3, జులై 2020, శుక్రవారం

మంచి ఆరోగ్యం గా ఉండటానికి జనరల్ టానిక్ మరియు ఏ వ్యాధి రాకుండా, సర్వ రోగ నివారినికి, ఇమ్మ్యూనిటి పెంపుదలకుఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు

సర్వ రోగ నివారిణి ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 

    సర్వ రోగ  నివారిణి  
 
                          తిప్ప తీగను అమృత లత అంటారు.తీగ యొక్క ఆకులను తొలగించి తీగను మాత్రం ముక్కలు చేసి ఎండ బెట్టి,దంచి, పొడి చెయ్యాలి. 
 
     తిప్ప తీగ పొడి      ------------- 150 gr
    పాత బెల్లం           -------------    50 gr
    తేనె              ------------- 100 gr.
    నెయ్యి           -------------   50 gr 
 
      పొడిని కల్వం లో వేసి బెల్లం వేసి బాగా నూరాలి. తరువాత తేనె, నెయ్యి కలిపి నూరాలి.లేహ్యం తయారవుతుంది,దీనిని సీసాలో భద్రపరచుకోవాలి.ఉదయం, రాత్రి భోజనానికి గంట ముందు లేహ్యం చప్పరించి  నీళ్ళు తాగాలి .5 గ్రాముల నుండి ప్రారంభించి 10 గ్రాముల వరకు పెంచాలి.
 
ఉపయోగాలు :--  నేత్ర వ్యాధులు,గుండె సంబంధ వ్యాధులు,కాలేయ,మూత్ర  పిండాల,మూత్ర సంబంధ వ్యాధులు  నివారింప బడతాయి. రక్తం చెడిపోయి ,చర్మవ్యాధులు వచ్చిన వాళ్ళు వాడితే నివారింప బడుతుంది.విష జ్వరాలను తగ్గిస్తుంది.వ్యాధినిరోధక శక్తిని యిస్తుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.శారీరక దృఢత్వాన్ని శారీరక బలాన్నిస్తుంది.
       తులసితో కాయ కల్పం                                                
     మన ఇంటి పెరట్లో ఈశాన్య మూల పంచగవ్య పదార్ధాలను చల్లి తులసిని పెంచాలి. గోళ్ళు గాని, చిటికెన వేలు గాని, చూపుడు వేలు గాని, తులసికి తగలకుండా మిగిలిన మూడు వేళ్ళతో మాత్రమే  5 ఆకులను గిల్లుకొని సూర్యుని కెదురుగా నిల్చుని తినాలి. ఈ విధంగా ఒక సంవత్సరం రోజులు తింటే ఎప్పటికి ఎలాంటి వ్యాధులు రావు. 
       సర్వ రోగనివారిణి--ద్రాక్ష  రసాయనం 
 
ఎండుద్రాక్ష          ----100 gr
అతిమధురం(యష్టిమధుకం )  పొడి   --- 100 gr 
 
      రెండింటిని రోట్లో వేసి బాగా దంచి, నూరాలి దీనిని సీసాలో భద్ర పరచుకోవాలి. 
 
      20 గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించి పాలు తాగాలి. ఈ విధంగా 40 రోజులనుండి 60 గాని 100 రోజులు గాని వాడాలి బ్రహ్మచర్యం పాటించాలి. 
 
      దీనిని వాడడం వలన చర్మ దోషాలు, మూత్ర దోషాలు, వీర్య దోషాలు తొలగించ బడతాయి. శరీరానికి  తేజస్సు నిస్తుంది. 
 
      అతి మధురంలోని చిరుచేదు  ఎన్నో సుగుణాలను కలిగి వున్నది. 
 
      సంతానం లేని పురుషులకు వీర్యవ్రుద్ధి జరిగి సంతానం కలుగు తుంది. స్త్రీలు కూడా వాడాలి. 
 
     విద్యార్ధులు దీనిని వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 
 
     హిస్టీరియా తగ్గుతుంది. 
 
     దాహం, బలహీనత తగ్గుతాయి. 
 
     32  ఎండుద్రాక్ష పళ్ళను రాత్రి నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకొని వాటిని ఒక్కొక్కటిగా తిని   ఆ నీటిని తాగాలి. దీని వలన  అల్ప రక్తపోటు (Low B.P. ), అలజడి, భయం లాంటివి తొలగిపోతాయి. 
 
ద్రాక్స రసాయనం  ఋతు క్రమం లో అతిగా నెలకు రెండు సార్లు పీరియడ్స్  వచ్చే వాళ్లకు సక్రమంగా వచ్చేట్లు చేస్తుంది.                                        
                                                             
 
       పండిన మర్రి పండ్లు, లేక మేడి, లేక జువ్వి, లేక రావి లేక అన్నిగాని లేదా ఒకటైనా గాని ముక్కలు చేసి ఎండబెట్టాలి. వాటిని కుండలో పోసి అవి మునిగే వరకు తేనె పోయాలి. బాగా కలియబెట్టి దానికి  గుడ్డను కట్టి 40  రోజులు కదిలించకుండా తాకకుండా ఒక మూల ఉంచాలి. 
 
      తరువాత ఉదయం సాయంత్రం 10 గ్రాముల చొప్పున తీసుకోవాలి. 
 అపామార్గ పత్రం (ఉత్తరేణి) :--- ఉత్తరేణి (సర్వ రోగ నివారిణి) 
బొటానికల్ నేం : -అఖిరాంథస్ ఆస్పరా ( Achyranthes aspera ); ఆంగ్లం: Prickly Chaff Flower  
సంస్కృతం: अपामार्ग; అమరాంథేసి కుటుంబానికి చెందినది.

* ఉత్తరేణి ఆకుల రసం ---
-- కడుపునొప్పికి,
-- అజీర్తికి,
-- మొలలకు, 
-- ఉడుకు గడ్డలకు,
-- చర్మపు పొంగుకు 
-- జీర్ణకారి. 
-- శరీరములో క్రొవ్వును కరిగిస్తుంది.
-- కడుపుబ్బరానికి 
-- కడుపులో నులి పురుగులకు
-- దగ్గు, ఉబ్బసంకి  మంచి మందుగా ఉపయోగపడుతుంది. 

* దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు గట్టిపడతాయి. 
* ఆకుల రసం గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది.
*  ఆకుల రసం దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలుతుంటే అరికడుతుంది.
* ఆకుల రసం లేదా ముద్ద, కందిరీగలు, తేనెటీగలు కుట్టినప్పుడు పూస్తే నొప్పి, దురద  తగ్గుతుంది.
* నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వును కరిగిస్తుంది.

* ఉత్తరేణి గింజల చూర్ణం + ఉప్పు + పటిక పొడి + వంట కర్పూరం = పంటి నొప్పులు , చిగుల్ల నుండి రక్తం కారటం , జిన్జివిటిస్
* సమూల చూర్ణం (లేదా) మొక్క కాల్చిన చూర్ణం + ఆముదం = గజ్జి, తామర
* సమూల చూర్ణం (లేదా) మొక్క కాల్చిన చూర్ణం + తేనె = ఉబ్బసం, దగ్గు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం, గుండె జబ్బులు.
* సమూల చూర్ణం (లేదా) మొక్క కాల్చిన చూర్ణం + మజ్జిగ = రక్త విరేచనాలు
* సమూల చూర్ణం (లేదా) మొక్క కాల్చిన చూర్ణం + ఆవు నెయ్యి = పౌరుష గ్రంథి వాపు 
* సమూల చూర్ణం (లేదా) మొక్క కాల్చిన చూర్ణం + మిరియాల పొడి = చర్మ వ్యాధులు
       ఇది సర్వ రోగ నివారిణి .
 
    సర్వరోగ నివారిణి ---దధి అమృతం
                                        
రెండు రోజుల పాటు నిల్వ ఉంచిన పెరుగు  ---- 4 శేర్లు        1 శేరు  =  800 గ్రాములు
        కలకండ పొడి       ---- 480 gr
        నెయ్యి     -----  30 gr
       మిరియాల పొడి     ----  50 gr
       ఏలకుల పొడి        ----  30 gr
      నాగ కేసరాల పొడి          ----    5 gr 
 
         పై పదార్ధాలను పెరుగులో  వేసి బాగా పరిశుభ్రమైన చేతితో కలపాలి.  తరువాత పలుచని నూలు గుడ్డలో  వడకట్టాలి.  దానిలో రెండున్నర గ్రాముల పచ్చ కర్పూరం కలపాలి.  దీనిని జాడీలో నిల్వ చెయ్యాలి. 
 
       దీనిని ప్రతి రోజు ఒక గ్లాసు తాగుతూ వుంటే  ఆకలి బాగా అవుతుంది. బలం కలుగుతుంది. సర్వరోగ నివారిణి, సంపూర్ణ ఆయుష్షు నిస్తుంది. 

      శరీర స్థౌల్యము కలుగుతుంది. అధిక బరువు, కొవ్వు తగ్గి శరీరము నాజూగ్గా తయారవుతుంది.
 
        దీనిని ఏ కాలం లోనైనా  ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. 

           సర్వరోగ నివారిణి                                                 

       దీనిని  365 రోజులకు సరిపడా తయారు చేసుకోవాలి. 

         వేపపువ్వు                     --- 180 gr  (రోగాలను తొలగించి, రాకుండా చేస్తుంది)
        సైంధవ లవణం               ---   30 gr 
        ఇంగువ --- 30 gr( ఆవు నేతిలో వేయించాలి) 
        మిరియాల పొడి             ---   40 gr 
        జిలకర  పొడి                 ---   40 gr 
        వాము పొడి                ---   40 gr 

     మిరియాలను, జిలకరను, వామును  శుద్ధి చేసి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేయాలి. 

      అన్నింటిని కల్వంలో వేసి నూరి 365 మాత్రలు తయారు చేసుకోవాలి. బాగా ఆరబెట్టి నిల్వ
 చేసుకోవాలి. 

      ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక మాత్ర చొప్పున వాడాలి. 

      ఈ విధంగా వాడడం వలన సంవత్సరమంతా ఎటువంటి వ్యాధులు దరి చేరవు. 

     సర్వ రోగ నివారిణి --- అమృత మిత్ర                                     

కుంకుడు కాయల బెరడు పొడి--- 50 gr
కరక్కాయల బెరడు పొడి   ---- 50 gr
               తేనె ---- తగినంత

     రెండింటిని కల్వం లో వేసి  తగినంత తేనె కలిపి మెత్తగా నూరాలి . బటాణి  గింజంత  (3 గ్రాములు ) మాత్రలు
తయారు చేసుకోవాలి ..  లేకుండా ఆరిన తరువాత నిల్వచేసుకోవాలి .

     ఆహారానికి  గంట ,ముందు  ఒక మాత్ర వేసుకోవాలి .

ఉపయోగాలు :---  పాండు రోగాన్ని పోగొట్టి రక్శాన్ని శుద్ధి చేస్తుంది . పొట్ట నిండా నీరు నిండి వున్నా ( ప్లీహ వృద్ధి)తగ్గిస్తుంది ..  చెడు నీరు తొలగించబడుతుంది  చర్మరోగాలు నివారింపబడతాయి . మొలలు కూడా నివారింపబడతాయి

ఇది తాగండి... స‌ర్వ రోగ నివారిణి, మీరే న‌మ్మ‌నంత ఛేంజ్

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాట‌న్నింటికీ స‌ర్వ‌రోగ నివార‌ణి ఆయుర్వేదంలో ఒక‌టి ఉంది. దీనిని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవ‌చ్చు కావాల్సిన‌వి: 250 గ్రాముల మెంతులు. 100 గ్రాముల వాము. 50 గ్రాముల నల్ల జీలకర్ర.


మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాట‌న్నింటికీ స‌ర్వ‌రోగ నివార‌ణి ఆయుర్వేదంలో ఒక‌టి ఉంది. దీనిని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవ‌చ్చు
కావాల్సిన‌వి:
250 గ్రాముల మెంతులు.
100 గ్రాముల వాము.
50 గ్రాముల నల్ల జీలకర్ర. 
 
తయారు చేయు విధానము : పై మూడు పదార్దాలను శుభ్రం చెయ్యండి. వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి. గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోండి.  
 
వాడే విధానం :
ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం(పొడి)ని కలిపి తాగండి. 

వేడి నీళ్ళలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి.
ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు.
అన్ని వయసుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణంని సేవించవచ్చు.
ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి. 
80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావ‌డాన్ని మీరు గమనించగలరు. 
అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది.
రక్తం శుభ్రపడుతుంది. మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. 
శరీరంపై ఉన్నముడతలు తగ్గుతాయి. 
శరీరం బలంగా, చురుకుగా, ప్ర‌కాశవంతంగా త‌యార‌వుతుంది. 
 
దీనివ‌ల్ల మ‌రిన్ని ప్రయోజనాలు...
1. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్ని త‌గ్గిపోతాయి. 
2. ఎముకలు బలంగా తయారవుతాయి. 
3. కంటి చూపు మెరుగవుతుంది. 
4. జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. 
5. మల బద్దకం శాశ్వతంగా నివార‌ణ అవుతుంది. 
6. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. 
7. దీర్ఘ కాలిక దగ్గు నివార‌ణ‌. 
8. గుండె పనితీరు మెరుగవుతుంది. 
9 . మీరు చలాకీగా త‌యార‌వుతారు. 
10. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 
11. వినికిడి శక్తి పెరుగుతుంది. 
12. గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్ప్రభావాలను ఇది క్లియర్ చేస్తుంది. 
13. రక్త శుద్ది జరుగుతుంది. 
14. అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి. 
15. పళ్ళు చిగుళ్ళు బలంగా తయారవుతాయి. 
16. మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. 
17. రెండు లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు.  
 
గమనిక : నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే, 15 -20 రోజులు ఆపి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: