15, అక్టోబర్ 2020, గురువారం

నడుము నొప్పి నివారణకు యోగ మరియు ఆయుర్వేదం నివారణకు మార్గం ఈ లింక్స్

నడుము నొప్పులు నివారణకు ఆయుర్వేదం మరియు యోగ నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు 
                నడుము నొప్పి --నివారణ                    
యోగాసనం :-  రెండు కాళ్ళు ఒక అడుగు ఎడంగా వుంచి రెండు చేతులను పైకెత్తి, రెండు చేతులలో దూర్చి అరి చేతులను పైకి పెట్టాలి.తరువాత అదే పొజిషన్ లో ఎడమ వైపుకు, కుడివైపుకు వంగాలి. 10 తో ప్రారంభించి
 
       20,30,40 పెంచాలి. దీని వలన నడుము భాగం లోని కొవ్వు కరుగుతుంది.నడుము నొప్పి తగ్గుతుంది.
 
2.  నిలబడి నెమ్మదిగా పాదాన్ని పైకెత్తాలి.  రెండవ పాదాన్ని కూడా అదేవిధంగా పైకెత్తాలి.మోకాలు వంగకూడదు

దీనిని గాలి పీలుస్తూ వదుల్తూ చెయ్యాలి.

                నడుము నొప్పి --నివారణ                                
       కారం, చేదు, వగరు ఎక్కువగా వాడే వాళ్లకు నడుమునొప్పి ఎక్కువగా వస్తుంది, ఎక్కువవుతుంది.
 
పుట్టుకతో నల్లగా వున్నవాళ్ళు వాత శరీరంతో వుంటారు.  నడుము నొప్పి వున్న వాళ్ళు తీపి ఎక్కువగా తినాలి.
 
ఆహారాన్ని అతిఎక్కువగా, అతితక్కువగా తినకూడదు.  ఆరుబయట గాలిలో ఎక్కువగా తిరగకూడదు. ఎక్కువ సేపు ఫ్యాన్  కింద కూర్చుంటే వాతం చేరుతుంది.
 
ఆహారం    ----- వెల్లుల్లి గారెలు
 
      మినప పప్పులో వెల్లుల్లి పాయల ముద్ద, అల్లం ముద్ద, పొంగించిన ఇంగువ పొడి, కొద్దిగా సైంధవ లవణం    కలిపి నూనెలో వేసి గారెల లాగా కాల్చుకొని ఒకటి, రెండు మాత్రమే తినాలి. దీని వలన వాతనోప్పులు తగ్గుతాయి
 
నడుమునొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నోప్పి శరీరం బిగిసినట్లు గా వుండడం తగ్గుతాయి.
 
నడుము దగ్గర కొవ్వు కరగడానికి (భార్యా భార్తలిరువురికి )
 
          బాదం పప్పు           ------ పావుకిలో
         గసగసాలు              ------ పావుకిలో
        పటికబెల్లం              ------ పావుకిలో
 
        బాదం పప్పులను రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం తొక్కులు తీసి బాగా ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
 
       గసగసాలను నేతిలో దోరగా వేయించి దంచి జల్లించి పొడి చేసుకోవాలి.
 
     పటికబెల్లాన్ని కూడా దంచి పొడి చేసుకోవాలి.
 
     అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
 
     అర గ్లాసు పాలలో గాని లేదా నీళ్ళలో గాని అర టీ స్పూను పొడిని కలుపుకొని తాగితే  నడుమునొప్పి,మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
 
             నడుము నొప్పి --నివారణ                                                  
 
       సాఫ్ట్  వేర్ ఉద్యోగస్తులు కూర్చునేటపుడు వాళ్ళ పొజిషన్ ను అప్పుడప్పుడు మారుస్తూ వుండాలి.
 
కటిచక్రాసనం:--  రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు స్థలం ఉండేట్లుగా నిలబడాలి. రెండుచేతులను పక్కలకు చాపి నిలబడాలి. అలాగే నిలబడి కదలకుండా గాలి పీలుస్తూ కుడివైపుకు తిరగాలి, గాలిని వదులుతూ మధ్యలోకి  రావాలి.  అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
 
అర్ధ చక్రాసనం :-- నిటారుగా నిలబడి కుడి చేతిని పైకెత్తి ఎడమ వైపుకు వంగాలి.శరీరాన్ని మాత్రం వంచకూడదు నడుమును కొద్దిగా మాత్రమే వంచాలి.అలాగే రెండవ వైపు కూడా చెయ్యాలి.
నడుమును గుండ్రంగా తిప్పాలి.
 
నటరాజాసనం :--  కుడిచేతిని పైకెత్తి, ఎడమ కాలును వెనక్కి పెట్టి ఎడమ చేతితో కాలును పట్టుకోవాలి.అలాగే   రెండవ వైపుకూడా చేయాలి.
 
ఆహారం:--
     జల్లించిన తెల్ల తవుడు      ------- పావు కిలో
     పాత బెల్లం                      -------  పావు కిలో
     నాటు నెయ్యి                   -------  పావు కిలో
 
      అన్నింటిని రోటిలో వేసి బాగా దంచాలి. ముద్దగా అయిన తరువాత 10 -15 గ్రాముల ఉండలు చేసి సీసాలో  భద్రపరచాలి. ఉదయం పరగడుపున   సాయంత్రం పొట్ట ఖాళీగా వున్నపుడు  ఒక్కొక్క ఉండ చొప్పున తిని,  గ్లాసు నీళ్ళలో ఒక స్పూను కలకండ కలుపుకొని తాగాలి.
 
 
     ఎక్కువసేపు కదలకుండా కూర్చున్న వాళ్ళు, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, నడుము దగ్గర  కొవ్వు పెరిగిన వాళ్ళు ఈ సమస్యతో బాధ పడుతుంటారు.
 
వ్యాయామం:-- నడుము మీద నూనె రాసి రెండు బొటన వేళ్ళతో సరదియ్యాలి. చేతిని కత్తి లాగా నిల బెట్టి కొట్టాలి.  నొప్పులను నివారించే ఆకులను వేసి   మరిగించి  ఆవిరి పట్టాలి  దానిలో  గుడ్డనుముంచి  ఓర్చుకో గలిగినంత వేడిగా కాపడం పెట్టాలి.
 
భుజంగాసనం:-- బోర్లా పడుకొని చేతులను నేలకు ఆనించి మెడను, పొట్టను పైకి లేపాలి,
 
శలభాసనం:-బోర్లాపడుకొని చేతులనుపొట్ట కింద పెట్టుకొని ఒక కాలును పైకి లేపాలి, అదే విధంగా రెండవ 
వైపు కూడా లేపాలి. తరువాత రెండు కాళ్ళు లేపాలి.
 
      బోర్లా పడుకొని వ్యతిరేక దిశలో అంటే ఎడమకాలు, కుడిచెయ్యి ఒకే సారి లేపాలి. అదే విధంగా కుడికాలు, ఎడమ చెయ్యి ఒకే సారి లేపాలి.
 
      స్త్రీలకు సిజేరియన్ ల వలన, మగవాళ్ళు శరీరాన్ని కదిలించక పోవడం వలన ఈ సమస్య వస్తుంది.
 
      ఇసుకను వేడి చేసి గుడ్డలో వేసి కాపడం పెడితే అప్పటికప్పుడు నడుము కదులుతుంది.
 
       ఏరుడు పిడకలను కాల్చి నులక మంచం కింద పెట్టి పొగ బెడితే నొప్పి తగ్గుతుంది.

 ఉమ్మెత్త ఆకులు         ---- 4, 5
నానబెట్టిన బియ్యం      ---- పిడికెడు
 
      రెండింటిని కలిపి నూరితే జిగటగా వస్తుంది . దానిని గుడ్డకు పూసి పట్టి వేస్తే నొప్పి తగ్గుతుంది.
 
గింజలు తీసిన ఎండు ఖర్జూరం
మహిషాక్షి గుగ్గిలం
తడిపిన గోధుమ పిండి
 
     గింజలు తీసిన ఖర్జూరంలో మహిషాక్షి గుగ్గిలాన్ని పెట్టి గోధుమ పిండిని కవచం లాగా పూసి నిప్పుల మీద  దొర్లించాలి. కాలిన తరువాత
గోధుమ పిండిని తొలగించి కాయలను నూరి మాత్రలు చేసి ఎండబెట్టి నిల్వ చెయ్యాలి. ( బటాణి  గింజంత మాత్రలు )
 
     ఉదయం, సాయంత్రం  ఆహారానికి గంట ముందు వాడితే మూడు వారాలలో నడుము నొప్పి తగ్గుతుంది.   
                 నడుము నొప్పి --- నివారణ                                      
    వ్యాయం చెయ్యాలి. ఆసనాలు వెయ్యాలి

    కారం, చేదు , వగరు తక్కువగా తినాలి.
 నడుమునొప్పి వున్నవాళ్ళు తీపి పండ్లు, ఇంట్లో చేసిన పదార్ధాలుతినాలి.

                    వెల్లుల్లి గారెలు 

 మినప పిండి
అల్లం                                      --- 3 gr
పొంగించిన ఇంగువ                     --- 2 చిటికెలు
వెల్లుల్లి                                    --- తగినన్ని
 సైంధవ లవణం                         --- తగినంత
నూనె

    మినప పిండిలో పైదార్ధాలను అన్నింటిని కలిపి గారెల్లా గా చేసి నూనెలో వేయించాలి.
   1,2  గారెలను మాత్రమే తినాలి.

      నడుము నొప్పి, ఇతర నొప్పులు --నివారణ                          
 
        వావిలాకు మొక్క యొక్క వేళ్ళ పై బెరడును నూరి నువ్వుల నూనె కలిపి చప్పరిస్తూ వుంటే నడుము   నొప్పి, ఇతర నొప్పులు నివారింప బడతాయి.                           
       కారణం తెలియని నడుము నొప్పి నివారణకు                                
        10.  15  గ్రాముల అల్లాన్ని సన్న ముక్కలుగా తరిగి నేతిలో వేయించి 5 రోజులు తింటే 6 నెలలుగా వున్న  నడుము నొప్పి తగ్గుతుంది,
 
                 నడుమునొప్పి --నివారణ                                             
మెంతి పిండి             --- 5 టీ స్పూన్లు
శొంటి పొడి               --- 1 టీ స్పూను
 
      రెండింటిని కలిపి  రెండు భాగాలు చెయ్యాలి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీటితో తీసుకోవాలి.
 
దీనితో సాధారణమైన నడుమునొప్పి అద్భుతంగా తగ్గుతుంది.
 
      వాతం వలన బిగుసుకుపోయిన  నడుము నొప్పి, వెన్ను నొప్పి--'నివారణ          

                         కటివస్తి

            ఇది  పంచ కర్మ చికిత్సల లో ముఖ్యమైనది
 
     మినప పప్పును గట్టిగా రుబ్బి నడుము మీద గుండ్రంగా ఏర్పాటు చెయ్యాలి, అంటే ఒక గిన్నెలాగా అంటే మధ్యలో ఖాళి వుండాలి. పిండిని గుండ్రంగా ఏర్పాటు చేసి దాని లో నువ్వుల నూనె పోయాలి. ఓమ తైలం,  ఉత్తరేణి తైలం వాడవచ్చు.

మినప పప్పు                   --- అర కిలో
ఔషధ తైలం                    --- అర కిలో

       మినప పప్పును  అర లీటరు వేడి నీళ్ళలో కలిపి బాగా పిసికి మెత్తగా చెయ్యాలి.        కాలకృత్యాల తరువాత ప్రశాంతమైన మనసుతో ప్రారంభించాలి.

       రోగిని బోర్లా పడుకోబెట్టి ఎక్కడ నొప్పి ఉన్నదో అక్కడ ఒక చట్రం లాగా ఒకటిన్నర అంగుళం ఎత్తుగా  ఏర్పాటు చెయ్యాలి. మినప పిండికి కూడా నొప్పి ని తగ్గించే లక్షణం వున్నది.  ఔషధ తైలాన్ని పరోక్షంగా వేడి చేసి ఆ పిండి మధ్యలో పొయ్యాలి. బొటన వ్రేలుతో నడుము మీద మసాజ్ చెయ్యాలి. తైలం చల్లారితే  దానిని  స్పూన్ సహాయంతో గాని, గుడ్డను ముంచి గాని తీసి మరలా వేడి చేసి మరలా పిండి మధ్యలో పోయాలి.

    ఆ విధంగా ఒక గంట సేపు చేయాలి. బోర్లా పడుకున్నపుడు గడ్డం కింద చేతులు పెట్టుకోవాలి. పూర్తిగా బిగదీసుకొని ఉండవలసిన అవసరం లేదు. కొంత శరీరాన్ని, కాళ్ళను, చేతులను కదిలించవచ్చు.

      పిండిని, తైలాన్ని తొలగించిన తరువాత వెన్నుపూస మీద రెండు బొటన వ్రేళ్ళతో మర్దన చెయ్యాలి. రోగికి
రిలీఫ్  అనిపించినా తరువాత తీసేయ్యాలి.     తీసినతరువాత మసాజ్చెయ్యాలి. నొప్పి వున్నచోట అనగా నూనెపోసిన చోట వర్తులాకారంలో  మర్దన చెయ్యాలి.  ఆ ప్రదేశంలో వేడి నీళ్ళలో ముంచిన టవల్ తో కాపడం పెట్టాలి.

      పైన చెప్పబడిన ప్రక్రియ  పూర్తి అయిన తరువాత కూడా 15 నిమిషాలు అలాగే పడుకొని వుండాలి. తరువాత
వేడి సున్ని పిండి గాని, లేక పెసర పిండి గాని రుద్దుకొని వేడి నీటితో స్నానం చెయ్యాలి.

         నడుమునొప్పి --నివారణా మార్గాలు         

       ఈ నొప్పి స్త్రీలలో గర్భాశయ సంబంధంగా, పురుషులలో వాత సంబంధంగా ఉండవచ్చు. వెన్నుపూసల మధ్యవుండే కార్టిలేజ్ పక్కకు జరగడం వలన వెన్ను నొప్పి  వస్తుంది.

       తైలంతో కాపడం పెడితే వాత సంబంధమైన నొప్పి తగ్గుతుంది.

1. నువ్వుల నూనె                  --- 100 gr
    వెల్లుల్లి ముద్ద                     --- 100 gr

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తేమ ఇగిరిపోయే వరకు కాచాలి.  తరువాత చల్లార్చి వడకట్టి సీసాలో భద్ర పరచుకోవాలి.

     అవసరమైనంత నూనెను తీసుకుని వేడి చేసి దానిలో పలుచని గుడ్డను ముంచి నడుము మీద  నొప్పి వున్నచోట పరచాలి.  నొప్పి తగ్గుతుంది. లేదా నూనెను రుద్ది కాపడం పెట్టవచ్చు.   రెండు టీ స్పూన్ల తైలాన్నితాగాలి.

వావిలాకు కషాయం 

వావిలాకులు             --- 20 gr
నీళ్ళు                       --- రెండు గ్లాసులు

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి.  వడకట్టి రోజు రెండు పూటలా  తాగుతూ వుంటే నొప్పి తగ్గుతుంది.

3. మిరియాలు                ---50 gr
    పిప్పళ్ళు                   --- 50 gr
    శొంటి                        --- 50 gr
    కరక్కాయలు              --- 50 gr
    తానికాయ లు             --- 50 gr
    ఉసిరికాయలు             ----50 gr
    వాము                     ----100 gr
   తిప్ప తీగ                ---- 100 gr

      అన్నింటిని విడివిడిగా చూర్ణాలు  చేసి కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.

      ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు మజ్జిగలో గాని లేదా ఒక గ్లాసు నీటిలో గానివేసి  కలిపి తాగాలి.  దీని వలన అన్నిరకాల ముఖ్యంగా వాత నడుము నొప్పి నివారించ బడుతుంది.
                              నడుము సన్నబడడానికి చిట్కా                                     
         పొడిగా వున్న త్రిఫల చూర్ణం తో  నడుము చుట్టూ మర్దన చేస్తూ వుంటే కొంత కాలానికి
  లావు తగ్గుతుంది.
                 నడుము నొప్పి-- నివారణ                                         
          ఈ సమస్య ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా వుంటుంది. రోజంతా పని వలన, హార్మోన్లలో
  తేడాల వలన,  అనారోగ్యం, మూత్ర సంబంధ  ఇన్ఫెక్షన్ వలన,  కిడ్నీలలో  రాళ్ళ వలన, తెల్లబట్ట
  సమస్య వలన, ఒత్తిడి వలన, తక్కువ  సమయంలో ఎక్కువ  పనులు చేయడంవంటికారణాల        వలన ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది.
                      పొగాకు తైలం

      పొగాకు ముద్ద             ---  10 gr
                  నీళ్ళు            --- 160 ml
      నువ్వుల నూనె          ---   40 ml
      ఆముదపు ఆకులు    

              పొగాకును నీళ్ళు చల్లుతూ ముద్దగా నూరాలి. ఒక పాత్రను తీసుకుని దానిలో నీళ్ళు పోసి
  పొగాకు ముద్దను వేయాలి. స్టవ్ మీద పెట్టి మరగడం ప్రారంభమైన తరువాత నువ్వుల నూనెను
  కలపాలి.  నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. దించి, వడపోసి, చల్లారిన తరువాత సీసాలో
  నిల్వ చేసుకోవాలి.

             అవసరమైనపుడు అర చేతిలో వేసుకుని వేడి పుట్టే వరకు రుద్ది నడుముపై మర్దన             చేయాలి.  తరువాత వీలైతే ఆముదపు ఆకులను నడుముపై కప్పి కట్టు కట్టాలి.

             మూత్ర సంబంధ సమస్యల వలన గాని నడుము నొప్పి వుంటే  సగ్గుబియ్యపు జావ, బార్లీ
 ఆకుపచ్చని ధనియాల కషాయం, కొబ్బరి నీళ్ళు తాగాలి.

             గర్భిణీ సమయంలో నొప్పి వుంటే నడుము మీద ఒత్తిడి లేకుండా దిండు పెట్టుకుని పడుకోవాలి.

             తెల్లబట్ట సమస్య వలన నడుము నొప్పి వుంటే అది బలహీనత వలన కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి
              నడుము నొప్పి నివారణకు --- కృష్ణ మోహిని లేపనం           
                             కృష్ణ మోహిని     =   నల్ల ఉమ్మెత్త  ( విష పదార్ధం ) 

 ఉమ్మెత్త గింజలను తగినంత కొబ్బరి నూనె వేసి నూరాలి.  ( గింజలను దంచి,  జల్లించి  కొబ్బరి నూనె కలిపి నూరవచ్చు.   ఇది లేపనం లాగా తయారవుతుంది. )

       నడుము నొప్పి ఉన్నవాళ్ళను  బోర్లా పడుకోబెట్టి నడుము మీద ఈ చివర నుండి ఆ చివర వరకు పట్టు వేయాలి.

దాని మీద గుడ్డ పరచవచ్చు లేదా కట్టు కట్టవచ్చు.

        దీనిని వాడడం వలన ఎంతో కాలంగా వున్న దీర్ఘ కాలపు నడుమునొప్పి  చాలా త్వరగా నివారింపబడుతుంది.
                   నడుము నొప్పి ---నివారణ                 
బోడతరం పూల పొడి                 --- 30 gr
తిప్ప తీగ            "                 --- 30 gr
శొంటి                 "                 --- 20 gr
మెంతి                "                 --- 20 gr
దుంప రాష్ట్రం       "                 --- 40 gr
అశ్వగంద         "                   --- 60 gr
ఆముదం                              --- తగినంత

     పై  చూర్ణాలను  అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తగినంత ఆముదం కలిపి లేహ్యం
లాగా కలపాలి .  దీనిని వెడల్పు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి .
    ప్రతి రోజు గచ్చ కాయంత లేహ్యాన్ని ఆహారానికి ముందు తిని నీళ్ళు తాగాలి . దీనితో ఎటువంటి
నడుము నొప్పి అయినా నివారింపబడుతుంది .

            నడుము నొప్పి   --- నివారణ                                     
వాము  పొడి                 --- చిటికెడు
మిరియాల పొడి            ---      "
సన్నరాష్ట్రము              ---      "
కటుకరోహిణి                 ---      "
పొంగించిన ఇంగువ         ---      "
వెల్లుల్లి  ముద్ద              ----     ఒక టీ స్పూను

    అన్నింటిని ముద్దగా కలిపి శనగ గింజలంత  మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టాలి .
    ప్రతిరోజు ఒక మాత్ర చొప్పున వాడాలి .
    దీని వలన శరీరం లోని వాతము  తగ్గి  అన్ని రకాల నొప్పులు నివారింపబడతాయి

             నడుము నొప్పి   --- నివారణ                 
ఆముదపు గింజల పప్పులు              --- మూడు లేక నాలుగు
          బియ్యం               --- చారెడు
          పాలు                  --- ఒక కప్పు          
         చక్కెర                 ---  రెండు టీ స్పూన్లు

         బియ్యాన్ని రవ్వ లాగా చేసి పాలు పోసి , పప్పు పొడి వేసి కాచి చక్కర కలపాలి .దీనిని రోజుకు రెండు సార్ల చొప్పున
ప్రతి రోజు తాగుతూ వుంటే నడుము నొప్పి తప్పక నివారింపబడుతుంది ,

         దీంతో పాటు నడుము మీద తైలం తో మర్దన చేయాలి .
            నడుము నొప్పి   ---నివారణ                          
కారణాలు :--- శరీరం లోని మలినాలు  చేరడం , కూర్చొనే విధానం , బండి నడిపే విధానం , గాయాల కారణం గా , ప్రసవ
సమయం లో శస్త్రచికిత్స  మొదలైన కారణాల వలన నడుము నొప్పి వచ్చే అవకాశం కలదు . 

చికిత్సా విధానం :--- రోగిని  బోర్లా పడుకోబెట్టాలి .నదుము దగ్గర నుండి  రెండు బొటన వ్రేళ్ళతో వెన్నుపూస వెంబడి పైకి
సున్నితంగా తైలంతో మర్దన చేయాలి .  మూడు వేళ్ళతో నడుము నుండి పైకి వెన్ను పూస మీద  పైకి పాకిన్చినట్లు  మర్దన
చేయాలి .
        మర్దన  చేసిన తరువాత కాపడం  పెట్టాలి . నీటిలో వాతాన్ని తగ్గించే ఆకులను వేటినైనా  (కసివిండ , వావిలి  మొదలైన ) వేసి , పసుపు కలిపి బాగా  కాచాలి . ఆ నీటిలో మందమైన బట్టను ముంచి ఒర్చుకో  గలిగినంత వేడిగా
కాపడం  పెట్టాలి .

నడుమును నొక్కే విధానము :--- రోగిని బోర్లా పడుకోబెట్టాలి .ఎదమ చేతిని నడుము మీద పెట్టి  దాని మీద కుడిచేతిని
వుంచి గట్టిగా నొక్కాలి . ఆ విధంగా నడుము నుండి ప్రారంభించి మెడ వరకు నొక్కాలి . అలాగే వెన్ను పూసకు ఎడమ వైపు
కింది నుండి పైకి నొక్కాలి , అదే విధంగా  రెండవ వైపు కూడా అలాగే నొక్క్కాలి

        రోగి వెల్లకిలా పడుకొని గాలిని పీలుస్తూ  కాళ్ళను నేల  మీద ఆనించి నడుమును మాత్రం పైకి లేపాలి  గాలి వదులుతూ
నడుమును కిందికి దించాలి . ఈ విధంగా 5 నుండు 10 సార్లు చేయాలి .థరువాథ కొంత విరామం పొందవచ్చు ..

       బోర్లా పడుకొని రెండు అరచేతులను కింద ఆనించి తలను పైకి లేపాలి . అలాగే చేతులను ఆనించి భుజాలను పైకి
లేపాలి , తలను పూర్తిగా పైకి లేపాలి .

       పద్మాసనం వేసుకొని కూర్చొని  మహా వాయుముద్రను వేయాలి . అనులోమ , విలోమ ప్రాణాయామము లను చేయాలి .  పూటకు 15 సార్లు చొప్పున రోజుకు మూడు సార్లు చేయాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు ;--- పెరుగు వాడకూడదు ంఅజ్జిగలొ మెంతి పొడి , ఉల్లిపాయలు వేసుకొని వాడాలి .కొత్తబియ్యం ,
కొత్త గోధుమలు ,  కొత్త పదార్ధాలను వాడకూడదు .

అశ్వగంధ చూర్ణం 
పటికబెల్లం

         రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . ప్రతి రోజు అర  టీ స్పూను పొడిని పాలలో కలుపుకొని తాగాలి

యోగా చేయడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. కొంతమంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఏయే ఆసనాలు వేస్తే ఫలితం ఉంటుందో తెలుసుకోండి..
 

మీరు బాక్ పెయిన్ తో బాధ పడుతుంటే యోగా మీకు బాగా హెల్ప్ చేస్తుంది. యోగా శరీరాన్నీ మనసునీ అనుసంధానం చేస్తుంది. యోగా బాక్ పెయిన్ నే కాదు అది రావడానికి కారణమైన స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. రోజుకి కనీసం కొంత సేపైనా యోగా ప్రాక్టీస్ చేసేవారికి వారి శరీరాన్ని గురించిన ఒక అవగాహన వస్తుంది. బాక్ పెయిన్ డీల్ చేసే కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం..

​చక్రవాకాసనం (కాట్-కౌ పోజ్)

1. మోకాళ్ళ మీద కూర్చోండి.

2. అర చేతులు భుజాల కిందుగా, మోకాళ్ళు పిరుదుల కిందుగా వచ్చేటట్లు చూసుకోండి.

3. బరువు ని బాలెన్స్ చెయ్యండి.

4. పైకి చూస్తూ ఊపిరి తీసుకోండి. అదే సమయంలో పొట్టని కిందకి తీసుకు రండి.

5. కిందకి చూస్తూ గడ్డాన్ని కిందకి దించినప్పుడు ఊపిరి వదలండి. ఇదే సమయం లో మీ వీపుని పైకి తీసుకు రండి. ఇప్పుడు మీరు సుమారుగా తలకిందులైన ఇంగ్లీష్ అక్షరం వీ లాగా ఉంటారు.

6. మీ శరీరాన్ని గమనిస్తూ ఈ ఆసనం వెయ్యండి.

7. మీ బాడీలో ఎక్కడ టెన్షన్ ఉందో గమనించుకుని దాన్ని రిలీజ్ చెయ్యడం మీద దృష్టి పెట్టండి.

8.ఒక నిమిషం పాటూ ఈ ఆసనం వెయ్యండి.

​అధోముఖ శ్వనాసనం (డౌన్వార్డ్-ఫేసింగ్ డాగ్)


1. మోకాళ్ళ మీద కూర్చోండి.

2. అర చేతులు భుజాల కిందుగా, మోకాళ్ళు పిరుదుల కిందుగా వచ్చేటట్లు చూసుకోండి.

3. చేతుల మీద బరువు ఆంచి కాలి వేళ్ళని స్థిరం గా నేల మీదే ఉంచి మీ మోకాళ్ళని పైకెత్తండి.

4. తలని లోపలైకి వంచి పిరుదులని పైకి తీసుకు వెళ్ళండి.

5. మీ బరువు మీ భుజాలూ, పిరుదుల మధ్య ఉండేలా చూసుకోండి.

6. ఒక నిమిషం పాటూ ఈ ఆసనాన్ని వేయండి.

​ఉత్థిత త్రికోణాసనం (ఎక్స్టెండెడ్ ట్రయాంగిల్ పోజ్)

1. మీ రెండు కాళ్ళ మధ్యా నాలుగు అడుగుల దూరం ఉండేట్టు నించోండి.

2. కుడి పాదం ముందుకే ఉంటుంది. ఎడమ పాడం పక్కకి, బైటవైపుకి తిప్పండి.

3. భుజాలకి సమాంతరంగా చేతులు పైకెత్తండి.

4. ఎడమ అరచేయి ఎడమ పాదం పక్కగా వచ్చేటట్లు, కుడి అరచేయి పైకి ఉండేటట్లు వంగండి.

5. తల కిందకీ పైకీ తిప్పండి.

6. ఇలా ఒక నిమిషం పాటూ చెయ్యండి.

​సాలంబ భుజంగాసనం (స్పింక్స్ పోజ్)

1. బోర్లా పడుకోండి

2. మీ అరచేతులని మీ భుజాల కిందకి తీసుకు రండి.

3. అరచేతుల మీద సపోర్ట్ పెట్టి నడుం పై భాగాన్ని పైకెత్తండి.

4. నెమ్మదిగా మళ్ళీ కిందకి రండి.

5. ఈ సమయం లో ఎదురుగా చూస్తూ ఉండండి.

6. ఇలా ఐదు నిమిషాలు చెయ్యచ్చు.

​భుజంగాసనం (కోబ్రా పోజ్)

1.బోర్లా పడుకోండి.

2. మీ అరచేతులు మీ భుజాల కిందకి వచ్చేటట్లు చూడండి.

3. అరచేతుల మీద సపోర్ట్ పెట్టి మీ తల, వక్షభాగం, భుజాలు నెమ్మదిగా పైకెత్తండి.

4. మీ మోచేతులు కొద్దిగా వంగుతాయి.




ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో  పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: