12, మే 2020, మంగళవారం

గర్బాశయం లో గడ్డ నీటి బుడగలు నివారణకు పరిష్కారం మార్గం

సంతానలేమి అంటే ఏమిటి? గర్భం లో గడ్డ మరియు నీటి బుడగ నివారణకు పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు 

పిల్లలు పుట్టక పోవడాన్నే సంతానలేమి అంటారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఏవిధమైన సంతాన నిరోధక సాధనాలు వినియోగించకుండా మహిళ, పురుషుడు రతిలో పాల్గొంటున్నా గర్భం రాకపోయినట్లైతే ఆ పరిస్థితిని సంతానలేమి అంటారు. ప్రస్తుతం 8 నుంచి 15 శాతం మంది దంపతులు ఈ సంతానలేమితో బాధ పడుతున్నారు. కాగా, సంతానలేమికి మహిళలే కాదు పురుషులు కూడా కారణమవుతాడు. ఇందుకు వైద్య సహాయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. భారత దేశంలో సాధారణంగా సంతానలేమికి ప్రత్యేక శిక్షణ పొందిన గైనకాలజిస్టులు చికిత్స అందిస్తారు. వీరు కూడా సంతానలేమితో బాధ పడుతున్నవారిలోని హార్మోన్ల పనితీరును అంచనా వేయడానికి ఎండోక్రైనాలజిస్టుల చేసిన వివిధ పరీక్షల ఫలితాలను ప్రామాణికంగా తీసుకొంటారు.

సంతానలేమికి కారణం ఏమిటి?

వయస్సు పై బడటం, మద్యపానం, ధూమపానం, అధిక బరువు, అల్ప బరువు సంతానలేమికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఇక పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, వీర్యకణాల్లో చురుకుదనం లోపించడం, ఒత్తిడితో పాటు ధూమ, మధ్య పానం సంతానలేమికి కారణాలవుతాయి. అదే మహిళల్లో అండాలు విడుదల కాకపోవడం, ఫాలోఫియన్ ట్యూబ్స్‌లో లోపాలు, పీసీఓడీ, గర్భాశయంలో వివిధ రకాల లోపాలు, హార్మోన్ల విడుదల్లో సమస్యలు, జీవన శైలిలో మార్పులు ధూమపానం, మధ్యపానం తదితర విషయాలు సంతానలేమికి కారణమవుతాయి.

సంతానలేమి సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గర్భధారణ జరగకపోవడాన్నే సంతానలేమికి మొదటి సంకేతంగా చెప్పవచ్చు. సంతానలేమికి కారణాన్ని అనుసరించి లక్షణాలు, సంకేతాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత మహిళల్లో సంతానలేమికి కారణమవుతుంది. నెలసరి సక్రమంగా ఉండకపోవడం, లైంగిక ఆలోచనల్లో మార్పులు, జుట్టు రాలిపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం, చనుమొనల నుంచి తెల్లటి స్రావం రావడం వంటివి సంతానలేమి లక్షణాలు. ఇక పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, చిన్నటి వృషణాలు సంతానలేమి లక్షణాలుగా చెప్పవచ్చు.

చికిత్స విధానం

అనేక పరీక్షల అనంతరం సంతానలేమికి చికిత్స మొదలవుతుంది. సదరు పరీక్షలు మహిళతో పాటు పురుషులకు కూడా నిర్వర్తిస్తారు. అటు పై హార్మోన్ల పనితీరును అనుసరించి ఈ చికిత్స ఉంటుంది. చికిత్స మొదలు పెట్టే సందర్భంలో వైద్యుడు అడిగే సాధారణ ప్రశ్నలు - -మీరు ఎప్పటి నుంచి గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నారు? -ఎన్ని రోజులకు ఒకసారి మీరు రతిలో పాల్గొంటారు? "పరీక్షల ఫలితాలు, సమాధానాలు తదితర విషయాలను అనుసరించి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఈ చికిత్స మందులు, హార్మోన్లు ఇవ్వడం, కృత్రిమ గర్భధారణ, దాత నుంచి అండాలు, శుక్రకణాలు తీసుకోవడం రూపంలో ఉంటుంది. కొన్నిసార్లు సహజ పద్దతుల ద్వారా కూడా సంతానలేమికి చికిత్స అందిస్తారు."

చికిత్స పద్దతులు?

సంతానలేమికి సాధారణంగా అందించే చికిత్స విధానాలు

క‌ృత్రిమ గర్భధారణ - 

దంపతుల్లో పురుషుడు లేదా ఇతర వ్యక్తి నుంచి వీరాన్ని కొన్ని సేకరించి నేరుగా కృత్రిమ పద్దతుల్లో గర్భాశయంలోకి ప్రవేశపెడుతారు. దీనినే వైద్య పరిభాషలో ఇంట్రాయుటిరైన్ ఇన్సెమినేషన్ అని అంటారు. దీని వల్ల సాధ్యమైనన్ని వీర్య కణాలు ఫాలోఫియన్ ట్యూబుల ద్వారా అండాలు చేరడానికి వీలవుతుంది. దీని వల్ల ఫలధీరణ రేటు కూడా ఎక్కువవుతుంది.

యోని నుంచి స్రావితాలు సమస్యలు - 

మూత్రనాళ, గర్భాశయ అంటువ్యాధులతో బాధపడే మహిళల్లో యోని నుంచి చెడు స్రావితాలు వస్తుంటాయి. సంతానలేమికి అంటువ్యాధులు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా బ్యాక్టీరియల్ వెజినోసిస్, క్లమైడియాసిస్ వంటి వ్యాధులు సంతానలేమికి కారణమవుతుంది. ఇటువంటి సమయాల్లో వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసి సరైన చికిత్స అందిస్తే సంతానలేమి నుంచి విముక్తి కలగుతుంది.

సంతానలేమికి మహిళలు కారణమైతే - 

సంతానలేమికి పురుషులతో పాటు మహిళలు కూడా కారణమవుతారు. ప్రథమిక పరీక్షల్లో సంతానలేమి సమస్యకు మహిళ కారణమని తేలితే; సదరు పరీక్షలు మహిళ వయస్సు, ఎంత కాలం నుంచి సంతానలేమితో బాధ పడుతున్నారు తదితర విషయాల పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక సంతానలేమికి కారణాన్ని నిర్థారించడానికి చేసే పరీక్షల్లో అండాల విడదల నాణ్యతతో పాటు విడుదలవుతున్నాయా? లేదా? తదితర విషయాల నిర్థారణకు నిర్వహించే ఒవల్యూషన్ పరీక్షతో పాటు హైస్టరోసల్పింగోగ్రఫీ, హార్మోనల్ పరీక్షలు కూడా ముఖ్యమైవి


గార్భాశయ సమస్యలు కు నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు 
            గర్భాశయ సమస్యలు
        రక్త గుల్మ వ్యాధి ( Fybroids)                              
      బహిష్టు రాకుండా చేయడం చాలా ప్రమాదకరం .రాకుండా మాత్రలు వాడకూడదు .harmonal inbalance జరుగుతుంది.
    ఉసిరికాయల పొడి                   ----- 100 gr
    దోరగా వేయించిన మిరియాల పొడి   ---25 gr
 
       రెండిటిని కలిపి నిల్వ చేసుకోవాలి .ఉదయం,సాయంత్రం అర టీ స్పూను చొప్పున సేవించాలి.
ఇది పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ లో గడ్డలు గా  అవుతుంటే పై మందు బాగా ఉపయోగ  పడుతుంది.

    గర్భాశయం లో గడ్డలు  (గుల్మములు )                  
 
  మట్టి పట్టి :--  మొదట పొడి బంక మట్టిని  జల్లించి దానికి కలబంద రసం కలిపి పెట్టుకోవాలి.ఒక మందమైన నూలు గుడ్డను తీసుకొని తడిపి, పిండి,విదిలించాలి. ఆ అగుడ్డ మీద తయారు చేసుకున్న మట్టి పేస్టును మందంగా పూయాలి . ఆ మట్టి పట్టిని గర్భాశయం మీద ,పొట్ట మీద పరచాలి. ఈ విధంగా రోజుకు రెండు,మూడు సార్లువెయ్యాలి.
యోగాసనం :-- నౌకాసనం :--  బోర్లా పడుకొని చేతులను ముందుకు చాపి, కాళ్ళను పూర్తిగా వెనుకకు చాపి  ఉంచాలి, అదే విధంగా వుంది ప్రక్కలకు వంగాలి
.
ధనురాసనం :-- బోర్లా పడుకొని రెండు పాదాలను రెండు చేతులతో పట్టుకొని ఊగాలి.
ఆహారం :--  బహిష్టు  సమయంలో ఘాటైన ఆహార పదార్ధాలు సేవించడం, ఉపవాసాలు వుండడం,
బహిష్టు సమయాన్ని ఆపడం వలన గుల్మ వ్యాధి వస్తుంది.
 
             నెత్తుటి గడ్డలు కరగడానికి
 
                శొంటి పొడి        ------ 10 gr
                మిరియాల పొడి  ----- 10 gr
                పిప్పళ్ళ పొడి     ------10 gr
                కరక్కాయల పొడి  ---- 10 gr
                సైంధవ లవణం    ----- 10 gr
 
     అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి  దంచి పొడి చేసి అన్నింటిని సైంధవ లవణం పొడితో కలపాలి.   
       తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
     కలబంద గుజ్జును రసం తీయాలి. 50 గ్రాముల రసంలో 10 గ్రాముల పొడిని కలపాలి.లేదా  ఆవు నేతిలో  కలుపుకోవచ్చు. పొడిని బాగా గిలకొట్టి పరగడుపున తీసుకోవాలి. 1 గంట వరకు ఏమి తిన కూడదు.దీనితో  గడ్డలు కరిగిపోతాయి. ముఖ్యంగా వర్షా కాలం లో సేవిస్తే మంచిది.

     సమస్య తీవ్రంగా వున్నవాళ్ళు రెండు పూటలా వాడాలి. లేకున్నఒక పూట చాలు.

     దీనిని సేవించడం వలన గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి. బహిష్టు సక్రమమవుతుంది.
శరీరంలో కొవ్వు కరుగుతుంది.
 
      2. ఉసిరికాయ ముక్కలు           ----- 10 gr
                           కాచు                ----- 10 gr
 
      ఒక గిన్నెలో వాటిని వేసి  అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పావు లీటరు కషాయం వచ్చే వరకు  కాచాలి.దీనిని రెండు భాగాలు చేసి ఉదయం, సాయంత్రం  సమానంగా తీసుకోవాలి.దీనిలో పావు టీ స్పూను  బావంచాల పొడి ని కలిపి తీసుకోవాలి.కొంచం గోరువెచ్చగా తీసుకోవాలి.
 
      మాంసం,చేపలు,గుడ్లు, పాలు,వెన్న కలిపి తినరాదు.  "మాంసాహారం, పాలపదార్ధాలు  కలిపి ఒకేసారి   తినరాదు"  అతి పులుపు పనికి రాదు.
  గర్భాశయం లో, రొమ్ముల్లో గడ్డలు రాకుండా -- నివారణ             
.
      కలబంద హల్వా తయారి

   కలబంద గుజ్జు    ---- 400 gr
  పటిక బెల్లం పొ  ----- 400 gr
 గోధుమ పిండి      ----- 100 gr
 నెయ్యి              ------ 100 gr
తేనె                  ------ 100 gr

    కలబంద గుజ్జు లో  రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  సన్న సెగ మీద   కలుపుతూ వేయించాలి. చల్లారిన తరువాత మిక్సి లోవేసి జూస్ చెయ్యాలి. తిరిగి దీనిని బాణలిలో పోసి దానిలో  పటిక బెల్లం వేసి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఈ పాకంలో గోధుమ పిండి కలపాలి. కొద్దిగా ఉడికిన తరువాత నెయ్యి కలపాలి. నురుగులా వచ్చి, నురుగు తగ్గిన తరువాత చల్లారనిచ్చి తేనె కలపాలి. ఇది పొంగు లాగా వచ్చిన తరువాత స్టవ్ ఆపాలి. బాగా చల్లారిన తరువాత నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం :--  భోజనానికి గంట ముందు ఉదయం, రాత్రి ఒక టీ స్పూన్ మందును వాడాలి.

  10  ----12 సంవత్సరాల వారికి  -- పావు టీ స్పూను
   12-----2 6 "                "  ----- అర స్పూను

       బహిష్టు సరిగా రాకుండా, ఎక్కువ గా లేదా తక్కువగా రక్త స్రావం కావడం, కాన్సర్ కారక పుండ్లు వున్నవారు, మూత్ర సమస్యలున్న వాళ్ళు ఈ హల్వా వాడవచ్చు.

    గర్భాశయ సమస్యల --నివారణ                      
 
పది కరక్కాయల పెచ్చులు
పది తానికాయల పెచ్చులు
పది ఉసిరిక కాయల ముక్కలు
 నీళ్ళు       ---అర లీటరు
 
     రాత్రి పూట ఈ పెచ్చులన్నింటిని నీళ్ళలో వేసి నానబెట్టి, ఉదయం కషాయం లాగా కాచాలి. మూత్ర విసర్జనకు
వెళ్ళినపుడు రెండు మూడు సార్లకు ఒక  సారి ఈ నీళ్ళతో శుభ్రపరచుకోవాలి. దీని వలన తెల్ల బట్ట వంటి
వ్యాధులు కూడా నివారింప బడతాయి.
                                                                
 
1. ఒక నూలు బట్టను తీసుకొని చల్లని నీటిలో ముంచి, పిండి పొట్ట మీద నాలుగు పొరలుగా వేసి దాని పై పొడిబట్టను వెయ్యాలి.
2.  6 అడుగుల నూలు బట్టను తీసుకొని చల్లని నీటిలో ముంచి, పిండి నాభి నుండి గజ్జల వరకు లుంగీ లాగా కట్టాలి.
3. ఎర్ర మట్టి జల్లించి నూరి పొట్ట మీద పట్టు లాగా వేసి 20 నిమిషాలు వుంచుకోవాలి.
      పై మూడు రకాలుగా చేయడం వలన అధికమైన వేడిని తగ్గించ వచ్చును. పొట్టలోని చెడు వాయువులను  నివారింప వచ్చును.

 శరీర అంతః , బాహ్య సౌందర్యానికి
 
       గర్భాశయ, మర్మాంగ సమస్యలు రాకుండా ఉండడానికి నువ్వులను అధికంగా వాడాలి. నువ్వుండలు,  నువ్వుల పొడి వాడుతూ నువ్వుల నూనెతో  శరీరమంతా మర్దన చేయడం వలన శరీర సౌందర్యం పెరుగుతుంది.
 
              సన్నిపాత ప్రదర సమస్య
 
1. వేపాకు నీటిలో వేసి ఉడికించి పేస్ట్ లాగా చేసి దానిని పొత్తి కడుపు మీద పట్టు లాగ వేసి నూలు బట్టతో  కప్పాలి.
2. మూడు గుప్పెళ్ళ వేపాకు, ఐదు చిటికెల పసుపు వేసి ఐదు గ్లాసుల నీటిలో వేసి  పది నిమిషాలు మరిగించి    ఆ నీటితో మర్గాన్గాన్ని కడుక్కోవాలి.
 
    బహిష్టు సమయంలో రక్త స్రావం గడ్డలు  లేదా రక్త గుల్మ వ్యాధి (Fybraoids)           
 
   అతిమధురం పొడి ----  100 gr
   శొంటి పొడి             ----- 100 gr
  పిప్పళ్ళ పొడి           -----  100 gr
 మిరియాల పొడి           -----  100 gr
పాతబెల్లం      -----  400 gr

   అన్ని పొడులను కలిపి బెల్లం కలిపి దంచి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను  చొప్పున తినాలి.
   దీనితో బహిష్టు సమయం లో రక్త స్రావంలో గడ్డలు పడుతూ వుంటే కరిగి బయట పడతాయి.
   నౌకాసనం,   మట్టిపట్టి

                  బహిష్టు సమయంలో రక్తస్రావం సరిగా జరగక పోవడం వలన వచ్చే పొట్ట తగ్గడానికి
1. వెల్లకిలా పడుకొని కాళ్ళు,చేతులు పూర్తిగా చాపాలి.ఒక కాలు పూర్తిగా పైకి లేపాలి, దించాలి (వేగంగా) అదే   విధంగా రెండవ కాలు తరువాత రెండు కాళ్ళతో చెయ్యాలి.

2.  పక్కకు తిరిగి పడుకొని చేయి వెనుకకు పెట్టుకొని కాలును తలవైపుకు పైకేత్తాలి.  అదే విధంగా రెండవ వైపు చేయాలి. దీని వలన అధికంగా ఏర్పడిన కొవ్వు తగ్గుతుంది.

       ఒక చిన్న గ్లాసు బియ్యం కడిగి దానిలో 14 గ్లాసులో నీళ్ళు పోసి శొంటి, మిరియాలు,అల్లం, కొత్తిమెర, పుదీనా  కరివేపాకు మొదలైన వాటినిచిటికెడు చొప్పున  వేసి ఉడికించి తినాలి.

3. అన్ని కూరగాయలలో పైవన్నీ వేసి వుకించి తినాలి.

4. ఉలవచారు వాడాలి.

5.పాత రాగులు, గోధుమలు, బార్లీ  అన్ని కలిపిన పిండితో రొట్టెలు చేసుకొని దానిలో ఒక టీ స్పూను ఆముదంకలుపుకొని చేసుకొని తినాలి.

                దీని వలన అధికంగా వున్న కొవ్వు తగ్గుతుంది

        ఉత్తరేణి తైలం

      100 గ్రాముల నువ్వుల నూనెను తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి దానిలో కొన్ని ఉత్తరేణి ఆకులను వేసి బాగా కాచాలి. తరువాత వడపోసి నిల్వ చేసుకోవాలి. ఈ తైలం తో పొట్ట మీద రుద్దితే కొవ్వు కరుగుతుంది.

        తులసి ---గర్భ దోషాలు -- నివారణ                          

        తులసి ఆకులను నూరి నాభి మీద పట్టు వెయ్యాలి.  తరువాత మట్టి పట్టి వెయ్యాలి.  దీని వలన   గర్భాశయం లోని గడ్డలు, నీటి బుడగలు నివారింప బడతాయి.

        ఉదరచాలనము, ఉడ్యానబంధము, భుజంగాసనం, శలభాసనం వెయ్యాలి.

     బహిష్టు సక్రమంగా రాకపోవడం ---నివారణ   

        కృష్ణ తులసి గింజల పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

       ఆడపిల్లలు బహిష్టు వచ్చిన రోజు నుండి వరుసగా మూడు రోజులు ఆహార నియమాలు పాటిస్తూమూడు చిటికెల తులసి గింజల చూర్ణాన్ని ఆహారానికి ముందు నీటితో సేవించాలి.

    2.   కృష్ణ తులసి సమూలంగా తెచ్చి విడివిడిగా నీడలో ఆరబెట్టి దంచి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.

     బహిష్టు ఆగిన తరువాత రోజునుండి తిరిగి బహిష్టు వచ్చే వరకు సేవిస్తే  1. గర్భాశయ ద్వారము ముడుచుకు పోవడం 
2. అతిరక్తస్రావం, చాలా తక్కువగా రక్తస్రావం కావడం, బహిష్టు సరిగా రాకపోవడం మొదలైన సమస్యలు    నివారింప బడతాయి.

        అండం సరిగా విడుదల కావడానికి

     ఎర్ర తులసి ఆకులు, కాండం ఎర్రగా వుంటాయి. దీనిని సమూలంగా తెచ్చి ఎండబెట్టి, దంచి పొడి చేసి నిల్వ  చేసుకోవాలి.

     మూడు చిటికెల పొడిలో సమానంగా కలకండ పొడి కలుపుకొని సేవించాలి.

     తప్పకుండా ఆహార నియమాలను పాటించాలి.

                      గర్భధారణ

కృష్ణ తులసి దళాలు                 ---- పిడికెడు                           నువ్వుల నూనె       పావుకిలో         
తెల్ల జిల్లేడు  ఆకు     ---- ఒకటి     
                                                                               చిట్టాముదం   --- పావుకిలో
నల్లేరు   ---- జానెడు పొడవు            వేప నూనె      ----పావుకిలో
వెల్లుల్లి పాయలు           ---- రెండు
మర్రి ఆకుల చిగుళ్ళు    ----- రెండు
తామర గింజలు         ----- రెండు

     అన్నింటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అన్ని నూనెలను ఒక పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగిస్తూ పై పదార్ధాల ముద్దను ఆ పాత్రలో మరుగుతున్న నూనేలలో వెయ్యాలి. నిదానంగా కలియబెడుతూ వుండాలి.  పదార్ధమంతా మాడిన తారువాత దించి వడపోసి నిల్వ చేసుకోవాలి.

     పది రోజులలో బహిష్టు రాబోతున్న దనగా ఈ తైలంతో రాత్రి పడుకునే ముందు నాభి చుట్టూ మర్దన చెయ్యాలి.  ఉదయం స్నానం చెయ్యాలి.

                                     గర్భాశయంలో గడ్డలు ----నివారణ ( Fybroids)
                    
కలబంద గుజ్జు                ---- 30 gr
పసుపు                         ---- మూడు వేళ్ళకు వచ్చినంత
జిలకర                          ----     "            "         "
నీళ్ళు                            ---- ఒక కప్పు

     అన్నింటిని కలిపి బాగా గిలకొట్టాలి.  ఉదయం, సాయంత్రం తాగాలి.  కపాలభాతి ప్రాణాయామం చెయ్యాలి.
              
  గర్భాశయంలో పుండు ( Survical Erosion ) --కారణాలు                        
 
లక్షణాలు:-- యోని నుండి చిక్కగా, తెల్లగా, జిడ్డుగా వున్న స్రావాలు రావడం.  లోపల బాక్టీరియా వలన ఇన్ఫెక్షన్    ఎక్కువై పసుపు రంగు ద్రవం ఏర్పడి దుర్వాసన కూడా వుంటుంది.
 
      నెల  మధ్యలో బ్లీడింగ్ కావడం వలన రావచ్చు. sexual intercourse వలన పెల్విస్  చిరిగి బ్లీడింగ్ కూడా  అవుతుంది.  survicks లో unwanted gowth వలన పుండు లాగ ఎత్తైన భాగం ఏర్పడుతుంది. దీని వలన కూడా బ్లీడింగ్ ఏర్పడుతుంది.
 
       మలబద్ధకం వలన ముఖద్వారం దగ్గర బ్లీడింగ్ అయ్యే అవకాశం వున్నది
       గర్భ నిరోధక మాత్రలు వాడడం వలన కూడా ఏర్పడుతుంది.
       ఫంగస్ చేరడం వలన కూడా ఏర్పడుతుంది.
       పై కారణాల వలన గర్భాశయం లో పుండ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
       దీనిని నివారిన్చుకోవడానికి నిపుణులైన స్త్రీ వైద్యులను సంప్రదించాలి.
 
యోని ప్రక్షాళనం ;--
 
మర్రి, రావి, మేడి, జువ్వి, గంగరావి ( పంచ వల్కలాలు ) ల యొక్క బెరడులను తెచ్చి కషాయం కాచి ఎనిమా క్యాన్ ద్వారా యోని మార్గంలో పెట్టి ఒత్తిడి ( ప్రెషర్) ఉపయోగించి పంపించాలి. దీనిని వైద్యుల ద్వారా చేయించుకుంటే మంచిది.
 
1."పుష్యానుగ చూర్ణం "  + తేనె కలిపి తీసుకోవాలి. ఈ ఔషధం 26  రకాల మూలికలతో విలక్షణం గా తయారు చేస్తారు.
      నేరేడు గింజల చూర్ణం లేదా మామిడి విత్తుల చూర్ణం, లేదా మాచికాయ చూర్ణం లలో ఏదో ఒకదానిని ఒకటి నుండి మూడు గ్రాముల చూర్నానికి తేనె కలిపి ఉండలాగా చేసి మింగి బియ్యం కడిగిన నీళ్ళు తాగాలి.
ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది.
     ఇది తెల్లబట్ట వ్యాధిని కూడా నివారిస్తుంది.
      ఇది గర్భాశయాన్ని కూడా  శుద్ధి చేస్తుంది.
2. ప్రదరాంతకవటి    టాబ్లెట్లను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. వీటికి అనుపానంగా
అశోకారిష్ట ,  రుద్రాంతకవటి  లను వాడాలి.

          గర్భాశయ సమస్యలు-- నివారణ                                 
 
       పిల్లలు మొదటి సారి రజస్వల అయినప్పటినుండి బహిష్టు సమయంలో మూడు రోజులు అన్నం, పెసర పప్పు, నెయ్యితినాలి

 .  మరియు అన్నంలో పాలు, చక్కెర   తినాలి. సున్నుండలు, కొబ్బరి  ఉండలు  నువ్వుండలు  తింటూ 
వుంటే గర్భాశయ సమస్యలు ఏర్పడవు

       గర్భ సంచి బలంగా ఉండడానికి                                     

     ప్రతి రోజు లవంగం లోని బుడిపే భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని నమిలి ( రోజుకొక్కటి)  తింటూ వుంటే గర్భ సంచి బలంగా తయారవుతుంది,

 గర్భాశయంలో రక్తం పేరుకు పోవడం --నివారణ                                 
.
      దీనినే గ్రంధి భూత ఆర్తవము అంటారు.        ( Menstrual  Clots ).

      మోదుగ ( పలాస ) ఆకులు, బెరడు, కాండము  తెచ్చి చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టి  కాల్చి బూడిద చెయ్యాలి. ( పలాశ భస్మము )

మోదుగ భస్మం                    --- పావు కిలో
 ఆవు నెయ్యి                       --- ఒక కిలో
నీళ్ళు                                --- ఒక లీటరు

    అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి కాచాలి.  తైలం మాత్రమే మిగలాలి. దీనిని ప్రతి రోజు ఒక టీ స్పూను తైలం
ఒక గ్లాసు పాలలో కలుపుకొని తాగుతూ వుంటే ఈ సమస్య నివారింప బడుతుంది.

      గర్భాశయ   క్యాన్సర్ --నివారణ                                             

     బహిష్టు సమయంలో సరిగా శుభ్ర పరచుకోక పోవడం వలన,  ఎక్కువ కాలం  తెల్లబట్ట,  ఎర్రబట్ట కావడం
దానితో గడ్డలు ఏర్పడడం కారణంగా ఇది క్రమేపి క్యాన్సర్ కి దారి తీయడానికి అవకాశం వుంది.

     ప్రాధమిక స్థాయిలో అయితే పెరగకుండా కాపాడుకోవచ్చు.
     ప్లాస్టిక్ వస్తువులను ఆహార పదార్ధాల ఉపయోగానికి వాడడం క్యాన్సర్ సమస్యలకు కారణం అవుతుంది.
 
                 వజ్ర భస్మం       వాడాలి.

నల్ల జీడి గింజలను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయం ఇసుకలో వేసి దంచాలి. ఈ విధంగా ఏడు సార్లు చేయాలి. తరువాత అదే విధంగా మూడు సార్లు పెదలో నానబెట్టి ఉదయం ఇసుకలో వేసి దంచాలి.

అశోక చెట్టు బెరడు చూర్ణం
శుద్ధి చేసిన జీడి గింజల చూర్ణం
త్రిఫల చూర్ణం
తెల్ల చిత్ర మూలం పొడి
తిప్ప తీగ పొడి
 
         అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలపాలి.  కల్వంలో వేసి నీటితో గాని,  గోమూత్ర అర్కంతో గానినూరి శనగ గింజలంత మాత్రలు చేయాలి.

                                                
        ప్రతి రోజు పూటకు  రెండు మాత్రల  చొప్పున మూడు పూటలా ఆరు మాత్రలు వాడుతూ వుంటే క్యాన్సర్ యొక్క తీవ్రత

 గర్భాశయం  జారిపోవడం                                          

        ఇదొక దురదృష్టకరమైన  సమస్య .

        స్త్రీలు  మూత్ర విసర్జనకు వెళ్ళినపుడు మూత్రానికి అడ్డుపడినట్లుగా అనిపిస్తే జారిందని గుర్తించ
 వచ్చు.

        గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, గుల్లలు వున్నపుడు   కండరాలు  వదులైనపుడు  సమస్య
ఏర్పడే అవకాశం కలదు.  దీని ప్రభావం మూత్రాశయం మీద, మలాశయం మీద పడుతుంది.
ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వలన కూడా గర్భాశయం జారిపోయ్యే ప్రమాదం వున్నది.
ఆహారం సరిగా తీసుకోక పోవడం వలన శారీరక ఆరోగ్యం చెడిపోవడం వలన కూడా ఈ వ్యాధి
రావచ్చు.

సమస్య ప్రారంభ దశలో వున్నపుడు :---

సుకుమార తైలం, బలా తైలం ,  వల్కల తైలం  లలో ఏదైనా వాడవచ్చు.

1. త్రిఫల చూర్ణం           --- రెండు టీ స్పూన్లు
         నీళ్ళు                --- రెండు గ్లాసులు

   నీళ్ళలో  చూర్ణాన్ని వేసి బాగా కాచి ఆ కషాయం తో కడగాలి.

2. వరుణ ( ఉలిమిరి) చెక్క చూ  --- 50 gr
లొద్దుగ   చెక్క  చూర్ణం          -- 50 gr
మాంస రోహిణి  ( సోమిడి) చెక్క చూర్ణం  -- 50 gr
  అశోక  చెక్క చూర్ణం   ---100 గా నువ్వుల నూనె               --- 250 gr
   నీళ్ళు                    ----ఒక లీటరు

        అన్ని చూర్ణాలను, నువ్వుల నూనెను, నీటిని కలిపి ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి కలియ
బెడుతూ కాచాలి. నీటి శాతం ఆవిరై తైలం మాత్రమె మిగిలే వరకు కాచాలి.

      దీనిని ప్రతి రోజు ఒక టీ స్పూను తైలాన్ని ఒక కప్పు పాలలో కలుపుకొని తాగాలి.

   గర్భాశయ క్యాన్సర్ --- నివారణ                         

1. మర్రి,  రావి పండ్లు
          కలకండ  

       రెండింటిని  సమానంగా తీసుకొని కలిపి హల్వా తయారు చేయాలి .

      ప్రతి రోజు ఒక టీ స్పూను హల్వా తినాలి ,

2.  త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజు రాత్రి వాడాలి . 

3.  మునగ చెట్టు బెరడు పొడి --- 100 gr
 రావి  చెట్టు బెరడు పొడి  ---  100 gr
   వస పొడి                   ---  100 gr

       అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

       ఒక టీ స్పూను పొడిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి అరకప్పుకు రానివ్వాలి . దించి దానిలో
చిటికెడు ఇంగువ పొడి,  చిటికెడు సైంధవ లవణం పొడి కలిపి గోరువెచ్చగా తాగాలి .  ఈ విధంగా ప్రతి రోజు చేయాలి

 గర్భాశయ సమస్యలు  ( అండాశయం లోని నీటి బుడగలు ) --- నివారణ   

   పొత్తి కడుపు మీద రెండు పూటలా పదిహేను  నుండి ఇరవై నిమిషాల పాటు మట్టి పట్టీని వేయాలి . తరువాత దానిని
తీసి  ఒక గుడ్డను వేడి నీటిలో ముంచి కాపడం పెట్టాలి . తరువాత రెండు నిమిషాల పాటు ఆ వేడి గుడ్డను పొట్ట మీద
పరచాలి . తరువాత దానిని తీసి  చన్నీటి లో ముంచిన గుడ్డను వేయాలి . ఈ విధంగా పట్టీలను మార్చుతూ ఈ   విధంగా మూడు సార్లు చేయాలి

     తరువాత 5, 6 ఆసనాలు వేయాలి

1.భుజంగాసనం  2. శలభాసనం  3. ధనురాసనం  4. పవనముక్తాసనం  5. యోగాముద్రాసనం
    ఒక్కొక్క ఆసనాన్ని రెండు నిమిషాల సేపు వేయాలి .
    ముఖ్యంగా సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు గా వేసే ఆసనం  చాలా ముఖ్యమైనది .
    కపాలభాతి ప్రాణాయామాన్ని శక్తిని బట్టి 50 నుండి 100 చెయ్యాలి .
ఈ విధంగా చేయడం వలన గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి .
     చితికేనవేలు ,  ఉంగరపు వేలు మడిచి దాని మీద బొటన వ్రేలును వుంచి మిగిలిన రెండు వేళ్ళను  చాపి ఉంచాలి
     పద్మాసనం వేసుకొని కూర్చొని ఈ విధంగా మడిచిన చేతులను మోకాళ్ళపై వుంచి మనసులో గర్భసంచి లోని
గడ్డలు కరుగుతున్నట్లుగా భావిస్తూ ధ్యానం చేయాలి .

   ఈ విధంగా రోజుకు మూడు సార్లు భోజనానికి ముందు చేయాలి .

అతిమధురం
ఉసిరిక పొడి
శొంటి
పిప్పళ్ళు
మిరియాలు

     శొంటి ,పిప్పళ్ళు , మిరియాలను దోరగా వేయించాలి .
     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా వేయించి దంచి , జల్లించి బాగా కలిపి సీసాలో నిల్వ
చేసుకోవాలి .
      పొట్ట ఖాళీ గా వున్న సమయం లో పావు టీ స్పూను నుండి అరస్పూను చూర్ణాన్ని మంచి నీటితో ఉదయం , సాయంత్రం సేవించాలి
  గర్భాశయం లో గడ్డలు   --- నివారణ                    
కలబంద గుజ్జు          --- 3 gr
పసుపు                   --- 3 gr
జిలకర                   --- 3  gr                  
త్రికటుకాల  చూర్ణం   --- 3 gr
ఉసిరిక  చూర్ణం        --- 3 gr

      అన్నింటిని కలిపి  పరగడుపున  కడుపులోకి తీసుకోవాలి  . ఒక గంట వరకు ఏమి తినకూడదు .
సూచన :-- వేపాకు పొడి ,  పసుపు పొడి సమానంతీసుకొని  నీటితో కలిపి రాత్రి పడుకునే ముందు పొత్తి కడుపు మీద
పట్టీ లాగా వేసుకోవాలి

  గర్భాశయంలో గడ్డలు మరియు తెల్లబట్ట ---నివారణ             

1. త్రిఫల చూర్ణం            --- ఒక టీ స్పూను
         నీళ్ళు                 --- ఒక కప్పు

         రెండింటిని కలిపి ఒక చిన్న గిన్నెలో వేసి కాచి అరకప్పు కు రానివ్వాలి . దానిలో అరకప్పు బియ్యం కడగగా
వచ్చిన నీళ్ళు  ( కడుగు ) కలిపి తాగితే గర్భాశయం లోని గడ్డలు కరిగిపోతాయి .

2. ప్రతి రోజు రెండు బెండకాయలను తినాలి .

3. బెండకాయ రసం లో చక్కర కలుపుకొని తాగాలి

4. ఉసిరిక పొడి , పంచదార , తేనె సమాన భాగాలుగా తీసుకొని కలిపి తినాలి .

5. ఉసిరి పొడి , పంచదార , అరటిపండు కలిపి తినాలి

    స్త్రీల యొక్క అండాశయం లో సిస్ట్ తయారవడం   --- నివారణ             .

లక్షణాలు :---  పొత్తి కడుపు లో నొప్పి వుంటుంది . మలబద్ధకం , ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు వుంటాయి .

1. సైంధవ లవణం  పొడి    --- ఒక గ్రాము
    పిప్పళ్ళ పొడి              ---       "
    పిప్పళ్ళ వేరు ( మోడి ) చూర్ణం---       "
   చిత్ర మూలం  వేరు చూర్ణం    --       "
   నల్ల జిలకర చూర్ణం              --       "
   దశ మూలాల కషాయం

         దశ మూలాల కషాయం లో అన్ని చూర్ణాలను  కలిపి తాగాలి . రోజుకు  రెండు పూటల చొప్పున  40 రోజులు
వాడాలి .

         దశ మూలాల కషాయం దొరకని పక్షం లో చూర్ణాలను నీటిలో కలుపుకొని అయినా తాగవచ్చును

2. వాము పొడి                             ---- ఒక గ్రాము
    పొంగించిన ఇంగువ పొడి             ----      "
    సైంధవ లవణం                        ----      "
    యవాక్షారం  పొడి                     ----      "
    కరక్కాయ పెచ్చుల పొడి           ----      "
    ద్రాక్షారిష్ట                                ----  20 ml

           ద్రాక్షారిష్ట లో అన్ని చూర్ణాలను  కలిపి తాగాలి  రోజుకు రెండు పూటల చొప్పున  40  రోజులు వాడాలి 
           చూర్ణాలను నీటిలో కలుపుకొని కూడా తాగావచ్చును .

           ఈ విధంగా వాడడం వలన సైస్ట్ లు కరిగి పోతాయి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .  వేడి నీళ్ళు ,  వేడి ఆహార పదార్ధాలను వాడాలి .
పాల పదార్ధాలను , దుంప కూరలను వాడడం తగ్గించాలి . ఆకు కూరలను బాగా ఎక్కువగా వాడుకోవాలి
  ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 

*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కామెంట్‌లు లేవు: