడోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున 7 సార్లు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక :ఇక్కడ సూచించిన మందులన్నీ ప్ర«థమ చికిత్సకు ఉద్దేశించినవి. ఒకవేళ ఈ మందులతో ఫలితం కనిపించకపోతే దగ్గరలో ఉన్న హోమియో వైద్యుణ్ని సంప్రదించం

పాలు బాగా పడాలంటే ఎలాంటి ఆహారం తినాలి?

నేనుమగబిడ్డను ప్రసవించాను. బాబు ఆరో గ్యంగానే ఉన్నాడు. నాకు పాలు పడ్డాయి. కానీ సరిపోవడం లేదు. అందుకని డబ్బా పాలు పట్టిస్తున్నాను. అవీఇవ్వాల్సినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది. పాలు బాగా పడాలంటే ఎలాంటి ఆహారంతినాలి? పెద్దవాళ్ళు పత్యం చేయాలి అంటూ నా కిష్టమైన పెరుగు, గుడ్లు, కనీసంఫ్రూట్సు, ఆకుకూరలు కూడా తినని వ్వటం లేదు. తింటే నాకేమీ అవ్వదట గానీబాబుకి అనారోగ్యమట. కుటుంబ నియం త్రణకి (టుడే) వాడవచ్చునా?

పాలతల్లి అన్నీ తినవచ్చునమ్మా, ఏం ఫర్వా లేదు. ముఖ్యంగా గుడ్లు, ఆకు కూరలు, పళ్ళు మానవద్దు, మీ బిడ్డ పెరుగుదలకి అవసరమై న ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు మీ పాల ద్వారానే మీ బిడ్డకు అందాలి. వాటిని మీరు సమృద్ధిగా తినండి. రోజూ 2,3 గ్లాసుల పా లు త్రాగండి. పళ్ళరసాలు తీసుకోండి లేదా కొబ్బరినీళ్ళు తీసుకోండి. తెలగపిండికూర మంచిది. కుటుంబ నియంత్రణకు టుడే వాడవచ్చును.

ఒక్కొక్క స్ర్తీకినెల తప్పిన నుండి డెలివరి అయ్యేవరకు ఏ ఆహారం తీసుకున్నా వాంతులుఅవుతున్నాయి, ఆ స్ర్తీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లి తీసుకునేఆహారం, గాలి మీదనే ఆధారపడి ఉన్న స్ర్తీ గర్భంలోని శిశువు గతి ఏమీ కావాలి? ఇలాంటి స్ర్తీలు చాలా అరుదుగా ఉంటారు. డెలివరి అయ్యే వరకూ వాంతులు అవటానికిముఖ్యమైన కారణం ఏమిటి? ఇలాంటి స్ర్తీలకు మీరిచ్చే సలహా ఏమిటో చెప్పగలరు.

మామూలుకంటే ఎక్కువగా వాంతులై, తిన్నదేది ఇమడకపోతే ఆది ప్రమాదమే! అలాంటి పేషెంటును పూర్తిగా డాక్టరు సంరక్షణలోనే ఉంచాలి. పెద్ద హాస్పిటల్లో ఉంచటం మంచిది. గర్భం ధరించిన వెంటనేకాని కొద్దివారాల్లోకాని ఆడవాళ్ళందరికీ కడుపులో త్రిప్పుట, వాంతులు మొదలవుతాయి. పొద్దుటవేళ త్రిప్పటం ఎక్కువగా ఉంటుంది. తిన్నదంతా కక్కేసుకోవటం జరగదు. ఇది మామూలు ఆడవాళ్ళ సంగతి.

కొందరికి మీరు చెప్పిన పేషెంటులా - పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతుంది. కనుక డిహైడ్రేషన్‌, కాళ్ళు తేలిపోవటం, బరువు కోల్పోవటం జరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందీ అంటే ఒక్కొక్కరూ ఒకొక్కలా చెబుతున్నారు. మొత్తంమీద గర్భం ధరించటం వల్ల ఒంట్లో సంభవించే అనేక రకాల రసాయనిక మార్పులకి శరీరం ఎడ్జస్టు కాలేకపోతోందనీ, అందుకు వాంతులు కలుగుతున్నాయనీ చెప్పుకోవచ్చు. న్యూరోసిస్‌(నరాల బలహీనత) ఉన్న స్ర్తీలే ఎక్కువడా దీనికి లోనవుతున్నారు.

జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు, కొన్ని అంటురోగాలూ, మెదడుకి, మెదడు పొరలకి సోకిన వ్యాధూలు కూడా ఈ పరిస్థితి తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అతివమనానికి క్లోర్‌ప్రామజైన్‌, ఇతర ఏంటీ హిస్టమైన్‌లు బాగానే పనిచేస్తాయి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించి కార్బో హైడ్రేట్లు ఎక్కువడా ఉండే దుంప పదార్థాలు, పళ్ళు, కూరలు తీసుకోవాలి. బార్లీజావ మంచి ది. ఫ్రూట్‌జామ్‌, నిమ్మకాయ ఊరగాయ మం చివి. మలబద్ధం గర్భవతులకు సహజం కను క దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఆ బాధ లేకుండా జాగ్రత్త పడాలి. అతివమనం మరీ ఎక్కువడా ఉంటే ఉపశమనకారులు వా డవచ్చు. మందుల ప్రభావం బిడ్డ మీదుంటుం ది సుమా. అందువల్ల స్వంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికి రాదు. ఈ అతివమనం చికిత్సకి లొంగకుండా ఎక్కువకాలం కొనసాగితే ఆ స్ర్తీ శరీరంలోని పిండి పదార్థ నిల్లలూ, ఆపై కొవ్వు నిల్వలు కలిగిపోయి రక్తంలో విషపదార్థాలు చేరుతాయి.

ఆ స్ర్తీ గబగబా బరువు తగ్గిపోతుంది. చర్మమూ, ఎముకలూ తప్ప కండలేదనిపిం చేలా తయారవుతుంది. అంతదాకా రానివ్వ కూడదు. వచ్చిందా హాస్పిటల్లో చేరాల్సిందే. అక్కడ డాక్టర్లు అన్నం మాన్పించి రెండు రోజుల పాటు సెలైను, గ్లూకోజు ఎక్కిస్తారు. పేషెంటు వెంటనే కోలు కుంటుంది. అపైన పళ్ళ రసాలు బార్లీ జావ మొదలైన వాటితో మొ దలుపెట్టి క్రమేణా మళ్ళీ ఆహారం లోకి దించుతారు. ప్రాణ ప్రమాద పరిస్థితే వస్తే ఆ గర్భాన్ని తొలగించైనా తల్లిప్రాణాన్ని కాపాడతారు. ఇంటి దగ్గర ఇవేవీ వీలుకావు.

గర్భవతి అయితే కొందరికి హై బీ.పీ.

నాకు 26 సంలు నా భార్యకు 22 సంలు. మేముకాపురం చెయ్యబట్టి 9 సం లయ్యంది. నా భార్యకు గతంలో సిజేరియన్‌తో అబ్బాయిపుట్టాడు. ఎందుకంటే అప్పుడు నా భార్య కు బీ.పీ., వచ్చింది. 180/90 ఇలావచ్చింది. డాక్టరు గారు గర్భవతి అయితే కొందరికి హై బీ.పీ., వస్తుందిఅన్నాడు. ?

గర్భవతులకు రక్తపుపోటు ఎక్కువయితే అది బిడ్డకు ప్రమాదిస్తుంది. మరీ ఎక్కువై ఇతర దుర్లక్షణాలు కూడా తోడయితే తల్లికి కూడా మంచిది కాదు. గర్భం పోవటానికి అధిక రక్త పుపోతే కారణం కావచ్చు. మామూలుగా గర్భ వతికి బి.పి 110/70 నుండి 120/80 వర కూ ఉంటుంది. ఆ పైబడితే ముఖ్యంగా 120 ఉండాల్సినది 140కి పెరగటం గానీ, 80 ఉండాల్సినది 90 దాటినా గానీ- అది బిడ్డకూ తల్లికీ విషమపరిస్థితి అనే చెప్పుకోవాలి.బీ.పీ., పెరగడంతో పాటు, వంటికి నీరు పట్టడం, మూత్రంలో తెలుపు పోవటం కూడా జరిగి ఉంటాయి. దీన్ని టాక్సీమియా అంటాం. బిడ్డకు మావి ద్వారా అందవలసిన రక్త సరగా తగ్గిపోయి, ఆమేరకు తల్లి రక్తపుపోటే పెరుగు తుంది. బిడ్డకి రక్తం సరఫరా తగ్గిపోవటం వల్ల దానికి ఆక్సిజన్‌ లోపం ఏర్పడుతుంది. బిడ్డ విసర్జించే మలినాలు బయటకి పోవటం తగ్గిపోతుంది. బిడ్డకు హాని కలగడానికి కారణం ఇదే! ఇంతకీ ఈ లోపం ఏర్పడటానికి మూల కారణమేమి టో ఇద్దమిద్ధంగా తెలీదు. గర్భ వతి అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకో వటం అవసరం.

  • టాక్సీమియాకి మొదటి లక్షణం కాళ్ళలో నీరు చేరటం! కనుక కాళ్ళలో నీరు చేరటం మొదలయితే ఆమెను పూర్తిగా బెడ్‌రెస్టు తీసు కోవాలి. తెల్లవారేసరికి వాపులు తగ్గిపోతాయి. తగ్గకపోతే ఇది టాక్సీమియా వల్ల కలిగిందను కోవచ్చు.
  • 7వ నెదాకా నెలనెలా బీ.పీ చెక్‌ చేయించాలి. బీ.పీ పెరగటం మొదలు పెట్ట గానే బెడ్‌రెస్ట్‌ తీసుకోవాలి. గర్భిణీ స్ర్తీల బీ.పీ మందులకు అంతగా తగ్గదు. 7వ నెల దాటి నప్పటి నుంచీ 15 రోజులకొకసారి అవసరమై తే ఇంకా తక్కువ వ్యవధిలోను బీ.పీ చెక్‌ చేయించుకోవాలి.
  • నెలనెలా కానీ, అవసరాన్ని బట్టి ఇంకా తక్కువ వ్యవధుల్లో గానీ మూ త్ర పరీక్షచే యించుకుంటూ మూత్రంలో ప్రో టీను ఎంత పోతున్నదీ నిర్థారింపజేయాలి. టాక్సీమియా ఏ స్థాయిలోఉన్నదో ఈ 3 పరీక్ష లూ చెబుతాయి. బెడ్‌రెస్టు విషయంలో ఆశ్రద్ధ చెయ్యకూ డదు. రక్తలేమి కలగకుండా ఐరన్‌ టానిక్‌లు తీసుకోవాలి. బి కాంప్లెక్సు మాత్రలు తీసు కుంటే టాక్సీమియా ప్రభావం తక్కువగా ఉం టాయట. బీ.పీ ఎక్కువగా ఉంటే హాస్పి టల్లో చేరిపోవాలి. నెలలు తక్కువ బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆ రకం బిడ్డల్ని సాకటానికి ‘‘ఇంక్యుబేటరు’’ సదుపా యం ఉన్న ఆస్పత్రులలో చేరటం మంచిది. 9 నెలల గర్భాన్ని దక్కించుకుని గర్భశోకాన్ని తప్పించుకోవటానికి ఈ మాత్రం శ్రద్ధ తీసుకోవటం అవసరం.

గర్భదారణ నుంచి ప్రసవం వరకు

తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని గర్భిణుల ఆరోగ్య పరిరక్షణపై కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. వారోత్సవాల సందర్భంగా గర్భిణుల ఆరోగ్య జాగ్రత్తలపై కథనం...

అధిక రక్తపోటుతో కూడా ట్రాక్సేమియా లాంటి కొన్ని పరిస్థితులు కలిగి మరణానికి దారితీయవచ్చు. అధిక రక్తపోటుతో ఎడిమా, ఫిట్స్‌ రావచ్చు. దీన్నే ‘ఎక్లామ్‌ప్సియా’ అంటారు. గర్భంధరించిన వాళ్ళల్లో ఎక్లామ్‌ప్సియా 0.88శాతం రెంయి 4.6శాతం వరకు ఉంటున్నాయి. ఈ కారణంగా మెడికల్‌ మోరాలిటి 20 శాతం ఎక్లామ్‌ప్సియాని నివారించవచ్చు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మన దేశంలో నేడు ఇది సమస్యగా మారింది. కాబట్టి గర్భం ధరించింది మొదలు ప్రసవం అయ్యేంత వరకు పద్ధతి ప్రకారం జరగాలి.

మెటర్నల్‌ డెత్స్‌కి మరోకారణం కామెర్లు - జాండీస్‌. గర్భం దాల్చినప్పుడు వైరల్‌ హెపటైటిస్‌ వల్ల ఈ కామెర్లు రావచ్చు. ఇది ప్రాణాంతక సమస్య. గర్భిణుల మరణాల్లో 30 నుంచి 50శాతం మరణాలకి కారణం ఈ కామెర్లు. నాటు వైద్యుల వల్ల ఆలస్యంగా జాండీస్‌ చికిత్సకు వైద్యుల వద్దకు వెళుతుంటారు. గర్భిణీ స్ర్తీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రమైన కాచి చల్లార్చిన నీటినే తాగాలి. దీంతో జాండిస్‌ రాకుండా కాపాడుకోవచ్చు. ఆహార నాళంలో ఇబ్బందులూ కలుగకుండా కాపాడుకోవచ్చు. బయట హోటళ్ళ ఆహార పదార్థాలు తీసుకోవద్దు.

అనీమియా...

గర్భం ధరించినప్పుడు రక్తహీనత కలగడం జరగవచ్చు. పేదరికం వల్ల సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, సరైన అవగాహనలేకపోవడం వల్ల ‘అనీమియా’ వస్తుంటుంది. వీళ్ళు గర్భానికి ముందూ, ప్రసవానంతరం కూడా సరైన ఆహారం తీసుకోవాలి. ఈ విషయంలో అందరిలో అవగాహన పెంచాలి. శుభ్రమైన ఆకుకూరలు, తాజాపండ్లు, బోన్‌సూప్‌ లాంటివి తీసుకోవాలి. ఒక సారి గర్భం దరించడానికి మరోసారి గర్భం ధరించడానికి మధ్య సరైన వ్యవధి ఉండాలి. అప్పుడు రక్తహీనత కలుగవచ్చు. ఈ రక్తహీనత తీవ్రమైతే గుండె దెబ్బతినవచ్చు.

తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని గర్భిణుల ఆరోగ్య పరిరక్షణపై కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. వారోత్సవాల సందర్భంగా గర్భిణుల ఆరోగ్య జాగ్రత్తలపై కథనం...

రక్తహీనత తీవ్రమైతే గుండె దెబ్బతినవచ్చు.

గుండె జబ్బులు, ఊపిరితిత్తుల టి.బి. లాంటి వాటి వల్ల కూడా గర్భిణీలలో మరణం సంభవించవచ్చు. శస్తచ్రికిత్స, ఎనస్థీషియా లాంటి సమస్యల వల్ల మరణం సంభవించవచ్చు.

తల్లికి పాలు పడాలంటే

  • ఆయుర్వేదం ప్రకారం చనుబాలు బాగా పడడం కోసం ఆహారంలో మధుర (తీపి), ఆమ్ల (పులుపు) పదార్థాలు ఎక్కువగా తినాలి.
  • పాలు, నెయ్యి, నూనె, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బిడ్డకి పాలు ఇవ్వడానికి ముందుగా ఒక గ్లాసు పాలు తాగాలి.
  • తల్లిపాలు కావలసినన్ని స్రవించేందుకు నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఈ జీలకర్ర కషాయం ప్రసవించిన తల్లికి వీలైనంత త్వరగా ఇవ్వడం మొదలుపెట్టవచ్చు. రెండు పూటలా దీన్ని ఇస్తుండాలి (గర్భవతిగా ఉన్నప్పుడే మొదలెట్టవచ్చు).
  • మెంతులు పొడి చేసి ఉదయం, రాత్రి ఒక చెంచా చొప్పున గోరువెచ్చని నీటితో ఇవ్వాలి.
  • మెంతులే కదా అని ఎక్కువగా ఇవ్వకూడదు. మెంతులు చక్కెరని తగ్గించి, నీరసానికి దారి తీయవచ్చు. అందువల్ల పరిమితంగా మాత్రమే ఇవ్వాలి.
  • మెంతులు, బెల్లం లడ్డూలా చేసి కూడా ఇవ్వవచ్చు.
  • శతావరీ (పిల్లిపీచర) చూర్ణం 1-2 గ్రాములు పాలలో కలిపి రెండు పూటలా ఇవ్వాలి.
  • తమలపాకుల మీద నువ్వుల నూనె లేదా ఆముదం పూసి రోజూ స్తనాల మీద పెడుతుంటూ పాలు బాగా స్రవిస్తాయి.
  • ఆముదాన్ని పూసి మృదువుగా మర్దన చేయవచ్చు.
  • ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారం- స్తన్యవర్ధక క్వాధ చూర్ణం, శతావరీ లేహ్యం, జీరకాద్యరిష్టం, సౌభాగ్యశుంఠి వంటి ఔషధాలు వాడవచ్చు.

ప్రసవానికి ముందే :

గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలల నిండిన దగ్గర్నుంచీ రొమ్ముల మీద ఆముదాన్ని మృదువుగా మర్దన చేయడం, సలాడ్‌ ఆకులు, పాలకూర, ఇతర ఆకుకూరలు ఎక్కువగా తింటూ, పోషకాహారం తీసుకుంటే, బిడ్డకి పాలు తక్కువయ్యే సమస్య రావడానికి అవకాశం తక్కువ.

ప్రసవం... ఓ పునర్జన్మ...

ఒక స్ర్తీ గర్భంధరించినప్పుడు, ప్రసవానంతరం 42 రోజుల్లో మరణం సంభవిస్తే దానిని గర్భం వల్ల జరిగిన మరణంగా ‘ మెటర్నల్‌ మోర్టాలిటి’గా అంటారు. ప్రతీ సంవత్సరం ప్రసవం లేక గర్భం తాలూకు అనారోగ్య సమస్యలతో లక్షమంది స్ర్తీలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. వాటిలో 99శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్నాయి. మనదేశంలో ఏటా లక్షమంది దాకా ఇలా ‘మెటర్నల్‌ మరణాలకు’ లోనవుతున్నారు. వీటిలో 75శాతాన్ని అరికట్టవచ్చు. గర్భం ధరించిన తరువాత, ప్రసవానికి పూర్వం సకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ మరణాలను అరికట్టవచ్చు.

ఒక స్ర్తీ గర్భంధరించినప్పుడు, ప్రసవానంతరం 42 రోజుల్లో మరణం సంభవిస్తే దానిని గర్భం వల్ల జరిగిన మరణంగా ‘ మెటర్నల్‌ మోర్టాలిటి’గా అంటారు. ప్రతీ సంవత్సరం ప్రసవం లేక గర్భం తాలూకు అనారోగ్య సమస్యలతో లక్షమంది స్ర్తీలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఈ మరణాలలో అధిక భాగంహెమరేజ్‌ (రక్తస్ర్తావం), సెప్సిన్‌, అధిక రక్తపోటు వంటివి గర్భం ధరించిన సమయంలో ఉండటంతో జరుగుతున్నాయి. వీటితో పాటు ఆర్థిక సామాజిక వెనుకబాటు, అణచివేత, అపరిశుభ్రత, పరిశుభ్రమైన తాగునీరు లభించక పోవడం, సరైన ఆరోగ్య అవగాహన లేకపోవడం లాంటివి కూడా కొంత వరకు కారణం.

 

రక్తస్రావం :

గర్భం ధరించిన వాళ్ళల్లో ఏ సమయంలో రక్తస్రావం అయినా దానిని ఒక వార్నింగ్‌గా గుర్తించి వెంటనే వైద్యుల్ని కలవాలి. గర్భం ధరించినప్పుడు రక్తస్రావం అవడానికి ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి వెంటనే కారణాల్ని కనుక్కుని తగిన చికిత్స చేయడం అవసరం. గ్రామాలలో ఇర్రివర్సబుల్‌ ఉషాక్‌లో పేషెంట్‌ ఉన్నప్పుడు స్పెషలిస్ట్‌ల దగ్గరికి తీసుకెళ్ళడం ఆలస్యమైతే ఇలాంటి కష్టాలుంటాయి. సరైన అవగాహన లేకపోవడం, రోగి తీవ్ర పరిస్థితిని తెలుసుకోలేకపోవడం లాంటివి నాటువైద్యాల వల్ల కలుగుతుంటాయి. ఆసుపత్రికి తీసుకువచ్చినా రక్తమార్పిడికి కావల్సిన వసతులుండకపోతే, కొన్ని గ్రూపుల రక్తం లభ్యం కాకపోయినా రోగి బాగా నీరసించిపోవచ్చు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో చుట్టుప్రక్కల ప్రజలు రక్తదానానికి ముందుకు రావాలి. కొద్దిగా రక్తాన్ని ఇవ్వడం వల్ల వీళ్ళ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అక్కడ పెద్ద ప్రాణం రక్షించవచ్చు.

సెప్టిక్‌ అబార్షన్‌ :

మెటర్నల్‌ డెత్స్‌కి మరో ముఖ్యకారణంగా సెప్టిక్‌ అబార్షన్‌ అని పేర్కొనాలి. అబార్షన్‌ లీగ లైజ్‌ అయినా ఈ సెప్టిక్‌ అబార్షన్‌ తగ్గకపోవటం గురించి ఆలోచించాలి. ఇలాంటి అబార్షన్‌ ఎక్కువగా పల్లెటళ్ళలో నాటు వైద్యుల వల్ల జరుగుతుంటాయి. సమస్య తీవ్రమైనప్పుడే, ఆలస్యంగా స్పెషలిస్టులను కలుస్తుంటారు. చాలామంది అబార్షన్‌ని ఎవ్వరికీ తెలియకుండా చేయించుకోవాలనుకుంటారు. ఇబ్బందైనప్పుడే స్పెషలిస్ట్‌లను కలుస్తారు. గర్భం దాల్చి మరణించే వాళ్ళల్లో ప్రతి నలుగురిలోనూ ఒకరు ఈ సెప్టిక్‌ అబార్షన్‌తో మరణిస్తున్నారు.అందుకనే గర్భం ధరించటం, గర్భం ధరించినప్పుడు, ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచటం చాలా అవసరం.

సంతానలేమి

ఇటీవలి కాలంలో సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పని ఒత్తిడి, కాలుష్యం, వ్యాయామలేమి, ఇతర అనారోగ్యసమస్యలు వారిలో సంతానలేమికి కారణమవుతున్నాయి. అయితే సంతానలేమి సమస్యలకు హోమియోలో మంచి వైద్యం అందుబాటులో ఉందంటున్నారు హోమియో వైద్యులు డా. చంద్రశేఖర్‌రావు. సంతానలేమికి గల కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చికిత్సా విధానాన్ని ఆయన వివరిస్తున్నారు.

ఒక ఏడాది పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా వైవాహిక జీవితం కొనసాగించినా పిల్లలు కలగకపోతే సంతానలేమి సమస్య ఉన్నట్లుగా భావించాలి. సంతానలేమికి కారణాలు స్త్రీలలోనే ఉంటాయనుకుంటారు. కానీ పురుషుల్లోనూ ఉంటాయి. కొందరిలో ఎటువంటి కారణం కనిపించదు. కానీ సంతానలేమి ఉంటుంది. సంతానలేమికి పురుషుల్లో కనిపించే కారణాలు, సమస్యలు, చికిత్స గురించి తెలుసుకుందాం.

వీర్యకణాలు :

మామూలుగా ప్రతీ పురుషునిలో 3 నుంచి 6 మి.లీ. వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఇందులో దాదాపు 60 నుంచి 150 మిలియన్ల వీర్యకణాలుంటాయి. ప్రతి వీర్యకణానికి తల, మెడ, తోక భాగాలు ఉంటాయి. సాధారణంగా వీర్యంలో దాదాపుగా 60 నుంచి 70 శాతం చురుకుగా కదిలే వీర్యకణాలు ఉంటాయి. 80 శాతం కణాలు మామూలు ఆకృతిని కలిగి ఉంటాయి. పైన చెప్పుకున్న విధంగా వీర్యకణాలుంటే దానిని సంతానం కలిగించే వీర్యంగా అభివర్ణించవచ్చు.

వీర్యకణాల సమస్యలు

అజూస్పెర్మియా : వీర్యకణాలు అసలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. వీర్యం నీటివలే, అతి పలుచగా ఉంటుంది.

అలిగోస్పెర్మియా : వీర్యకణాల సంఖ్య 60 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది.

అలిగోఅస్థినోస్పెర్మియా: వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉంటుంది.

కారణాలు :

  • హార్మోన్ల లోపం. ఠి మానసిక ఒత్తిడి.
  • వెరికోసీల్. ఠి ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం.
  • బీజంలో సమస్యలు.
  • అంగస్థంబన సమస్యలు.
  • పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా సంతానలేమికి కారణమవుతుంటాయి.

పరీక్షలు :

సంతానలేమికి కారణం తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెమన్ అనాలసిస్ టెస్ట్ ద్వారా వీర్యకణాల సంఖ్య, చురుకుగా ఉన్న కణాల సంఖ్యను తెలుసుకునే వీలుంది. దీనివల్ల సమస్యను సులభంగా గుర్తించవచ్చు. వీర్యంలో క్రిముల నిర్ధారణ పరీక్ష కూడా సమస్యను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అల్ట్రా సౌండ్ పరీక్ష ద్వారా బీజంల పనితీరు, లోపాలు తెలుసుకోవచ్చు. సంతానలేమికి కారణం తెలుసుకోవడానికి ఉపయోగపడే మరొక పరీక్ష బయాప్సీ. ఇందులో బీజంలో నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షించడం జరుగుతుంది. హార్మోన్ల లోపం తెలుసుకోవడానికి హార్మోన్స్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.

చికిత్స :

సంతానలేమి సమస్యలకు హోమియోలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ముందుగా అవసరమైన పరీక్షలు చేసి సమస్య ఏమిటో తెలుసుకోవడం, ఆ తరువాత మరిన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకోవడం జరుగుతుంది. తరువాత సమస్యను బట్టి మందులను అందివ్వడం జరుగుతుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే అందుకు తగిన మందులు ఇవ్వడం, హార్మోన్ల లోపం ఉంటే శరీరంలో ఆ హార్మోన్ సహజంగా ఉత్పత్తి అయ్యే విధంగా మందులను ఇవ్వడం జరుగుతుంది. ధూమపానం, ఆల్కహాల్ అలవాటు ఉంటే డీ అడిక్షన్ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

వెరికోసీల్ సమస్య ఉంటే అందుకు తగిన హోమియో మందులను వాడాల్సి ఉంటుంది. అంగస్థంబన సమస్యలు ఉంటే దానికి కూడా చికిత్సను ఇవ్వడం, సంతాన సాఫల్యత లభించేలా చేయడం జరుగుతుంది. పైగా హోమియో మందుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

గర్భాశయ సమస్యలకు పల్సటీల్లా

కడుపులో బిడ్డ పూర్తిగా ఎదిగిన తరువాత గర్భకోశం సంకోచం చెంది శిశువు బయటకు విడుదల అవుతుంది. అలాకాకుండా నెలలు నిండక ముందే అంటే బిడ్డ పూర్తిగా ఎదగక ముందే గర్భకోశం సంకోచం చెందితే...? దాని ఫలితమే అబార్షన్... గర్భస్రావం. అండం ఫలదీకరణం చెందిన తరువాత జరాయువు కూడా పూర్తిగా ఏర్పడక ముందే కొందరిలో ఆ పిండము బయటకు వచ్చేస్తుంది.

 

దీన్నే గర్భస్రావం అంటారు. నెలలు నిండక ముందే గర్భకోశం సంకోచం చెందడమే దీనికి కారణం. గర్భస్రావం 28 వారాల ముందు ఎప్పుడైనా జరగవచ్చు. సాధారణంగా 12 వారాలలోపు ఎక్కువగా జరుగుతుంది. గర్భస్రావం తరచుగా ఒకే సమయంలో జరుగుతున్నట్లయితే దానిని హాబిచ్యువల్ ఆబార్షన్ అంటారు.

లక్షణాలు :

గర్భస్రావం జరిగినపుడు సాధారణంగా కనిపించే లక్షణం నొప్పి, రక్తస్రావం. అండం గర్భాశయం నుంచి విడిపోయినపుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తమే గర్భాశయానికి ఫారెన్‌బాడీగా పనిచేస్తుంది. దాంతో గర్భాశయం సంకోచం చెందుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అండం బయటకు పంపించబడుతుంది. ఉదరం రక్తస్రావంతో నిండి ఉంటుంది. చర్మం రంగు ఎరుపుగా మారుతుంది.

కారణాలు :

పుట్టుకతో గర్భాశయం సరిగ్గా ఏర్పడకపోవటం. థైరాయిడ్ సమస్య ఉండటం. దీర్ఘకాలిక మలబద్దకం. ఎక్కువగా పెయిన్‌కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులు వాడటం. ఎక్కువ శారీరక శ్రమ, ఆందోళన. సిఫిలిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు. ఫైబ్రాయిడ్స్. అధిక రక్తపోటు, డయాబెటిస్.

చికిత్స :

హార్మోన్లలో మార్పులు, గర్భాశయ ఇన్‌ఫెక్షన్, మలబద్దకం వంటి సమస్యలకు సహజపద్ధతుల ద్వారా చికిత్సనందించవచ్చు. గర్భాశయంలో పుట్టుకతోనే లోపాలుంటే శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. తరచుగా గర్భస్రావం అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడం, తల భాగం కిందకు ఉండేలా పడుకోవడం,

గర్భంతో ఉన్నప్పుడు శృంగారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు చల్లని నీటితో రెండు పూటలా స్నానం చేయాలి. దీనివల్ల గర్భాశయపు వాపు తగ్గుతుంది. యోగిక్ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా హార్మోన్లలో మార్పులను సవరించుకోవచ్చు. సర్వాంగాసన, వజ్రాసన, భుజంగాసన, శలభాసన, ధనురాసన, త్రికోణాసన వంటి యోగాసనాలు వేయడం ద్వారా థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్, లైంగిక హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. గర్భం ధరించిన రెండు నెలలవరకు ఈ యోగాసనాలు వేయవచ్చు.

హోమియో మందులు

ఎపిస్ : అండాశయంలో వాపు, భరించలేని నొప్పి, ఎక్కువగా కుడిపైపు అండాశయంలో నొప్పి, ఉదరంలో నొప్పి, గర్భాశయంలో నొప్పి, తలనొప్పి, బలహీనత, భయం, కోప స్వభావం, బాధ, మూత్రాశయ సమస్యల వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు వాడదగిన ఔషధం.

బెల్లడోనా : ఇది తరచుగా జరిగే గర్భస్రావానికి వాడదగిన మందు. నడుం నొప్పి, రుతుస్రావంలో సమస్యలు త్వరగా రావడం, అధిక రక్తస్రావం, తొడ భాగంలో నొప్పి, ఉదరంలో నొప్పి, ఛాతి బరువుగా ఉండి నొప్పితో ఉండటం, వక్షోజాలలో కణితి ఏర్పడటం, పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, వెలుతురు, శబ్దాలను భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు బెల్లడోనా మందు ఉపయోగించవచ్చు.

కామమిల్లా : రుతుస్రావం ఎక్కువగా కావడం, భరించలేని నొప్పి, రుతుచక్రంలో సమస్యలు, లుకేరియా, కోప స్వభావం, చిరాకు, దాహం ఎక్కువ, నొప్పి ఉన్న చోట మొద్దుబారడం, రాత్రుళ్లలో చెమటలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.

పల్సటిల్లా : తరచుగా జరిగే గర్భస్రావానికి వాడదగిన మందు. రుతుస్రావం రాకపోవడం, ఆలస్యంగా రావడం, లుకేరియా, నడుం నొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత, రక్తహీనత, పిరికితనం, భయం వంటి లక్షణాలకు వాడదగిన మందు.

సబైన : రుతుచక్రంలో సమస్యలు, రుతుస్రావం ఎక్కువగా కావడం, తరచుగా గర్భస్రావం జరగడం, అండాశయంలో వాపు, గర్భాశయ వాపు, గర్భాశయంలో కణితి, నొప్పి వెనకభాగం నుంచి ముందుకు వ్యాపించడం, భరించలేని తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపకరిస్తుంది.

సికెల్‌కార్ : రుతుచక్రంలో సమస్యలు, నొప్పి, గర్భాశయంలో నొప్పి, మంట, తరచుగా గర్భస్రావం కావడం, జ్వరం, లుకేరియా వాసనతో కూడి ఉండటం, ఆందోళన, బలహీనత, దాహం, ఆకలి ఎక్కువ, రక్తపోటు, తలనొప్పి, జుట్టురాలడం, ముఖం పాలిపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం ఇది.

నక్స్‌మాస్కట : గర్భాశయ సమస్యలు, రుతుస్రావంలో సమస్యలు, లుకేరియా రక్తంతో కూడి ఉండుట, మత్తుగా ఉండటం, రుతుస్రావం సమయానికి రాకపోవడం, బలహీనత, మతిమరుపు, చల్లగాలిని భరించలేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడదగినది. క్రోకస్ : రక్తస్రావం పలుచగా గడ్డలు, గడ్డలుగా పడుతుండటం, కడుపులో ఏదో కదిలినట్లు అనిపించడం, వికారం, కదిలితే రక్తస్రావం కావడం వంటి లక్షణాలకు వాడదగిన మందు.

ఎరిజిరాన్ : ఎక్కువ శారీరక శ్రమ వలన గర్భస్రావం కావడం, మూత్రాశయంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో వేడి, మంట, లుకేరియా రక్తంతో ఉండటం, గర్భాశయం బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్న వారికి సూచించదగిన మందు.



మీ సూచనను పోస్ట్ చేయండి

(పై కంటెంట్‌పై మీకు ఏమైనా వ్యాఖ్యలు / సూచనలు ఉంటే, దయచేసి వాటిని ఇక్కడ పోస్ట్ చేయండి)

కామెంట్‌లు లేవు: