8, జూన్ 2021, మంగళవారం

నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన, భయంకరమైన నొప్పి రాకుండా ఏం చేయగలము? నెలసరి నొప్పికి నివారణ ఏమిటి?లింక్స్ లో చూడాలి

ఓ వయసు వచ్చాక మొదలయ్యే నెలసరి మహిళల జీవితాంతం వారితోనే ఉంటుంది. కొంతమందికి ఇది ఇరెగ్యులర్‌గా ఉంటుంది. అలాంటి వారు వాటిని రెగ్యులర్ చేసుకోవాలో తెలుసుకోండి.

    

ఇరెగ్యులర్ పీరియడ్స్.. చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య. ఈ ప్రాబ్లమ్ వల్ల కేవలం ఇదే మరికొన్ని సమస్యలు కూడా చుట్టు ముడతాయి. వివాహం అయ్యాక ఈ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ముందుగానే ఈ సమస్యని తగ్గించుకోవాలి. దీని కోసం ఆస్పత్రులు, మెడిసిన్స్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలతో కూడా సమస్యని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

అల్లం

అల్లం అనేది గొప్ప ఔషధం అని చెప్పొచ్చు. వంటల్లో అధికంగా వాడే ఈ ఆహార పదార్థం ఆరోగ్యం విషయంలోనూ ఎంతగానో సాయపడుతుంది. దీనిలోని గొప్ప గుణాలు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారంగా మారతాయి. అందుకే దీనిని చాలా రకాలైన ఔషధాల తయారీల్లోనూ వాడతారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించి పీరియడ్స్‌ని రెగ్యులర్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత దీనిని వడకట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాసింత తేనెని కలపండి. దీనిని ప్రతీ రోజూ భోనం చేసిన తర్వాత తాగండి. దీని వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌‌గా తయారవుతాయి.


సోంపు

సోంపు కూడా ఈ సమస్యకి పరిష్కారం చూపుతుంది. రుతుసమస్యలను సరిచేసే గుణం దీనికి ఉంటుంది. సోంపు, సోంపు గింజల ఆకులు కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ ప్రాబ్లమ్‌‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ గింజలను బహిష్టు సమయంలో వాడడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఈ గింజలను వాడి పీరియడ్స్‌ని ఎలా రెగ్యులర్ చేసుకోవాలో చూద్దాం.. ఇందుకోసం ముందుగా రెండు టీస్పూన్ సోంపుని తీసుకుని రాత్రంతా నానెబట్టండి. ఇప్పుడు ఉదయాన్ని ఆ నీటిని వాడబోసి తాగండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యేవరకూ వీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగానే సమస్య పరిస్కారం అవుతుంది.


దాల్చిన చెక్క

మసాలా దినుసుల్లో ఒక్కటైన దాల్చిన చెక్కలోనూ ఎన్నో చక్కని గుణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి సమస్యను తగ్గించుకోవచ్చు. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ మసాలా దినుసు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి రుతు క్రమ సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం దాల్చిన చెక్కని చక్కగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని గోరువెచ్చని పాల్లలో కలిపి తాగాలి. అదే విధంగా.. మీరు తీసుకునే ప్రతీ ఆహారంపైనా ఈ పొడిని చల్లుకుని తీసుకోవచ్చు. దీని వల్ల పీరియడ్స్ కచ్చితంగా రెగ్యులర్ అవుతాయి.


పండ్లు, కూరగాయల జ్యూస్‌లుహార్మోన్స్ మార్పుల వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. అయితే అన్ని రకాలైన పోషకాలు, మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అందుకోసం రకరకాల పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. అదే విధంగా క్యారెట్, ద్రాక్ష వంటి వాటిని జ్యూస్ చేయడం వల్ల కచ్చితంగా రుతుక్రమ సమస్యలన్నీ దూరం అవుతాయి.

ఆపిల్ సిడర్ వెనిగర్..

పీరియడ్స్‌ని రెగ్యులర్ చేయడంలో ఆపిల్ సిడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ సరిగ్గా ఉంటాయి. దీనిని ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం ఎలా వాడాలో చూద్దాం.. గ్లాస్ వాటర్‌లో రెండు స్పూన్స్ ఆపిల్ సిడర్ వెనిగర్‌ని బాగా కలపండి. ఇది భోజనానికి ముందు తాగండి. ఓ పది నిమిషాల తర్వాత భోజనం చేయండి. దీని వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.

యోగా, మెడిటేషన్

బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా కూడా చాలా వరకూ మహిళలలో ఒత్తిడి ఎదురవుతుంది. ఈ కారణంగా రుతుక్రమ సమస్యలు వస్తాయి. ఇందుకోసం ప్రతీ రోజూ ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల సమ

మరింత సమాచారం తెలుసుకోండి

నిత్యం కొంచెం చిమ్మిరి తింటే ఈ నడుము నొప్పి ,కడుపు నొప్పి పూర్తిగా పోతాయి.

అలాగే కొంతమంది అశోకారిష్ట్ట్ వాడుతారు.

బొప్పాయి పండు తింటే చాలా మంచిది.

నిత్యం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అర గంట చొప్పున సూర్య రశ్మి లో నుండుట సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే D విటమిన్ ,కాల్షియమ్ పుష్కలంగా లభిస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి. పొద్దున్నే ఒకలిటర్ నీళ్లు తాగడం మరియు రోజంతా 3 లేక 4 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రాణాయామం చేయడం చాలా మంచిది.


  • నల్ల బెల్లం,నెయ్యి,నువ్వులు సమంగా తీసుకుని నూరి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.
  • ఆ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణం లో మూడు లడ్డు లు గా చుట్టి నిలువ చేసుకోవాలి.
  • బహిష్టుసమయంలో రోజుకొకటి చొప్పున మూడు రోజులు ఉదయం తీసుకుని చప్పరించాలి.
  • ఇలా మూడు నెలల వరకు చేస్తే గుణం కనిపిస్తుంది.

చాలామంది మహిళల్లో ఇది సహజమేనండి. హోమియోలో Belladonna; Colocynthis; Cocculus వంటి చక్కటి ఔషధాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మీకు పీరియడ్స్ మొదలు కావడానికి 5 రోజుల ముందు నుండి 30 పొటెన్సీ లో రోజు ఒక సారి. పీరియడ్స్ మొదలయ్యేక రోజుకు 3 సార్లు వాడండి.


1. మెంతులు + క్యారట్ + ముల్లంగి గింజలు. సమపాళ్ళలో తీసుకొని నూర వలెను.( Paste లాగా చేయండి ).

1 Table Spoon Paste + 1 Table Spoon అశోకారిష్టం లో కలిపి ప్రతి రోజు త్రాగండి . 

2. ఎండిన మామిడి ఆకులను కాల్చ వలెను. చూర్ణం తయారగును . 

1 Table Spoon మామిడి ఆకుల చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు త్రాగండి . 

3. బిరియాని ఆకుల కషాయం ప్రతి రోజు త్రాగండి . 

( 2 లేక 3 బిరియాని ఆకుల ముక్కలను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించండి . కషాయం తయారవును . ప్రతి రోజు త్రాగవలెను .

*గమనిక* : ----

1. అశోకారిష్ట ( ASHOKA RISTA ) ఆయుర్వేధ షాపులలో లభించును . 

2 . బిరియాని ఆకు = మసాల ఆకు ( Bay Leaf ). 

3. మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వరకు , ప్రతి రోజు త్రాగవలెను . Periods time లో త్రాగరాదు .

👉బహిష్టు సమయం లో

స్త్రీలు పగటినిద్ర, రాత్రిమేల్కోవడం,అతిగా పరిగెత్తడం, 

పెద్దగానవ్వడం,ఏడవడం,

మాట్లాడడం,దూర ప్రయాణమువంటివి చెయ్య కూడదు.దీనివలన శరీరంలో అతిగా ఉష్ణంపుడుతుంది. మి నవీన్ నడిమింటి

బహిష్టు సమయంలో కడుపులో నొప్పి ---నివారణ

నొప్పిగా వున్నపుడు నూలు గుడ్డను వేడి నీటిలో ముంచిభరించ గలిగినంత వేడిగా పొట్ట మీద వేసుకోవాలి. వెంటనేచల్లటి నీటిలో ముంచిన గుడ్డను దానిపై కప్పాలి, ఈవిధానాన్ని ఋతుస్రావం కొద్ది కొద్దిగా వున్నపుడు మాత్రమేచేయాలి. ఎక్కువగా వున్నపుడు చెయ్యకూడదు.

ఉదరచాలనం:-- పొట్టను ముందుకు, వెనుకకుకదిలించాలి. సీతాకోక చిలుక వ్యాయామం లాగా కాళ్ళనుఆడించాలి.

1. బటాణి గింజంత నీరుసున్నం తీసుకొని 50 గ్రాములవెన్నపూస మధ్యలో పెట్టి మింగాలి. విపరీతంగా వున్నకడుపు నొప్పి 10,15 నిమిషాలలో తగ్గి పోతుంది. 

*బహిష్టు సమయంలో నడుము నొప్పి--నివారణ*

నలగగొట్టిన శొంటి ---5 gr

" వాయువిడంగాలు -5 gr

రెండింటిని కలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి ఒకకప్పుకు రానివ్వాలి. వడకట్టి బెల్లం కలుపుకొని తాగాలి.దీనిని బహిష్టు వచ్చిన రోజు నుండిu మూడు రోజులుఉదయం పరగడుపున వాడాలి. (1,2,3 రోజులు) ఆవిధంగా మూడు నెలలు వాడితే ఇక 

ఎప్పటికి నొప్పి రాదు

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

ఫోన్ -9703706660


కామెంట్‌లు లేవు: