4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మోకాళ్ళ నొప్పులు నివారణకు తీసుకో వలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి


Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..
  •  

  •  
మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారుు.

-మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

-ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి , అల్ట్రాసౌండ్‌ , ఐ.ఆర్‌.ఆర్‌. , ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

    గుండె బాగా కొట్టుకుంటుంది.
    శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
    కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
    మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
    చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
    ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
    రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

    - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

    నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
 
        నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
        రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
        బ్రిస్క్‌ వాకింగ్‌ .


        తీసుకోవలసిన జాగ్రత్తలు:
            ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
            నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
            పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
            వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.


            వ్యాయామం:
                మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
                స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
                ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.


                ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

                    క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
                    ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
                    కీళు సులువుగా కదులుతుంది.
                    ఎముకలు బలపడతాయి.
                    బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.

                    చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
                    గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
                    సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

                    మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.


  •                  Courtesy with :  డా వై. నందకిషోర్‌ కుమార్‌-- బి.పి.టి. (నిమ్స్‌), యం.యస్‌.స్పోర్ట్స్  (యు.కె.) ఫిజియోథెరపిస్ట్
  1. # మన శరీరంలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు వరకే మనం స్వీకరించే ఆహారంలో నుంచి కాల్షియం తయారవుతుంది .
    # శరీరంలో కాల్షియం తగ్గితే ఎక్కవగా ఎముకలకి సంబంధించిన నొప్పులు , రక్తానికి , కఫానికి సంబందించిన రోగాలు వస్తాయి .
    # కీళ్ళ నొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు వస్తాయి .
    # స్త్రీ లకు *45 సంవత్సరాలు* పూర్తికాగానే నెలసరులు ఆగిపోయిన తర్వాత శరీరం కాల్షియంను తీసుకునే సామర్ధ్యం కోల్పోతుంది .
    # కాల్షియం ఎక్కవగా ఉండే పదార్ధాలు :- *పాలు , పెరుగు , మజ్జిగ , వెన్న , నెయ్యి*.
    # కాల్షియం ఎక్కవగా ఉండే పండ్లు :- *అరటి పండు , నారింజ , కమలా , బత్తాయి , ద్రాక్ష , మామిడి పండ్లు*.

    # మీరు పండ్లు తీసుకున్నప్పటికి శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్లు ఉత్పత్తి ఆగిపోయినందు వలన ( 45 సంవత్సరాలు నిండిన వారికి ) మీరు కాల్షియంను బయటనుండి తీసుకోవలసి ఉంటుంది .
    # 45 సంవత్సరాల తర్వాత స్త్రీలు గాని పురుషులుగాని తప్పకుండా *సున్నం* తీసుకొనవలెను .
    # శరీరంలో కాల్షియం ఉండటం వల్లనే మిగతా పోషకాలన్ని ఉపయోగ పడతాయి .
    # కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి . యూరిక్ యాసిడ్ అంటే ఆమ్లాలు .
    # ఈ మధ్య కాలంలో వాత రోగాలు ఎక్కవగా పెరుగుతున్నాయి .
    # వాత రోగులకు చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి , నొప్పులు ఎక్కవగా ఉంటాయి .
    # శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు .
    # మీ కదలికలు ఏవైనా చేతి కదలికలైనా , కాళ్ళ కదలికలైన , మెడ కదలికలైనా , నడుము కదలికలైనా స్టిఫ్ అవుతున్నట్లయితే ఏమైనా నొప్పి కలిగిస్తున్నట్లయితే వాతానికి సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు గుర్తించండి .
    # ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్ గా జడంగా  తయారయి ఉంటాము .
    #ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కవగా పెంచుతుంది .
    # వేగంగా తిరిగే ఫ్యాన్ క్రింద పండు కొనరాదు . పలుచటి దుప్పటి కప్పుకొని కాస్తప్రక్కకు పడుకోవాలి .
    # గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి .
    *వాత రోగాలు కీళ్ళనొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు*.
    *ఈ క్రింది ఆరోగ్య సూత్రాలను ఆచరించి నొప్పుల నుండి నివారణ పొందండి* :-
    1 . *సున్నంను తీసుకోండి*
         సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా వుంది . మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు కలవు .
    *సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు*
    ( 1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు )
    సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకొనవలెను .
    సున్నం + పెరుగు లేక మజ్జిగ .
    సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకొనవలెను . 
    # ఆర్ధరైటిస్ వున్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం , మాములు వారు 1 గ్రాము సున్నం తీసుకొనవలెను .
    *గమనిక* :-
    # శరీరంలో ఏ భాగములలోనైన రాళ్ళు వున్నవారు ఎట్టి పరిస్ధితులలో సున్నుంని తీసుకొనరాదు .
                  *లేక*
    *మెంతులు కూడా ఒక మంచి మందు* :-
    *మెంతులు ఔషధాల గని. గొప్ప ఔషధం . మెంతులు వాత + కఫ రోగాల్ని తగ్గిస్తాయి*
    *మెంతులు ఉపయేగించే విధానం :*-
    # రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నాన బెట్టి ఉదయాన్నే పరగడుపున *బాగా నమిలి ,నమిలి* తినవలెను . నీళ్ళను త్రాగవలెను . *బాగా నమిలి తినడం వలన అది మీ లాలజలంతో కలిసి లోనికి వెళ్ళి మీకు ఎక్కువ మేలు చేస్తుంది*
    *# ఎప్పటికీ మెంతుల కంటే సున్నం ఎక్కవ వాతనాశిని* .
                      *లేక*
    # ఎక్కువ క్షారగుణం కలిగినది *పారిజాత వృక్షం చేట్టు ఆకులు*.
    # రాత్రి 4 -5 ఆకులను బాగా నలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఆ నీటిని అరగ్లాసు ఆవిరి అయ్యేలాగ వేడి చేసి , ఆ నీటిని ఉదయం పరగడపున ఆకులతో సహా గుటక గుటక గా త్రాగవలెను . మీకు అన్ని రకాల ఆర్ధరైటీసులు తగ్గిపోతాయి . ఈ కషాయం దీర్ఘకాల రోగులకు మంచి మందు .
    *గమనిక :-*
    # ఈ కషాయం వాడుతున్నపుడు ఖచ్చితంగా ఎటువంటి ఏ మందులు వాడరాదు .
    # 2 లేక 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యం కలుగును .
    #4. యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వున్నవారు :-
    *నల్ల నువ్వులు + బెల్లంని కలిపి తినవలెను .
    # 5 . ఆస్తమా + ఆర్ధరైటీస్ వున్న వారు దాల్చిన చెక్క + శొంటి కషాయం  తప్పకుండా త్రాగాలి . వాయు సంబంధ రోగాలు వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
    # 6 . స్థూలకాయం + ఆర్ధరైటీస్ వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
    # 7 . పెద్ద వయస్సు వారికి మోకాళ్ళ  నొప్పలు పోవాలంటే *సున్నం* తీసుకుంటే సరిపోతుంది .
    # 8 . భుజాల నొప్పులు , మోచేతి నొప్పులకు నీటిని *చిన్నగా గుటక గుటకగా* త్రాగితే నొప్పులు తగ్గిపోతాయి .
    # 9 . కీళ్ళ నొప్పులు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే వేడి నీళ్ళు త్రాగాలి . మాములు నీళ్ళు గంట లేక గంటన్నర తర్వాత త్రాగాలి. కావలసినవారు వేడి నీళ్ళలో నిమ్మరసం కూడా కలుపు కొనవచ్చును .
    # 10 . ఉపవాస సమయంలో చల్లటి పండ్ల రసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి . ఎక్కవ సేపు కాళీ కడుపులో ఉండవలసి వస్తే వాతము పెరిగి చేతులు కాళ్ళు మరియు నడుము నొప్పులు వస్తాయి . వేడి నీళ్ళు త్రాగడం వలన మీకు ఏ హాని జరుగదు .
    # వాతాన్ని శమింపచేసే అత్యుత్తమైన పదార్ధాలు .... శుద్ధమైన వంట నూనెలు ( Non - Refined Oils ) , మరియు ఏఏ పదార్ధాలలో నీటి శాతం అధికంగా ఉంటుందో అవన్నీ వాత నాశకములే. ఉదా : - పాలు , పెరుగు , మజ్జిగ , చెరకు రసం మరియు పండ్ల రసాలు .
    # మంచి నీళ్ళను ఎప్పుడూ నిలబడి త్రాగకండి . కూర్చునే త్రాగండి .
    # వేడి వేడి పాలను నిలబడి త్రాగండి .
    # ఎప్పుడూ చల్లని నీళ్ళు త్రాగకూడదు .
    # నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటక గా త్రాగవలెను . వీలైయితే సుఖాసనములో కూర్చొని నీళ్ళు త్రాగండి .
    # నిలబడి నీళ్ళు త్రాగితే మోకాళ్ళ నొప్పులు ఎప్పటికీ తగ్గవు . ఏ మందులు వాడినా తగ్గవు .
    # సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
    # శుద్దమైన వంట నూనె వాడవలెను .
      *శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండు నూనె (Non Refined Oil ) .  ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె . *ఈ శుద్ధమైన నూనె మీ వాతాన్ని పెరగనీయ కండా ఉంచుతుంది* .
    # జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన నూనెను వాడుకోవటమే మంచిది .
    *# రిఫైండ్ నూనెలను ఖచ్చితంగా వాడరాదు* .

    *గమనిక :- సున్నం లేక మెంతులు వాడవలెను . దీర్ఘకాలిక రోగులు పారిజాత చేట్టు ఆకుల కషాయంని వాడండి* .
    *# నిరాటంగా 3 నెలలు ఈ మందులు తీసుకుంటే 15 - 20 రోజులు ఆపి ఆ తర్వాత 3 నెలలు తీసుకోవచ్చును*. 
         ధన్యవాదములు

  2. మీ నవీన్ నడిమింటి 

  3. విశాఖపట్నం 

  4. 9703706660


కామెంట్‌లు లేవు: