పిల్లలకు ఆకలి వేయకపోవడానికి గల కారణం 

దాదాపు ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన పిల్లల గురించి చెప్పే మొదటి కంప్లయింట్ “తిండి సరిగా తినట్లేదు” అని. ఇది కేవలం కంప్లయింట్ కాదు, చాలా ఇళ్ళల్లో పిల్లలు ఇలానే ఉంటున్నారు. పిల్లలు ఆటలకే పరిమితం అవుతారు తప్ప తిండి మీద ధ్యాస పెట్టరు. కొందరికైతే అస్సలు ఆకలి వేయదు. మరి అలాంటి చిన్నారుల విషయంలో ఏం చేయాలో తెలుసా! వారికి ఆకలి ఎందుకు వేయట్లేదు ? దీని వెనుక ఒకటి రెండు కాదు, చాలా కారణాలే ఉన్నాయి. మీ పిల్లలు ఏ కారణంతో సరిగా తినట్లేదో ఇప్పుడు తెలుసుకోండి.


  • ఆకలి పెంచే క్రమంలో ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా తృణధాన్యాలూ, పెరుగూ, పండ్ల వంటి వాటితో చేసిన వివిధ పదార్థాలను ఎంచుకొని వారికి అందించండి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందిస్తూనే క్రమంగా ఆకలిని పెంచుతాయి.
  • వాళ్లకు ఎప్పుడు పెట్టే ఆహారమే రోజూ పెడుతూ ఉంటే కూడా తిండి మీద ధ్యాస తగ్గుతుంది. కాబట్టి ఆసక్తికరమైన వంటకాలు చేస్తూ ఉండాలి. నూనె ఎక్కువగా వాడిన ఆహరం పెట్టవద్దు. ఫ్యాట్స్ ఎక్కువగా శరీరంలో పడ్డాక, మరో పూట ఆకలి సరిగా వేయదు.
  • చిన్నారులకు ఆహారాన్ని అందించే వేళల్ని క్రమబద్ధం చేసుకోండి. మీ పని పూర్తవడాన్ని బట్టో లేక ఓ పనైపోతుందనో భావించి చేయొద్దు. ఇలాంటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టేయడం వల్ల వారికి అన్నం తినడం మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. జీర్ణశక్తీ మందగిస్తుంది. అందుకే విసుగనుకోకుండా కొద్దికొద్దిగా అన్నం తినేలా చూడండి.
  • పిల్లలు సాయంత్రం సమయంలో కనీసం ఒక గంట ఆరుబయట ఆడుకునేలా చూడాలి. కుదిరితే మీతో పాటూ వ్యాయామానికీ తీసుకెళ్లాలి. దానివల్ల ఆకలిని పెంచే హార్మోన్లు సమతుల్యమవుతాయి. బాగా ఆకలీ వేస్తుంది.
  • చిరుతిండిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కచ్చితంగా ఫలానాదే తినాలి… అంటూ నియమ నిబంధనలు విధించొద్దు. వారి ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ తయారు చేయండి. రోజూ చేయాలంటే ఇబ్బంది కాబట్టి వారానికోసారి చేసి నిల్వ చేయండి.
  • కొందమంది పిల్లలు బయటకి ఎక్కువగా వెళ్ళరు. ఇంట్లోనే టీవి, కంప్యుటర్, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంటారు. ఇలాంటి పిల్లలకు క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. కాబట్టి పిల్లలు బయటకి వెళ్ళి ఆటలు ఆడకునేలా ప్రోత్సహించండి.
  • అరటి పండ్లూ, నట్స్, చీజ్, పాప్‌కార్న్ వంటివి ఎదిగే పిల్లలకు అవసరం. అలా అని స్నాక్స్ భోజనానికి ప్రత్యామ్నాయం కాదు. ఎదిగే పిల్లలకు కార్బోహైడ్రేట్లూ, పీచూ తగిన మోతాదులో అవసరం. చిన్న పిల్లలకి ఆహారాన్ని వీలైనంత వరకూ వేడిగా ఉన్నప్పుడే తినిపించే ప్రయత్నం చేయండి. దీనివల్ల త్వరగా జీర్ణమవుతుంది. తిరిగి ఆకలి వేస్తుంది.

ఆకలి కావడానికి పిల్లలు కు పెద్దవాళ్ళు కు ఆయుర్వేదం నవీన్ సలహాలు 

               సున్నిత శరీరులకు ఆకలి కావడానికి --- కాశ్యపలేహ్యం              
 
జిలకర పొడి  ------- 100 gr
కలకండ పొడి ------- 100 gr
ఆవు నెయ్యి ------- 100 gr 
 
    జిలకరకలకండలను మెత్తగా దంచి జల్లించాలిఉండలు లేకుండా చూసుకోవాలిరెండింటిని కలపాలి.
 
ఒక గిన్నెలో నెయ్యి పోసి స్టవ్ మీద పెట్టి వేడిచెయ్యాలి.పాత్రను దించి పొడిని కలపాలిఒకరు వేస్తూవుంటే  మరొకరు కలిపితే మంచిదిపొడి మొత్తం బాగాకలిసే విధంగా బాగా కలియ బెట్టాలి.కొంచం సేపు గాలికిఉంచితే  గట్టి పడుతుందిగాజు సీసాలో భద్రపరచుకోవాలి.తడి తగలకూడదు
 
పిల్లలకు           ---- పావు టీ స్పూను
పెద్దలకు           ---- ఒక టీ స్పూను
చిన్న పిల్లలకు ----- 2,3 చిటికెలు 
 
ఆహారానికి ఒక గంట ముందు వాడాలి.
 
ఇది ఆకలి మందగించిన వారికి బాగా ఆకలికలిగిస్తుంది. పైత్యాన్ని  తగ్గిస్తుందిఆకలి తగ్గిన పిల్లలకుపైత్యం ప్రకోపించిన వారికి ఇది బాగా పని చేస్తుంది.

                             అగ్ని మాంద్యాన్ని పోగొట్టేకారప్పొడి                         

జిలకర పొడి                          ---- 20 gr
మెంతుల పొడి                       ---- 20 gr
ఇంగువ పొడి                          ---- 5 gr
ఎండు మిర్చి పొడి                 ---- 40 gr
ఉప్పు లేక సైంధవ లవణం          --తగినంత

జిలకరనుమెంతులను దోరగా వేయించాలి.
 ఇంగువను పొంగించాలి.

అన్నింటిని కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.

  పొడిని అన్నం లో కలుపుకొని నెయ్యి వేసుకొని తినాలి.

దీని వలన బాగా మందగించిన జటరాగ్ని పెరిగి  ఆకాలిబాగా అవుతుంది

                                                 .జీర్ణ శక్తినిపెంచడానికి                        

    శీతా కాలంలో శరీరంలో కఫం చేరి అది జీర్ణ కోశంలోగడ్డలుగా చేరిపోయి ఆకలి మందగిస్తుంది 

 .నీళ్ళలో ఉప్పు కలిపి గొంతులో పోసుకొని త్రాగాలితరువాత వ్రేళ్ళు పెట్టి వాంతి చేస్తే కఫం బయటకు వస్తుంది.

శొంటికరక్కాయల బెరడు
సైంధవ లవణం
పిప్పలి కట్టె
వాము

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని ఒక్కొక్క దానినివిడివిడిగా దోరగా వేయించాలి. ( సైంధవ లవణంతప్ప ) దంచిజల్లించికలిపి నిల్వ చేసుకోవాలి.

   భోజనం తరువాత పెద్దలు ఐదు గ్రాములుపిల్లలు రెండుగ్రాముల పొడిని గోరు వెచ్చని నీటితో సేవిస్తే  చాలా త్వరగాసులభంగా జీర్ణమవుతుందిచాలా బాగా ఆకలిఅవుతుందిఅన్నం చూస్తే సహించని వాళ్లకు     ఇది చాలాబాగా పని చేస్తుంది
 
    ఆహారం బాగా జీర్ణంకావడానికి                           
 
అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి సైంధవ లవణం కలిపితీసుకుంటే జీర్ణ శక్తీ పెరుగుతుంది 

                                           కలినిపెంచే  లింగ్వాష్టకం                  

శొంటి పొడి                        ---- 50 gr
పిప్పళ్ల పొడి                      ---- 50 gr
జీలకర్ర                             ---- 50 gr
వాము                              ---- 50 gr
సైంధవ లవణం                   ---- 50 gr
,మిరియాల పొడి                ---- 50 gr
నల్ల జిలకర పొడి                ---- 50 gr
పొంగించిన ఇంగువ పొడి       ---- 50 gr 
 
     అన్నింటిని విడివిడిగా వేయించి దంచి జల్లించిచూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలివారానికి ఒక సారి తయారు చేసుకుంటే మంచిదిచూర్ణాన్ని వేడినీటితో గానిమజ్జిగతో గాని లేక అన్నంలో మొదటి  ముద్దలో కలుపుకొని గాని తీసుకోవచ్చు
 
వేడి చేస్తే మజ్జిగతో తీసుకుంటే మంచిది
 
     దీనిని వాడడం వలన కీళ్ళనొప్పులుఒల్లునోప్పులుఆకలి మందగించడంకడుపులో నొప్పిఅజీర్ణం   కూడానివారించ బడతాయి
 
    అజీర్ణాన్ని నివారించి ఆకలినిపెంచడానికి                    

ఎండబెట్టిన కరివేపాకు   ---- 50 gr
ధనియాలు                 -----50 gr

        విడివిడిగా పొడి చేసి రెండు కలిపి దానికి ఉప్పుకారంకలిపి అన్నంలో కలుపుకొని గాని 
మజ్జిగలో కలుపుకొని గాని తీసుకోవచ్చు

  ఆకలి పెరగడానికి -- అగ్నిముఖచూర్ణం                   

ఇంగువ                       --- ఒక గ్రాము
వస                            --- రెండు గ్రాములు
పిప్పళ్ళు                    --- మూడు   "
శొంటి                         --- నాలుగు  "
వాము                       --- ఐదు       "
కరక్కాయ                  --- ఆరు       "
చిత్ర మూలం               --- ఏడు      "
చంగల్వ కోష్టు             --- ఎనిమిది "

   ఇంగువను బాణలి లో ఆవు నెయ్యి వేసి పొంగిస్తే శుద్ధిచేయబడుతుంది.అన్నింటిని చూర్ణాలుగా
 చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.2 గ్రాముల నుండి 4 గ్రాముల వరకు వాడ వచ్చు.

 దీనిని నోట్లో వేసుకుని మజ్జిగ తాగాలి.

        ఆహారం తిన్నతరువాత బాగా జీర్ణమవుతుందిఆకలిలేని వాళ్ళు తీసుకుంటే బాగా జీర్ణమవుతుందిఆహారానికిముందుతీసుకుంటే అరగంటకే బాగా ఆకలవుతుంది

    అగ్ని మాంద్యము తొలగి ఆకలికావడానికి                      

అర్క క్షారం  సమస్య శారీరకమానసిక ఆందోళనలవలన ఏర్పడుతుంది.

  జిల్లెడును సమూలంగా తెచ్చి నీడలో ఆరబెట్టాలిమూడునాలుగు రోజుల తరువాత దానిని కాల్చాలి.దానివలన వచ్చే బూడిదను సేకరించుకోవాలి.

జిల్లేడు బూడిద ---- ఒక కిలో
నీళ్ళు              ---- 16 రెట్లు

 ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో జిల్లేడు బూడిదనువేయాలి
ప్రతి రెండు మూడు గంటల కొకసారి కలియబెడుతూవుండాలి.
 మూడవ రోజు పై తేట నీటిని వంచుకోవాలి
 తేట ను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టిపూర్తిగా తేమఇంకి పోయే విధంగా సన్న మంట మీద కాచాలిచివరగాఉప్పు లాంటి పదార్ధం మిగులుతుంది." దీనిని చిన్నపిల్లలకు వాడకూడదు 

"చిటికెడు పొడిని పెద్దలు ఉదయంసాయంత్రం నీటితోగానిమజ్జిగతో గాని తీసుకుంటే ఆకలి బాగాఅవుతుంది.

   ఆకలి లేమి --- అగ్నిమాంద్యం                       

      నిద్ర సగం రోగాలను పోగోడితే ఆకలి అన్ని రోగాలనుపోగొడుతుంది.

ఆయుర్వేద శాస్త్ర ప్రకారము నిద్రలేమిఆకలి లేమిప్రదానమైనరోగాలు.                                                                    1. కామెర్ల వలన ఆకలి వుండదురోగం వలన సమస్యసమస్య వలన రోగంవుంటాయి.                                              2. ఆకలిలేకపోవడం వలన నిద్రలేమిరక్త లేమి ఏర్పడతాయి.చిత్రాదివటి, ద్రాక్షారిష్ట వీనిలో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు

ఏక మూలికా వైద్యం :--చిత్ర మూలం పొడిని మాత్రమేసేవిస్తే విరేచనమవుతుందిబాగా ఆకలవుతుందిఎక్కువతీసుకుంటే వేడిచేస్తుంది.అర టీ స్పూను చిత్రమూలంపొడిని బెల్లం తో కలిపి తీసుకుంటే సరిపోతుంది.

చిత్రమూలం            ---- 100 gr
శొంటి                    ---- 100 gr 
grధనియాలు           ---- 50 gr
అడ్డసరం ఆకు చూర్ణం ---- 25 gr
తిప్ప తీగ కాదా పొడి ----- 25 gr
నెల వేము                ---- 25 gr
కతుక రోహిణి            ---- 25 gr

  అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి పెట్టుకోవాలిదీనిని కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి శనగగింజలంతమాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

  ప్రతి రోజు ఉదయంసాయంత్రం పూటకు రెండు మాత్రలచొప్పున ఆహారం తరువాత వేసుకోవాలి.
 దీని వలనబాగా ఆకలి అవుతుంది

.     ఆకలిని పెంచేగుళికలు                              

.లేత వేప చిగుళ్ళు      --- 20 gr
పాత బెల్లం                ----20 gr

       రెండింటిని కల్వంలో వేసి మెత్తగా నూరాలిశనగగింజలంత గోలీలు చేసి బాగా గాలి తగిలేచోట నీడలోఆరబెట్టాలి.తేమ లేకుండా ఆరిన తరువాత నిల్వచేసుకోవాలి .రాత్రి నిద్రించే ముందు ఒక మాత్ర వేసుకునినీళ్ళు తాగాలి విధంగా 40 రోజులు చేస్తే కాలేయముప్లీహము కాపాడబడతాయిరక్తం శుద్ధి చేయబడుతుంది మందును వాడేటపుడు అతి పులుపుఅతి కారం అతితీపి పదార్ధాలను వాడకూడదు.
                       ఆకలి పెరగడానికి ఆర్ద్రఖండావలీహ్యము               
 
ఆర్ద్రము = అల్లము
 లేహ్యము పులి త్రేనుపులనుఅరుచినిపొట్టఉబ్బరాన్ని , వాతరోగాలను నివారిస్తుంది
 
అల్లం ముక్కలు           --- అర కిలో
కలకండ                     --- తగినంత
మిరియాల పొడి          --- 50 gr
పిప్పల్లపొడి                --- 25 gr
మోడి (పిప్పలి కట్టే)     --- 25 gr
శొంటి పొడి                 --- 15 gr
జాజి కాయ పొడి          --- 15 gr
యాలకుల పొడి          --- 15 gr
చిత్రమూలం పొడి          ---15 gr
నెయ్యి                       --- రెండు టీ స్పూన్లు
తేనె                          --- 100 gr 
 
   పెనంలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కాగిన తరువాతఅల్లం ముక్కలను వేసి తడి లేకుండా వేయించాలితరువాత వాటిని పళ్ళెంలో వేసి గాలికి ఆరబెట్టాలిబాగాఆరిన తరువాత మిక్సి లోవేసి మెత్తగా నూరాలి.
ఒక పాత్రలో నీటిని పోసి వేడి చేసి కలకండ పొడిని దానిలోకలపాలితీగపాకం వచ్చే వరకు కాచాలితరువాత దీనికిఅల్లం పొడిని కలపాలితరువాత ఒక్కొక్కటిగా మిగిలినవాటిని కలపాలిచివరలో నెయ్యి కలపాలిచల్లారినతరువాత తేనె కలపాలితరువాత అంతటిని లేహ్యంలాగాబాగా కలిపి బాగా చల్లారిన తరువాత సీసాలో నిల్వచేసుకోవాలి
 
ఆహారానికి ముందు ఒకటిరెండు స్పూన్ల లేహ్యాన్ని తినాలి
 
ఉపయోగాలు:-- ఇది ఆకలిని పెంచుతుందిఅరుచిని, గ్యాస్ ను నివారిస్తుందిపొట్ట ఉబ్బరింపును ,
త్రేనుపులను నివారిస్తుంది.