6, జులై 2020, సోమవారం

నడుము నొప్పి ఎక్కువగా ఉంటే రోజు క్రమం తప్పకుండా ఈ ఆసనాలు వేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.అవగాహనా కోసం ఆయుర్వేదం లో నవీన్ మడిమింటి సలహాలు



           ఆధునిక సమస్యలు.. రెండు! సనాతన పరిష్కారం.. ఒకటి! నేటి తరం ఆధునిక మానవులను వేధిస్తున్న అతిపెద్ద సమస్యలు రెండు. నడుము నొప్పి, మెడ నొప్పి. రోజంతా ఇంటి పనితో సతమతమయ్యే గృహిణుల నుంచి రేయింబవళ్లు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుండే ఐటీ ఉద్యోగుల వరకూ ఎవరిని పలకరించినా ఇదే గోడు. నిజానికి ఆధునిక కాలంలో అందర్నీ వేధిస్తున్న ఈ సమస్యలకు.. మన సనాతన యోగ విధానంలో సమర్థమైన పరిష్కారం ఉండటం విశేషం. రోజూ ఉదయాన్నే ఓ పావు గంట సమయం వెచ్చించి.. పద్ధతి ప్రకారం కొన్ని యోగాసనాలు సాధన చేస్తే చాలు.. ఈ వెన్ను బాధలు రెండూ తొలగిపోతాయి. అందుకే వీటికి సంబంధించిన ప్రత్యేక యోగాసనాలను మీ ముందుకు తెస్తోంది 
• మర్చరీ ఆసనం!

నడుము నొప్పి మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఈ నొప్పి మొదలైతే చేసే పని మీద దృష్టి ఉండదు.  మర్చరీ ఆసనం వేయడం వల్ల నడుముకు ఉపశమనం లభించి నొప్పి తగ్గుముఖం పడుతుంది.
ఆసనంతో నొప్పులు మాయం
దీర్ఘకాలంగా తలనొప్పి,నడుము నొప్పిలతో బాధపడుతున్నారా?అయితే  ఈ ఆసనం ద్వార..ఆ నొప్పులను సులభంగా ఉపశమనం పొందవచ్చంటున్నారు యోగా నిపుణులు.
ప్రసరిత పాదోత్తానాసనం
కాళ్లను దగ్గర ఉంచి నిలబడాలి.గాలి పీల్చుకుంటూ కాళ్లను దూరంగా జరపాలి.ఇప్పుడు నడుము దగ్గర నుంచి శరీరాన్ని ముందుకు వంచి చేతి వేళ్లను నేలకు ఆన్చాలి.మెల్లగా తలను కూడా నేలకు తాకేలా వంగాలి. ఇప్పుడు చేతులను తల పక్కనుంచి ముందుకు చాచి ఇదే స్థితిలో 45 సెకన్ల పాటు ఉండాలి.నెమ్మదిగా చేతులను వెనక్కి తీసుకొచ్చి తలను పైకి లేపి యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు :
-నడము నొప్పి తగ్గుతుంది.
-అలసట వల్ల వచ్చే తలనొప్పి తగ్గితుంది.
-వెన్నెముక, కాలి కండరాలు శక్తివంతం అవుతాయి.
లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు చే

సీటుబంధా స నం ఈ ఆసనం నడుము నొప్పి తగ్గిస్తుంది కాళ్ళు దృఢంగా ఉంటాయి ఈ ఆసనం 2 సార్లు 3 సార్లు చేయండి కపిల మహర్షి యోగా కేంద్రం..

న‌డుము నొప్పికి ఆయుర్వేదం నవీన్ సలహాలు 


న‌డుము నొప్పికి వంటింటి చిట్కాలు

న‌డుము నొప్పి వ‌చ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివార‌ణ కొరకు మందులు వాడ‌డం నేడు అధిక‌మైపోయింది.

న‌డుము నొప్పి వ‌చ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివార‌ణ కొరకు మందులు వాడ‌డం నేడు అధిక‌మైపోయింది. ఈ క్రమంలో వాటి వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్‌ల‌ను గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే అలాంటి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌ని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని స‌హ‌జ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు. న‌డుము నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.
 
* ఒక కప్పు పాలలో తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు.


* నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు.


* తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు.


 రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకూ మరిగించాలి. వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.


* నొప్పి ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.


* రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండు త్రాగండి నొప్పి తగ్గింది 

2.-నడుం నొప్పికి ఆయుర్వేద వైద్యం

నడుము నొప్పి సమస్యతో సతమతమయ్యేవారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బందిపెడుతుందో తెలుస్తుంది. ఈ నడుం నొప్పిని భరించడం చాలా కష్టమవుతుంటుంది. అయితే ఆయుర్వేద వైద్యంలో నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.

పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్థ బాగా ఉపకరిస్తాయి. నడుము నొప్పితో బాధపడేవారు వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు. లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున తాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడు పెట్టాలి నొప్పి తగ్గింది 






  1. ఆయుర్వేద వైద్యంలో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. 
    * ప్రతి రోజూ 10 చుక్కలు వెల్లుల్లి రసం పావు గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుం నొప్పి తగ్గుతుంది
    * అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణ కోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. 
    * ఆవనూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడినీళ్ళతో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. 
    * పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్థ బాగా ఉపకరిస్తాయి. 
    * నడుము నొప్పితో బాధపడేవారు... వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువుగా తీసుకోవడం మంచిది కాదు. 
    * లావుగా ఉన్నవారికి నడుం నొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మ రసం పోసి పరగడుపున తాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. 
    * ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది

  2. మీ నవీన్ నడిమింటి 
  3. విశాఖపట్నం 
  4. 9703706660

కామెంట్‌లు లేవు: