10, జులై 2020, శుక్రవారం

అధిక రక్తపోటు (హై బీపి) సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు హై బీపి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ... గుండెపోటు , కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలకు దారి తీస్తుంది. వెంటనే దగ్గరలో డాక్టర్స్ ని సంప్రదించి మందులు వాడుకోవాలి. జీవన శైలి , ఆహార శైలిలో మార్పులు చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. హై బీపి , లో బీపి సమస్యలకు ఆయుర్వేదం అలౌపతి హోమియోపతి లో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణుల సహాయంతో వాడుకొంటే బీపి సమస్యలకు శాశ్వత పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి


అధిక రక్తపోటు ఆయుర్వేదంలో నవీన్ నడిమింటి సలహాలు 



        అధిక రక్త పోటు -- నివారణ                         

              రక్త నాళాల్లో మలినపదార్ధాలు చేరినపుడు రక్త ప్రసరణకు  అవరోధం    ఏర్పడుతుందిఅటువంటప్పుడు రక్తం వేగంగా ప్రవహించడానికి ప్రయాత్నించడాన్ని "రక్త పోటు " అంటారు.

యోగాసనం:--
పద్మాసనం లో కూర్చొని చిటికెన వేలుబొటన వేలు కలిపి మధ్యలో పెట్టి మిగిలిన మూడు వేళ్ళను చాచాలి.
రెండు చేతులను అదేవిధంగా పెట్టుకొనితలను నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని నొసటి మధ్యలో ఒక ఆకారాన్ని ఊహించుకొని మనోఫలకం పై పెట్టుకోవాలి.కనుగుడ్లు పైకి పోకూడదు.

ఇప్పుడు క్రమముగా శ్వాస వేగాన్ని తగ్గించాలి.ఇప్పుడు మనసు వాయువు తో లగ్నమవుతుంది.

శరీరంలో  సమయం లో చాలా ప్రశాంతమైన మార్పులు జరుగుతాయి.అన్ని రకాల మదాలు అణిగి పోయి ప్రశాంతత కలుగుతుంది.

ఆహారం:-- ఎక్కువ సార్లు కాఫీలు తాగడం,పాన్ మసాలాలు,గుట్కాలుమద్యంఅధిక కారంఅధికమైన మసాలాలువాడ కూడదుఅవి వాడితే ప్రాణాయామాలు చేసినా B.P తగ్గదు

ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడుకోవాలిదీని వలన ఎలాంటి ముప్పు ఏర్పడదు.

పచ్చి మిర్చి తగ్గించి మిరియాలు ఎక్కువగా వాడాలికొత్త చింత పండు వాడకూడదుఅన్నిటికంటే చింత పువ్వుచింత చిగురు అతి శ్రేష్టమైనది .వీటిని నిల్వ వుంచుకొని వాడడం మంచిదిఉల్లివెల్లుల్లి ఎక్కువగావాడాలి.
హై బిపి ఉన్నవారు ఇలా చిత్రము లో ఉన్నట్లు clips పెట్టుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి 3 సార్లు 5 నిమిషాలు చొప్పున ధరించాలి. జయగురుదత్త

కిచిడి లేదా పొంగలి:--

      గోధుమ రవ్వ,పెసర పప్పు కలిపి దానికి కారెట్బీట్రూట్,జిలకర,ధనియాలపొడిఆకుపత్రి
(సగం ఆకు ), కొంచం ఆవు నెయ్యి లేదా కొద్దిగా నువ్వుల నూనెసైంధవ లవణం,అల్లం కలిపి వండుకొని తింటే    B.P. కి వేరే మందులు అవసరం లేదు.


            అధిక రక్త పోటు                        

ఉష్ణం అధికంగా పెరగడం వలన అధిక రక్త పోటు వస్తుంది.

1. చంద్ర భేదన ప్రాణాయామం:-- పద్మాసనం లో లేక అర్ధ పద్మాసనంలో లేక సుఖాసనం లో కూర్చొని బొటన వ్రేలుతో కుడి ముక్కును మూసి నెమ్మదిగా గాలిని పీల్చాలి.
ఎడమ ముక్కును మూసి పీల్చిన గాలిని రెట్టింపు నెమ్మదిగా వదలాలి.
అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.
 విధంగా రోజుకు మూడు సార్లు ఆహారానికి ఒక గంట ముందు 12 సార్లు లేదా 24 సార్లు చొప్పున చెయ్యాలి.

2 శీతలి ప్రాణాయామం :-- సుఖాసనం లో కూర్చొని నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని బాగా దీర్ఘంగా లోపలి పీల్చినోరు మూసి కొంత సేపు ఆపి ఉంచాలితరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా గాలిని వదలాలిదీని వలన    శరీరము చల్లబడుతుంది విధంగా రోజుకు 12 లేక, 18 లేక, 24 సార్లు చెయ్యాలి.

3. శీత్కారి ప్రాణాయామం ;-- సుఖాసనం లో కూర్చొని రెండు పళ్ళ మధ్య నుండి గాలిని పీల్చి లోపల కొంత సేపు నిలిపి వుంచి తరువాత నెమ్మదిగా ముక్కు ద్వారా వదలాలిదీని వలన రక్త పోటు అతి సహజంగా నివారింపబడుతుంది.

 ఆహారం:-- రోజుకు రెండుమూడు సార్లు ఆహారంలో ఒక్కొక్క టీ స్పూను పొడి కరివేపాకు పొడి తీసుకుంటూ వుంటే రక్తం లో వున్న వేడి తగ్గుతుందిఇది రక్తంగడ్డ కట్టకుండా చేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

      వేప చిగుళ్ళను కూడా దీనితో కలిపి వాడితే B. P. అతి వేగంగా నివారింపబడుతుంది.
బీరకాయసొరకాయపొట్ల కాయ,దోసకాయ,టమేటా,తీపిద్రాక్ష (ఎండు ద్రాక్ష), నల్లద్రాక్ష,ఆపిల్దానిమ్మ లాటి పళ్ళ రసాలు సాయంత్రం పూట తాగుతూ వుంటే రక్త పోటు అదుపులో వుంటుంది.

   తాజా పుదీనా          ----- 100 gr
   కరివేపాకు               ----- 100 gr
   కొత్తిమీర                ----- 100 gr

     అన్నింటిని కలిపి దంచి రసం తీసి అది ఎంత వుంటే అంత కలకండ కలిపి కరిగించి చిన్న మంట మీద కాచాలి రసాలన్ని ఇగిరి తీగ పాకం వచ్చే వరకు కాచిదించిచల్లార్చి సీసాలో భద్ర పరచాలిరెండు టీ స్పూన్ల పాకాన్ని అర గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలిదీనితో B.P. నివారింప బడుతుంది  
.  దీనిలో జిలకర పొడిధనియాల పొడి కూడా కలుపుకోవచ్చుదీని వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.

            అధిక రక్తపోటు వలన వచ్చే గుండె సంబంధ సమస్యలు            

1. High B.P. వున్న మనిషిని చొక్కా తీసేసి బోర్లా పడుకోబెట్టాలి.ఒక నూలు గుడ్డ(తుండు గుడ్డ అయినా పరవాలేదుబాగా తడిపిపిండి మెడ దగ్గర నుండి నడుము వరకు పరిచి అద్ది దుప్పటి కప్పి ఉంచాలి.దీని  వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

2. Ice Cubes ను గుడ్డలో వేసి మెడ దగ్గర నుండి నడుము వరకు వెన్నుపూస మీద కాపడం పెట్టాలిదీనిని  కశేరుకా శీతల స్నానం అంటారుదీని వలన అధిక రక్తపోటు అప్పటికప్పుడు అదుపులోకి వస్తుంది.

3. అనులోమవిలోమ ప్రాణాయామాలను 12, 18, 24 సార్లు చెయ్యాలి.

4. చంద్ర భేదన ప్రాణాయామం చెయ్యాలి రెండు వ్యాయామాలను ప్రతి రోజు చేస్తే గుండెపోటు అదుపులో వుంటుంది.

ఆహారం--

       ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసి కూరలో కొన్నిపెరుగు అన్నంలో కొన్ని తింటూ
 వుంటే గుండెపోటు రాదుఉల్లి అతి వేడిని తగ్గిస్తుంది.అతి వేడి వలన గుండెపోటు వస్తుంది . ఉల్లి అధికఅల్ప రక్తపోటు లను నియంత్రిస్తుంది.

     ఒక టీ స్పూను ఉల్లిరసం,మరియు ఒక టీ స్పూను తేనె కలిపి ఆహారానికి ఒక గంట ముందు రాత్రి పూట తీసుకుంటూ వుంటే అధిక రక్తపోటు అదుపులో వుంటుంది.

     అధిక రక్తపోటును నివారించడానికి అనపకాయ రసం                 

    150 గ్రాముల సొరకాయ (అనప కాయముక్కలను కుక్కర్ లో వేసి అర లీటరు నీళ్ళు పోసి ఒక విజిల్రానివ్వాలిగోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి  నీటిని తాగాలిఉదయం పరగడుపున 5,6 రోజులు  మాత్రమే సేవించాలిఒక గంట వరకు ఏమి తినకూడదుదీని వలన రక్తపోటు అతి త్వరగా అదుపులోకి వస్తుంది

రక్తపోటు అదుపులో ఉండాలంటే కాలేయముప్లీహము సమస్థితిలో (సమ ఉష్ణోగ్రతవుండాలి.

అనులోమవిలోమ ప్రాణాయామం చెయ్యాలి.

          అధిక రక్తపోటు సమస్య -- నివారణ                            

కారణాలు:-- మానసికమైన ఒత్తిడికొవ్వు పెరగడంనరాలు కుంచించుకు పోవడం మొదలైనవి.

ఆచరణ :-- నిన్ను నువ్వే సరిదిద్దుకోవాలిసమయ పాలనను పాటించాలిఆసనాలువ్యాయామమ చెయ్యాలి,

ఎండ ఎక్కువగా వున్నపుడు పైత్య ప్రభావం ఎక్కువగా వుంటుందిఅందువలన మధ్యాహ్న సమయంలో

రక్తపోటు ప్రభావం ఎక్కువగా వుంటుంది.

1. పొడవైన నూలు బట్టను చల్లని నీటిలో ముంచి పిండి వెన్నుపూస మీద కప్పాలిఒక క్షణంలో వేడి లాగేసి   B.P. వెంటనే తగ్గుతుంది.

2. చల్లని నీటిలో గిలకలు మునిగే వరకు కాళ్ళను ఉంచాలి.

3. చేతిగుడ్డను నీళ్ళలో ముంచి ముఖం మీద వేసుకోవాలి.

4. ఆరడుగుల నూలు గుడ్డను నీటిలో ముంచి పిండి పక్కటెముకలకు తగిలేట్లు చుట్టాలిదాని మీద పలుచని  పొడి గుడ్డనుదాని మీద మందపాటి గుడ్డను చుట్టాలి.

5. నరాలు బాగా రిలాక్స్ అవ్వాలంటే హాయిగా నేలమీద వెల్లికిలా పడుకొని యోగనిద్రాసనం వేస్తూ శరీరంలోని   ఒక్కొక్క భాగం చాల చల్లబడుతున్నట్లువిశ్రాంతిగా వున్నట్లు భావించాలి.

చిన్న పిల్లలకు కూడా B.P. వస్తుంది.

    ఎవరి ఆలోచనలు వారు తమ అధీనంలో వుంచుకోవాలిఆహార సేవన విధానంసమయాలుపదార్ధాలు మార్చుకోవాలి.

      ప్రతి రోజు శరీరాన్ని తైలంతో మర్దన చెయ్యాలిదీని వలన అల్పఅధిక రక్తపోట్లు ఖచ్చితంగా తగ్గుతాయి.

 విధంగా నలభై రోజులు చేయాలి.

అరకప్పు నాటు ఆవు మూత్రం తాగితే B.P.సులభంగా నియంత్రించ బడుతుంది.

తులసి ఆకుల పొడి
పుదీనా ఆకుల పొడి
కరివేపాకు పొడి
జిలకర పొడి
ధనియాల పొడి

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.ప్రతిరోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్ళు తాగాలి.దీని వలన రక్తపోటు మాత్రమే కాదు అజీర్ణంఅగ్ని మాంద్యంఅరుచి లాంటివన్నీ తగ్గుతాయి.

            అతి కారంఅతి ఉప్పు తిన కూడదుఉప్పును పూర్తిగా మానకూడదుసమంగా వుండాలి.

             అధిక రక్తపోటు --నివారణ                       

    మూత్ర పిండాలు రక్తాన్ని గ్రహించి మలిన పదార్ధాలను ఆయా అవయవాలకు అందిస్తుందిమంచి రక్తాన్ని శరీరానికి అందిస్తాయి.రక్త నాళాలలో కొవ్వు చేరితే రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది.

B. p. లక్షణాలు:-- ఉదయం నిద్ర లేవగానే తూలినట్లుగా వుండడంవాంతి వచ్చినట్లుగా పడిపోతున్నట్లుగా   ఉండడం వంటి లక్షణాలు వుంటాయి.

 128 ఇది సాధారణమైన B. P. 180 ఇది ఎక్కువ B. P.

                   140   /   100
 
  మానసిక ఆందోళనను తగ్గించుకోవాలిబయటి సమస్యలను బయట మర్చి పోయి ఇంట్లో ప్రశాంతంగా  వుండాలి.

పుచ్చ గింజల పొడి
సర్ప గంధ చూర్ణము
త్రిఫల చూర్ణము

           అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలిప్రతి రోజు  ఒక గ్రాము పొడిని తీసుకుంటే
ఎలాంటి B. P.వుండదు       నార్మల్ గా వుంటుంది.

      అతి కొవ్వు వలన వచ్చే అధిక రక్తపోటు --- నివారణ               

తులసి ఆకు
కొత్తిమీర
కరివేపాకు
పుదీనా

     అన్నింటిని సమాన భాగాలు తీసుకుని విడివిడిగా పొడులు చేసి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నోట్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు తాగాలిదీని వలన అధిక రక్తపోటుతగ్గుతుందిదీని వలన రక్తంలో గడ్డ కట్టుకున్న కొవ్వు కరుగుతుంది.

                        అతి కొవ్వు వలన అధిక రక్తపోటుమరియు అల్పరక్తపోటు-- నివారణ
 
ఉల్లిగడ్డ యొక్క నిజ రసం -- రెండు టీ స్పూన్లు
                            తేనె ---రెండు టీ స్పూన్లు

            రెండింటిని కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తూ వుంటే అధిక కొవ్వు వలన వచ్చే
అధిక రక్తపోటు,   అల్పరక్తపోటు నివారింప బడతాయి.
       అధిక రక్తపోటు (Highper Tension) --నివారణ                         

       టెన్షన్భయంఆందోళన ఎక్కువగా పెరుగుతూ వుంటాయిదీని వలన వాతపిత్తకఫాలు ప్రకోపిస్తాయి.
         బిపి పెరగడం వలన శరీరంలో వాతం పెరుగుతుందిఇది తల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.
   మెదడు నాళాలపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందిదీని వలన పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ.
బిపి కి ఎన్ని మందులు వాడినా తల మీద తైల మర్దన తప్పని సరిఇది బిపి ని నియంత్రిస్తుందితలను  రోజుకు రెండు మూడు సార్లు తైలం తో తడుపుతూ వుండాలిముఖ్యంగా నువ్వుల నూనెను పరోక్షంగా  వేడి చేసి అంటుకోవాలిలేదా సుషుప్తి తైలం గానిబ్రాహ్మి తైలం గానిక్షీరబల తైలం గాని అంటుకోవచ్చు. .
నువ్వుల నూనెను నేరుగా వేడి చెయ్యకుండా వేడి నీటి లో పెట్టి వేడి చెయ్యాలి.

              అధిక రక్తపోటు --నివారణ                     

     స్థూల కాయమువారసత్వముశరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా నిర్వహించ బడకపోవడంఆహార వ్యవహార  నియమాలను సరిగా పాటించక పోవడంమానసిక సమస్యలు మొదలైన కారణాల వలన అధికరక్తపోటు ఏర్పడుతుందిమానసిక సమస్యలున్నవాళ్ళకు మందులు సరిగా పనిచెయ్యవు.

జ్యోతిష్మతి గింజల చూర్ణం    --- 25 gr
             తిప్ప తీగ చూర్ణం   --- 50 gr
  సరస్వతి ఆకుల చూర్ణం    ---- 50 gr
            సర్ప గంధ చూర్ణం   --- 50 gr
                 బ్రాహ్మి చూర్ణం  --- 50 gr
                     వస చూర్ణం   --- 50 gr
                               తేనె  --- తగినంత

                       అన్ని చూర్ణాలను కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
          అర టీ స్పూను పొడిలో తగినంత తేనె కలిపి తినాలి విధంగా ఉదయంసాయంత్రం తీసుకోవాలి.
మానసిక సమస్యలు వున్నవాళ్ళకు మందులు సరిగా పనిచేయవుఇతర ఔషధాలు వాడుతున్న ఈ  ఔషధాన్ని కూడా వాడుకోవచ్చుఉప్పు తగ్గించి వాడాలి.

                  అధిక రక్తపోటు                                 

రక్తపు ఒత్తిడినే రక్తపోటు అంటారు. It is a silent killer .

లక్షణాలుకారణాలు :--

కొంతమందిలో తలతిరగడం ముఖ్య కారణంజన్యుపరం కావచ్చుఅధిక బరువు,వ్యాయామం చేయకపోవడంఉప్పు ఎక్కువగా వాడడంఆల్కహాల్ ఎక్కువగా సేవించడం,ధూమపానంమూత్రపిండాలలో సమస్యలుమొదలైనవి

        అన్నింటికంటే ముఖ్యమైనది    రక్తంలో ఎక్కువగా కొవ్వు చేరడం.

                                                    వెల్లుల్లిమునగ క్షీరపానం :--

              వెల్లుల్లి    -- 4, 5 పాయలు
మునగ ఆకులు     --- 10
       ఆవు పాలు    --- ఒక కప్పు
              నీళ్ళు   --- ఒక పెద్ద గ్లాసు

వెల్లుల్లి పాయలనుమునగ ఆకులను కలిపి మెత్తగా దంచి పాలునీళ్ళు కలిపి ఉడికించాలి దీనిని ప్రతి రోజు రాత్రిపూట తాగుతూ వుంటే అధిక రక్తపోటు నివారించ బడుతుంది.

2. తాజా తులసి ఆకులు --- గుప్పెడు (50 gr )
           వెల్లుల్లి పాయలు --- 3

రెండింటిని ముద్దగా నూరి చిన్న ఉండగా చేసి మింగాలి విధంగా ప్రతిరోజు చేయాలి.

సూచనలు :-- ఎత్తుకు తగిన . బరువు వుండాలి. ఉప్పును నియంత్రిచుకోవాలి.  మద్యపానం,  ధూమపానాలను   వదలాలి.  కొవ్వు పదార్ధాలను వాడకూడదు 

      అధికరక్తపోటు      ---    మానసిక సమస్య                           

                తెల్ల మద్ది చెక్క పొడి తో కషాయం  కాచి ప్రతి రోజు తాగుతూ వుంటే కంట్రోల్ అవుతుంది.

                            తెల్ల మద్ది చెక్క పొడి
                                    ఉసిరిక పొడి          
                                      కలకండ

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి భద్రపరచుకోవాలి.
                 ప్రతి రోజు అర టీ స్పూను పొడిని మంచి నీటితో సేవించాలి.
                 కారం,  ఉప్పు తగ్గించి తినాలి.

        రక్తపోటు తగ్గడానికి అర్జున పానీయం

      తెల్ల మద్ది చెక్క పొడి                --- 120 gr
      తులసి ఆకుల పొడి                ---   30 gr
     ఉసిరి పెచ్చుల పొడి                ---   30 gr
     పుదీనా ఆకుల పొడి                ---   30 gr
     చిన్న యాలకుల పొడి               ---   10 gr
                    శొంటి పొడి               ---   10 gr
      అతిమధురం పొడి                 ---  10 gr

      అన్నింటిని  బాగా కలిపి సీసాలో నిల్వ చేయాలి

      ఒక గ్లాసు నీటిని స్టవ్ మీద పెట్టి మరిగేటపుడు ఒక స్పూను నిండుగా పొడి వేసి మరిగించాలి.
  తరువాత దించి పాలు,  కలకండ కలిపి తాగాలి.  దీనిలో తాజా పుదీనా ఆకులను కూడా
  వేసుకోవచ్చు.     మధుమేహం వున్నవాళ్ళు తాటి బెల్లం కొద్దిగా కలుపుకుని తాగవచ్చు.
       దీని వలన ఆకలి పెరుగుతుంది.  రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడుతుంది

               అధిక రక్తపోటు --- నివారణ                              

  30 సంవత్సరాల వయసు దాటిన తరువాత కారణం లేని తలనొప్పి వున్నా,  శరీరం లోని ఏ భాగం
 నుండి అయినా రక్తస్రావం వంటి లక్షణాలు వున్నా దానిని రక్తపోటు గా అనుమానించవచ్చు
j
కారణాలు,  లక్షణాలు :-- వంశపారంపర్య లక్షణాలు, జన్యు పరమైన లక్షణాలు, అధిక బరువు
వ్యాయామం చేయకపోవడం , మద్యం సేవించడం,  రక్త ప్రసరణలో వేగం పెరగడం ( స్ట్రోక్) వంటి
కారణాల వలన  రక్తపోటు వచ్చే అవకాశం కలదు .

       Non Drug Moralities  అనగా తమను తామే నియంత్రించుకోవడం  వలన వ్యాధిని
నియంత్రించవచ్చు .

                సర్పగంధాది చూర్ణం

జటామాంసి వేరు చూర్ణం              --- 20 gr
గ్రందితగరం చూర్ణం                     --- 20 gr
పల్లేరు కాయల చూర్ణం                --- 20 gr
సర్పగంధి వేరు చూర్ణం                --- 20 gr 
   
        అన్ని చూర్ణాలను బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. 

        దీనిలో  "మోతాదు" చాలా ప్రధానమైనది .
ఒక గ్రాము ( స్పూను చివర) చూర్ణాన్ని అర కప్పు వెన్న తీసిన పాలతో గాని, లేదా నీటితో గాని
( ఉత్తమమైనది) లేదా చిటికెడు తేనెతో గాని లేదా నేతితో గాని తీసుకోవచ్చు.

మూలికల ఉపయోగాలు :--

జటామాంసి ఆందోళన ను తగ్గించి మంచి నిద్ర వచ్చేట్లు చేస్తుంది.

             అధిక రక్తపోటు ---నివారణ                                                

తెల్ల మద్ది చెక్క పొడి                     ---- 75 gr
కరక్కాయ పొడి                            ---- 25 gr
జాపత్రి పొడి                                 ---- 25 gr
పల్లేరు కాయల పొడి                      ---- 25 gr
మందార పూల పొడి                      ---- 25 gr
తులసి ఆకుల పొడి                      ---- 25 gr
సునాముఖి పొడి                          ---- 25 gr
తులసి రసం                               ---- తగినంత

       అన్ని చూర్ణాలను  కలిపి కల్వంలో వేసి తగినంత తులసి రసం పోసి నూరి శనగ గింజలంత  మాత్రలు
తయారు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .

       పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి రక్తపోటు   ను  నియంత్రించడానికి

                రక్తపోటు  నియంత్రణకు                              

       మునగ గింజల చూర్ణాన్ని కషాయం కాచి ఉదయం , సాయంత్రం తాగుతూ వుంటే  బి పీ  కంట్రోల్ అవుతుంది

             అధిక రక్తపోటు  --- నివారణ                     

                        ఇది రాబోయే వ్యాధులకు మూలం .
       
        రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను మెంతులను వేస్సి నానబెట్టాలి .  ఉదయం పరగడుపున  నీటిని మాత్రమె తాగాలి .  ఈ విధంగా రోజులు చేస్తే  B . P కంట్రోల్ అవుతుంది

                         B . P.                                

  తులసి కాండాన్ని పూసలుగా తయారు చేసి రాగి తీగ తో చుట్టి  మూడు చుట్లు మేడలో మాలగా ధరించాలి వేసుకోవాలి .
దీనితో B . P . ఎప్పటికి కంట్రోల్ లో వుంటుంది .

తులసి దళాలు
కొత్తిమీర
కరివేపాకు
పుదీనా
          అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని  చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
          ప్రతిరోజు ఒక టీ స్పూను పొడిని అన్నంలో కలుపుకొని తినాలి .

                                                            
       తెల్లవారు జామున  4 గంటలకు నిద్ర లేవాలి .   రాత్రి పడుకునే ముందు  ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దానిలో  3, 4 తులసి దళాలను వేసి చెక్క పీట మీద పెట్టాలి .  నేల  మీద పెట్టకూడదు . ఉదయం ఆ నీటిని తాగాలి .

       ఉదయం స్నానానికి  అరగంట , గంట ముందు శరీరాన్ని నేతితో గాని , ఆముదము తో గాని మర్దన చేయాలి .
దీనివలన శరీరం లోని వేడి తగ్గుతుంది .

      సూర్యభేదన ప్రాణాయామం  12  సార్లు చేయాలి .  మరియు శీతలీ ప్రాణాయామం చేయాలి . దీనితో కళ్ళు తిరగడం
తగ్గుతుంది .

     మందముగా వున్న బట్టను నీటిలో ముంచి గట్టిగా పిండాలి . దానిని పొడవుగా మడవాలి . రోగిని బోర్లా పడుకోబెట్టి
ఆ తడి బట్టను ముచ్చెన గుంట నుండి వెన్నుపూస చివరివరకు పరచాలి దీనిని కశేరుక పట్టు అంటారు .దీనిని  15 నిమిషాలు ఉంచాలి . ఈ విధంగా రెండు పూటలా చేయాలి .

    పాదాలను చల్లటి నీటిలో పెట్టుకుని కుర్చీలో కూర్చుంటే  10 నిమిమిషాలలో  అధిక రక్తపోటు నియంత్రణ లోకి వస్తుంది .

    ఉదయం , సాయంత్రం ఉల్లిపాయలను తింటూ ఉంటే అల్ప , అధిక రక్తపోటు లు నియంత్రణలోకి వస్తాయి .

సూచనలు :--- ఉప్పుకు బదులుగా  సయింధవ లవణం  వాడాలి .పచ్చి మిర్చి  వాడకూడదు . మిరప్పొడికి బదులుగా
మిరియాల పొడి వాడాలి . మరీ పాత చింతపండును వాడడం మంచిది .టమాటాలు ఎక్కువగా వాడుకోవాలి
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
                 *సభ్యులకు విజ్ఞప్తి*
     ************-******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

   


      



   















కామెంట్‌లు లేవు: