22, నవంబర్ 2019, శుక్రవారం

మధుమేహం నివారణ సలహాలు

*మధుమేహం  -sugar  నివారణకు మార్గం ఆహారం నియమాలు నవీన్ నడిమింటి సలహాలు & మధుమేహం వున్నవారు ఏమి తినకూడదో మాత్రమె కాకుండా వాటికి సింపుల్ సప్లిమెంటరీ పదార్థాలు ...జస్ట్  ... ఒక 5-6 లైన్స్ .... క్లుప్తంగా ... మేము మా క్లినిక్లో  పేషంట్  కి అర్ధగంటచెప్పేవి .....*

             మధుమేహము తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో మార్పులు తీసుకురావాలి. మందుల ద్వారా  మధుమేహం శాశ్వతంగా తగ్గదు. కొన్ని రకాల, ఆకులు కషాయాలు  తీసుకోవడం ద్వారా, సిరి ధాన్యాలు తీసుకోవడం ద్వారాశాశ్వతంగాతగ్గించుకోవచ్చు.ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ఆహార నియమాలు పాటిస్తే, మీ మధుమేహం త్వరగా తగ్గిపోతుంది
👉దినచర్య :---
 ఉదయం లేవగానే పరగడుపున రాగి బిందె లోని  రెండు గ్లాసుల నీళ్లు త్రాగాలి
నాభి పైభాగములో బొటన వేలుతో గట్టిగా ఒత్తిడి చేస్తే మోషన్స్ ఫ్రీ గా వస్తాయి.
👉పకృతి సిద్ధంగా లభించే ఆకులతో కషాయాలు
1 వారం తిప్పతీగ కషాయం
2 వారం మెంతిఆకు కషాయం
3,వారం నేరేడు ఆకు కషాయం
4,వారం మునగాకు కషాయం.
5,వ వారం తమలపాకు కషాయం
6,వ వారంపుదీనా ఆకుల కషాయం
ఉదయం సాయంత్రం రెండు పూటల ఆహారం తినడానికి ముందు ఒక గ్లాసు నీళ్లలో ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దానిలో తాటి బెల్లం కలిపి సేవించండి.
ఒక వారం రోజులు ఒకే రకమైన ఆకు ల  కషాయాలు వాడండి.

సిరి ధాన్యాల లో ఏదైనా ఒక రకముది. అల్పాహారం ఇవ్వండి. సిరి ధాన్యాలతో, ఇడ్లీ, దోశ, చపాతి ఉప్మా చేసుకుని తినవచ్చు. జావ చేసుకొని త్రాగవచ్చు


కొర్రలు రెండు రోజులు
సామేలు రెండు రోజులు
ఊదలు రెండు రోజులు
అరికలు రెండు రోజులు
అండు కొర్రలు  రెండురోజులు
పది రోజులు తర్వాత మరల మార్చి అదేవిధంగా తినాలి.


తినకూడనివి  :--

 మాంసాహారం ,మద్యపానం,దూమపానం గుట్కా పాన్ మసాలా లు, అన్నము ఇడ్లీ దోసె చపాతీ, కార్న్  ఫ్లోర్  ,మైదాతో చేసినవి తినకూడదు, టీ కాఫీలు పాలు తాగ కూడదు. పిజ్జా బర్గర్లు బేకరీ ఐటమ్స్
ఐస్ క్రీమ్ కూల్డ్రింక్స్ , వాడకూడదు.

15 నిముశాలు ఇష్టదైవం ధ్యానం చేయాలి.

గంటలకొద్దీ కూర్చుంటే మధుమేహం

మీకు వ్యాయామం చేసే అలవాటు ఉన్నా సరే.. గంటలకొద్దీ కూర్చుని ఉండిపోతే టైప్‌-2 మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్‌పై పనిచేయడం, కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం వంటి.. కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటతో మధుమేహం ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని చెబుతున్నారు. మధుమేహం లేనివారితో పోలిస్తే.. మధుమేహం బాధితులు రోజుకు 26 నిమిషాలు అధికంగా కూర్చుని ఉంటున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని నెదర్లాండ్స్‌ పరిశోధకులు జులియానే వాండర్‌బెర్గ్‌ పేర్కొన్నారు. అయితే.. కూర్చోవడం వల్లే మధుమేహం వస్తుందనేది రుజువు కాలేదనీ, రెండింటి మధ్య సంబంధం ఉందని వివరించారు. శారీరక శ్రమలేని అలవాటుతో టైప్‌-2 మధుమేహం పెరుగుతుందనే అంశం ఇంకా తేలలేదన్నారు.

*<3 :) మధుమేహం (షుగర్) రోగులు కనీసం 20 నుండి 30 నిముషాలు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేసుకోవాలి :) <3*
1) ఆహారాన్ని సమయానికి తీసుకొంటూ , ఆహారంలో పచ్చని కూరగాయలు , ఆకుకూరలు , నిమ్మజాతి పండ్లు ఉండేలా చూసుకోవాలి.
2) రైస్ తగ్గించి , గోధుమ లేదా జొన్న రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
3) ముఖ్యంగా ఆపిల్స్ , నారింజ , బెర్రీస్ , బత్తాయి , కమలా పండ్లు , నేరేడు పండ్లు , ఉసిరి కాయలు , తరచుగా తీసుకొంటూ ఉండాలి.
4) మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా చేసుకోవాలి.

మధుమేహం పై అశ్రద్ధ వద్దు
మధుమేహం ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధుల సమ్మేళనం. శరీరంలో గుండె, మూత్రపిండాలు, కాలేయం, కన్ను, నరాలు, పక్షవాతం రావడానికి ఇది కారణమవుతుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహాలు తీసుకుంటూ వ్యాయామం, ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు చేస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చు. జన్యుపరంగా లేదా హార్మోన్ల లోపం కారణంగా రక్తంలో చక్కెరస్థాయి పెరగడంతో మధుమేహం వస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే వారి పిల్లలకు కూడా సోకే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి లేదా బంధువులకు కూడా మధుమేహం ఉంటే వ్యాధి సోకే అవకాశాలు 70 శాతం వరకూ ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరికి మాత్రమే మధుమేహం ఉంటే 40 శాతం వారి పిల్లలకు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు, గర్భవతులు 20 నుండి 24 వారాలలోపు తప్పనిసరిగా మధుమేహ వైద్య పరీక్షలను చేయించుకోవాలి.

లక్షణాలివీ
ఆకలి ఎక్కువ, అతి దాహం, మూత్రం అధికం, నిస్సత్తువ, పుండ్లు మానకపోవడం, దృష్టి లోపాలు, మర్మావయవాలపై దురద. కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉన్నా, అధిక బరువున్నా వారు 30 సంవత్సరాలు పైన ఉంటే తప్పకుండా మధుమేహ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీంతోపాటు రక్తపోటు, గుండె, రెటీనా, క్రియాటినైన్‌ పరీక్షలు కూడా చేయించుకోవాలి.
చక్కెరస్థాయి ఎప్పుడు ఎలా ...
పరగడపున అంటే 8 గంటలు ఏమి తినకుండా 65 నుండి 100 మిల్లీ గ్రాములు. ఆహారం తిన్న గంటన్నర తరువాత 100 నుండి 140 మిల్లీ గ్రాములు. మధుమేహం వచ్చే సూచనలు ఉన్న వారికి 140 - 200 మిల్లీ గ్రాములు.
ఆధునిక పరీక్షలు
ఆధునికంగా హెచ్‌బీఎ1సి మధుమేహ వ్యాధి నిర్థారణా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. దీనిలో 5.7 నుండి 6.4 శాతం ఉంటే చక్కెర వచ్చే
సూచనలు ఉన్నట్లే. 6.5 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు గర్తించాలి. 5.6 శాతంలోపు ఉంటేనే మధుమేహం లేనట్లు భావించాలి.

24 గంటలూ వైద్య పరీక్షలు
కొంతమందిలో మధుమేహ లక్షణాలుంటాయి. కానీ పరీక్ష చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కనిపిస్తాయి. ఇటువంటి వారికి గ్లూకోజ్‌ మానిటర్‌ వ్యవస్థతో 24 గంటలూ పర్యవేక్షణ చేసి రక్తంలో చక్కెర స్థాయిలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఈవిధంగా మూడు రోజుల పాటు పరీక్షించి వ్యాధిని నిర్థారించవచ్చు. వ్యాధి నియంత్రణకు ఆధునిక ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముఖ్యంగా మధుమేహం రాకుండా ఆహారపు అలవాట్లతో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: