23, మే 2020, శనివారం

రక్తం విరోచనాలు నివారణకు ఆయుర్వేదం సలహాలు క్రింద లింక్స్ లో చూడండి


విరేచనాలు--నివారణ పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

అతి చౌకగా రోటావైరస్‌ టీకా
ఇంటర్నెట్ డెస్క్:  ఏటా 80,000 మంది 5 ఏళ్ల లోపు పిల్లలు డయేరియా (అతిసారం) వ్యాధితో మరణిస్తున్నారు.   

.            విరేచనాలు ----నివారణ                   
  
                శివఫలదా గుళికలు

ఇవి నీళ్ళ విరేచానాలనుజిగట విరేచానాలనురక్త విరేచానాలను అరికడతాయి.
 
మారేడు పండు గుజ్జు ;పొడి           -----100 gr (ఎండబెట్టిదంచిపొడి చెయ్యాలి.)
 కరక్కాయల పొడి                     ----- 100 gr
మంచి నీరు                              ----- తగినంత
 
 మారేడు పండు గుజ్జు పొడిని ,కరక్కాయ పొడిని కలిపి కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలి తగిలే చోట ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
 
   దీనిని పిల్లలకుపెద్దలకు కూడా వాడవచ్చు.
 
ఉదయం,మధ్యాహ్నంరాత్రి పూటకు ఒక్కొకటి చొప్పున మంచి నీటితో ఇవ్వాలి.అవసరాన్ని బట్టి రెండు మూడు రోజులు వాడాలి . ఒక రోజులో కూడా తగ్గుతుందిదీనిని వాడడం వలన బంక విరేచనాలురక్త విరేచనాలునీళ్ళ విరేచనాలు నివారిమ్పబడతాయి.
డయోరియా మరియు స్టొమక్ ఫ్లూతో బాధపడుతుంటే రైస్ వాటర్ బెస్ట్ హోం రెమెడీ. అన్నం గంజిలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగొచ్చు లేదా కొద్దిగా తేనె మరియు దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తాగడంవల్ల స్టొమక్ ఫ్లూ వల్ల వచ్చే ఇన్ఫ్లమేసన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

         అజీర్ణ విరేచనాలు --నివారణ                                          
అన్ని రోగాలకు అజీర్ణమే మూలం . అజీర్ణ విరేచనాలు చాలా ప్రమాద కరమైనవి.
  అజీర్ణము వలన విరేచనాలు ఆగకుండా అవుతుంటే రేగడి మన్ను తెచ్చి నీటితో కలిపి పిసికి గుడ్డమీద పరచి దానిని పొట్ట మీద వేసి దుప్పటి కప్పుకోవాలి.మట్టిని వీలైనంత చల్లని నీటితో తడుపుతూ వుండాలి.
సమస్యను బట్టిరోజుకు రెండు మూడుసార్లు మట్టి పట్టి వేసుకోవచ్చు.
 
యోగాసనం :-- వజ్రాసనంలో కూర్చోవాలిదీనివలన ఆహారం బాగా జీర్ణమవుతుంది.
 
గాజు గ్లాసులో మంచి నీళ్ళు పోసి బ్లూ కలర్ పేపరు అన్నివైపులా పూర్తిగా చుట్టి ఎండలో ఉంచాలి.ఇది  సూర్య రశ్మి లోని బ్లూ కలర్ ని మాత్రమే చార్జి చేసుకుంటుంది.ఆవిధంగా రోజంతా వుంచి  నీటిని తాగాలి.
           ఏ ఆహారం తింటే గిట్టదో అది తినకూడదుశారీరక శ్రమ అత్యవసరం .
 
దోరగా వేయించి దంచిన సోంపు గింజలపొడి      ---- 50 gr
" " " జిలకర పొడి            ---- 25 gr
కలకండ                        -----50 gr
 
 ఒక గిన్నెలో అన్నింటిని వేసికలిపి సీసాలో భద్ర పరచాలి.ఇది నీళ్ళ విరేచానాలను చాలా త్వరగా అరికడు తుంది.రోజుకు రెండు మూడు సార్లు ఒక్కొక్క సారికి పావు టీ స్పూను చొప్పున నోట్లో వేసుకొని మంచి నీళ్ళు తాగాలి లేదా నీళ్ళలో కలుపుకొని తాగవచ్చుచిన్న పిల్లలకు ఒకటిరెండు చిటికెల పొడిని వాడవచ్చు.
 
        అతిసార విరేచానాలను అరికట్టుట              

పుల్ల దానిమ్మ పండ్ల గింజలను ఒలిచి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలిఅత్యవసరమైతే గింజలను దంచి రసం తీసుకోవాలి.

దానిమ్మ గింజల రసం       ----- 50 gr
                       శొంటి       ----- 7 gr
                     జీలకర్ర       ----- 7 gr
              నల్ల జిలకర      ----- 20 gr
     కరక్కాయల పొడి        ----- 20 gr
    తాని కాయల పొడి        ----- 20 gr
  సైంధవ లవణం పొడి         ----- 20 gr

అన్నింటిని దోరగా వేయించాలి.

దీనిని తయారు చేసేటపుడు సగం పొడి చాలా మెత్తగామిగిలిన సగం రవ్వలాగా తయారు చేసుకోవాలి.

విడివిడిగా సీసాలలో భద్ర పరచుకోవాలి.

పెద్దలకు ఒక మోస్తరు విరేచనాలు అవుతుంటే ఒక్కొక్క టీ స్పూను చొప్పున రోజుకు రెండు మూడు సార్లు రవ్వ లాంటి పొడిని నీటిలో కలిపి ఇవ్వాలిలేదా చాలా ఎక్కువగా నీళ్ళ లాగా మాటి మాటికి వెడుతూ వుంటే మెత్తటి పొడిని ఒక టీ స్పూను పొడిని నీటిలో కలుపుకొని తాగాలి.

  పిల్లలకు వయసును బట్టి 3 చిటికెలు లేదా 4,5 చిటికెలు లేదా అర టీ స్పూనువాడాలి /
  నీళ్ళ విరేచనాలు అవుతున్నపుడు నిర్జలీకరణ ఏర్పడుతుందిదానిని నివారించడానికి అర గ్లాసు నీటిలో ఒక టీ స్పూను చక్కెరఒక టీ స్పూను ఉప్పు కలిపి కొంచం కొంచం తాగించాలి.

       అమీబియాసిస్ --- కడుపులో పురుగుల ని(IBS)       

1. కపాలభాతి ప్రాణాయామం 2. ఉదార చాలనం 3. మయూరాసనం వెయ్యాలి.
       శరీర శ్రమ లేని వాళ్ళు ఆహారానికి బదులుగా గంజి మాత్రమే తాగాలి.

     దానిమ్మ (క్రిమి సంహారక శక్తి కలిగినదికాండం యొక్క పై బెరడు ---- 50 gr
                                                                                 నీళ్ళు ---- ఒక లీటరు

నీళ్ళలో బెరడును వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలినిల్వ వుంచుకోవాలిదానిలో 70 గ్రాముల నీళ్ళు మొదటి సారి తాగాలితరువాత గంట గంట వరకు 20 గ్రాముల చొప్పున తాగాలిదీనిని తాగిన రోజు పలుచని జావ గాని గంజి గాని మాత్రమే తీసుకోవాలిదీని వలన కడుపులోని క్రిములు విసర్జింప బడతాయి.

                రక్త విరేచనాలు -- నివారణ      
          
కబంద 
రక్త విరోచనాలు : కబంద పట్టు మరియు శొంటి  నీటి యందు కషాయము గా కాచి మూడు రాతురులు తాగాలి .విరోచనాలు తగ్గుతాయి
శుక్ర దోషాలు : దిని పట్టు కసాయము త్రాగుచున్న శుక్ర దోషాలు పోవును 
గర్బాశయ ముఖ ద్వారము  నందలి గయలు : పట్టు కసాయము తో యోని ని కడుగుతుంటే యోని దోసాలు పోవును 
శారిర కాంతి : పట్టు కసాయము నందలి తేనె కలిపి తాగుతుంటే రక్త దోసాలు పోయీ చర్మ రోగాలు పోవును శారిర కాంతి పెరుగును
స్తన్య వృధీ : దిని బెరుడు రసము 2-3 gr తాగుతుంటే వీర్యము పెరుగును స్తన్య వృధీ కలుగును 
యోని దోసాలు : బెరుడు కసాయము 30 ml  తో రోజు యోనిని కడుగుతుంటే యోని దోసాలు పోవును
కొబ్బరి పీచును చిన్న చిన్న ముక్కలు చేసి బాణలి లో వేసి స్టవ్ మీద పెట్టి బూడిద లాగా మాడ్చాలిజల్లించాలిపావు టీ స్పూను మోతాదుగా పలుచని తియ్యని మజ్జిగలోగానినీళ్ళలో కలిపి తీసుకొని తరువాత మజ్జిగ తాగాలి.

 కొబ్బరి నూనెకొబ్బరి పాలు కూడా చలువ ;చేస్తాయిశరీరంలో అధిక ఉష్ణ ప్రభావం వలన అన్ని రకాలుగా రక్తస్రావం జరుగుతుందిదీనిద్వారా  రక్త స్రావాలను నివారించ వచ్చును,

                 విరేచనాలు--- నివారణ                                             
కారణాలు:-- వర్షాకాలంలో వచ్చే (కలుషితనీటి వలన వస్తాయివిచక్షణ లేకుండా తినడం వలనగిట్టని పదార్ధాలను తినడం వలనవీధుల్లో అమ్మే బాగా మాడ్చిన పదార్ధాలను తినడం వలన వస్తాయి.
ఆమము కుళ్ళి పొట్టలో చేరడం వలన వస్తాయి.

ఎగిరి దూకినపుడు బొడ్డు  పైకి పోవడం వలనకిందికి జారడం వలనవస్తాయి.

     పేగు కిందికి జారడం వలన వచ్చే విరేచనాలు ఎన్ని మందులు వాడినా తగ్గవుకాళ్ళను చాపినపుడు రెండు పాదాలను సమంగా పెట్టాలిఅవి సమంగా లేకపోతే నాభి జరిగినట్లు లెక్క.

 వ్యాయామము;-- వెల్లకిలా పడుకొని చేతులను చాపి రెండు కాళ్ళను ఒకే సారి పైకి లేపాలి.

           విపరీతంగా విరేచానాలైనపుడు --- నివారణ
                              విరేచనాలు --నిర్జలీకరణ -- నివారణ

     ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి నీలి రంగు కాగితం చుట్టి చెక్క పీట మీద గాజును వుంచి ఎండలో పది గంటల సేపు వుంచి రీచార్జ్ చెయ్యాలి నీటిని తాగాలిదీని వలన ఆగకుండా పోతున్న విరేచనాలు నివారింప బడతాయి . నిర్జలీకరణ కూడా తగ్గుతుంది.

  "జీర్ణ శక్తినిబట్టి ఆహారాన్ని తినాలిఋతువులను బట్టి ఆహారాన్ని మార్చాలి.

 ఆహారం పూర్తిగా జీర్ణం కాక ముందే మరలా ఆహారాన్ని భుజించడం వలన విరేచనాల సమస్య ఏర్పడుతుంది.
            జిగట విరేచనాలు--- నివారణ

     కృష్ణ తులసి దళాలు   ---- 20 gr
            సిందవ లవణం    ---- 20 gr
                        వెల్లుల్లి  ---- 20 gr
               గడ్డకర్పూరం   ---- 20 gr          అన్నింటిని కలిపి శుభ్రంగా ఎండిన కల్వంలో వేసి నూరాలిమాత్రలు కట్టాలి.

              చిన్న పిల్లలకు ---జొన్న గింజంత
                పెద్ద పిల్లలకు --- శనగ గింజంత
                       పెద్దలకు --- బటాణి గింజంత

           ఉ + + సా మంచి నీటితో సేవించాలి.

               రక్త విరేచనాలు ---నివారణ

 గేదె పెరుగు ఒక కప్పు
తులసి ఆకుల ముద్ద --- 3 నుండి 10 ఆకులు (వయసును బట్టి)

పెరుగులో తులసి ఆకులు నూరిన ముద్దను కలిపి ఉదయంసాయంత్రం తీసుకుంటే రక్త విరేచనాలు ఆగిపోతాయి. "రక్త విరేచనాలుచాలా ప్రమాదకర మైనవిచంద్రభేదన ప్రాణాయామం చెయ్యాలిదీని వలన శరీరం చల్లబడుతుందిశీతలిశీత్కారి ప్రాణాయామాలను చేయాలిచలువ చేసే పదార్ధాలను వాడాలి.

అడవి తులసి ఆకుల పొడిని పిల్లలకు    --- 1,2 గ్రా
                                         పెద్దలకు --- 3 గ్రా

దానితో సమానంగా కలకండ పొడి కలిపి మంచి నీటితో తీసుకుంటే రక్త విరేచనాలు ఆగిపోతాయి.

              నీళ్ళ విరేచనాలు ----నివారణ

తులసి ఆకుల రసం
జాజికాయల పొడి         -- చిటికెడు (రెండు వేళ్ళకు వచ్చినంత)
చిన్న పిల్లలకు          ---- అర టీ స్పూను రసం
 పెద్ద పిల్లలకు            ---- ఒక " " "
పెద్దలకు                   ---- రెండు " "
      కలిపి తాగిస్తే వెంటనే నీళ్ళ విరేచనాలు అరికట్ట బడతాయి 
        15 కరివేపాకులను నూరి మజ్జిగలో కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
  
               అతిసార --- నివారణ                                               .
            దీని వలన జ్వరం రావచ్చు, B.P. తగ్గి పోవచ్చు .
 
అతిసార రావడానికి గల కారణాలు:-- ఆహారంనీరుజీవన విధానంఆకలిగా వున్నపుడు ఆహారం తీసుకోకపోవడంఆకలి లేనపుడు తినడంమలినాలు కలిసిన నీరు తాగడంసమయాలు పాటించకుండా ఆహారంభుజించడంనిద్ర సరిగా పోకపోవడం మొదలైనవి .
 
జిలకర
శొంటి
పిప్పళ్ళు
తుంగ ముస్థలు
 
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలిఅన్నింటిని విడివిడిగా వేయించి దంచి జల్లించి అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.
 చూర్ణాన్ని ప్రతి రెండు గంటలకొకసారి అర టీ స్పూను పొడి చొప్పు  పెరుగు తేటతో తీసుకోవాలి.
పెరుగు తేట దొరకని పక్షంలో మజ్జిగతో సేవించవచ్చు.
  
         మలబద్ధకంవిరేచనాలు కలిసి ఒకే సారి రావడం-- నివారణ                 
       ( Irritable Bowl Syndrome)
 
ప్రేగుల కదలిక మందగించడం వలన వస్తుందిభోజనం చేసిన వెంటనే విరేచానానికి పోవలసి రావడందీనితో పాటు కడుపులో నొప్పి జిగటగా వుండే విరేచనాలు కావడం వంటి లక్షణాలు వుంటాయి.
గ్రహణి " కి చేసే చికిత్శ  వ్యాధికి కూడా ఉపయోగ పడుతుంది.
  గ్లూటిన్ అనే ప్రోటీన్ పప్పు ధాన్యాలలోకొన్ని రకాల గింజ ధాన్యాలలోమద్యంలో వుంటుంది  ప్రోటీన్   గిట్టనపుడు  వ్యాధి వస్తుంది.
     దీనికి వెన్నలేని మజ్జిగ , పెరుగుకు నాలుగు రెట్లు నీళ్ళు కలిపి వాడాలి.
1. తక్రారిష్ట ----30 -- 40 ml
చొప్పున ఉదయంమధ్యాహ్నంరాత్రి ఆహారం తరువాత వాడాలి.
2. తుంగ ముస్తల చూర్ణం 3 -- 6 gr
3. దానిమ్మ పండు తొక్కల చూర్ణాన్ని మజ్జిగలో కలుపుకొని తాగాలిమూడు పూటలా వాడాలి.
  
                       అతిసార (డయేరియా )                                                 
లక్షణాలు:-- నీరసం రావడం B. P. తగ్గడంజ్వరంవాంతులు వంటి లక్షణాలు వుంటాయి.
కారణాలు:-- సరైన ఆహారం తీసుకోక పోవడంసరిగా ఉడకని ఆహారం తినక పోవడంకలుషితమైన నీరు తాగడంఅతి వేడి నీరుఅతి చల్లని నీరు తాగడంనాణ్యత లేని ఆహారం సేవించడం , సరైన నిద్ర లేకపోవడం,రాత్రి వేళలందు ఎక్కువసేపు నిద్ర మేల్కోవడం వంటి కారణాల వలన అతిసార వస్తుంది.
 
జిలకర పొడి
శొంటి పొడి
తుంగ ముస్తల పొడి
 
         అన్నింటిని సమాన భాగాలు చేసి చిన్న చిన్న ముక్కలుగా దంచి చూర్ణం చెయ్యాలి.
అర టీ స్పూను చూర్ణాన్ని ప్రతి రెండు గంటలకు ఒక సారి పెరుగు తేటలో కలిపి తీసుకోవాలిపెరుగు తేట లేనపుడు పలుచని మజ్జిగతో తీసుకోవచ్చుదీని తో విరేచనాలు తగ్గి పోతాయి.
 
           అతి సార వ్యాధి-- నివారణ                                          తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తరువాతనే మరలా తినాలిఅంతేకాని వెంటవెంటనే తినకూడదు విధంగా చేస్తే అతిసార వ్యాధి వస్తుందిప్రతిరోజు విరేచనం కాని వాళ్లకు కూడా విరేచనం అవుతుంది,
చింత గింజలను బాణలిలో వేసి వేయించాలిరోట్లో వేసి రోకలి బండతో తిప్పితే తొక్కలు వూడి పోతాయి  లేదా ఒకరోజు గానిరెండు రోజులు గాని నీటిలో నానబెట్టి తొక్క తీసి బాగా గలగల లాడేట్లు ఎండబెట్టాలిదంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
మూడు వేళ్ళకు వచ్చినంత పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే వెంటనే విరేచనాలు తగ్గిపోతాయి.
దీనితో అతిసార మాత్రమే కాక మోకాళ్ళ నొప్పులుపిక్కల నొప్పులు తగ్గి పోతాయిమోకాళ్ళలో గుజ్జుకూడా పెరుగుతుంది.
 
         సాధారణ విరేచనాలు-- నివారణ                                 జామ చెట్టు వేరు యొక్క బెరడును తెచ్చి కచ్చా పచ్చాగా దంచికాచిన కషాయం గాని లేదా జామ ఆకుల రసం గాని రెండు మూడు గంటల కొకసారి ఇవ్వాలిప్రతి సారి రెండు టీ స్పూన్ల చొప్పున ఇవ్వాలి.
జామ ఆకులలో సులభంగా రసం రాదుఆకులను ఆవిరితో ఉడికించి రసం తీయవచ్చులేదా ఆకులను ఎండించి పొడి చేసి అర టీ స్పూను పొడి గాని లేదా ఒక టీ స్పూను పొడిగాని ఇస్తే విరేచనాలు తగ్గుతాయి
దానిమ్మ చెట్టు బెరడు   --- 10 gr
కొడిశపాల చెట్టు బెరడు ----10 gr

                  విరేచనాల నివారణ.                                      
కరివేపాకు
తుంగ గడ్డలు
మిరియాలు
కర్పూరం
సైంధవ లవణం

    అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి బటాణి గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలిగంట గంట కు ఒక్కొక్క మాత్ర చొప్పున ఇస్తూ వుంటే నీళ్ళ విరేచనాలు నివారించ బడతాయి.

            నీళ్ళ విరేచనాలు-- నివారణ                       
మామిడి టెంక లోని పప్పును ఎండబెట్టి పొడి చెయ్యాలి  పొడిని ఒకటిరెండు స్పూన్లు తీసుకుని నాలుగు కప్పుల నీటికి కలిపి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేట్లు కాచాలిదానిని రెండు భాగాలుగా చేసి ఉదయంరాత్రి తాగాలిదీనితో నీళ్ళ విరేచనాలు నివారించ బడతాయి.

          ఋతువులలో మార్పుల వలన వచ్చే విరేచనాలు         
   ఋతువులలో మార్పులు జరిగినపుడుపిల్లలు ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి నోట్లో పెట్టుకోవడం వలన అజీర్ణం వలనలేక అజీర్ణ ఆహారం తీసుకోవడం వలన విరేచనాలు

విరేచనంలో దుర్వాసన లేకపోతే ఎలాంటి సమస్య వుండదు.
విరేచనంలో పుల్లటి వాసననీచు వాసన వుంటే తప్పక జాగ్రత్త పడాలి.

పాలు తాగే పిల్లలలో అజీర్తి వలన ఎక్కువగా విరేచనాలు అవుతుంటాయి.

                చిన్న పిల్లలకైతే :--

     సోంపు గింజల పొడి --- ఒక టీ స్పూను
                        నీళ్ళు --- ఒక గ్లాసు

 నీళ్ళలో సోంపు గింజల పొడిని వేసి కాచి పావు గ్లాసు కషాయానికి రానివ్వాలిప్రతి రోజు అర టీ స్పూను చొప్పున తాగిస్తూ వుంటే అజీర్తి వలన అయ్యే విరేచనాలు తగ్గిపోతాయి.

                     పెద్ద పిల్లలకైతే:--

సోంపు కషాయంలో జాజి కాయను 15 చుట్లు నూరి గంధం తీసి  కషాయంలో కలిపి తాగించాలి.

                    ఇంకా పెద్ద పిల్లలకు :--

బిర్యాని ఆకు పొడి
మారేడు పండు గుజ్జు పొడి
బెల్లం

   అన్నింటిని కలిపి ముద్దగా చేసి తినిపిస్తూ వుంటే ఒకటిరెండు రోజులలో తగ్గుతాయివిరేచనాల వలన నిర్జలీకరణ జరిగినపుడు మజ్జిగకొబ్బరి నీళ్ళు తాగించాలి.

                      అజీర్ణ విరేచనాలు                                   
దాల్చిన చెక్క పొడి
 శొంటి పొడి
జీలకర్ర పొడి

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలిఅర టీ స్పూను పొడిని తేనె కలిపి తీసుకుంటే అజీర్ణం వలన కలిగే విరేచనాలు తగ్గుతాయి.

                          ప్రవాహిక                                              
వెళకు భోజనం చేయక పోవడం ద్వారా వస్తుంది.

1. కడుపులో నొప్పి వుంటుందిగుదము ద్వారా నురుగులాగా తక్కువ మలంతో విసర్జన జరగడాన్ని ప్రవాహిక అంటారు.
          విరుద్ధ ఆహారం తినడం వలన  వ్యాధి వస్తుంది.
            నొప్పితో కూడిన పీనం రావడం జరుగుతుంది.

2. అతిసార వ్యాధిలో సరి అయిన చికిత్స జరగక పోవడం వలన కూడా  వ్యాధి వస్తుంది.

3. ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మరల ఆహారం తీసుకోవడం వలన కూడా  సమస్య వస్తుంది.

  ఎంత ఆహారం తీసుకుంటే జీర్ణం అవుతుందో అంతే తీసుకోవాలినీరు ఎక్కువగా తీసుకోవాలి ( వేడి చేసి చల్లార్చిన నీరు ) నెయ్యినూనెగోరువెచ్చని పాలు ప్రతి రోజు సేవనం చేయడం వలన తగ్గుతుంది.

 తైలాన్ని పై పూతగా మర్దనకు ఉపయోగించాలిలోపలి భోజనం ద్వారా తీసుకోవాలినెయ్యిపాలు వాడడం వలన ఆహారం ప్రేవులలో సులభంగా జారుతుందిత్రికటు చూర్ణాన్ని ( శొంటిపిప్పళ్ళుమిరియాలుచూర్ణం రెండు గ్రాములో పాలలో కలిపి అన్నంలో కలిపి తింటే ప్రవాహిక నయమవుతుంది.

మారేడు పండు గుజ్జు పొడిని తిని నీళ్ళు తాగితే తగ్గుతుంది.

రేగు పండు గుజ్జును నీటిలో కలిపి తాగితే తగ్గుతుంది.
          నీళ్ళ విరేచనాలు తగ్గడానికి చిట్కా                    
పెరుగు           --- ఒక కప్పు
 జిలకర పొడి   ---- ఒక టీ స్పూను

రెండింటిని కలిపి తాగితే విరేచనాలు నివారింప బడతాయిరోజుకు ఒకటిరెండు సార్లు చెయ్యాలి.

అతిసార నివారణకు --చిట్కా                                                    
పచ్చి అల్లం పేస్ట్ ను బొద్దు చుట్టూ వేస్తె అతిసార తగ్గుతుంది

నీళ్ళ విరేచనాలు --డయేరియా                                                 
      కలుషిత ఆహారం తినడంగిట్టని పదార్ధాలు తినడంకడుపులో కృములు చేరడం మొదలైన కారణాల వలన వస్తుంది. " అన్ని విరేచనాలు డయేరియా కాదు"

దాడిమాష్టక చూర్ణం
కుటజారిష్ట

వీటిలో దేనినైనా వాడవచ్చు.

వాము                 ----50 gr
 దాల్చిన చెక్క      ----25 gr
శొంటి                  ----25 gr
అతిమధురం        ----25 gr

ఇంగువ ---- పన్నెండున్నర గ్రాములు ( నేతిలో వేయించాలి)

 అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సేసాలో భద్ర పరచుకోవాలి పొడిని నీటితో గానిపెరుగు తేట తో గానితేనె తో గాని తీసుకోవచ్చు
.
2. కోడిశ పాల గింజల చూర్ణం
 దానిమ్మ కాయల బెరడు చూర్ణం
మారేడు గుజ్జు చూర్ణం
 తుంగ ముస్తల చూర్ణం

అన్నింటి యొక్క చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలిఒక్కొక్కసారి అర టీ స్పూను చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి విధంగా రోజుకు నాలుగైదు సార్లు తీసుకోవాలి.

            నెత్తురు బంక తగ్గడానికి చిట్కా                          
నేరేడు ఆకు ఉసిరి పెచ్చులు మామిడి ఆకులు బెల్లం కలిపి నూరి ముద్దా చేసుకుని తినాలి.
  
              అమీబియాసిస్ --- ప్రవాహిక                             
ముక్కితే గాని మలము రాని పరిస్థితిని ప్రవాహిక అంటారు.

లక్షణాలు  :--  సమస్య పది శాతం మంది ప్రజలలో మాత్రమే కనిపిస్తుందిపలుచని విరేచనాలు రక్తంతో కూడి వుండడంబరువు కోల్పోవడంబడలికకామెర్లుఆకలి తగ్గడంకాలేయంలో చీముగడ్డలు తయారవడం వంటి లక్షణాలు వుంటాయి.
 సమస్య వున్నవాళ్ళు బయట హోటల్స్ లో తినకూడదుఆహారంలో వెనిగర్ లేక నిమ్మ రసం
కలుపుకుని తింటే అమీబియాసిస్ కి సంబంధించిన సూక్ష్మ జీవులు నివారింప బడతాయి.
 
1.       మజ్జిగ                   --- అరకప్పు
          శొంటి పొడి              --- ఒక టీ స్పూను
          సైంధవ లవణం        --- అర టీ స్పూను
 
    కలిపి తాగితే అమీబియాసిస్ సులభంగా కంట్రోల్ అవుతుందిలేదా మజ్జిగ మాత్రమే కంట్రోల్ చేయగలదు.
2. నల్ల నువ్వులు
   మారేడు గుజ్జు
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా నూరి వెన్నతోగానిపెరుగుతో గాని తీసుకోవాలి.
 
3. పిప్పళ్ళ  పొడి       --- 20 gr
మిరియాల పొడి         --- 20 gr
 
రెండింటిని కలిపి ఒక గ్లాసు నీటిలో వేసి కాచి అర గ్లాసు కషాయానికి రానివ్వాలిదానిలో కొద్దిగా కలకండ కలిపి తాగాలి.
ఆహార నియమాలు :-- సాత్వికాహారం తినాలిచింత పండురోటి పచ్చళ్ళు తినకూడదు.

                                 నీళ్ళ విరేచనాలు --- అతిసార                              
 
ఎక్కువ సార్లు అసాధారణ స్థాయిలో మలము విసర్జింప బడదాన్ని అతి సార అంటారు.
లక్షణాలు :-- ఆకలి తగ్గడంనీళ్ళ విరేచనాలు కావడం వాంతులువికారం జ్వరంశరీరం నిర్జలీకరణ చెందడందాని వలన చర్మం సాగడం మొదలైనవి.
కారణాలు :-- ప్రధాన కారణం బాక్టీరియా మరియు కలుషిత ఆహారంపరిశుభ్రత పాటించక పోవడం.
1. మారేడు పండు గుజ్జు పొడి                 ---5 gr
పొంగించిన ఇంగువ పొడి                       --- అర గ్రాము
దాల్చిన చెక్క పొడి                             --- చిటికెడు
 
     అన్నింటిని కలిపి పై మోతాదు ప్రకారం రోజుకు రెండు సార్లు తీసుకుంటే టక్కున తగ్గుతుంది.
2. మామిడి ఆకులు --- గుప్పెడు
       నేరేడు ఆకులు --- గుప్పెడు
 
రెండింటిని ముద్దగా నూరి రసం పిండి ఒక పెద్ద టీ స్పూను రసం రోజుకు రెండు సార్లు వాడాలి.
3. కరక్కాయ పెచ్చులు
       పిప్పళ్ళు
    రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒకటి లేక రెండు గ్రాముల పొడి చొప్పున రోజుకు మూడు సార్లు వేడి నీటితో తీసుకోవాలి.
పద్ధ్యం :-- మజ్జిగ ఎక్కువగా వాడాలిమసాలాలుఇతర ఉత్ప్రేరకాలు మానెయ్యాలి.
                        చిట్కా                                       
అల్లంబెల్లం సమానంగా కలిపి తీసుకుంటే అజీర్ణ విరేచనాలు నివారింప బడతాయి.
                             
       విరేచనాలు  పైత్య ప్రకృతి వలన వస్తాయి. 

               టీ డికాషన్   --- ఒక కప్పు
       బాగా పండిన అరటిపండు  గుజ్జు 

               రెండింటిని కలిపి తీసుకుంటే విరేచనాలు చాలా త్వరగా తగ్గుతాయి.
               ఇది చిన్న పిల్లలకు సురక్షిత మైనది.

                               వేసవిలో వచ్చే అతిసార   లేక నీళ్ళ విరేచనాలు                  

         నీరసం, బలహీనపడడం,  ఒక్కోసారి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా కలదు.
         విరుద్ధ ఆహారం తినడం వలన,  సరైన ఆహారం తీసుకోక పోవడం  ఈ సమస్య వస్తుంది. బాగా
 ఎండలో తిరగడం , ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగడ,  వేడి పదార్ధాలు, చల్లటి నీళ్ళు ఒకేసారి
 తీసుకోవడం వంటి కారణాల వలన ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.

  లక్షణాలు:--  అతిసార వ్యాధిలో నీళ్ళ విరేచానాలే కాక, వాంతులు, అజీర్ణ సమస్యలు, పొట్టలో
  నొప్పి కూడా వుంటాయి. విరేచనాల సమయంలో తలతిరగడం  సమస్య గాని వుంటే  దానిని తప్పక అతిసారిగా గుర్తించాలి.  నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చు.  దీనిలో నీటి శాతం
 తగ్గడం ప్రమాదకరం. 

  1.   ఉప్పు
        చక్కర
        మజ్జిగ

                 కలిపి తాగాలి.

  2.   మజ్జిగ
        నిమ్మరసం

                 కలిపి తాగాలి

  3.   తుంగ ముస్తల చూర్ణం       ---ఒక టీ స్పూను  
        వెన్న తీసిన మజ్జిగ           ---ఒక గ్లాసు   

                 కలిపి తాగితే తప్పక తగ్గుతుంది.

  4.   దానిమ్మ పండు తొక్క చూర్ణం       --- 5 gr
                            మజ్జిగ
                  కలిపి తాగాలి.

   5.   దోరగా వేయించిన జిలకర పొడి                 ---25 gr
            "           "         సోంపు గింజల పొడి      ---25 gr
                          మారేడు పండు గుజ్జు పొడి      ---50 gr

         అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
          ఒక టీ స్పూను పొడిని వెన్న తీసిన మజ్జిగలో కలుపుకుని తాగాలి.

                వేసవిలో రక్త విరేచనాలు                        
   1.  పెరుగు              --- ఒక కప్పు
        కలకండ            --- రెండు టీ స్పూన్లు

             రెండింటిని కలిపి తాగాలి .  ఈ విధంగా రోజుకు రెండు,  మూడు సార్లు సేవించాలి.
        వెంటనే తగ్గుతాయి.

 2.దానిమ్మ పండ్ల రసంగాని, లేదా బెరడు రసం గాని ఒక గ్లాసు చొప్పున రోజుకు రెండు, మూడు
      సార్లు తాగితే తగ్గుతాయి.

   3. దానిమ్మ బెరడు గుజ్జుకు మజ్జిగ కలిపి గాని,  కలకండ కలిపి గాని తాగాలి.

   4.  మారేడు గుజ్జు పొడి     --- ఒక టీ స్పూను
        మజ్జిగలో గాని,  నీటిలో గాని కలుపుకుని తాగాలి.

   5.  శొంటి పొడి         --- 10 gr
        పర్పాటకం        --- 10 gr
        తుంగ ముస్థలు  --- 10 gr             మూడు చూర్ణాలను కలిపి నిల్వ చేసుకోవాలి.

             ఒక టీ స్పూను పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసుకు రానిచ్చి
       వడపోసి కలకండ కలుపుకుని తాగాలి.
             పైన చెప్పబడిన వానిలో ఏది వాడినా ఒక్క రోజులో విరేచనాలు తగ్గి పోతాయి.

             వేసవిలో వచ్చే రక్త విరేచనాలు                                    

                       కోడిశపాల చెక్క చూర్ణం           
                       దానిమ్మ పండు తొక్క చూర్ణం

           రెండింటిని సమాన భాగాలు గా తీసుకుని కలిపి నిల్వ చేసుకోవాలి.

           అర స్పూను పొడిని మజ్జిగ లో కలుపుకుని తాగాలి.  ఈ విధంగా రోజుకు రెండు, మూడు సార్లు తాగాలి.

               రక్త విరేచనాలు  --- నివారణ                   
లక్షణాలు :--  మలము  పల్చగా ,  జిగటగా ,  దుర్వాసనతో వుంటుంది .బొడ్డు  చుట్టూ కడుపులో నొప్పి వుంటుంది .

కారణాలు :-- ముఖ్యంగా అపరిశుభ్రత కారణంగా ,  కలుషితమైన నీరు , ఆహారం సేవించడం వలన  వచ్చే అవకాశం కలదు .

దోరగా వేయించిన నాగాకేసరాల చూర్ణం       ---- ఒక టీ స్పూను
                        పంచదార       ---- ఒక టీ స్పూను

     ఈ మోతాదు ప్రకారం రెండింటిని కలిపి అవసరాన్ని బట్టి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి .
2.  తుంగముస్తల చూర్ణం                          ----  రెండు టీ స్పూన్లు
                        పాలు                           ---- అరకప్పు50 gr
5
                        నీళ్ళు                ---- అరకప్పు

           అన్నింటిని కలిపి పాలు మాత్రమె మిగిలేట్లు కాచి  తాగితే చాలా వెంటనే తగ్గుతాయి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :-- నీటిని ఐదు , పది నిమిషాల పాటు కాచి తాగాలి పచ్చి సలాడ్లు తినకూడదు .  తినాలంటే
వెనిగర్ తో శుభ్ర పరచి తినాలి . హోటల్స్ లోని చట్ని తినకూడదు . పళ్ళ రసాలకు బయట షాపుల నుండి తెచ్చిన
ఐస్ స్క్యుబ్స్ వాడకూడదు

                                                   అతి విరేచనాలు  -- పరిష్కార మార్గాలు                     

          బాక్టీరియా , వైరస్ కలిసిన  నీటిని,  ఆహారాన్ని తీసుకోవడం వలన రావచ్చును  లేదా దీర్ఘ కాలిక వ్యాధులవలన ,
లేదా పరిణామ శూల వలన రావచ్చును .

        నిలకడ లేకుండా విరేచనాలు అవుతూ వుంటే ఈ క్రింది ఔషధాలను వాదాలి.

        రామబాణ రస్   లేదా భువనేశ్వరి రస్

దానిమ్మ బెరడు చూర్ణం                --- 50 gr
              బిల్వ చూర్ణం                --- 50 gr  ( మారేడు పండు గుజ్జు చూర్ణం )
  తుంగ ముస్తల  చూర్ణం                --- 50 gr
            శొంటి   చూర్ణం                --- 50 gr
            జిలకర  చూర్ణం               --- 50 gr

       అన్ని చూర్ణాలను కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి

      ఉదయం , మధ్యాహ్నం ,సాయంత్రం  పూటకు అర టీ స్పూను పొడి చొప్పున పెరుగు తేట తో గాని లేదా
పలుచని మజ్జిగ తో గాని కలిపి తీసుకోవాలి .  లేదా రెండు టీ స్పూన్ల పొడిని నీటిలో వేసి కాచి వడకట్టి తాగాలి .

                            దీర్ఘ కాలపు విరేచనాలను  తగ్గించడానికి చిత్రమూలాది చూర్ణం                28-6-11.

లక్షణాలు :--  ఈ సమస్యలో కడుపునొప్పి ప్రధానంగా వుంటుంది, గ్యాస్ విడుదలతో నొప్పి తగ్గడం ప్రత్యక లక్షణం .
మలబద్ధకం తో కూడిన  అజీర్ణం వుంటుంది , విరేచనాలు అవుతూ వ్య్న్తాయి . మలం లో శ్లేష్మం , జిగురు వుంటాయి .
పొట్ట ఉబ్బరింపు వుంటుంది .

చిత్రమూలం వేరు చూర్ణం                       ---- 20 gr
మారేడు పండు గుజ్జు చూర్ణం                   ---- 20 gr
చవ్యం  వేరు చూర్ణం                              ---- 20 gr
శొంటి చూర్ణం                                       ---- 20 gr
మజ్జిగ

          అన్ని చూర్ణాలను  కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .
          పూటకు అర  టీ స్పూను పొడిని అర గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి .  ఈ విధంగా రెండు పూటలా తీసుకోవాలి

సూచనలు :-- ఉప్పు , కారం  మానెయ్యాలి . సోంపు , సగ్గుబియ్యపు జావ  ఎక్కువగా వాడుకోవాలి . జిలేబి తినాలి .
ఆపిల్స్ , కోడిగుడ్లు , శనగ పిండి తో చేసిన పదార్ధాలు , పాలు వంటి గ్యాస్ ను పెంచే పదార్ధాలను వాడకూడదు .

        ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుండి వున్నా ఈ ఔషధం వాడడం వలన సులభంగా నివారింపబడుతుంది .

             అతి విరేచన సమస్య ---- నివారణ                    
         రక్తం లో పిత్తం చేరితే  రక్త విరేచనాలు అవుతాయి .
1.  దానిమ్మ తొక్కలు           ---- 20 gr
             నీళ్ళు                   ---- ఒక గ్లాసు

             రెండింటిని కలిపి మరిగించి అరగ్లాసు  కషాయానికి రానివ్వాలి . తరువాత వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత  తాగితే విరేచనాలు ఆగి పోతాయి .

2.  చామ ఆకు
         నీళ్ళు
    
            రెండింటిని కలిపి మరిగించాలి . గోరువెచ్చగా అయిన తరువాత తాగితే వేగంగా అవుతున్న విరేచనాలు వెంటనే
ఆగిపోతాయి .
                                    
             రక్త విరేచనాలు , రక్త మొలలు  --- నివారణకు ---నారికేళ భస్మం          

         కొబ్బరి పీచులోని పొడిని బాగా దులిపి దానిని బాణలిలో వేసి  మాదడే  వరకు సన్న  మంట మీద వేయించాలి .
దానిని  నలిపి పొడి చేసి వస్త్రఘాలితం పట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి . 

        గ్లాసులో  కొద్దిగా మజ్జిగ  తీసుకొని దానిలో పావు టీ స్పూను పొడిని కలిపి తాగాలి . తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగాలి .ఈ విధంగా ఉదయం , సాయంత్రం వాడాలి ,  అవసరమైతే మూడు పూటలా వాడాలి .

        ఇది ఎటువంటి రక్థస్రావమైన  అంటే రక్త మొలలు , ఆసనం దగ్గర గడ్డలు చితికి  రక్తస్రావం అవుతున్నా  నోటి నుండి రక్తం పడడం , ముక్కు నుండి రక్తం కారడం , బహిష్టు లో అధిక రక్తస్రావం  మొదలైన వాటిని అన్నింటిని నివారిస్తుంది .

                                నీళ్ళ , రక్త , జిగట  విరేచనాల సమస్య నివారణకు  --- హరీతకీ చూర్ణం      

కరక్కాయ పెచ్చులు             --- 50 gr
సోంపు గింజలు                     --- 50 gr
శొంటి                                 --- 50 gr

        అన్నింటిని విడివిడిగా కొద్దిగా నెయ్యి వేసి విడివిడిగా దంచి జల్లించి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .

పిల్లలకు                       ---- అర పావు లేదా పావు టీ స్పూను
పెద్దలకు                       ---- అర టీ స్పూను

       దీనిని మూడు పూటలా మంచి నీటితో వాడాలి  
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం  
                                                                                            *సభ్యులకు విజ్ఞప్తి* 
                 ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
                                                                                                                                                                                                                                                                                                                               


       
        

        

                    

                                    







                                                     
                          

కామెంట్‌లు లేవు: