22, జనవరి 2020, బుధవారం

కిడ్నీ లో రాళ్ళ ఉన్న వాళ్ళు కు పరిష్కారం మార్గం


*కిడ్నీ స్టోన్ బాధపడేవారికి ఉన్న వరకు కలిగే అపోహలు  దెబ్బతినకుండా కాపాడుకోండిలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు ..*

ఈ ఒక్క ఆకు రసం వాడితే చాలు కిడ్నీ సమస్యలన్నీ దెబ్బకు పోతాయి.... డయాలసిస్ పేషంట్లు కూడా బతుకుతారు!!
     మన ఆహార పదార్థాలు, పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను ఇట్టే పారదోలే అద్భుత లక్షణాలెన్నో ఉన్నాయి. మన పూర్వీకులు పదిపైసలు ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు. దానికి కారణం పెరటి మొక్కల వైద్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. *అటువంటిదే ఈ అటిక మామిడి-తెల్ల జిల్లేడు  తీగ (పల్లెల్లో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా అంటుంటారు) కూడా..* కిడ్నీ సమస్యలన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా, వచ్చే అవకాశాలున్నా కింద చెప్పిన విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇంతకూ ఏం చేయాలంటే..
తయారీ విధానం:
* అటిక మామిడి తీగను తెంచుకుని ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి.
* 200 మి.లీ. నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5-10 నిమిషాలు మరిగించాలి.
* మరిగే క్రమంలోనే అందులో ఆ ముక్కలను వేయలి.
* తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి.
* రోజూ ఉదయం 50మి.లీ. నీటిని తాగితే సరిపోతుంది.
ఇదీ ప్రత్యేకత:
* అటిక మామిడి తీగ ఊళ్లలో, చేలల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
* దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వవగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూస
* కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లిష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు.
* కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకు రసం చేసుకుని తాగితే వ్యాధులు రావు, వచ్చినా పోతాయి.
* దీనిని మిగిలిన ఆకు కూరల్లాగానే వండుకుని తింటే ఇంకా మంచిది.
* కళ్ల నుంచి కాళ్ల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
* కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునే వారు సైతం దీనిని వాడొచ్చు. అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు.
* ఇది తాగడం వల్ల వారానికి 3సార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
* అన్ని కిడ్నీ సమస్యలకు ఇంగ్లిష్ మందులు వాడుతూ కూడా ఈ రసం తాగొచ్చు. కూర తినొచ్చు. అద్భుత ఫలితాలు ఉంటాయి.

*కిడ్నీలో రాళ్లను సులభంగా తొలగించుకోవడానికి నివారణ ఎలా చేయాలి అందరికి తెలియజేయండ*

ప్రస్తుతం కిడ్నీ స్టోన్స్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి భయట పడాలంటే కింద చెప్పినట్లు చేస్తే ఉపశమనం పొందొచ్చు అని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1.కిడ్నీ లో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు.

2.నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి.

3.పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.

4.నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట.

5.కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

6.ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి.

7.కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు భయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషదం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

8.అలోవేర జ్యూస్ తాగితే మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడవని చెబుతున్నారు.

9.అదే విధంగా రోజూ ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ ఖచ్చితంగా కరిగిపోతాయి
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఎవరు ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు*
రకరకాల వైద్యం ఎంతో కాలం నుంచి  చేసుకుంటున్నా సమస్య పెరుగుతూనే వుందా ఇక్కడ పరిష్కారం వుంది  
కిడ్నీ ఫెయిల్యూర్ కి   కారణాలు :-
 షుగర్ వ్యాధి ( Diabetes ), రక్త పోటు ( B P ), గుండె సంబంధ వ్యాధులు, రక్త నాళాల వ్యాధులు ,మూత్ర వ్యవస్థ లో ఇన్ఫెక్షన్, కిడ్ని వాపు , పొగ త్రాగడం, ఆల్కాహాల్ సేవించడం, నొప్పులు తగ్గడానికి ( పెయిన్ కిల్లర్స్ ) ఇంగ్లీష్  మందులు తరచూ వాడడం మొదలగునవి ప్రధాన కారణాలు .   
ఎలా మొదలౌతుంది :-
 క్రియటినిన్ లెవెల్స్ కొద్దిగా పెరగడం, మూత్రంలో ప్రోటీన్ పోవడం, వీటిలో ఒకటి కాని రెండు కాని జరగవచ్చు. 
మనం చేసే పొరపాటు :-
క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరగడం మూత్రంలో ప్రోటీన్ లాస్ కనబడినపుడు దానిని చిన్న సమస్యగా అనుకుని పట్టించుకోము  ఇది క్రమంగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది అనే విషయం మనకు తెలియక పోవడం  ప్రధాన సమస్య , ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి కిడ్నీ ఫెయిల్యూర్ లో అయిదు దశలు ( Stages ) వుంటాయి.  కిడ్నీలు  ఒక నిమిషానికి ఎంత   రక్తాన్ని   ఫిల్టర్ చేస్తున్నాయి  అన్నదాని ఆధారంగా  కిడ్నీ ఫెయిల్యూర్ దశ ( Stages ) లను నిర్ణయిస్తారు  ఈ టెస్ట్ ను GFR ( Glomerular Filtration Rate ) అంటారు.   దురదృష్టవశాత్తూ  ఇలాంటిది ఒకటి వుంది అని మనకు  తెలియదు ఇది చాలా కీలకమయినది   
GFR ఆధారంగా  క్రానిక్ కిడ్నీ డిసీజ్ ( CKD )  దశలు 
GFR   నిమిషానికి 90 ML పైన సాధారణం 
CKD   స్టేజి 1   GFR = 89 నుంచి 60
CKD  స్టేజి 2   GFR =  59  నుంచి 45  
CKD  స్టేజి 3  GFR = 44  నుంచి 30
CKD స్టేజి  4  GFR = 29  నుంచి 15  ఇప్పటివరకు CKD గా  వ్యవహరించిన ఈ వ్యాధిని 
GFR  15 కంటే క్రిందికి వస్తే అపుడు E S R D ( End stage renal disease ) గా వ్యవహరిస్తారు  అంటే ఇక కిడ్నీలు పూర్తి స్థాయిలో పాడయి పోయాయి అని అర్ధం ఇక డయాలసిస్ అనే ప్రక్రియ పైన ఆధారపడవలసి వుంటుంది. 
మనం చేయవలసినది :-  కేవలం క్రియటినిన్  చెక్ చేసుకోవడం కాకుండా GFR  టెస్ట్  చేసుకోవడం  ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు , ఈ వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం వుంది  డయాలసిస్ చేసుకునే అవసరం లేకుండా ఆపుకోవచ్చు అంతేకాకుండా GFR క్రమంగా పెంచుకుంటూ కిడ్నీలు సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు కిడ్నీలు ఫెయిల్ అయిన కారణంగా ఏ ఒక్కరు కూడా ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు 
   క్రింది టెస్ట్ లు  
Hemoglobin, serum creatinine, blood urea nitrogen,  serum electrolytes, glomerular filtration rate ( GFR ), urine protein, urine creatinine,  protein creatinine ratio ,  diabetes (  FBS, PP )
   మీ నవీన్ నడిమింటి
*కిడ్నీ లో రాళ్లు పోవాలా మీకు కొండ పిండి ఆకులు తో పోతాయ్* 

ఈ  మొక్క కర్నూలు జిల్లా నందికొట్కూర్ ప్రాంతంలో కాలువ గట్ల వెంబడి విస్తారంగా పండుతుంది.  మసక భూముల్లో పంటతో పాటు పెరుగుతుంది.  దీని విలువ తెలియక కలుపు మొక్కల కింద దీన్ని పెకిలించి వేస్తారు.  కిడ్నీ లో రాళ్ళు కరిగించడం కొరకు వాడేవాళ్ళం.

ఇది కొండ పిండి చెట్టు. దీనిని ఒక 100 గ్రా. తీసుకొని అరా 
లీటర్ నీటిలో సగం నీరు మరిగే వరకు కాంచి తగినంత పఠిక బెల్లం అనగా కలకండ కలిపి వారం రోజులు పడకడుపున తాగితే మీ కిడ్నీ లో రాళ్లు కానీ, మూత్ర సమస్యలు కానీ, కిడ్నీ ల ప్రతి సమస్య తీరిపోతుంది.

కొండపిండి మొక్కలు రెండడుగుల ఎత్తు వరకూ పెరుగుతూ తెల్లటి నూగుతో ఉండే మొక్కలు. ఒక సమయంలో వీటి పచ్చటి ఆకులన్నీ రాలిపోయి, కేవలం పొడిపొడిలాంటి నూగుతో కూడిన పూత చెట్టునిండుగా కనబడుతుంటుంది. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సమయంలో గొబ్బెమ్మల్ని అలంకరించేందుకు ఈ పూతని ఉపయోగిస్తుంటారు. సంస్కృతంలో 'పాషాణ భేది ' అని పిలువబడే ఈ మొక్క నిజంగానే రాళ్లను పగలగొడుతుంది: మూత్రపిండాలలో పెరిగే రాళ్లను ముక్కలు ముక్కలుగా చేయటంలో దీన్ని మించిన ఔషధం లేదు అని చెబుతారు.
*కిడ్నీ లో రాళ్ళు పోవాలా ?*
.
కొండ పిండి మొక్క ఆకులు తో పోతాయి 
.
1) మీ ఇంట్లో ఈ మొక్క కుండీలలో పెంచండి . రోజూ 4 లేక 5 ఆకులు నమిలి తినండి . ఇది కొంచెం లేట్ గా ఫలితం కనిపించవచ్చు . మీ కిడ్నీ లలోకి రాళ్ళు చేరకుండా చూడడం , తొలగించడం అన్నీ చేస్తుంది

 . 
2) కొన్ని ఆకుల రసం తీసుకుని తాగండి . 15 రోజులలో ఫలితం కనిపిస్తుంది .
.

. . ఇలా మా యోగా క్లాస్ లో ఒకరు చెప్పగా చేసిన వ్యక్తి కి 15 రోజుల తర్వాత స్కానింగ్ చేయిస్తే కిడ్నీ లో ఉండవలసిన రాయి సైజ్ తగ్గి యూరిన్ బ్లాడర్ లోకి వచ్చేసింది .
.
3) ఈ ఆకులు పప్పులో వేసుకుని తినండి . రుచిగానే ఉంటుంది . ఫలితం ఉంటుంది 
.

4) ఇది దొరకని వారు అశ్మరీ క్వాత్ అనే మూలికల ప్యాకెట్
.
 ( బాబా రామ్ దేవ్ వారి చికిత్సాలయం లో దొరుకుతుంది . అది ఇదే ) దానిని కషాయం గా కాచుకుని త్రాగండి B

5)వృక్కదోషహర వటి అని టాబ్లెట్ రూపంలో కూడా లభిస్తుంది
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
      
.
     
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: