4, జనవరి 2020, శనివారం

బరువు తగ్గాలి అనుకుంటే మంచి ఆహరం, వ్యాయామాలు అనుసరించాలి. ఆహర విషయానికి వస్తే బరువు పెంచే పట్టిక గురించి ఇక్కడ తెలుపబడింది

బరువు తగ్గడం ఎలా పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు 


       ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు , స్ధూలకాయంతో సతమతమవుతున్నారు . ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికి , చాలా మంది మధ్యవయస్సులోనే ఎక్కవగా *బరువు* పెరుగుతుంటారు .
        శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు , ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్ల అలవాటు వంటి జీవనశైలితో స్ధూలకాయం వస్తుంది .
      స్ధూలకాయం కారణంగా గుండె జబ్బులు , అధిక రక్తపోటు , మధుమేహం , సంతాన సమస్యలు , క్యాన్సర్ , ఊపిరితిత్తుల జబ్బులు , పిత్తాశయంలో కిడ్నీల్లో రాళ్ళు , అల్సర్లు , గ్యాస్ట్రిక్ సమస్యలు , మోకాళ్ళ నొప్పులు మొదలగునవి చుట్టుమడుతున్నాయి .
         స్త్రీలు రజస్వల అయినపుడు గర్భం ధరించినపుడు , ముట్లుడిగన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది .
# స్తూలకాయులు కఫ , వాత రోగులు .
# శారీరక దుఃఖాలలో 90 % పొట్ట వల్ల వచ్చేవి .
# మనము తిన్న ఆహారం పొట్టలో సక్రంగా జీర్ణం అవ్వడం చాలా ముఖ్యం . కాబట్టి తినడం ఎంత ప్రధానమో , సక్రమంగా జీర్ణమటం అంతే ముఖ్యం . భోజనం కుళ్ళినప్పుడు శరీరంలో L.D.L. / V.L.D.L. ( చెడు కొలెస్ట్రాల్ ) తయారవుతుంది . మీకు ఈ చెడుకొలెస్ట్రాల్ వల్లనే స్ధూలకాయం వస్తుంది . మేలు చేసే కొలెస్ట్రాల్ ( H.D.L. ) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది . శరీరంలో కాల్షియం , విటమిన్ ' సి '  లోపించిన స్ధూలకాయం వస్తుంది .
*బరువు తగ్గే మార్గాలు* :-
1. *నీరు త్రాగే విధానం*...
   # నీటిని గుటక గుటకగా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 1 గంట ముందు నీళ్ళు త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనము తర్వాత 1 1/2 గంట తర్వాత త్రాగాలి . భోజనము మధ్యలో త్రాగాలని పిస్తే 1 లేక 2 గుటకలు త్రాగవచ్చు . భోజనము తర్వాత గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగ వచ్చును .
# మీరు పై పద్దతిలో నీళ్ళు త్రాగిన యెడల తిన్న ఆహారం సక్రమంగా *జీర్ణం* అవుతుంది . ఆహారం *కుళ్ళి పోదు* . L. D. L. / V. L. D.L. అనే *చెడు కొలెస్ట్రల్* తయారవదు
*అధిక బరువు* సమస్య వుండదు .
*నీటిని గుటక గుటకగా త్రాగితే ఎలాంటి గుండె జబ్బులు , మధు మేహం , అధిక బరువు వంటి సమస్యలు రావు*.
*వంట నూనె*
# మీరు వంటకు ఉపయోగించే *శుద్దమైన నూనె ( Non Refined Oil )* మీ *వాతాన్ని* పెరగనీయ కుండా ఉంచుతుంది . స్ధూలకాయం సమస్య వుండదు . శుద్ధమైన నూనె తీసుకుంటే శరీరంలో *లివర్* సహాయంతో మంచి *కొలెస్ట్రాల్ ( H.D.L)* ఎక్కువ మోతాదులో తయారవుతుంది . ఈ (H.D.L)  మంచి చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది .
# *హాని చేసే కొలెస్ట్రాల్ ( L.D.L./ V.L.D.L )* వల్లనే *స్ధూలకాయం* వస్తుంది . కావున ఎటువంటి *(Refined Oils) రిఫైండ్ నూనెల* ను వాడరాదు
ఈ రీఫైండ్ నూనెను తయారు చేసేటప్పుడు 6 లేక 13 రకాల హానికరమైన కెమికల్స్ ని కలుపుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి .
# శుద్దమైన నూనెను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు .
*శుద్దమైన నునెలు* ..
  *వేరు శనగ నూనె , నువ్వుల నూనె , కుసుమల నున్ మరియు కొబ్బెర నూనెలు* .
*3త్రిఫల చూర్ణం*
*కరక్కాయ + తానెకాయ + ఉసరికాయలు కలిసినదే త్రిఫల చూర్ణం* వాత,పిత్త,కఫముల ఈ మూడింటినీ అద్భతముగా శమింప చేస్తుంది ఈ త్రిఫల.
*త్రిఫల యొక్క మోతాదు*
  1భాగం కరక్కాయ +2 భాగాలు తానేకాయ + 3 భాగాలు ఉసరికాయలు కలుప వలెను .
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . ఉత్తమమైనది .
# కొన్ని రకాల ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే సమపాళ్ళలో ఉన్న త్రిఫల చూర్ణంని తీసుకోవలసి వస్తుంది .
# ఆయుర్వేద షాపులలో  సమపాళ్ళలో వున్న త్రిఫల చూర్ణం లభిస్తుంది . కావున మీరే 1:2:3. నిష్పత్తిలో త్రిఫల చూర్ణంని తయారు చేసుకొనండి .
*త్రిఫల వాడే విధానము*.
    ఉదయం పరగడపున అల్పాహారినికి 45 నిమిషాల ముందు ఈ త్రిఫలని తీసుకొనవలెను .
*1 ( పెద్ద స్పూన్ ) త్రిఫల చూర్ణం + బెల్లం లేక తేనెను కలిపి తినవలెను* 
*తర్వాత ఆవు పాలు త్రాగవలెను* 
అధిక బరువు తగ్గుతారు .
# ఉదయం పూట త్రిఫల తీసుకోవడం వలన శరీరానికి కావలసిన *విటమిన్స్ , మైక్రో నూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ అన్నిరకాల పోషకాలు అందుతాయి . *ఖచ్చితంగా బరువు తగ్గుతారు* .
*4. ఆవు పాలు + ఆవు నెయ్యి*..
  # దేశీయ ఆవు పాలు అమృతం . ఆవు పాలు ఎంత వేడి చేసినా దానిలో ఉన్న ఏ గుణం నశించదు .
# ఆవు నెయ్యిలో అద్భతమైన ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు కలవు . *ఆవు నెయ్యి శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది* . అధిక బరువు వున్న వారు బరువు తగ్గుతారు .
*ఆవు నెయ్యిని తీసుకొనే విధానం* : ----
# రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి వేడి ఆవు పాలలో 1 లేక 2 గ్లాసుల చెంచాల ఆవు నెయ్యిని+చిటికెడు పసుపు  కలిపి , రెండు గ్లాసులతో ఎక్కువ సేపు , సుమారుగా 20-25 సార్లు పైకీ క్రిందికి తిరగతిప్పాలి. అప్పుడు ఆ పాలను గుటక గుటకగా త్రాగ వలెను.
*బరువు తగ్గుతారు*.
# వేడి వేడి కిచిడిలో బాగా ఎక్కువ నెయ్యి కలుపుకుని వారానాకి ఒక సారి తిన వలెను. *బరువు తగ్గుతారు*.
*పాటించ వలసిన నియమాలు* .
# సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
# ప్రతి రోజు ఉదయం 10-15 నిమిషాలీ తిరగలి తిప్పాలి .
# స్త్రీలు తిరగలి తిప్పిన యెడల మోనోపాజ్ సమస్యల నుండి రక్షిస్తుంది .
# పొట్ట తగ్గాలన్నా , ఎసిడిటి , విరేచన , జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే ప్రతి రోజు తిరగలి తిప్పండి .
# భోజనం తర్వాత నల్ల నువ్వులను బాగా నమిలి తినండి . 3 లేక 4 నెలల్లో 7 లేక 8 కిలోల బరువు తగ్గుతారు .
*వేసవిలో నువ్వులను తినరాదు* .
# ఫ్రిజ్ నీటిని , ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగరాదు .
# పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు సుఖాసనంలో కూర్చోని భోజనం చేసిన యెడల 2 లేక 3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళి ఉంటుంది .
#.మైదా. తో చేసిన పదార్థాలు తినకొఢథు.
# పరోటా రాత్రి తినటం వల్ల పొట్ట పెరిగే అవకాశం వున్నది .
# గోధుమలు , మైదాను వాడరాదు .
# గోడంబి బరువును పెంచుతుంది .
# నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బరువు తగ్గుతారు .
# ఆహారంలో *చిరు దాన్యాలు ( Millets ) ను చేర్చుకొన వలెను .
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

కామెంట్‌లు లేవు: