11, నవంబర్ 2020, బుధవారం

పంటి నొప్పి మరియు చిగుళ్ల లో రక్తం సమస్య కు ఈ లింక్స్ లో చుడండి అవగాహన కోసం

దవడ పంటి నొప్పి మరియు చిగుళ్లు నుండి రక్తం రావడం పై అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు  - Molar Tooth Pain 

దవడ మరియు దాని దంతాల చుట్టూ ఉండే నొప్పి దవడ పంటి నొప్పిని సూచిస్తుంది. ఇది సాధారణంగా దంత క్షయం వలన సంభవిస్తుంది. దవడ పళ్ళు (మొలార్ పళ్ళు) నోటి వెనుక భాగంలో ఉంటాయి. నాలుగు మోలార్ (దవడ) పళ్ళు, ఉంటాయి రెండు పై దవడలో మరియు రెండు కింద దవడలో ఉంటాయి. కొందరు వ్యక్తులలో తక్కువ మోలార్ (దవడ) పళ్ళు/దంతాలు ఉంటాయి లేదా అసలు ఉండవు. కొందరు వ్యక్తులలో, మోలార్ పళ్ళు ఒక కోణంలో అభివృద్ధి చెందుతాయి, అవి చుట్టుపక్కల ఉన్న పళ్ళను/దంతాలను లేదా పంటి చిగురును పక్కకు తోసేస్తాయి. ఈ ప్రక్రియ చాలా బాధాకరముగా ఉంటుంది, మరియు ఆ పంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కష్టం అవుతుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పితో ముడి పడి ఉన్న ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • మోలార్/దవడ పంటి దగ్గర ఉండే దవడ భాగం బిరుసుగా మారిపోవడం లేదా నొప్పిగా ఉండడం
  • మింగడంలో కష్టం, పళ్ళు తోమడం మరియు నోరు తెరవడంలో కష్టం
  • దంత క్షయం
  • పళ్ళ మీద పళ్ళు ఏర్పడడం
  • చిగుళ్లలో చీము ఏర్పడడం
  • మోలార్ పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ల యొక్క ఇన్ఫెక్షన్ లేదా వాపు
  • చెడు శ్వాస
  • అశాంతి
  • జ్ఞాన దంతాలు మరియు వాటి పక్కన ఉండే దంతాల మధ్య ఆహారం మరియు బాక్టీరియా చేరడం
  • లింఫ్ నోడ్లలో (శోషరస కణుపులలో) వాపు
  • పళ్ళు తప్పు కోణంలో పెరగడం వలన నాలుక, చెంప, నోటిలో పైన లేదా కింద నొప్పి లేదా చికాకు
  • చిగుళ్ల వ్యాధి
  • జ్వరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పి యొక్క ప్రధాన కారణాలు:

  • డెంటల్ పల్ప్ (dental pulp, పంటి లోపలి పొర) లో వాపు
  • పంటి కురుపులు (పంటి మధ్యభాగంలో బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్టేడ్ పదార్దాల యొక్క చేరిక)
  • చిగుళ్ళ పరిమాణం తగ్గిపోవడం ఇది మోలార్/దవడ పళ్ళ మూలలను సున్నితముగా చేస్తుంది
  • పరిశుభ్రత లేకపోవడం
  • చీము ఏర్పడటం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దంతవైద్యులు పంటి చెక్-అప్/తనిఖీ ద్వారా దవడ దంతంలో నొప్పిని నిర్ధారింస్తారు మరియు నిర్వహించడం మరియు ఎక్స్- రే ఆధారంగా ఏ మోలార్ పంటి వలన నొప్పి సంభవిస్తుందో గుర్తిస్తారు.

దవడ పంటి నొప్పికి ఈ కింది పద్ధతుల ద్వారా చికిత్స జరుగుతుంది:

  • ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారుణులు (పెయిన్ కిల్లర్స్)
  • యాంటిబయోటిక్స్
  • ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాలను శుభ్రపరచడం
  • పన్ను తీవ్రంగా పాడయినట్లైతే పన్ను పీకివేయడం
  • వెచ్చని ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం
  • రూట్ కెనాల్ (Root canal


దవడ పంటి నొప్పి కొరకు అలౌపతి మందులు

Medicine NamePack Size
Oxalgin DPOxalgin DP Tablet
Diclogesic RrDiclogesic RR Injection
DivonDivon Gel
VoveranVoveran 50 GE Tablet
EnzoflamEnzoflam SV Tablet
DolserDolser Tablet MR
Renac SpRenac Sp Tablet
Dicser PlusDicser Plus Tablet
D P ZoxD P Zox Tablet
Unofen KUnofen K 50 Tablet
ExflamExflam Gel
Rid SRid S 50 Mg/10 Mg Capsule
Diclonova PDiclonova P Tablet
Dil Se PlusDil SE Plus Tablet
Dynaford MrDynaford MR Tablet
ValfenValfen 100 Mg Injection
FeganFegan Eye Drop
RolosolRolosol 50 Mg/10 Mg Tablet
DiclopalDiclopal Tablet
DipseeDipsee Gel
FlexicamFlexicam Tablet
VivianVivian Roll ON Gel
I GesicI Gesic Eye Drop
Rolosol ERolosol E 50 Mg/10 Mg Capsule
DicloparaDiclopara Tablet

చిగుళ్ళు వాపు నివారణకు ఆయుర్వేదం లో  నవీన్ నడిమింటి సలహాలు 

     చిగుళ్ళ సమస్యలు --నివారణ
1.  

వక్కలను నీళ్ళలో పోసి ఉడికించి నోట్లో వేసుకొని చప్పరిస్తూ వుంటే చిగుళ్ళ వాపు తగ్గుతుంది

2. 

 10 తులసి ఆకులు , 10  సన్నజాజి ఆకులను కలిపి నమలాలి. లేదా ముద్దగా నూరి చిగుళ్ళకు
పట్టించాలి.
3. 

 పళ్ళు సరిగా శుభ్రం చేసుకోక పోవడం ,రక్త హీనత, రక్త స్రావం మొదలైన కారణాల వలన వాపు
వస్తుంది.
    గట్టి పదార్ధాలను కొరకడం వలన వాపు రాదు,
    నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి, నోట్లో పోసుకొని పుక్కిలిస్తే వాపు తగ్గుతుంది.
                               లోద్దుగ చెక్క               ----------100 gr
                               తుంగ ముస్థలు            ----------100 gr
                               జటా మాంసి                ----------100 gr
                               త్రిఫల చూర్ణం               ----------100 gr
                 వీటన్నింటిని విడివిడిగా బాగా మెత్తగా చూర్ణాలు చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి.
                 తగినంత పొడిని తీసుకొని నీళ్ళు కలిపి పేస్టు లాగా చేసి వాపు వున్న దగ్గర పెట్టాలి.
4. (

 కారణాలు:-- ప్రధానంగా Infection చేరడం వలన , వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన, మధుమేహం
వలన  చిగుళ్ళలో వాపు వచ్చే అవకాశం ఎక్కువ.
         జామ ఆకులను చిన్న ముక్కలుగా చేసి ,నీళ్ళలో వేసి ,మరిగించి ఆ కషాయాన్ని పుక్కిట పట్టాలి. దీని వలన చిగుళ్ళ వాపు, నొప్పి తగ్గుతాయి.
         నల్ల తుమ్మ బెరడుతో కషాయం తయారుచేసి దానికి కొద్దిగా పటిక కలిపి పుక్కిలించాలి. దీని వలన చిగుళ్ళ వాపు, నొప్పి తగ్గుతాయి.
        నేరేడు ఆకులను రాతి కల్వం లో  వేసి మెత్తగా నూరి గుడ్డలో వేసి రసం పిండి దానిని పుక్కిట పడితే ఎంతటి చిగుళ్ళ నొప్పులైనా తగ్గుతాయి.
5. 

   కుండలో నీళ్ళు తీసుకొని, దానిలో పొడి బెల్లం వేసి కలపాలి. దానిలో నిమ్మ రసం పిండాలి. బాగా కలిసేటట్లు తిప్పాలి. దీనిని ప్రతి రోజు తాగితే ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది.
6.

                            చిగుళ్ళ నుండి రక్తం కారడం :--

  కారణాలు :-- చిగుళ్ళకు దెబ్బ తగలడం,రఫ్ గా ఉన్న బ్రష్ తో తోమడం, విటమిన్  సి మరియు కే యొక్క లోపం, ఆకుకూరలు,కాయగూరలు తినకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
                                  రక్త స్తంభన లేపన చూర్ణం
                                      లొద్దుగా చెక్క చూర్ణం        -------5 gr
                                      త్రిఫల చూర్ణం                   -------5 gr
                                      వేపాకుల చూర్ణం              -------5 gr
                                      నల్ల ఉప్పు                      ------- 5 gr
              ఒక పాత్రలో అన్ని చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. దీనితో పళ్ళను, చిగుళ్ళను శుభ్రపరచుకోవాలి. సమస్య తగ్గే వరకు వాడాలి. రోజుకు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. కొంతసేపు ఆగి నీళ్ళు పుక్కితబట్టి, కొంతసేపు వుంచి గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
    ఉసిరి  చూర్ణం         -----1 T.S.
 లోద్దుగా చెక్క చూర్ణం --1/2  T.S.
                   రెండు కలిపి నీటితో కడుపులోకి తీసుకోవాలి.
               
7.        చిగుళ్ళ వ్యాధుల వలన దంతాలు కదులుతూ వుంటే --నివారణ
      తుమ్మ కాయల పొడి           ------100 gr
     శొంటి పొడి                          ------ 100 gr
    లవంగాల పొడి                    ------ 100 gr
     తుంగ ముస్తల పొడి             ------ 100 gr
                 కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
                 ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కాచి అర గ్లాసుకు రానివ్వాలి. గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకొని  పుక్కిలించాలి. పుక్కిటబట్టి కొంత సేపు అలాగే ఉంచాలి. ఈ విధంగా పది, పదిహేను నిమిషాలు వుంచి కడుక్కోవాలి.
                ఈ విధంగా ప్రతి రోజు చేస్తే పళ్ళు చాలా ద్రుధంగా  తయారవుతాయి. ఎంతటి గట్టి పదార్ధాల నైనా కొరకగలరు.
8.       చిగుళ్ళ నుండి రక్తం కారడం ---నివారణ  
కారణాలు :--   చిగుళ్ళకు దెబ్బ తగలడం, పాచి పేరుకు పోవడం, పోషకాహార లోపం, మొ=
    కాచు                  --------10 gr
    దిరిసెన చెట్టు బెరడు ----- 20 gr
    సీమ సుద్ద              ------ 20 gr
         అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు రెండు పూటలా పళ్ళు తోముకుంటూ వుంటే చిగుళ్ళలో చీము, రక్తం కారడం వాపు తగ్గుతాయి.
   నిమ్మ తొక్కల చూర్ణం           ----40 gr
   కరక్కాయ పెచ్చుల చూర్ణం   ---- 20 gr
     పంచదార పొడి                     ---- 10 gr
         అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనితో పళ్ళు తోముకుంటే అన్ని సమస్యలు నివారింప బడతాయి. గట్టి పదార్ధాలను కోరక కూడదు. రెండు పూటలా దంత ధావనం చెయ్యాలి. అతి చల్లని, అతి వేడి  పదార్ధాలను వాడ కూడదు.
            చిగుళ్ల సమస్య --చికిత్స                                
పటిక
కుంకుడు కాయల పెచ్చులు
     మట్టి మూకుడులో నిప్పులు తీసుకొని వాటి పై పటికను పొంగించాలి.  దానిలో నీరు ఇంకిపోయి, తెల్లగా పొంగుతుంది దానిని నూరాఆలి (శుద్ధ భస్మం) 
     కుంకుడు కాయల లోని గింజలను తొలగించి పెచ్చులను నిప్పులపై నల్లగా కాల్చాలి.చల్లార్చి పొడిగా నూరాలి
     రెండింటి యొక్క భస్మాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
     ఈ పొడితో నెమ్మదిగా చిగుళ్ల మీద రుద్దుతూ వుంటే చిగుళ్ల లో చేరిన ఇన్ఫెక్షన్, వాపు, రక్తం కారడం వంటిసమస్యలు   నివారింప బడతాయి. దీనిని క్రమం తప్పకుండ వాడుతూ వుంటే పళ్ళు కదలకుండా వుంటాయి


       వక్కలను నీళ్ళు పోసి ఉడికించి నోట్లో పోసుకొని చప్పరిస్తూ వుంటే చిగుల్ల వాపు తగ్గుతుంది
.
               చిగుళ్ళ నొప్పుల నివారణకు                                  

       వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఈ వ్యాధి వస్తుంది.

       ఒక టీ స్పూను ఉల్లి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి  రుద్దితే చిగుళ్ళ నొప్పులు తగ్గుతాయి.


వాము పొడి
సైంధవ లవణం

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని పళ్ళు తోముకుంటే  చిగుళ్ళ వాపు, నొప్పి, తగ్గుతుంది.

తులసి ఆకులు        ---- 10
సన్న జాజి ఆకులు   ---- 10

       రెండింటిని కలిపి నమలాలి. లేదా రెండు కలిపి ముద్దగా నూరి చిగుళ్ళకు పట్టించాలి.

లక్షణాలు :-- చిగుళ్ళలో వాపు,  చిగుళ్ళు జారడం, నొప్పి, ఉమ్మినపుడు రక్తపు జీరలు,  ఆ రక్తం గులాబి రంగులో  కాక నీలం రంగులో  కనిపించడం
కారణాలు :--     సరిగా బ్రష్  చెయ్యకపోవడం,  నోటిని సరిగా శుభ్ర పరచకపోవడం,  పళ్ళ మధ్య పుల్లలతో గుచ్చడం  పొగాకు నమలడం, మధుమేహ వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలైనవి.

      త్రిఫల చూర్ణం చేతిలోకి తీసుకుని పళ్ళ మీద చిగుళ్ళ   మీద గుండ్రంగా రుద్దాలి.

      నువ్వుల నూనెను నోట్లో పోసుకుని   ఆయిల్ పుల్లింగ్ చేసుకుని పళ్ళ మీద చిగుళ్ళ  మీద రుద్దాలి

       కానుగ వేరు చూర్ణం తయారు చేసుకుని  దానితో చిగుళ్ళ  మీద రుద్దాలి.

  చిగుళ్ళ నుండి రక్తం కారడం --- నివారణ    

కారణాలు :---- చిగుళ్ళ  కు దెబ్బ తగలడం , పాచి పేరుకు పోవడం , పోషకాహార లోపం మొదలైనవి .

కాచు                           --- 10 gr
దిరిసెన చెట్టు బెరడు      --- 20 gr
సీమ సుద్ద                    --- 20 gr

       అన్నింటి యొక్క చూర్ణాలను  బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
      ప్రతి రోజు రెండు పూటలా ఈ చూర్ణం తో పళ్ళు తోముకుంటూ వుంటే చిగుళ్ళ  నుండి రక్తం కారడం , వాపు తగ్గుతాయి 

నిమ్మతోక్కల చూర్ణం                   --- 40 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణం            --- 20 gr
పంచదార పొడి                            --- 10 gr

      అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి . దీనితో ప్రతి రోజు పళ్ళు తోముకుంటూ వుంటే అన్ని సమస్యలు నివారింప
బడతాయి .       

సూచనలు :--- గట్టి పదార్ధాలను వాడకూడదు . రెండు పూటలా దంతధావనం చేసుకోవాలి . అతిచల్లని , అతివేడి
పదార్ధాలను వాడకూడదు
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.


కామెంట్‌లు లేవు: