11, ఆగస్టు 2020, మంగళవారం

మతిమరుపు సమస్య ఉన్న వల్ల కు తీసుకోవాలిసిన జాగ్రత్తలు




మతిమరపు అంటే ఏమిటి?

మనము సాధారణంగా కొన్ని మర్చిపోతూఉంటం లేకపోతే గందరగోళంగా కొన్ని విషయాలను తప్పుగా గుర్తుపెట్టుకుంటాం. ఇది సమాచారం ఎక్కువ అయినప్పుడు, ఒత్తిడి, కలవరం లేదా ఇతర కారణాల వల్ల జరుగుతుంది.కానీ ఇది ఆరోగ్య సమస్యల కారణంగా సంభవించినప్పుడు, వాస్తవాలు, అనుభవాలు మరియు సమాచారం వంటి మర్చిపోతున్నపుడు అది మతిమరుపు (ఆమ్నెసియా) గా పిలవబడుతుంది.

మతిమరుపు (ఆమ్నేసియా) ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మతిమరుపుతో బాధపడుతున్న ప్రజలుకు తామ గురించి మరియు వారి పరిసరాల గురించి తెలుస్తుంది, కానీ కొత్త సమాచారంతో బాధపడుతుంటారు. మతిమరుపు యొక్క ప్రధాన రకాలు కూడా పరిస్థితి యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి:

  • అంటేరోగ్రేడ్ (Anterograde) మతిమరువు (ఆమ్నేసియా)
    ఈ రకమైన మతిమరపులో, క్రొత్త సమాచారాన్ని గుర్తించడం మరియు గుర్తుంచుకోవడం కష్టం.
  • రెట్రోగ్రేడ్ (Retrograde)మతిమరువు (ఆమ్నేసియా)
    ఇది గత/పాత అనుభవాలు మరియు సమాచారం గుర్తుచేసుకోవడంలో కష్టంగా ఉంటుంది.

ఇతర లక్షణాలు:

  • స్థితి భ్రాంతి
  • తప్పుడు జ్ఞాపకాలు, అనగా, జ్ఞాపకాలను తప్పుగా గుర్తుతెచ్చుకుని,నిజమని నమ్మేవారు.

ప్రధాన కారణాలు ఏమిటి?

జ్ఞాపకం అనేది మెదడు యొక్క ఒక విధి. మెదడులోని ఏదైనా భాగం, ముఖ్యంగా థాలమస్, హిప్పోకాంపస్ లేదా ఇతర సంబంధితఅవయవాలు, జ్ఞాపకాలు మరియు భావోద్వేగాలకు బాధ్యత వహించేవి ప్రభావితం ఐతే, అది మతిమరుపుకి దారితీస్తుంది. ఆ కారణాలలో కొన్ని:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మతిమరుపు కోసం తనిఖీ చేయటానికి ఒక వివరణాత్మక పరీక్ష చేయబడుతుంది మరియు ఇది చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి వంటి ఇతర రుగ్మతల నుండి వేరు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వాటిని ఈ క్రింద చూడవచ్చు:

  • జ్ఞాపకశక్తి తగ్గుదల, దాని పురోగతి, ప్రేరేపకాలు, కుటుంబ చరిత్ర, ప్రమాదాలు మరియు క్యాన్సర్ లేదా నిరాశ, ఆకస్మిక మతిమరుపు వంటి పూర్వ వైద్య సమస్యల తనిఖీ కోసం ఒక వివరణాత్మకమైన ఆరోగ్య చరిత్ర గురించి వైద్యులు తెలుసుకుంటారు. వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి సరిగాలేనందున, సన్నిహిత కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు వైద్య సంప్రదింపు సమయంలో పాల్గొంటారు.
  • ప్రతిచర్యలు (reflexes), సమతుల్యత, జ్ఞాన ప్రక్రియలు మరియు నాడీ వ్యవస్థ మరియు మెదడు యొక్క ఇతర విధులు తెలుసుకోవడం కోసం భౌతిక పరీక్ష.
  • దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి తగ్గుదల, తీర్పు, ఆలోచన మరియు ప్రక్రియలు యొక్క సాధారణ సమాచారం కోసం పరీక్షలు.
  • అంటువ్యాధులు, ఆకస్మిక మతిమరుపు లక్షణాలు మరియు మెదడు నష్టం కోసం పరీక్షలు.

దాదాపు అన్ని సందర్భాల్లో, మతిమరపు నుంచి పూర్తిగా పూర్వస్థితికి చేరుకోలేము లేదా పాక్షికంగా తిరిగి చేరుకోవచ్చు. పూర్తి చికిత్స సాధ్యం కానందున ఈ పరిస్థితి యొక్క నిర్వహణ అనేది కీలకం ఉంది. తరచుగా ఉపయోగించే చికిత్స వ్యూహాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • వృత్తి చికిత్స (occupational therapy) అనేది వ్యక్తులకి కొత్త సమాచారంతో వ్యవహరించేందుకు సహాయపడటానికి వ్యూహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది మరియు ఇప్పటికే ఉన్న సమాచారాన్ని మరియు జ్ఞాపకాలను ఉపయోగించి వారి అనుభవాలను నిర్మించడానికి సహాయపడుతుంది.
  • మతిమరపు ఉన్నవారికి కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్పిస్తే అది వారి రోజువారీ కార్యకలాపాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో ఫోన్లు, కొత్త వస్తువుల ఉపయోగం ఉంటుంది.
  • పోషకాహార అవసరాలను క్రమబద్ధీకరించడానికి మందులు మరియు ఏవైనా ఇతర అంశాలకు చికిత్స చేయడం వలన పరిస్థితి యొక్క మరింత క్షీణతను నివారించ

జ్ఞాపక శక్తి పెరగాలి అంటే నవీన్ సలహాలు 


           జ్ఞాపక శక్తి పెరగడానికి


వస్త్రగాయం పట్టిన సోంపు గింజల పొడి                     ------- 100 gr
పటిక బెల్లం పొడి                                                 ------- 100 gr

రెండింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

పెద్దలకు                    ------- అర స్పూను
పిల్లలకు                   ------- పావు స్పూను
చిన్న పిల్లలకు          ------- అర పావు స్పూను


  ఆహారానికి గంట ముందుగానిగంట తరువాత గాని వాడాలి.దీనివలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది,
మానసిక రుగ్మతలను నివారించవచ్చుశిరస్సు కు ఆహారాన్ని యిస్తుంది.ఆహారం బాగా జీర్ణమవుతుంది.

                                  మతి మరుపు రాకుండా నివారణ                            

                 బుద్ధి మాంద్యాన్ని అరికట్టడానికి ---సరస్వతి చూర్ణం

సరస్వతి చూర్ణం            ---- 50 gr
బోడతరం పొడి              ---- 50 gr
శొంటి పొడి                    ---- 50 gr
వస పొడి                      ---- 50 gr
పిప్పళ్ళ పొడి                 ----50 gr
తేనె                            -----తగినంత

బోడతరం పొడి మానసిక శక్తిని ఇవ్వడంలో చాలా శ్రేష్ఠమైనది .

శొంటి ని విశ్వ భేషజము అంటారు.దీనిని దోరగా వేయించి పొడి చేయాలి.

వస కొమ్ములను 24 గంటలు నీళ్ళలో నానబెట్టాలితరువాత నీటినుండి కొమ్ములను తీసి పొడి గుడ్డతోతుడిచి చిన్న ముక్కలుగా నలగగొట్టి బాగా ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.

పిప్పళ్ళను కూడా దోరగా వేయించి పొడి చేసుకోవాలి.

అన్ని చూర్ణాలను కల్వం లో వేసి తగినంత తేనె కలిపి బాగా మెత్తగా నూరాలిదీనితో ఒక మంచి లేహ్యం  తయారవుతుంది.

దీనిని బుద్ధి మాంద్యం వున్నవాళ్లకు వాడితే ఎంతో ఉపయోగపడుతుంది.

చిన్న పిల్లలకు                    ---- ఒక గ్రాము
పెద్ద పిల్లలకు                      ---- బటాణి గింజంత
పెద్దలకు                            ---- కుంకుడు గింజంత

దీనిని ఉదయంసాయంత్రం పరగడుపున వాడాలి.
ఇది మెదడుకు శక్తి ని ఇస్తుందిఎదుటి వ్యక్తులను గుర్తించ లేని సమస్యను నివారిస్తుందికీచుగొంతు ,బొంగురు గొంతు మరియు ఊపిరి తిత్తుల సమస్యలు నివారింప బడతాయి

                   మతిమరుపు ----నివారణ                           

ఏకాగ్రత కొరకు వ్యాయామం:-- పద్మాసనం లో కూర్చొని చిరుముద్ర వేసుకొని ఎదురుగా ప్రమిదలో ఒత్తి గాని ,కొవ్వొత్తి గాని వెలిగించి పెట్టుకొని దానినే దీక్షగా 5 నిమిషాలు చూడాలి ఆసనంలో మోచేతులుమెడవెన్నుపూస నిటారుగా వుండాలిఇదే విధంగా కూర్చొని ఓంకారాన్ని పలకాలి.

భ్రామరీ ప్రాణాయామం:-- ఓంకారం లోని మకారాన్ని మాత్రమే పలకాలిదీనిని పద్మాసనం వేసుకొని రెండు చెవులలో రెండు చూపుడు వేళ్ళను పెట్టుకొని పలకాలి.

ఆహారం:-- రాత్రి పడుకునే ముందు బాదం పాలు తాగితే మంచిదిబాదం పప్పులను రాత్రి పూట నానబెట్టి   ఉదయం తొక్క తీసి ఎండబెట్టి పొడి చేసుకోవాలిదీనికి సమానంగా సోంపు గింజలపొడిసమానంగా కలకండ కలిపి నిల్వ చేసుకోవాలి పొడిని పాలల్లో కలుపుకొని తాగితే చాలా గొప్పగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

బాదం పప్పుల పొడి               ---- 50 gr
సోంపు గింజల పొడి                 ---- 50 gr
కలకండ పొడి                         ---- 50 gr

చిన్న పిల్లలకు             ----ఒక  టీ స్పూను
పెద్దలకు, పెద్ద పిల్లలకు  -- రెండు టీ స్పూన్లు

                   సరస్వతి చూర్ణం

సరస్వతి ఆకుల చూర్ణం              ---- 100 gr
అశ్వగంధ             "                  ---- 100 gr
అతిమధురం         "                  ---- 100 gr
కలకండ               "                   ---- 100 gr

అన్నింటిని కలిపి జల్లించి సీసాలో భద్రపరచు కోవాలి.

ఉదయంసాయంత్రం పరగడుపున ఒక టీ స్పూను పొడి పాలల్లో కలుపుకొని తాగాలిపాలు ఇష్టం లేని  వాళ్ళు నీటిలో కలుపుకొని తాగవచ్చులేదా నాలుకతో అడ్డుకొని తిన వచ్చు.

          బుద్ధి మాంద్యము --- నివారణ   నవీన్ సలహాలు                         

           శిరస్సులో కఫం మితిమీరి చేరడం వలన బుద్ధి మాంద్యం ఏర్పడుతుందితలలో వున్న
అధికమైన కొవ్వును తీసి వెయ్యడం ద్వారా దీనిని నివారించ వచ్చును.

నువ్వుల నూనె గాని ఆవాల నూనె గాని వెచ్చ జేసి ముక్కుల్లోచెవుల్లో రెండేసి చుక్కల చొప్పున వెయ్యాలి         ఇది తప్పనిసరి.

తలను బాగా మునివేళ్ళతో గోరువెచ్చని నువ్వుల నూనె రాసి నెమ్మదిగా మర్దన చెయ్యాలినరాలన్నీ చురుకుదనం పొందాలంటే శరీరమంతా తైల మర్దనం చెయ్యాలి.

కపాల భాతి:-- పద్మాసనం వేసుకొని పొట్టను బయటకు లోపలి కదిలించాలిగాలిని కుడి ముక్కు నుండి గాలిని పీల్చి ఎడమ ముక్కుతో వదలాలిఅదే విధంగా రెండవ వైపు చెయ్యాలిఓంకారాన్ని పలకాలి.

దోరగా వేయించి దంచిన ధనియాల పొడి  --- 50 gr
 "  కరక్కాయల పొడి                          ---- 20 gr
కలకండ పొడి                                     ---- 70 gr

అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.

పిల్లలకు              --- అర టీ స్పూను
పెద్దలకు              --- ఒక టీ స్పూను

పొడిని మంచినీటితో రెండు పూటలా తీసుకోవాలి.

             "మానవుడికి జ్ఞానమే సౌందర్యము"

తేనె                   ---- ఒక టీ స్పూను
పాలమీది మీగడ     --రెండు టీ స్పూన్లు

రెండింటిని కలిపి ఉదయంసాయంత్రం సేవిస్తే మేదస్సు అద్భుతంగాపెరుగుతుంది.
దీని వలన అధికమైన కఫం తొలగి పోతుంది.


              విద్యార్ధుల యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి                       

       ప్రతిరోజు  రెండు లేక మూడు సరస్వతి ఆకులను మెత్తగా నూరి తేనె కలిపి తింటే మెదడుకు ఎంతో శక్తి కలుగుతుంది .

ధనియాలు                   --- 50 gr
కరక్కాయ పెచ్చులు       --- 20 gr
కలకండ                        --- 70 gr

       అన్నింటి యొక్క చూర్ణాలను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                      --- పావు టీ స్పూను
పెద్దలకు                      --- అర టీ స్పూను

      ప్రతి రోజు వాడితే మెదడు కు ఎంతో శక్తి కలుగుతుంది . 


ప్రతి రోజు రాత్రి నాలుగైదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం తొక్క తీసి మెత్తగా నూరి తేనెతో  గానినీటితో గాని సేవిస్తే విద్యార్ధులలో జ్ఞాపక శక్తి పెరుతుంది. నరాలు బలంగా తయారవుతాయి 

                పదునైన ఆలోచనా శక్తికి                      

బూడిద గుమ్మడి యొక్క ఒక ముక్కను గాని రసం గాని ప్రతి రోజు తీసుకుంటూ వుంటే ఆలోచనా శక్తిమెరుగవుతుంది.

             మతిమరుపు --- నివారణ                                  
కారణాలు :-- వయసు పైబడడం, పోషకాహార లోపం, దీర్ఘ కాలపు వ్యాధులు, హైపో థైరాయిడ్
ఫిట్స్మధుమేహంగుండెపోటుమద్యపానంక్రొవ్వుపదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన,
మతి మరుపు ఏర్పడుతుంది.

1. ఉసిరి పెచ్చుల చూర్ణం --- అర టీ స్పూను
                             తేనె --- ఒక టీ స్పూను

     రెండింటిని కలిపి నాకాలి విధంగా ప్రతి రోజు రెండు పూటలా తీసుకోవాలి. 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

2. అతిమధురం పొడి   --- ఒక గ్రాము
                        తేనె --- ఐదు గ్రాములు

దీనిని కూడా పై విధంగానే రోజుకు రెండు పూటలా చొప్పున 40 రోజులు వాడాలి.

3. ఆవు నెయ్యి --- ఒక టీ స్పూను
             పాలు --- అర కప్పు

  గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలిదీనిని 40 రోజులు
వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుందిదీనిని ఆయుర్వేదంలో మేధో రసాయనం అంటారు

           ప్రతి రోజూ చదువుతూ వుండడం  , గురుముఖత నేర్చుకోవడంఆరు రుచుల యొక్క సమతులాహారం భుజించడం మొదలైనవి . 

ఒత్తిడి తగ్గించుకోవడంఅర్ధ శక్తిగా వ్యాయామం చేయడంఒళ్లంతా నువ్వుల నూనె రుద్దుకోవడం

మెడిటేషన్ ( ధ్యానం -- ప్రతి రోజు కొద్ది సేపు ) చేయడం వలన జ్ఞాపక శక్తి నీ పెంచుకోవచ్చు.

                                        జ్ఞాపక శక్తి ని పెంచడానికి  , మెదడు యొక్క బలానికి           

        ప్రతిరోజు రెండు , మూడు సరస్వతి ఆకులను నూరి తేనె కలిపి తినాలి . ఇది మెదడుకు ఎంతో శక్తిని ఇస్తుంది . నరాలు
బలంగా తయారవుతాయి .

ధనియాలు                   ----50 gr
కరక్కాయ పెచ్చులు       --- 20 gr
కలకండ                        --- 70 gr

       అన్నింటిని  చూర్ణాలు గా చేసి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                   ---- పావు  టీ స్పూను
పెద్దలకు                   ---- అర టీ స్పూను

      మోతాదుగా ప్రతి రోజు వాడితే మెదడుకు ఎంతో శక్తి కలిపి జ్ఞాపక శక్తి పెరుగుతుంది

                                                                     మతిమరుపు  ---  నివారణ                           

కారణాలు :-- ఆహార, విహార కారణాలు వుంటాయి . ఆందోళన ఎక్కువ వున్నవాళ్ళకు  వుంటుంది .

సరస్వతి ఆకుల చూర్ణము                ---100 gr
అశ్వగంధ చూర్ణము                       --- 100 gr
తులసి గింజల చూర్ణము                             --- 100 gr  ( రోగనిరోధక శక్తిని , జ్ఞాపక శక్తిని పెంచుతుంది .)
జటామాంసి    చూర్ణము               ---  50 gr
దాల్చిన చెక్క చూర్ణము               ---  50 gr
యాలకుల గింజల చూర్ణము        ---  50 gr

      అన్ని చూర్ణాలను  బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
      ఒక టీ స్పూను చూర్ణాన్ని  ఆవు నెయ్యి కలిపి వుండ  చేసుకొని ఆహారానికి ముందు తీసుకోవాలి

                                                       

తిప్పతీగ చూర్ణం                          ----50 gr
ఉత్తరేణి వేర్ల చూర్ణం                      ---- 50 gr
వసకొమ్ముల చూర్ణం                     ---- 50 gr
వాయు విడంగాల చూర్ణం               ---- 50 gr
సరస్వతి ఆకు చూర్ణం                   ---- 50 gr
బోడసరం పూల చూర్ణం                  ---- 50 gr

        అన్నింటిని కలిపి వస్త్ర ఘాలితము చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .

        దీనిని ఉదయం పరగడుపున గాని లేదా రాత్రి ఆహారానికి ముందు గాని వాడాలి

చిన్న పిల్లలకు                   --- 3 చిటికెల చూర్ణము + తేనె
పెద్ద పిల్లలకు                      --- పావు టీ స్పూను చూర్ణము + తేనె
పెద్దలకు       --- అర టీ స్పూను చూర్ణము  +తేనె


           మతిమరుపు కొరకు మందులు


Medicine NamePack Size
DonepDonep 10 Tablet
Exelon TtsExelon Tts 13.3 Transdermal Patch
ExelonExelon 1.5 Capsule
RivademRivadem 3 Capsule
RivamerRivamer 1.5 Mg Capsule
RivaplastRivaplast Transdermal Patch
RivasmineRivasmine 1.5 Mg Capsule
RiveraRivera 1.5 Capsule
AlzilAlzil 10 Tablet
AricepAricep 10 Tablet
CognidepCognidep 10 Tablet
DNPDNP 10 Tablet
DoneceptDonecept 10 Tablet
DonetazDonetaz 11.5 Mg Tablet
DozareDozare 5 Mg Tablet
LapezilLapezil 10 Tablet
SanezilSanezil 5 Mg Tablet
AlzepilAlzepil 10 Tablet
DemenzaDemenza 10 Tablet
DepzilDepzil Tablet
Aricep MAricep M Forte Tablet
DonazDonaz 10 Mg Tablet
CogmentinCogmentin 10 Mg/10 Mg Table
DopeDope 10 Mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: