11, ఆగస్టు 2020, మంగళవారం

ఆస్తమా, సైనసైటిస్ రోగుల అష్టకష్టాలు నివారణకు నవీన్ నడిమింటి సలహాలు


సైనసైటిస్ (పీనస వ్యాధి) నివారణకు నవీన్ నడిమింటి సలహాలు 

                  సైనసైటిస్ (పీనస వ్యాధి )                            

        మేలురకమైన  వేపనూనె (నీళ్ళ లాగా పల్చగా వుంటుంది).ఉదయం పళ్ళు తోముకున్న తరువాత  రాత్రి భోజనానికి ముందు రెండు ముక్కుల్లో  రెండేసి చుక్కలు వేసుకోవాలి. లేదా గులాబి తైలమైతే పెద్దలకు  6 చుక్కలు, పిల్లలకు 4 చుక్కలు వేసుకోవచ్చు.
 
       గులాబి తైలం తయారు చేసే విధానం :---
                    గులాబి రేకులు           ---------- 100 gr
                    నువ్వుల నూనె           ---------- 100 gr
 
     నువ్వుల నూనెను స్టవ్ మీద పెట్టి కాగుతుండగా గులాబి రేకులు కొంచం కొంచంగా వేస్తూ వుంటే రేకులు మాడి గులాబి తైలం  తయారవుతుంది.
 
                                               తులసి టీ
 
                 కృష్ణ తులసి ఆకులు        ------- 10 (దంచాలి )
                         మిరియాలు            -------  10 (దంచాలి )
                         అల్లం                     --------  2 కణుపులంత (దంచాలి)
                         నీళ్ళు                    --------  2 కప్పులు
 
      అన్నింటిని ఒక గిన్నెలో వేసి, నీళ్ళు పోసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు కాచాలి.దించి,వడపోసి  కలకండ పొడి కలిపి పరగడుపున , స్నానం చెయ్యక ముందు  తాగాలి. .
 
                                             తులసి నశ్యం
 
        లక్ష్మి తులసి ఆకులను నీడలో ఆరబెట్టి,దంచి,వస్త్రగాయం పట్టి,సీసాలో నిల్వ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం చిటికెడు పొడిని ముక్కు దగ్గర పెట్టి ఒక ముక్కు మూసి రెండవ ముక్కుతో పీల్చాలి,  అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.

 శ్వాస ఆడనప్పుడు వేడిగావున్నఅన్నం పిడికెడు తీసుకొని అందులో చిటికెడు  పసుపు కలిపి వేసి పిసికి ముక్కు మీద పట్టు వేయాలి.తరువాత ముక్కులో తైలం వేసుకోవాలి.
 
                 సైనసైటిస్ --ఎలర్జీ--ముక్కుకారడం                                       
 
                                   నశ్యద్రావణం  తయారీ
 
సముద్రపు  ఉప్పు            ----ఒక టీ స్పూను
వంట సోడా                      --- ఒక చిటికెడు

      ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. దానిలో ఉప్పును కలపాలి. దానిలో మూడు వేళ్ళకు వచ్చినంత వంట సోడా కలపాలి. అన్నింటిని బాగా కరిగించాలి. ఇది కన్నీటి కంటే కొంచం ఉప్పగా వుంటుంది. ఈ నీటిని ముక్కులోకి  చొప్పించాలి.

ఉపయోగాలు:--    బల్బ్ సిరంజి లోకి ఈ నీటిని తీసుకొని ముక్కులోకి ఎక్కించాలి. దొరకనపుడు చేతిలో పోసుకొని ముక్కుతో పీల్చాలి. వాష్ బేసిన్ దగ్గర  45  డిగ్రీ లలో వంగి బల్బ్ సిరంజి నిండా ద్రావణాన్ని తీసుకుని  ఒక అంగుళం మాత్రమే లోనికి పోనిచ్చి నోటితో గాలిని పీలుస్తూ ఆ నీటిని మొదట ఒక ముక్కులోకి పంపి మరలా  రెండవ ముక్కులోకి పంపించాలి. ఒక వేళ ఘాటు ఎక్కువైతే ఉప్పు తగ్గించుకోవాలి. వెనక్కి వంగకూడదు.

    ఈ విధంగా చెయ్యడం వలన ముక్కు దిబ్బడ  తొలగించ బడుతుంది.
 
    రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. తగ్గడం ప్రారంభమైన తరువాత వారానికి మూడు సార్లు తీసుకుంటే  సరిపోతుంది
 
                        పీనస వ్యాధి --( సైనసైటిస్ ) లేదా అలర్జీ --నివారణ                     11-9-10.

    చెట్ల పుప్పొడి, దుమ్ము, ధూళి వలన అలర్జీ వస్తుంది.

    శరీరంలో రోగనిరోధక శక్తి లేకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.. దీని వలన ముక్కునుండి స్రావాలు కారడం జరుగుతుంది.

మిరియాల పొడి             ---  అర టీ స్పూను
బెల్లం పొడి                     ---  ఒక టీ స్పూను

       రెండింటిని కలిపి ముద్దగా నూరాలి.  తాజాగా, తియ్యగా వున్న పెరుగులో ఈ ముద్దను కలుపుకొని తాగాలి.

   దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి.  దీనితో మందులకు లొంగని పీనస వ్యాధి చాలా సులభంగా తగ్గుతుంది.

     గోధుమ రవ్వను ఉడికించి తేనె కలుపుకొని తింటే చాలా మంచిది.

                       సైనస్ లేదా నాసా రోగము --ఆయుర్వేద పరిష్కార మార్గాలు           

     శరీరం లోని కఫదోషాల వలన నాసికా సమస్యలు వస్తాయి.

వ్యోషాదివటి
తాళిసాది చూర్ణము
అభ్రక చూర్ణము

     పైన చెప్పబడిన ఔషధాలలో ఏదైనా ఒక దానిని వాడాలి.

     తైలం ముక్కులో ఉదయం, సాయంత్రం మూడు చుక్కల చొప్పున వేసుకోవాలి.

పిప్పళ్ళు                      --- 50 gr
శొంటి                           ----50 gr
మిరియాలు                 ---- 50 gr
దాల్చిన చెక్క               ---- 25 gr
జిలకర                         ----25 gr
బిర్యాని ఆకు                 --- 25 gr
చింత పండు                  --- 25 gr

     అన్నింటి చూర్ణాలను కల్వంలో వేసి బాగా కలిపి చింతపండు కలిపి నూరాలు. మాత్ర కట్టుకు రాకపోతే   పాత బెల్లం కలిపి నూరి మాత్రలు కట్టాలి.

పిల్లలకు                   --- శనగ గింజంత
పెద్దలకు                   --- గోలీలంత

    చప్పరించవచ్చు లేదా మింగవచ్చు.

    పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వాడాలి.

                               కఫసమస్యలు లేదా సైనసైటిస్  ---నివారణ                      

           ముక్కు నుండి నీరు కారడం  చాలా మంది యొక్క సమస్య .

నాటు ఆవు నెయ్యి         ___ 100 gr
సబ్జా ఆకులు                 ----- గుప్పెడు

         రెండింటిని  కలిపి స్టవ్ మీద పెట్టి ఆకులు నల్లగా మారే వరకు కాచి వడపోసి చల్లారిన తరువాత సీసాలో పోసి భద్రపరచాలి.

       ప్రతి రోజు మూడు పూటలా రెండేసి చుక్కల చొప్పున ముక్కులో వేసుకోవాలి.

2.    రెండు టీ స్పూన్ల నల్ల జిలకరను దోరగా వేయించి పలుచని గుడ్డ లో వేసి వాసన పీలుస్తూ వుంటే ఎంతటి జలుబైనా తగ్గిపోతుంది.

3. జలసంహార ముద్రను వేయాలి. :--- పద్మాసనం లో కూర్చొని చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకొని చిటికెన వేళ్ళ మీద బొటన వేళ్ళ ను వుంచి కూర్చోవాలి.

                      సైనసైటిస్     ---- నివారణ                                   

కారణాలు :-- శరీరం లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి తీవ్రమవుతుంది .
                   కఫ సమస్యలతో బాధపడే వాళ్ళు సూర్యొదయానీకి పూర్వమే  -- ఆవ నూనెను గోరువెచ్చగా చేసి లేవాలి .
మొదటి దశ :-ఆవ నూనెను గోరువెచ్చగా చేసి ఉదయం , మధ్యాహ్నం , రాత్రి రెండు చెవులలో మూడు చుక్కల చొప్పున
వేయాలి .దీని వలన శిరస్సు  లో పేరుకు పోయిన కఫం కరుగుతుంది .

        చాతీ మీద , గొంతు మీద , వీపు మీద , అరికాళ్ళ మీద ఈ నూనెతో బాగా ఇంకేటట్లు  మర్దన చేయాలి . చెవులకు

రెండవ దశ :-- నీటి ఆవిరి పట్టడం  బాగా మరిగిన నీటిలో ఒక టీ స్పూను పసుపు పొడి  పది చుక్కల కర్పూర తైలం వేయాలి .  కింద కూర్చొని  దుప్పటిని తల మీద నుండి గాలి దూర కుండా కప్పుకొని నీటి ఆవిరిని నోటి ద్వారా  ముక్కు ద్వారా పీల్చాలి  చ్ద్వులకు , గొంత్జుకు పట్టించాలి . ఈ విధంగా 5 , 6 సార్లు చేయాలి .

మూడవ దశ :--- ముక్కును చిట్లించడం , బుగ్గలు పూరించడం , నోటిని తెరవడం, మూయడం చేయాలి . మరియు
మెడను గాలి పీలుస్తూ వెనక్కి తీసుకుపోవడం , ముందుకు వంగడం , పక్కలకు వంచడం , గుండ్రం గా ఎడమ నుండి కుడికి
కుడి నుండి ఎడమ కు తిప్పాలి .

నాల్గవ దశ :-- చేతులను గాలి పీలుస్తూ చాపాలి . బార్లా చాపాలి . పైకి లేపి ముందుకు తీసుకు రావాలి  చేతులను
భుజాలల మీద పెట్టి గుండ్రంగా తిప్పాలి .

ఐదవ దశ  :-- సూర్యభేదన ,  ఉజ్జాయి ప్రాణాయామము లను చేయాలి

ఆరవ దశ ;--- పద్మాసనం వేసుకొని రెండు చేతుల అన్ని వేళ్ళను ఒక దానికొకటి ఆనించి గట్టిగా నొక్కాలి అన్నింటిని ఒకేసారి నొక్కాలి . మరలా వదలడం , నొక్కడం ,వదలడం ,నొక్కడం చేయాలి . బొటనవేలు , చూపుడు వేలు మధ్య వున్న
చర్మాన్ని నొక్కాలి ఈ విధంగా రెండు చేతులకు చేయాలి .

సూచన :--- జలసంహార ముద్ర వేయాలి . దీనిని వేసేటపుడు శరీరం లో ఎక్కువ వేడి పుడుతుంది .కాబట్టి ఎక్కువ సేపు
వేయకూడదు .

        రెండు చేతుల వేళ్ళను ఒకదానిలో ఒకటి దూర్చి గట్టిగా పట్టుకొని బొటన వేలును మాత్రం పైకి లెపాలి. ఇది చాలా
ముఖ్యమైనది .

జాగ్రత్తలు :-- దోస రకం కూర గాయాలను వాడకూడదు . వేడి నీటితో స్నానం చేయాలి . వేడిగా వున్న అన్నాన్ని
భుజిచాలి
*సైనసైటిస్‌ సమస్యే కాదు!*

'సైనసైటిస్‌' అనేది వినేవాళ్లకు ఒక పదమే కావచ్చు. కానీ, దాని బారిన పడిన వాళ్ల బాధలు ఇన్నీ అన్నీ కావు. తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి ద్రవాలు కారడం, వాసన తెలియకపోవడం, తల బరువు, చిగుళ్ల నొప్పి లాంటి లక్షణాలు పెద్ద చిరాకు పెడతాయి. ముక్కుకు ఇరువైపులా, కళ్ల పైనా ఉండే గాలి గదుల్లో వైరస్‌, బ్యాక్టీరియా చేరిపోవడమే ఈ సమస్యకు అసలు మూలం. మౌలికంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. అయితే సమస్య మొదలైన వెంటనే, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తే, సమస్య అంతటితో సమసిపోతుంది. హోమియోలోని ఇచ్‌నేసియా అనే ద్రావణం (మదర్‌ టించర్‌) వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది.

*హోమియో వైద్యంలో..*

ఠి ఒక దశలో సైన్‌సలోని ద్రవాలు బాగా చిక్కబడి, దారంలా బయటికి వస్తూ గొంతులోకి కూడా జారుతుంటాయి. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాంటి వారికి కాలిబైక్రోమియం- 200 (పొటెన్సీ) మందు బాగా పనిచేస్తుంది. పిల్లలకైతే 30 పొటెన్సీ సరిపోతుంది. హోమియోలోని ఏ మందైనా పిల్లలకు 30 పొటెన్సీలో ఇస్తే చాలు.

ఠి కొందరికి ఈ సమయంలో కడుపు ఉబ్బరంగానూ, మంటగానూ ఉండడంతో పాటు లాలాజలం ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోరు, ముక్కు నుంచి దుర్వాసన కూడా వేస్తుంది. ముక్కు నుంచి వచ్చే ద్రవాలు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇలాంటి వారికి మెర్క్‌సాల్‌ - 200 మందు సమర్థంగా పనిచేస్తుంది.

ఠి కొంత మందికి ద్రవాలు కారడంతో పాటు, విపరీతంగా తుమ్ములు, తలంతా బరువుగా అనిపిస్తుంది. అలాంటి వారికి టూక్రియం - 200 మందు బాగా పనిచేస్తుంది.

ఠి సమస్య తీవ్రతను బట్టి కొంతమందికి ఈ సమస్య 3 లేదా 6 నెలల్లో పూర్తిగా త గ్గిపోతుంది. ఒక వేళ ఏడెనిమిదేళ్లుగా ఉన్న సమస్య అయితే ఇంకా ఎక్కువ సమయమే పట్టవచ్చు. కాకపోతే, వైద్య చికిత్సలతో పాటు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
*సైనసైటిస్‌కు సమూల వైద్యం!*

నాలుగు చినుకులు పడితే చాలు...కాసేపు చల్లగాలి వీస్తే చాలువరుస పరంపరగా ఒకటే తుమ్ములు.ఆ తర్వాత దగ్గు. ఏమీ తోచదు.ఏ పనీ చేయాలనిపించదు.సైనసైటిస్‌తో వచ్చే బాధలే ఇవి.ఎందుకిలా అంటే...!

వ్యాధినిరోధక శక్తి తగ్గడమో, శరీరంలోకి హానికారక బాహ్య పదార్థాలు ప్రవేశించడ మో ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల దేహంలోని వివిధ భాగాల్లోని టిష్యూలు ఒక్కోసారి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ స్థితిలో అవి తమ సహజ ప్రక్రియలను సక్రమంగా నిర్వరించలేకపోతాయి.

పైగా ఆ క్షణం నుంచి అవి అతిగా స్పందించడం మొదలెడతాయి. ఈ పరిణామాన్నే ఎలర్జీగా పేర్కొంటాం. ఈ ఎలర్జీ కారక పదార్థాలను యాంటిజెన్స్‌ అని, ఎలర్జిన్స్‌ అనీ పిలుస్తారు. ప్రత్యేకించి, ఎలర్జీ కార క పదార్థాలు ముక్కులోని వాయువాహికలను తాకినప్పుడు కళ్ల దిగువన, కళ్ల పై భాగాన ఉండే సైనస్‌లలోని మృదుభాగాలు ఉబ్బి కొన్ని రకాల ద్రవాలను స్రవిస్తాయి. ఈ ద్రవంలోకి సూక్ష్మ క్రిములు వచ్చిచేరతాయి. రక్తంలోని తెల్ల కణాలకూ ఈ క్రిములకూ జరిగే ఘర్షణ ఫలితంగా ఏర్పడే చీము రక్తంతో, చెక్కిళ్లు, కళ్లు, కళ్ల కింది భాగం, కళ్ల పై భాగం, కణతలు విపరీతంగా నొప్పి పెడతాయి. ఈ స్థితిలో శరీర భాగాలు వాయడం, కందడం, దురదపెట్టడం, తరుచూ తమ్ములు రావడంతో పాటు ముక్కలు బిగవేయడం, నొప్పులు రావడం, ఉచ్చ్వాస- నిశ్వాసలు కష్టతరం కావడం, ఇతర కారణాల వల్ల వచ్చిన వ్యాధులు ప్రకోపించడం, వంటి ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి..

*తాత్కాలికాలే!*

వాస్తవం ఏమిటంటే, ఎలర్జీ కార క దుమ్ము, ధూలి, ఘాటు వాసనల వంటివి ముక్కులోని మ్యూకస్‌ మెంబ్రేన్‌నుగానీ, కనుపాపలను గానీ, ముఖం చ ర్మాన్ని గానీ తాకినప్పుడు వాటి తాకిడికి ముక్కులోని మ్యూకస్‌ మెంట్రేన్స్‌ కాకుండా, సైనస్‌ల చుట్టూ ఉండే మ్యూకస్‌ మెంబ్రేన్స్‌ ప్రేరేపితమవుతాయి. ఫలితంగా సైనస్‌ల ఖాళీల్లో పరిస్థితిని నిలువరించే కొన్ని ద్రవాలు వచ్చి చేరతాయి. అందువల్ల సైనసనైటిస్‌ ప్రథమ దశలో ఉన్నప్పుడు ముక్కునుంచి నీళ్లు కారకపోవచ్చు. తుమ్ములు రాకపోవచ్చు. కళ్లు ఎర్రబడకపోవచ్చు. ఈ కారణంగానే చాలా మంది సైనసైటిస్‌ ప్రధమ దశలో ఉన్నప్పుడు దాన్ని జలుబులా అనిపించే రైనైటిస్‌ అని అపోహపడతారు. అందుకే వ్యాధి తీవ్రమైతే గానీ డాక్టర్‌ను సంప్రదించరు. కాకపోతే వ్యాధి బాగా తీవ్రమయ్యాక సాధారణ యాంటీబయాటిక్స్‌ పనిచేయకపోవచ్చు. ఎక్కువ శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ కూడా ఒక్కోసారి బాక్టీరియాను పూర్తిగా అణచలేకపోవచ్చు. సైనస్‌లల్లో గూడుకట్టిన చెడు రక్తాన్ని, చీమును రక్తప్రసరణ వ్యవస్థ శుభ్రపరచలేకపోవచ్చు. అప్పుడింక సర్జరీ చేసి డ్రెయిన్‌ చేయడం ఒక్కటే మార్గంగా అనిపించవచ్చు. కానీ, అది కూడా తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే పనిచేస్తుంది.

*దుష్ప్రభావాలే ఎక్కువ!*

ఎలర్జీ కారక పదార్థాలు దేహాన్ని తాకి చిరాకు పరిచినప్పుడు, శరీరం తన్ను తాను రక్షించుకోవడానికి యాంటీబాడీస్‌ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీలు ఎలర్జిన్‌ ఘర్షణ పడినప్పుడు శరీరం హిస్టమిన్‌ అనే రసాయనాన్ని తదితర రసాయనాల్ని ఉత్పత్తి చేసి రక్తప్రసరణ వ్యవస్థలోకి విడుదల చేస్తుంది. ఈ వర్గానికి చెందిన రసాయనాల వల్లే పైన ఉదహరించిన ఎలర్జీ లక్షణాలు దేహంలోని ఒక భాగంలో గానీ, అంతకన్నా ఎక్కువ భాగాల్లో గానీ కనిపిస్తాయి. ఇది బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి కనుక, యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం కొందరి చికిత్సా విధానంగా ఉంది. అయితే, సైనసైటిస్‌కు గురైన చాలామంది రోగుల మీద, సాధారణ యాంటీబయాటిక్స్‌ పనిచేయడం లేదు.

అందువల్ల వైద్యులు ఎక్కువ శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ సూచిస్తారు. అంతటి శక్తివంత మైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా తక్కువేమీ కాదుఈ స్థితిలో ముక్కులోని వాయు వాహికలు ఒకటి గానీ, రెండు గానీ తరుచూ దిబ్బడి వేస్తాయి. వీటివల్ల శ్వాస ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో కొంద రు సర్జరీకి సిద్ధమవుతారు. అయితే, ఒకటి రెండు సార్లు సర్జరీ జరిగిన తర్వాత కూడా చాలా మందికి సమస్య పరిష్కారమే కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేహంలోని వ్యాధి నిరోధక శక్తి కుంటుపడి, టిష్యూలు ఎలర్జీన్స్‌ వల్ల తేలికగా ప్రభావితమయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడే రకరకాల ఎలర్జీలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి రోగిలోని వ్యాధినిరోధక శక్తిని పునరుద్ధరించే ప్రయత్నం జరగాలి. కానీ, చాలా సార్లు అది జరగడం లేదు. మూలికా వైద్యం మాత్రం ఆ వ్యాధినిరోధక శక్తిని పెంచడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

మూలికావైద్యం

సైనసైటిస్‌ను సమూలంగా నయం చేయగల శక్తి మూలికా వైద్యానికి ఉంది. సైనసైటిస్‌ చికిత్సకు ఉపకరించే సుమారు పది రకాల శక్తివంతమైన మూలికలు ఈ వైద్య చికిత్పలో ఉన్నాయి. రోగి ఆరోగ్య నేపథ్యాన్ని బట్టి, ఎవరికి ఏ ఔషధాలు ఇవ్వాలో నిర్ణయించి, చికిత్స చేయడం జరుగుతుంది. మూలికా వైద్యం లక్ష్యం వ్యాధి లక్షణాలను నయం చేయడం కాదు. వ్యాది ఉత్పన్నానికి మూలకారణాలైన బాహ్య పరిస్థితులను, శారీరక సమస్యలను విశ్లేషించి వాటిని నివారించడం మూలికా వైద్యం ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. అంతే కాదు, సున్నితమైన మ్యూకస్‌ మెంబ్రేన్లను సామాన్య స్థితికి తేవడంతో పాటు, అవి సాధారణ బాహ్య పదార్థాలకు గానీ, మరే ఇతర విషయాలకు గానీ, అతిగా స్పదించకుండా చేయడం మూలికా వైద్యంలో సాధ్యమవుతుంది. నిజానికి, అత్యంత ఆధునిక యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని ఎలర్జీలను ప్రకృతి సిద్ధమైన మూలికా యాంటీబయాటిక్స్‌ పూర్తిగా నయం చేయగలవు. వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు సైనసైటిస్‌ సమస్యను సమూలంగా పోఠున్ధీ  
                
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.


కామెంట్‌లు లేవు: